
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల ప్రాంగణాల్లో న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించకుండా చూడాలని ఇరు రాష్ట్రాల జిల్లా జడ్జీలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. కొందరు న్యాయవాదులు అనుమతులు తీసుకోకుండానే కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ సర్క్యులర్ జారీ చేశామని హైకోర్టు పేర్కొంది. సర్క్యులర్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment