‘నేరెళ్ల’పై సుప్రీంను ఆశ్రయిస్తాం | Gudur Narayana Reddy commtes on Nerella issue | Sakshi
Sakshi News home page

‘నేరెళ్ల’పై సుప్రీంను ఆశ్రయిస్తాం

Published Thu, Aug 10 2017 2:53 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Gudur Narayana Reddy commtes on Nerella issue

ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: నేరెళ్ల ఘటనపై అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ నిజస్వరూపాన్ని దేశ ప్రజలకు తెలియచేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ కోశాధికారి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

పోలీసుల అండతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్న తీరును నాయస్థానాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఘటనకు బాధ్యత వహించి ఇప్పటికే సంబంధిత పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి కేటీఆర్‌ గుట్టుగా పర్యటించి కేసును నీరుగార్చే యత్నం చేయడం దారుణమని నారాయణరెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement