advocate
-
Advocate: పోసానిని చంద్రబాబు ప్రభుత్వం మానసికంగా హింసించింది
-
ఎస్పీకి ఏం సంబంధం..?
-
టీడీపీ కుట్రపూరితంగా PV సునీల్ ని సస్పెండ్ చేసింది
-
అడ్వకేట్ బిల్లుపై స్టాలిన్ ఫైర్.. కేంద్రానికి వార్నింగ్
చెన్నై: ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)పై ఫైరవుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా అడ్వకేట్ బిల్లుపై కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తీసుకువస్తున్న అడ్వకేట్ బిల్లు న్యాయవాద వృత్తిపై దాడి అని అన్నారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు,పుదుచ్చేరిని బార్ కౌన్సిల్ ఆఫ్ మద్రాస్గా కేంద్రం మార్చాలనుకుంటోంది. తమిళనాడు అనేది కేవలం పేరు కాదు. మా గుర్తింపు. తమిళులపై బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్జేఏసీని తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మళ్లీ అడ్వకేట్ బిల్లు ద్వారా బార్ కౌన్సిళ్లపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది. అడ్వకేట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’అని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా, బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసకుంది. ముసాయిదాలో సవరణలు చేయనున్నట్లు ప్రకటించింది. -
రషీద్ సోదరుడిపై కేసు నమోదు చేయటం దారుణం: అడ్వొకేట్ రోళ్ల మాధవి
-
ఈడీది బాధ్యతారాహిత్యం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థల పనితీరును కొన్నిసార్లు కోర్టులు తప్పుబట్టడం పరిపాటే. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ తీరును కేంద్ర ప్రభుత్వమే తప్పుబట్టిన అసాధారణ ఘటనకు సాక్షాత్తూ సుప్రీంకోర్టే వేదికైంది! ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని అరుణ్పతి తివారీ అనే ఇండియన్ టెలికాం సరీ్వసెస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణకు వచి్చంది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో తామెవరితోనూ సరైన సంప్రదింపులు చేయకుండా ఈడీ పూర్తి అసమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో ఇది చాలా సీరియస్ అంశమంటూ ధర్మాసనం కూడా అసహనం వెలిబుచ్చింది. ‘‘ఈడీ జవాబుదారీతనంపైనే ఈ ఉదంతం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అన్నివిధాలా సరిచూసుకున్న మీదట కౌంటర్ సమగ్రంగా దాఖలు చేయాల్సిన బాధ్యత ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)దే కదా’’ అని వ్యాఖ్యానించింది. ఈ తప్పిదానికి ఏఓఆర్ను బాధ్యున్ని చేయలేమని ఏఎస్జీ బదులివ్వడంతో అయిష్టంగానే విచారణను చేపట్టింది. కానీ ‘‘దీన్ని మేమింతటితో వదిలేయదలచుకోలేదు. మీ వ్యాఖ్యల నేపథ్యంలో, ఈడీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్తో మీకేమీ సంబంధం లేదని చెప్పదలచుకున్నారా?’’ అని ఏఎస్జీని ప్రశ్నించింది. దాంతో అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. అఫిడవిట్ను ఓసారి సరిచూసుకోవాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు. ‘‘ఇది కేవలం సమాచార లోపమే. అయితే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలో ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండాల్సింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యుడైన అధికారిని ధర్మాసనం ముందు నిలబెట్టాల్సిందిగా ఈడీ డైరెక్టర్ను ఇప్పటికే వ్యక్తిగతంగా కోరాను. దయచేసి విచారణ కొనసాగించండి’’ అని అభ్యరి్థంచారు. ధర్మాసనం మాత్రం విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ‘ఆప్’ సర్కార్కు ‘సుప్రీం’లో ఊరట -
ఫార్ములా ఈ రేస్ కేసులో.. అసలు నిందితులు ఎవరు ?
-
ఎప్పుడు తొక్కిసలాటలు జరగలేదా!
-
Formula E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట
-
Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
ఢాకా: బంగ్లాదేశ్లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) తెలిపింది.ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్లో ఒక పోస్ట్లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024బంగ్లాదేశ్కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్పూర్లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఛటోగ్రామ్లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు -
HYD: ఐమాక్స్ వద్ద న్యాయవాదిపై దాడి.. ఇద్దరు మైనర్ల అరెస్టు
సాక్షి,హైదరాబాద్: ఐమాక్స్ వద్ద అడ్వకేట్ కల్యాణ్పై ఇద్దరు దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం(నవంబర్ 13) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్,సైఫాబాద్ ఏసీపీలు చంద్రశేఖర్, సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు.మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గన్ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్మెంట్ వాచ్మెన్ను కత్తితో బెదిరించిన ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కల్యాణ్ వారిని అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు.ఈ క్రమంలో మైనర్ల చేతిలో కల్యాణ్ గాయపడ్డారు.సెంట్రల్ జోన్ పరిధిలో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్ను అదుపులోకి తీసుకొని విచారించారు.అతని వద్ద ఉన్న వాచ్మెన్ మొబైల్ ఫోన్ను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద న్యాయవాది కల్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు వాడిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారి ఆధార్ కార్డుల ప్రకారం మైనర్లుగా తేలిందని..అయితే, వారి వయసును నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించాం. గతంలో వారిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది’ అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్ -
పోలిసులపై పవన్ ఒత్తిడి.. అందుకే అక్రమ అరెస్టులు
-
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జితో, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జడ్జీ ఛాంబర్ వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కూర్చీలు పట్టుకొని మరీ లాయర్లను బయటకు తరిమేశారు. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.In #UttarPradesh's #Ghaziabad, a major disturbance erupted in the District Court following an argument between a district judge and a lawyer during a bail hearing. The altercation soon escalated, leading to a chaotic scene as large numbers of lawyers gathered and tensions… pic.twitter.com/0RsozCFHag— Hate Detector 🔍 (@HateDetectors) October 29, 2024 -
హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు
సాక్షి, అమరావతి /సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం తీర్మానం చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం వారి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్గా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం, తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణ రంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోదరుడి వరుస అవుతారు. గుణ రంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కోదండరామ్ వద్దే జూనియర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. సీజే నేతృత్వంలో కొలీజియం సమావేశం..ఈ ఏడాది మే 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. మహేశ్వరరావు, ధనశేఖర్, చల్లా గుణరంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడ రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వారి వివరాలు సేకరించింది. కేంద్ర న్యాయశాఖ ఇటీవల వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొనసాగుతున్న నలుగురి అభిప్రాయాలు కూడా అంతకు ముందే తీసుకుంది. వారందరూ కూడా న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు తగిన వారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొలీజియం సమావేశంలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్ పేర్లకు ఆమోదం తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీజేతో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిఫారసు చేసిన ముగ్గురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంటుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయవాదుల పేర్లతోపాటు ముగ్గురు న్యాయాధికారుల పేర్లను కూడా హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సిఫారసు చేసింది. అయితే ఈ ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏం నిర్ణయం తీసుకున్నదీ తెలియరాలేదు. -
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్పూర్లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
న్యాయవాదులకు ఓర్పు, నేర్పు అవసరం
తాడేపల్లిరూరల్: ఆధారాలను సేకరించడంలో న్యాయవాదులు ఓర్పు, నేర్పు కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా సూచించారు. వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యాన మూడు రోజులుగా నిర్వహిస్తున్న న్యాయవాదుల అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు సదస్సుకు జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత.. ఐపీసీని పోలి ఉందన్నారు. సైబర్ క్రైమ్, లింగ వివక్ష చట్టం, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలలోని పలు సెక్షన్ల గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఆస్తి బదిలీ చట్టం, ఆస్తి హక్కు, నిర్దిష్ట ఉపశమన చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, మే«ధో సంపత్తి హక్కులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో న్యాయవాది పాత్ర, డాక్యుమెంటేషన్ వంటి పలు అంశాల గురించి న్యాయవాదులకు వివరించారు. ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్రెడ్డి, కేఎల్యూ వీసీ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకటరామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు రిమాండ్ పొడిగింపు -
హెచ్సీఏఏ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి విజయం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగిన హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్సీఏఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్రెడ్డి విజయం సాధించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్రెడ్డి, మణికొండ విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ.జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో జగన్పై రవీందర్రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఏ.దీప్తి, జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతిభూషణ్ రావు, జిల్లెల సంజీవ్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్కుమార్, ట్రెజరర్గా కట్టా శ్రావ్య, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా ఎస్.అభిలాష్ విజయం సాధించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరగడం, ఫలితాలు ప్రకటించడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా: రవీందర్రెడ్డి బార్ అండ్ బెంచ్ సంబంధాలు మరింత బలోపేతం చేస్తా. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా. జూనియర్ న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటి పరిష్కారానికి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. -
Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం. అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో 43 టైగర్ రిజర్వ్లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా. లా చదివి ‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి. నెట్లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్లోని భరత్పూర్ రిజర్వ్ఫారెస్ట్లో వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా. కలిసి బతకాలి ‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
Supreme Court: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: కోర్టు హాల్లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ సోమవారం సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదికి క్లాస్ పీకారు. ఏ రైలు పడితే అది ఎక్కేయడానికి ఇది రైల్వేస్టేషన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రూమ్లో ఎలా మెలగాలన్నదానిపై ముందు మీరు వెళ్లి ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద శిక్షణ తీసుకోండని సూచించారు. జ్యుడిషీయల్ సంస్కరణలపై తాను వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సోమవారం సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక్కసారిగా లేచి సీజేఐ బెంచ్ను అడగడం ప్రారంభించాడు. కేసు లిస్ట్ కాకుండా మీ వంతు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మెన్షన్ చేయడమేంటని ఆ న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. అయినా వినిపించుకోని ఆ న్యాయవాది న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత త్వరగా తీసుకురావాల్సి ఉందని చెప్పసాగాడు. న్యాయవాది ప్రవర్తన పట్ల ఆగ్రహించిన సీజేఐ అసలు మీరెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో చేస్తా అని చెప్పాడు. దీనికి స్పందించిన సీజేఐ మీరు త్వరగా ఒక సీనియర్ వద్ద జాయిన్ అయి కోర్టు రూమ్లో ఎలా మెలగాలో నేర్చుకోండని చురకంటించారు. ఈ నెల ప్రారంభంలోనూ ఓ అడ్వకేట్ సుప్రీం కోర్టులో గొంతు పెంచి మాట్లాడుతుండగా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించి వాదించాలని సూచించారు. ఇదీచదవండి.. ఈడీ ఎదుటకు లాలూ -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్లో చేరి, నా కెరీర్ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
పేదల పక్షాన నిలవండి
సాక్షి, అమరావతి: పేదల పక్షాన అడ్వొకేట్ సోదరులు, చెల్లెమ్మలు ఔదార్యం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్ను ఇదే కోరుతున్నానని, దీనిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విడుదల చేశారు. నెలకు రూ.5,000 చొప్పున 2023 జూలై–డిసెంబర్ వరకు 6 నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.30,000 మేరకు మొత్తం రూ.7,98,95,000 కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, అదే రీతిన మీరంతా పేద వాడి పక్షాన నిలవాలన్నారు. వారి పట్ల మానవతా దృక్పథం చూపించాలని కోరారు. లా డిగ్రీ పూర్తి చేసుకుని, న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకునే సమయంలో వారికి ప్రోత్సాహకంగా నిలుస్తూ వరుసగా గత నాలుగేళ్లుగా వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నెలకు రూ.5 వేలు స్టైఫండ్ చొప్పున, సంవత్సరానికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఈ కార్యక్రమం ద్వారా తోడుగా నిలిచామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్లకు మంచి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లలో రూ.49.51 కోట్లు ► ‘ఈ నాలుగేళ్లలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి చేస్తూ.. మనందరి ప్రభుత్వం రూ.49.51 కోట్లు సాయం చేసింది. ఈ మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి ఈ కార్యక్రమం ముందడుగు అవుతుంది. అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వైఎస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరినీ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచాం. ► ఈ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వీళ్లలో 643 కుటుంబాలకు రూ.52 లక్షలు ఇచ్చాం. ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రూ.11.56 కోట్ల రుణాలు ఇచ్చారు. మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద మరో రూ.11.41 కోట్లు చెల్లించాం. అదే టైంలో దాదాపు రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి అడ్వొకేట్ కమ్యూనిటీకి ఇచ్చి, వారికి తోడుగా నిలబడగలిగాం. ► నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. ఆ మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేశాం. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ► ఈ కార్య‘క్రమంలో సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, లా సెక్రటరీ జి సత్యప్రభాకర రావు, ఇతర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. విజనరీ స్కీమ్స్ మీకే సాధ్యం గుంటూరు జిల్లా కోర్టులో నేను జూనియర్ అడ్వకేట్గా కెరీర్ ప్రారంభించాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. మీరు ప్రవేశపెట్టిన విజనరీ స్కీమ్స్ గురించి సచివాలయంలో తెలుసుకున్నాను. హ్యాట్సాఫ్ సార్. నేను ఇటీవల ఆరోగ్య సురక్ష క్యాంప్కు వెళ్లాను. చాలా బాగుంది. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. విదేశీ విద్య చాలా బాగుంది. తుపాను సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, భరోసా చాలా నచ్చింది. మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని మేం కూడా పేదలకు సాయం చేయాలనుకుంటున్నాం. మీరు ఒక విజనరీ. మీరు ఇచ్చే స్టైఫండ్ చాలా ఉపయోగపడుతుంది. మా కాళ్లపై మేం నిలబడుతున్నాం. – శశిధర్, జూనియర్ అడ్వొకేట్, గుంటూరు లా నేస్తం మాకు ధైర్యాన్నిచ్చింది నేను వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాను. నాకు చాలా ఉపయోగపడుతోంది. మేం ఈ డబ్బును కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు, బుక్స్, రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ వృత్తిలో తొలుత ఎలా నిలదొక్కుకోవాలి.. ఎలా రాణించాలి.. ఖర్చుల మాటేంటి.. అని భయపడ్డాం. కానీ ఈ స్కీమ్ మాకు ధైర్యాన్నిచ్చింది. మా జూనియర్స్కు కూడా ధైర్యం చెబుతున్నాం. గుప్తుల స్వర్ణయుగాన్ని నేను చూడలేదు కానీ మీ పాలనలో చూడగలిగాను. చాలా సంతోషం. మీరు ఇచ్చే అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి. ఆరీ్టసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో చాలా సంతోషపడ్డాం. – కోట ఆశ్రిత, జూనియర్ అడ్వొకేట్, నందిగామ -
యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తోంది. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ.25 కోట్ల ఆర్థికసాయం అందించింది. ఈ ట్రస్ట్ నుంచి ఆర్థికసాయం కోరే అడ్వకేట్స్ ఆన్లైన్లో ట్ఛఛిచి ్చఠీః్చp.జౌఠి.జీnలోగానీ, నేరుగా లా సెక్రటరీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా 1902 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ పథకాన్ని మరింత సమర్థంగా మానిటర్ చేస్తూ యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్దమొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునే విధంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం వారి ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. దరఖాస్తు చేసుకోదలిచినవారు https://ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో తమ పేరు, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబరు, సర్టిఫికెట్లు జతచేయాలి. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
ఆపన్నులకు అండ.. పేదలకు లీగల్ సర్వీసెస్ అథారిటీ భరోసా
హక్కులకు భంగం కలిగితే కోర్టును ఎలా ఆశ్రయించాలో తెలియదు.. పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు నమోదైతే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..న్యాయవాదిని పెట్టుకొనేంత ఆర్థిక స్తోమత లేదు.. ఇదీ సగటు పేదవాడి దుస్థితి. ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు న్యాయం కోసం ఏం చేయాలి.. ఎవరిని ఆశ్రయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏర్పాటైందే ‘లీగల్ సర్విసెస్ అథారిటీ (ఎల్ఎస్ఏ)’. ఈ నెల 9న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ డే, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: పేదలకు న్యాయ సా యం అందించడం, కోర్టు కేసులను మ ధ్య వర్తిత్వంతో పరిష్కరించడం, లోక్ అదాలత్లు నిర్వహించడమే కాదు.. వృద్ధులకు ఆసరాగా నిలవడం, పేద విద్యార్థులకు సాయం చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాలను లీగల్ సర్విసె స్ అథారిటీ నిర్వహిస్తోంది. పత్రికల్లో వచ్చిన కథనా ల ఆధారంగా లేదా సుమోటోగా పలువురి బాధల ను తీరుస్తోంది. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందేలా చర్యలు తీసుకోవడం, విడిపోయి న భార్యాభర్తలను కలపడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం వసతు లు, వేతనం అందేలా చేయడం, మతిస్థిమితం కో ల్పోయిన వారికి ఆశ్రయం కల్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 1995లో ఏర్పాటు లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం 1995 నవంబర్ 9న జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటైంది. దీనికి జాతీయ స్థాయిలో ప్యాట్రన్ ఇన్ చీఫ్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు పని చేస్తాయి. వృద్ధ దంపతులకు ఆసరా.. ఖమ్మం జిల్లాకు చెందిన రామన్న, కృష్టమ్మ దంపతులు. ఉన్న ఆస్తినంతా పిల్లలకు పంచిపెట్టారు. మలి వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారిని సంప్రదించింది. చట్టప్రకారం 3 ఎకరాల 20 గుంటల భూమిని తిరిగి వృద్ధ దంపతుల పేర రిజిస్ట్రేషన్ చేయించి ఆసరా కల్పించింది. అమరచింతలోని కియోస్్కలో వారికి ఆశ్రయం అందించింది. నిరుద్యోగులకు చేయూత.. మహబూబ్నగర్ జిల్లా సెంట్రల్ లైబ్రరీకి రోజూ సుమారు 200 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చిన కొందరు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే చదువుకుంటా రు. వారిలో ఎక్కువ మంది పేదలే కావడం, మధ్యాహా్నలు భోజనం కూడా చేయడం లేదని గుర్తించిన జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ.. మున్సిపల్ చైర్మన్తో సంప్రదింపులు జరిపింది. రూ. 5కే మంచి భోజనం అందేలా చర్యలు తీసుకొని చేయూతనిచ్చింది. 33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు పేదల కేసులను వాదించేందుకు, న్యాయ సలహా అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాలన్న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (జిల్లా స్థాయి), డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (సబ్–కోర్టు), అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (మేజిస్ట్రేట్ కోర్టు)ను పూర్తిస్థాయిలో నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో 33 జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏం న్యాయ సేవలు అందిస్తారు? 1). ఉచితంగా న్యాయ సలహాలు అందించడం 2). కేసులు పరిశీలించి బాధితుని తరఫున న్యాయవాదిని నియమించడం 3). కోర్టు ఫీజులను భరించడం 4). తీర్పు వచ్చిన తర్వాత కాపీలను ఉచితంగా అందజేయడం ఆశ్రయించడం ఎలా? ఉచిత న్యాయ సాయం కోసం మండల న్యాయసేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040–23446723 లేదా టోల్ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చు. న్యాయ సాయం ఎవరికి.. 1). షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 2). మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు 3). మహిళలు, బాలబాలికలు 4). అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 5). ప్రకృతి విపత్తులు, కుల, మత కల్లోలాల బాధితులు 6). పారిశ్రామిక కార్మికులు 7). రక్షణ గృహం, అనాథ గృహం, బాలల గృహం, మానసిక చికిత్సాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి.. 8). సంవత్సర ఆదాయం రూ.3 లక్షలు మించని వారికి... అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేయడం కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను రాష్ట్రంలో ప్రారంభించాం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా సాగు చట్టాలు, నియమాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తాం. కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నాం. – గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి -
కాంగ్రెస్లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. -
‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి?
న్యాయవాదుల హోదా విషయమై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాయర్ల సుదీర్ఘకాల డిమాండ్కు ముగింపు లభించింది. ఈ విషయంపై గతంలో పిటిషన్ దాఖలైంది. లాయర్కు సీనియర్ పోస్టు ఇవ్వడాన్ని అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023, అక్టోబర్ 19న మొత్తం 535 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించారు. ఇంతకీ సీనియర్ న్యాయవాది అని ఎవరిని పిలుస్తారు? ఇందుకుగల అర్హతలు, నిబంధనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వకేట్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం న్యాయవాదులు రెండు తరగతులకు చెందినవారై ఉంటారు. మొదటిది సీనియర్ న్యాయవాది. రెండవ ఇతర న్యాయవాది. ఒక న్యాయవాది సీనియర్ కావాలనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ హోదాను అందించవచ్చు. సెక్షన్ 23 (5) ప్రకారం కేసును దాఖలు చేసే హక్కు సీనియర్ న్యాయవాదులకు ఉండదు. వారు ఆయా కేసులను పరిష్కరించడమో లేదా కేసును క్రాస్ ఎగ్జామిన్ చేయడమో చేస్తారు. సాధారణ న్యాయవాదులతో పోలిస్తే సీనియర్ న్యాయవాది కేసు దాఖలు చేసే అధికారాన్ని కోల్పోతాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే పలు కేసుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు ఈ లాయర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రాను సీనియర్ లాయర్ హోదా పొందేందుకు వయసుకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయా అని అడగా, దీనికి వయోపరిమితి లేదని బదులిచ్చారు. అయితే ఆ న్యాయవాది ఎన్ని కేసులలో వాదించాడు? అవి ఎలాంటి కేసులు, కేసులలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సీనియర్ హోదా పొందడానికి ముందుగా ఎవరైనా న్యాయవాది హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారి దరఖాస్తులను పరిశీలించి, జాబితాను విడుదల చేస్తారు. తాజాగా 535 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పించింది. కోర్టు వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా సందర్భంలో వారి సలహా తీసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది? -
చంద్రబాబు, లోకేశ్ లకు ఎందుకు మద్ధతు ఇవ్వాలి: న్యాయవాది
-
సిద్ధార్థ లూద్రాపై రాజమండ్రిలో కేసు
-
చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని ఏఏజీ వెల్లడి
-
జైలులో ఖైదీలు ఉండక.. స్వామీలు ఉంటారా?: సాక్షితో AAG
-
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషాన్ పై ముగిసిన వాదనలు
-
కస్టడీలోకి తీసుకుంటేనే మరిన్ని వివరాలు తెలుస్తాయి
-
ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
29 కోర్టు హాళ్లలో లైవ్ ప్రసార సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో కేసుల విచారణకు సంబంధించి ఆన్లైన్ లైవ్ ప్రసారాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టులోని 29 హాళ్లలో విచారణల లైవ్ ప్రసార సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి లైవ్ ప్రసారాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే మొదటి కోర్టు హాల్లో లైవ్ ప్రసార సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సేవలు న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై మిగతా కోర్టుల్లో జరిగే విచారణలను కూడా వీక్షించే వీలు కలగనుంది. దీనితో న్యాయవాదులకు కూడా ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించే అవకాశం లభిస్తుంది. భవిష్యత్లో న్యాయవాదులే కాకుండా వాదప్రతివాదుల నుంచి న్యాయమూర్తులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్లో వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని కోర్టులను ఆన్లైన్ లైవ్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువచేస్తామని సుప్రీంకోర్టు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్లైన్ లైవ్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. లైవ్ ప్రసారాలతో పెండింగ్ కేసులు తగ్గే అవకాశం ఉందని, కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు లైవ్ ప్రసారాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ సుధీర్కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్రావు, జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
సుప్రీంకోర్టు స్టే పై లాయర్ల సంబరాలు
-
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు. చదవండి: Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం అలిశెట్టి లక్ష్మీనారాయణ: నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో హెడ్మాస్టర్ గంగాధర్, రాజుబాయ్ దంపతులకు 1968 మే 13న లక్ష్మీనారాయణ జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించుకున్నారు. రాజ్యాంగ, ‘సివిల్ లా’లో నైపుణ్యం సాధించారు. ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్బీసీసీ, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్తోపాటు పలు ఎల్బీసీ, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. కె.సుజన: నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధు సూదన్, ప్రమీల దంపతులకు కె.సుజన 1970 మార్చి 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగాను, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. గతేడాది నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా సుజన విధులు నిర్వర్తిస్తున్నారు. -
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
అడ్వొకేట్ అరాచకం
విజయనగరం (క్రైమ్): నలుగురికీ న్యాయం చేయాల్సిన న్యాయవాదే భార్యను హింసకు గురిచేశాడు. 11 ఏళ్లపాటు భార్యను బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు. తమ కుమార్తె అసలు బతికి ఉందో లేదోనన్న సందేహంతో ఆమె తల్లిదండ్రులు విజయనగరం వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఎం.దీపికను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులపైనా కేసు పెడతానంటూ న్యాయవాది బెదిరించడంతో చేసేది లేక మేజిస్ట్రేట్ జారీ చేసిన సెర్చ్ వారెంట్తో వెళ్లి గృహ నిర్బంధం నుంచి ఆమెను విడిపించారు. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలోని మార్వాడి వీధిలో ఉంటున్న న్యాయవాది గోదారి మధుసూదనరావు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్నాడు. 2009లో వీరికి పాప పుట్టింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సుప్రియ ఆ తరువాత భర్త దగ్గరకు వచ్చేందుకు నిరాకరించింది. నువ్వు లేకపోతే ఉండలేనంటూ భర్త చెప్పిన మాయమాటలు నమ్మి విజయనగరం వచ్చింది. అప్పటినుంచి భార్యను ఇంట్లోనే బంధించిన మధుసూదనరావు తల్లిదండ్రులతో మాట్లాడటానికి, చూడటానికి కూడా అనుమతించలేదు. ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా బయటినుంచే పంపించేసేవాడు. ఇలా 11 ఏళ్లపాటు ఈ తంతు సాగింది. దీంతో తమ కుమార్తె సుప్రియ అసలు బతికి ఉందో లేదోనని అనుమానించిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతూ వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. మీరు దొంగపోలీసులని, ఎఫ్ఐఆర్ ఉంటేనే రావాలని చెప్పి లోపలికి రానీయలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎస్పీ ఎం.దీపికను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు కోర్టునుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని బుధవారం ఆ ఇంటికి వెళ్లి మహిళను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. -
వైఎస్సార్ ‘లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు ‘లా నేస్తం’ అని సీఎం అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ బుధవారం.. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్ను ఏర్పాటుచేసింది. కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు. -
న్యాయవాదులకు వరం ‘లా నేస్తం’
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తోన్న డాక్టర్ వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు న్యాయవాదులను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకుంటున్నారని న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్రావు చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లా నేస్తం, సంక్షేమ నిధి పథకాలతో న్యాయవాదులు పొందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడం కష్టమని, అలాంటి వారిని ఆదుకునేందుకే లా నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. 2019 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్ల పాటు స్టైఫండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత మూడున్నర ఏళ్లలో 65,537 మంది న్యాయవాదులకు రూ.34.39 కోట్లను స్టైపెండ్ రూపంలో చెల్లించామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్ఫండ్తో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంక్షేమ నిధి నుంచి అర్హులైన న్యాయవాదులకు వైద్య ఖర్చులు, లా పుస్తకాలు, మేజర్ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్ వంటి అత్యవసరాలకు నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధి ద్వారా ఇప్పటివరకు 7,733 మంది న్యాయవాదులకు రూ.25 కోట్ల మేర సాయం చేసినట్లు చెప్పారు. -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీవ్రంగా వేధిస్తోందని న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యానని, మూడు రోజులపాటు కేవలం సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సిట్ దర్యాప్తు ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ అధికారులు, సీబీఐ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్, సీవీ ఆనంద్తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సిట్ ఎదుట హాజరయ్యానని.. రాజేంద్రనగర్ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. వారు కోరిన విధంగా చెప్పేందుకు నిరాకరిస్తే.. తనను నిందితుడిగా(ఏ7)గా పేర్కొంటూ మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయాన్ని సిట్కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్కు చెప్పినా పట్టించుకోలేదని నివేదించారు. విచారణవీడియోను హైకోర్టుకు సమరి్పంచాలని కోరినా.. 23నాటి∙విచారణలో అధికారులు కోర్టుకు అందజేయలేదని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సిట్ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: హైదరాబాద్లో నీరా కేఫ్ రెడీ -
టీడీపీ, జనసేనలపై లాయర్ల ఆగ్రహావేశాలు
సాక్షి నెట్వర్క్: హెకోర్టులో న్యాయమూర్తుల బదిలీలపై విమర్శలు చేస్తూ వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం గర్హనీయమని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్కు చెందిన న్యాయవాదులు ఆక్షేపించారు. ఇద్దరు జడ్జీల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దీనికి రాజకీయం ఆపాదించడంపై వారు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ శనివారం అనేక జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న దుష్టచతుష్టయం కుతంత్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ వినతిపత్రాలు ఇచ్చారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి టీడీపీ, జనసేన పార్టీల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరులోనూ న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ, జనసేన తీరును నిరసిస్తూ కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇక గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన న్యాయవాదులు ‘రాజ్యాంగ పరిరక్షణకు దుష్టశక్తుల ఆట కట్టిద్దాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ జిల్లా, నగర కమిటీ ప్రతినిధులు విజయవాడలోనూ నిరసన ప్రదర్శన నిర్వహించి కోర్టులకు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వమని చెప్పడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. మరోవైపు.. కోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలపై కూడా విమర్శలు చేస్తూ వాటిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం తగదంటూ శ్రీకాకుళంలోనూ న్యాయవాదులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్కు వినతిపత్రం అందించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చివరకు న్యాయవ్యవస్థలో బదిలీలను కూడా తన స్వార్థానికి వాడుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పలువురు లాయర్లు విమర్శించారు. -
న్యాయవ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు : ఏపీ న్యాయవాదులు
-
విపత్తు నిర్వహణ శాఖ నిర్లక్ష్యంపై ఫిర్యాదు
నాంపల్లి: రాష్ట్రంలో పిడుగుపాటుతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకుని, వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పిడుగుపాటు నివారణ చర్యలు చేపట్టడంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశంలో పిడుగుపాటు ప్రమాదాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, గడచిన ఆరేళ్లలో ఇక్కడ 398 మంది మృత్యువాతపడ్డారని, ఇందుకు సంబంధించి ‘సాక్షి’లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ప్రమాదాలకు గురైనవారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే రైతులు, రైతుకూలీలు ఉన్నట్లు తెలియజేశారు. పిడుగుపాటుకు బలైన నిరుపేద కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రోడ్డునపడ్డ కుటుంబాలను ఆదుకోవడం, పిడుగుపాటు నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, పుణే ఐఐటీ దామిని అనే యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, ఇది 20 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు. అధునాతన పరికరాల సహాయంతో అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని, పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఉద్యమం
కర్నూలు(లీగల్): హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే వరకు ఉద్యమం ఆపేది లేదని న్యాయవాదులు స్పష్టంచేశారు. కర్నూలులోని ధర్నా చౌక్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు నరసింహ, సంపత్కుమారి, బి.కృష్ణమూర్తి, సోమశేఖర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరం వద్దకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరితోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, డోన్, ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాదులు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ చౌదరి, కార్యదర్శి దస్తగిరి మరికొందరు మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు భాస్కర్రెడ్డి కూడా న్యాయవాదులకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కొలిమిగుండ్ల ప్రాంతంలో కలసి వినతిపత్రం సమరి్పస్తామని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కాటం రంగడు, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, రాయలసీమ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ కమిటీ నేత వై.జయరాజు, ఓంకార్ తెలిపారు. సీఎం జగన్ను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు (లీగల్): రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించి సీమ ప్రజల చిరకాల వాంఛను తీర్చాలని కర్నూలు న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఆర్.కృష్ణ, సీమ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వై.జయరాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, నాగలక్ష్మీదేవి, ఎం.సుబ్బయ్య, పి.సువర్ణరెడ్డి, బి.చంద్రుడు, రాజేష్, రంగనాథ్ మాట్లాడారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చరిత్రాత్మక అవసరమే కాకుండా మూడుప్రాంతాల సమతుల్యానికి దోహదం చేస్తుందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధానులతో సంబంధం లేకుండా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్కు, ప్రతిపక్ష నేతకు, సీమప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. -
హైకోర్టులో 35 మంది ప్యానెల్ అడ్వొకేట్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులతో కూడిన ప్యానెల్ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (అమరావతి)లో వాదనలు వినిపించేందుకు మరో ఏడుగురు న్యాయవాదులను నియమించింది. వీరంతా మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పోస్టుల్లో కొనసాగుతారు. హైకోర్టులో నియమితులైన న్యాయవాదులంతా కూడా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మార్గదర్శకత్వంలో పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా నియమితులైనవారిలో సాగి శ్రీనివాసవర్మ, జోస్యుల భాస్కరరావు, బొమ్మినాయుని అప్పారావు, ఏవీఎస్ రామకృష్ణ, తాత సింగయ్య గౌడ్, గేదెల తుహిన్ కుమార్, అంబటి సత్యనారాయణ, మల్లంపల్లి శ్రీనివాస్, సీవీఆర్ రుద్రప్రసాద్, అరవల శ్రీనివాసరావు, మంచాల ఉమాదేవి, పోతంశెట్టి విజయకుమారి, బేతంపల్లి సూర్యనారాయణ, బాచిన హనుమంతరావు, తానేపల్లి నిరంజన్, అరవ రవీంద్రబాబు, గుడిసేవ నరసింహారావు, గుండుబోయిన వెంకటేశ్వర్లు, పసల పున్నారావు, గేదెల సాయి నారాయణరావు, వి.వెంకట నాగరాజు, ఇ.అంజనారెడ్డి, కామిని వెంకటేశ్వర్లు, తుమ్మలపూడి శ్రీధర్, ఓరుగంటి ఉదయ్ కుమార్, కె.శ్రీధర్ మూర్తి, సోమిశెట్టి గణేష్ బాబు, తడసిన అలేఖ్య రెడ్డి, వైవీ అనిల్ కుమార్, సోమసాని దిలీప్ జయరామ్, పల్లేటి రాజేష్ కుమార్, పామర్తి కామేశ్వరరావు, మన్నవ అపరాజిత, షేక్ బాజీ, గొర్రెముచ్చు అరుణ్ శౌరి ఉన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో నియమితులైన వారిలో కవిపురపు పట్టాభి రాముడు, గొరికపూడి అంకమ్మరావు, ఎన్.వీరప్రసాద్, సీతిరాజు రామకృష్ణ, మాదాల ఆదిలక్ష్మి, షేక్ మంజూర్ అహ్మద్, బి.బి.లక్ష్మయ్య ఉన్నారు. -
ప్రముఖ న్యాయ కోవిదుడు సత్తి వెంకట్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది సత్తి వెంకట్రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. వెంకట్రెడ్డి అంత్యక్రియలు బుధవారం సా యంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. సత్తి వెంకట్రెడ్డి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కవిటం గ్రామం. అక్కడే 1926, ఫిబ్ర వరి 25న జన్మించారు. 1951లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కొంత కాలం పాటు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత 1956లో హైదరాబాద్కు మకాం మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. 1992–94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సత్తి వెంకట్రెడ్డి అడ్వొకేట్ జనరల్గా సేవలు అందించారు. ఆయన పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన ముగ్గురు కుమారులు న్యాయవాదులే. వెంకట్రెడ్డి అల్లుడు సీవీ మోహన్రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అడ్వొకేట్ జనరల్గా వ్యవహరించారు. సత్తి వెంకట్రెడ్డి మృతి పట్ల పలువురు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. -
అడ్వకేట్ మల్లారెడ్డి కేసును చేధించిన పోలీసులు
-
పక్కా ప్లాన్తో మల్లారెడ్డి హత్య.. హంతక ముఠాకు రూ.15 లక్షలకుపైగా సుపారీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రముఖ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లే. ములుగు జిల్లా పందికుంట సమీపంలో ఆయన దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్గా తీసుకున్న ములుగు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రెండు రోజులపాటు మల్లంపల్లి మాజీ సర్పంచ్ పిండి రవి, మైనింగ్ వ్యాపారంతో సంబంధమున్న కె.వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు ఎర్రమట్టి క్వారీల యజమానులను విచారించారు. 44 క్వారీలకు చెందిన సుమారు 24 మందిని విచారించిన పోలీసులు బుధవారం కీలక ఆధారాలు రాబట్టి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య కేసు మిస్టరీ వీడినట్లు సమాచారం. హత్యకు ప్రధాన సూత్రధారి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఓ రైస్ మిల్లు వ్యాపారిగా పోలీసులు అనుమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య పూర్తి వివరాలు వెల్లడైనట్లు సమాచారం. ఆయన చెప్పిన వివరాల మేరకు మైనింగ్ క్వారీల నిర్వహణ, మల్లారెడ్డితో దీర్ఘకాలిక వివాదమున్న కీలక వ్యక్తులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ హత్య కేసుతో సంబంధమున్న మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 15 మందికిపైగా అనుమానితులను ప్రశ్నించిన తర్వాత హత్యకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. రూ.15 లక్షలకుపైగా సుపారీ? మైనింగ్ వివాదమే మల్లారెడ్డి హత్యకు కారణమన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలి సింది. హత్యకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సుపారీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. హత్యకు పథకం తర్వాత నర్సంపేట, శాయంపేటకు చెందిన 2 సుపారీ గ్యాంగ్లతో మాట్లాడినట్లు తెలిసింది. కర్నూలు ప్రాంతానికి చెందిన నలుగురు హంతక ముఠా సుపారీ తీసుకుని మల్లారెడ్డిని హత్య చేసినట్లు సమాచారం. వీరితో పాటు నల్లగొండకు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. -
మల్లారెడ్డి హత్య వెనుక భారీ స్కెచ్.. రూ.10 లక్షలకుపైనే సుపారీ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్కు సుపారీ ఇచ్చిందెవరు?.. మల్లారెడ్డిని హత్యచేసే అవసరం ఎవరికుంది?.. ఆయనను మట్టుపెడితే మేలు ఎవరికీ?.. ఈ హత్యకు కారణం మైనింగ్ వివాదమా.. భూ వివాదాలా?.. మర్డర్కు ప్రణాళిక రచించిందెవరు? ఘటనలో పాల్గొన్నదెవరు?.. సోమవారం రాత్రి ములుగు జిల్లా పందికుంట సమీపంలో హత్యకు గురైన మూలగుండ్ల మల్లారెడ్డి ఘటనపై సర్వత్రా సాగుతున్న చర్చ ఇది. మల్లంపల్లి మాజీ సర్పంచ్ రవి సహా 10మందినిపైగా విచారించి వదిలేసిన పోలీసులు కీలక వ్యక్తులపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. పక్కా స్కెచ్తో.. మల్లారెడ్డి మర్డర్పై మంగళవారం రాత్రి వరకు స్పష్టత రాకపోగా.. భిన్న కథనాలు వినిపించాయి. ఎర్రమట్టి క్వారీలు, భూ వివాదాల పరిష్కారం కోసం సోమవారం కూడా ములుగు రెవెన్యూ, పోలీసు అధికారులను కలిసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ హత్య జరిగే నాలుగు రోజుల ముందు మల్లారెడ్డి ఇద్దరితో తీవ్రస్థాయిలో గొడవపడినట్లు చెబుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఒకరితో జరిగిన గొడవ తారస్థాయికి చేరగా, అవతలి వ్యక్తి లేపేస్తానని మల్లారెడ్డిని హెచ్చరించాడని అంటున్నారు. మల్లారెడ్డి హత్యకు హైదరాబాద్లోని ఒక హోటల్లో పథకానికి రూపకల్పన జరిగినట్లు ములుగు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. హంతకులకు రూ.10 లక్షలకుపైనే సుపారీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. హంతకులు కూడా హైదరాబాద్కు చెందిన వారుగా భావిస్తుండగా, హత్య జరిగిన సమయంలో హంతకులు మాస్క్లు ధరించి తెలుగు మాట్లాడారని చెబుతున్నారు. హత్యకు వాడిన కత్తులు, మారణాయుధాలను చూస్తే హైదరాబాద్ నుంచి గానీ, ఆన్లైన్లో గాని తెప్పించినవిగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. హత్య కుట్రలోని ఆ ఇద్దరు ఎవరు.. మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి పేర్లు చెప్పకుండా హత్య వెనుక ఇద్దరి హస్తముందని మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలతో పాటు పలుచోట్ల భూవివాదాల్లో ఆయనను అడ్డు తొలగించుకునేందుకు వ్యూహం రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లో హత్యకు వ్యూహరచన చేసి, 3 రోజులు ములుగు, హనుమకొండలో రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. చివరకు పందికుంట వద్ద పధకం అమలు చేసినట్లు తెలిసింది. హత్య వెనుకున్న ఆ ఇద్దరు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు బుధవారం గుట్టువిప్పే అవకాశం ఉంది. ములుగు మండలం ఉమ్మాయినగర్, కేఎన్ఆర్ కాలేజీ సమీపంలోని ఐదుగురు ఎర్రమట్టిæ క్వారీల యజమానులను మంగళవారం వేర్వేరుగా విచారించారు. అలాగే మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి, కూతురు అనూషకు సంబంధించిన 113 ఎకరాల భూమి విషయంలోనూ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మెడ చుట్టూ పది, పొత్తి కడుపులో మూడు చోట్ల.. మొత్తం 13 చోట్ల మల్లారెడ్డిపై కత్తులతో దాడి జరిగినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు. -
‘టైమ్స్’అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో గౌతమ్ అదానీ!..కరుణా నంది ఎవరు?
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నంది చోటు దక్కించుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, టెన్నిస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే తదితరులకు స్థానం లభించింది. ప్రజలకు పెద్దగా కనిపించకుండా, నిశ్శబ్దంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఉంటారని గౌతమ్ అదానీపై టైమ్స్ పత్రిక ప్రశంసల వర్షం కురిపించింది. మహిళా హక్కుల ఛాంపియన్ అడ్వొకేట్ కరుణా నంది అని కొనియాడింది. -
తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇప్పటికే ఈ విషయంలో రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. ముగ్గురు తెలంగాణ న్యాయమూర్తులను ఇప్పటికే బదిలీ చేశారని, త్వరలో మరికొందరిని బదిలీ చేసేందుకు సర్వం సిద్ధమైందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని బదిలీలు చేపట్టబోతున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ బదిలీ యత్నాల వెనుక ఇటీవల తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన ఓ న్యాయమూర్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో సర్వం తానై వ్యవహరిస్తున్న ఆ న్యాయమూర్తి ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని వాడుతున్నట్టు చెబుతున్నారు. ఆ న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ప్రధానమంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం ఓ లేఖను పంపింది. ఊరుకునేది లేదు రాష్ట్ర న్యాయమూర్తులను బలి పశువులను చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని తెలంగాణ న్యాయవాదులు చెబుతున్నారు. ఇందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం సిద్ధమంటున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులు బుధవారం హైకోర్టులో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు గేటు ముందు ‘సేవ్ తెలంగాణ జ్యడీషియరీ, ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం ఆపాలి’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంతో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్రెడ్డి చెప్పారు. ఇలా చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని, రాష్ట్ర న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని ప్రశ్నించడమేనని మరో న్యాయవాది చిన్నోళ్ల నరేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకురావాలన్న ప్రయత్నాలను విరమించుకోకపోతే ఆందోళనలు ఉద్యమ రూపం దాలుస్తాయని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, చిక్కుడు ప్రభాకర్, ఎ. జగన్, రాజేశ్ మెహతా తదితరులు పాల్గొన్నారు. -
ఆ వకీలు నిత్యపెళ్లికొడుకు .. ముచ్చటగా మూడోసారి
సాక్షి, మైసూరు (కర్ణాటక): పేరుకు న్యాయవాది, కానీ చేసేది మాత్రం మహిళలకు అన్యాయం. జిల్లాలోని కేఆర్ నగరలో సీవీ సునీల్ కుమార్ అనే న్యాయవాది మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు. శివమొగ్గ సాగర తాలూకాకు చెందిన 36 ఏళ్ల మహిళను మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయం చేసుకుని 2020, జూన్ 18న పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ. 5 లక్షలను తీసుకున్నాడు. తరచూ వేధిస్తుండడంతో ఆమె కేఆర్ నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెలరోజులు జైల్లో ఉండి వచ్చాడు. మైసూరు బాంబూ బజార్కు చెందిన మహిళను గత జూలై 27న కేఆర్ నగర దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఆమెకు భర్త మొదటిపెళ్లి గురించి తెలిసి నిలదీయగా, నీతోనే కాపురం చేస్తా, రూ. 6 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆమె ససేమిరా అని పెద్దలతో పంచాయతీ పెట్టించింది. ఆమెను పుట్టింటికి పంపించేశాడు. బెంగళూరులో షాదీ.కామ్ అనే వెబ్సైట్ ద్వారా మరో మహిళను పరిచయం చేసుకుని డిసెంబర్ 2న మూడో పెళ్లి చేసుకున్నాడు. కేఆర్ నగర ఇంటిలోనే సంపారం పెట్టాడు. ఇది తెలిసి మొదటి ఇద్దరు భార్యలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు. -
సాధారణ న్యాయవాదులూ న్యాయమూర్తులుగా ఎదగొచ్చు
కందుకూరు: వృత్తిలో సవాళ్లు, ఒత్తిడిలను అధిగమించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా సాధారణ న్యాయవాదులు సైతం న్యాయమూర్తులుగా ఎదగవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పేర్కొన్నారు. తనలాంటి సామాన్యుడికి హైకోర్టు న్యాయమూర్తి పదవి దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ.. కందుకూరు బార్ అసోసియేషన్ సభ్యుడిగా కందుకూరు కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 31 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో పనిచేసిన తరువాత తనకు న్యాయమూర్తిగా అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టుల్లో అవకాశాలు భారీగా పెరిగాయని, ఈ నేపథ్యంలో న్యాయమూర్తిగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. బార్ అసోసియేషన్లు కేవలం కోర్టు విధులు, కోర్టుల్లో సమస్యలకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై కూడా పోరాటం చేయాలని మన్మథరావు కోరారు. నేడు కోర్టులే ప్రజల వద్దకు వస్తుంటే.. బార్ అసోసియేషన్లు ప్రజల వద్దకు ఎందుకు వెళ్లలేవని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జ్యోతిర్మయి, సీనియర్ సివిల్ జడ్జి విజయబాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు. -
కాబోయే వధూవరులు విక్కీ-కత్రీనాలపై రాజస్థాన్లో కేసు
Case File Against Katrina Kaif and Vicky Kaushal In Rajasthan: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ఏం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతాయి. ప్రధానంగా స్టార్ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో సీక్రెట్గా బాలీవుడ్ లవ్బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఏర్పాట్లు జరగుతున్నాయి. వారి పెళ్లికి సంబంధించిన విషయాలను ఈ జంట గోప్యంగా ఉంచినప్పటికీ ఆ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాగా రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని టాక్. ఇప్పటికే మెహందీ, సంగీత్లో భాగంగా ఈ జంట రాజస్థాన్కు పయనమైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమచారం. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ రాజస్తాన్లో వీరి పెళ్లి ఏర్పాట్లకు భారీ బందోబస్తును నియమించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు విక్కీ-కత్రీనాలకు షాకిచ్చారు. రాజస్థాన్కు చెందిన ఓ అడ్వకేట్ ఈ జంటపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా రాజస్థాన్లో చౌత్మాత మందిర్ ఎంత ప్రఖ్యాతిగాంచిందో తెలిసిన విషయమే. నిత్యం భక్తులతో ఈ మందిరం రద్దీగా ఉంటుంది. అయితే విక్కీ-కత్రినాల పెళ్లి ఏర్పాట్లలలో భాగంగా ఈ మందిర్కు వెళ్లే రోడ్డును డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు తాత్కలికంగా ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో స్థానికులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన నైత్రాబింద్ సింగ్ జాదౌన్ అనే న్యాయవాది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన పెళ్లి వేడుకలో భాగంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అమ్మవారి టెంపుల్ దారిని మూసివేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా మేనేజర్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్తో పాటు జిల్లా కలెక్టర్పై ఫిర్యాదు చేశాడు. అయితే విక్కీ కౌశల్-కత్రీనా పెళ్లికి తాను వ్యతిరేకం కాదని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేవలం అమ్మవారి టెంపుల్ దారిని మూసివేసిన కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశాడు. అంతేగాక వెంటనే ఆ దారిని తిరిగి తెరవాల్సిందిగా ఆయన లీగల్ సర్వీసెస్ అథారిటీ కోరారు. -
జస్టిస్ శివశంకర్ మరిన్ని పుస్తకాలు రచించాలి
సాక్షి, అమరావతి: న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని, ఆయన కలం ఆగకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఆకాంక్షించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని మంగళగిరిలో గురువారం సీజే గోస్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీజే అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. ఇటీవల జస్టిస్ శివశంకర్ తనను పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానించారన్నారు. ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకానికి తొలి పాఠకుడిని తానేనని చెప్పారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు. శివశంకర్ పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ఓ మంచి పుస్తకం పది మంది స్నేహితులతో సమానమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి తెలిపారు. ఈ పుస్తకం న్యాయవాద వృత్తిలోకి వచ్చే భవిష్యత్ తరాలకు టార్చ్బేరర్ వంటిది అన్నారు. శివశంకర్, తాను ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందినవారమేనని పేర్కొన్నారు. శివశంకర్ రాసిన వర్డ్స్, ప్రిన్సిపిల్స్, ప్రెసిడెంట్స్ పుస్తకం న్యాయవాదులతోపాటు, న్యాయమూర్తులకు కూడా ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఆయన గతంలో రాసిన పుస్తకాలు న్యాయ వ్యవస్థపై సమాచారంతోపాటు జ్ఞానాన్ని అందించాయని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జొయ్మాల్య బాగ్చి, దుర్గాప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాజధాని కేసుల్లో విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో పలువురి అభ్యర్థన మేరకు తదుపరి విచారణను నవంబర్ 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఆ తరువాత ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా రోజువారీ పద్ధతిలో విచారణ జరిగేందుకు సహకరించాలని ధర్మాసనం న్యాయవాదులకు తేల్చి చెప్పింది. న్యాయవాదుల వ్యక్తిగత కారణాలు ఏవైనప్పటికీ తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మాట్లాడుకుని ముందు ఎవరు వాదనలు ప్రారంభిస్తారో అందుకు సంబంధించి షెడ్యూల్ను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ విధానంలోనే తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. న్యాయవాదుల నుంచి భిన్న సూచనలు ఈ వ్యాజ్యాల్లో విచారణను సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ అందించామని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ తరఫున జూనియర్ న్యాయవాది సంజయ్ సూరనేని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విచారణను ఎప్పటికి వాయిదా వేయాలన్న దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. సెప్టెంబర్ చివరి వారానికి కోవిడ్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయని, అక్టోబర్ మొదటి వారం నుంచి హైకోర్టుకు దసరా సెలవులు, ఆ తరువాత దీపావళి సెలవులు ఉంటాయని ఏజీ తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో నిరాటంకంగా వాదనలు జరగాల్సి ఉన్నందున విచారణను నవంబర్లో చేపట్టాలని కోరారు. దీనిపైనా న్యాయవాదులు భిన్న సూచనలు చేశారు. పిటిషనర్ల తరఫున హాజరైన సుప్రీంకోర్టు న్యాయవాది దేవదత్ కామత్ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ సమయంలో ధర్మాసనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమలో తాము మాట్లాడుకుని ఎవరు ఏయే సమయంలో వాదనలు వినిపించాలో నిర్ణయించుకుని కోర్టుకు తెలియచేస్తామని ప్రతిపాదించారు. స్వాగతించిన ధర్మాసనం అత్యధికుల సూచన మేరకు తదుపరి విచారణను నవంబర్ 15కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాస్త్ర పట్టా పొందిన వారు న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకునేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు సమర్పించవచ్చ ని బార్కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కొత్త సాఫ్ట్వేర్ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత ఏ తేదీన వారికి ఎన్రోల్మెంట్ ఉంటుందో తెలియజేస్తామని, ఆరోజున మాత్రమే బార్ కౌన్సిల్కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. కార్యదర్శి రేణుక పదవీ విరమణ బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్.రేణుక శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 32 ఏళ్లుగా ఆమె బార్ కౌన్సిల్కు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంగా రామారావు, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పొన్నం అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బార్ కౌన్సిల్ కార్యదర్శిగా వి.నాగలక్ష్మిని నియమించారు. -
రాష్ట్రాలు దాటొచ్చి.. క్లయింట్ను కోర్టులో హాజరుపరిచేందుకు వెళ్తు..
సాక్షి, గన్నేరువరం (కరీంనగర్): వృత్తిలో భాగంగా రాష్ట్రాలు దాటొచ్చి, క్లయింట్ను కోర్టులో హాజరుపరిచేందుకు వెళ్తున్న రాజస్థాన్కు చెందిన ఓ న్యాయవాది రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని జూలూర్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న రాజేష్కుమార్ పర్వానీ (45)కి హైదరాబాద్కు చెందిన గంగారాం బంధువు. గంగారాంపై శంకరపట్నం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీని విషయమై మంగళవారం ఉదయం హుజూరాబాద్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. ఈ కేసును రాజేష్ కుమార్ పర్వానీ వాదిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఆయన తన క్లయింట్ గంగారాంతో కలిసి కారులో వస్తున్నారు. వీరి వాహనం గుండ్లపల్లి టోల్ప్లాజా వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న రాజేష్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కృష్ణతోపాటు, గంగారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కరీంనగర్ న్యాయవాదుల సంతాపం గుండ్లపల్లి వద్ద మృతిచెందిన వ్యక్తి న్యాయవాది అని తెలుసుకున్న కరీంనగర్ న్యాయవాదులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్రావు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు ప్రభాకర్రావు, సత్యనారాయణరావు, రాములు, మహేందర్రెడ్డి, శ్రీకాంత్ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఏసీపీ విజయసారథిని కలిసి వెంటనే పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించాలని కోరారు. ఏసీపీ ఆదేశాల మేరకు సీఐ శశిధర్రెడ్డి, ఎస్సై తిరుపతి ఆస్పత్రికి వచ్చి పంచానామా ముగించారు. కరీంనగర్లో ఉంటున్న రాజస్థాన్కు చెందిన సీనియర్ న్యాయవాది కిరణ్ సింగ్తోపాటు న్యాయవాదులు సంపత్, శ్రీనివాస్లు కేసు నమోదు చేయించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో రాజస్థాన్కు పంపించారు. వృత్తి ధర్మంలో భాగంగా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి, మృతిచెందడం బాధాకరమని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. -
లాయర్ దంపతుల హత్య: విచారణ పూర్తి.. చార్జ్షీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులైన గట్టు వామనరావు,నాగమణి హత్యలపై విచారణ వివరాలను తెలపాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా, తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయిందని హైకోర్టుకు విన్నవించారు. అయితే, ఛార్జీషీట్ ఫైల్ చేసారా అన్న ప్రశ్నకు.. గత నెల 19న విచారణను పూర్తి చేసి మంథని లోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ ముందు చార్జ్షీట్ దాఖలు చేశామని ఏజీ తెలిపారు. ఈ అభియోగపత్రం (చార్జిషీట్)పై విచారణ ఈనెల 10 నుంచి మంథని కోర్ట్లో జరుగుతుందని ఏజీ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకేసును న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారిస్తున్నసంగతి తెలిసిందే. చదవండి: ఏడాదిన్నరగా భార్యను, కూతుళ్లను ఇంట్లోనే నిర్భందించాడు! -
లాయర్ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్య కేసులో మే 17 నాటికి 90 రోజులు పూర్తవుతుందని, ఆ లోగా అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. న్యాయవాద దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గత ఫిబ్రవరిలో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదిక సమర్పిం చారు. ఈ కేసులో 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని, వారిలో 26 మంది వాంగ్మూలాలను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని, మిగిలినవారి వాంగ్మూలాలను త్వరలో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని.. ఆ నివేదిక వచ్చేందుకు నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17న హత్య జరిగిన నేపథ్యంలో మే 17 నాటికి 90 రోజులు అవుతుందని, 17లోగా సమగ్రంగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఇస్తే.. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని గట్టు వామన్రావు తండ్రి కిషన్రావు తరఫు న్యాయవాది విజయభాస్కర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. నివేదికపై హైకోర్టు సంతృప్తి.. దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసుల నివేదిక సంతృప్తికరంగా ఉందని, దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. చదవండి: బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు -
బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ.. తన ఫోన్ ద్వారా శ్రీనును వేరే వ్యక్తితో మాట్లాడించినట్లు బందోబస్తుకు వచి్చన రామగుం డం ఆర్ఎస్సై అజ్మీరా ప్రవీణ్ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు రక్షణగా వచ్చిన కానిస్టేబుళ్లు, కోర్టు పీసీ ఫోన్లో మాట్లాడకూడదని వారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ వెళ్లే దారిలో మరోసారి వచి్చన పుట్ట శైలజ ఓ మహిళతో వీడియోకాల్ మాట్లాడించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో వివరించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన పుట్ట శైలజపై చర్య తీసుకోవాలని కోరారు. కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరగడంతో మేజిస్ట్రేట్ అనుమతితో మంథని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మార్చి 26న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. పుట్ట శైలజ నిందితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించారని వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు సైతం పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే కేసు నమోదైనా, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం) -
లాయర్ దంపతుల హత్య బాధాకరం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లాయర్ వామన్రావు దంపతుల హత్య చాలా బాధాకరమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం మంత్రి మాట్లాడుతూ.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తమ పార్టీ చెందినవాడేనని తెలిసి తక్షణమే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారని, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామని హామీనిచ్చారు. వామన్రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది తెలంగాణ న్యాయవాదులేనని ప్రశంసించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. హైకోర్టు విభజన కోసం సీఎం కేసీఆర్ దాదాపు 10 సార్లు ప్రధాని మోదీని కలిశారని, విభజన జరిగాకే తెలంగాణకు తగిన న్యాయం జరిగిందన్నారు. ఆరున్నరేళ్లలో వ్యవసాయమే అబ్బురపడేలా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ పథకాలను ప్రధాని మోదీ కాపీ కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలు సంతోషంగా ఉండాలనే పెన్షన్లతో సహా ఎన్నో సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ విద్యపై కొందరు అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని,సంక్షేమ గురుకులాల్లో ఈ పథకం ఇప్పటికే నడుస్తోందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్పై కొందరు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలంతో మాట్లాడటం బాధ కలిగిస్తోందన్నారు. కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ లేవని పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్డీయే.. నో డేటా అవైలబుల్’ -
న్యాయవాదుల హత్యపై సీఎం స్పందించాలి
నిజామాబాద్ లీగల్: హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్యలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు స్పందించకుండా తన బాధ్యతలను విస్మరిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. వామన్రావు, నాగమణిల హత్యలను నిరసిస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు రిలే నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ శిబిరానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్రంలో అన్ని రాజకీయ పారీ్ట లు ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తే, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ నోరు మోదపటం లేదన్నారు. సీఎంగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్కు లేదని ధ్వజమెత్తారు. ఈ హత్యలతో సంబంధం ఉన్న వారు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగించాలి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ హత్యల విచారణకు సీబీఐకి అప్పగించాలని కోరిందని, అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కేసులో బిట్టు శ్రీను కుట్రదారుడిగా నిరూపితమయ్యిండని, పుట్ట మధును పోలీసులు ప్రశ్నించాలన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయటంలేదని, పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సీఎం స్పందించి ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించేలా విచారణకు ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్రెడ్డి, నిజామాబాద్ బార్ అధ్యక్షుడు గోవర్ధన్, కార్యదర్శి శ్రీధర్,డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, మహేశ్కుమార్గౌడ్, నాయకులు తాహెర్బిన్ హందాన్, నగేశ్రెడ్డి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలపై హామీ ఇవ్వాలి మోర్తాడ్: రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం రోజుకో విధమైన ప్రకటన చేస్తూ రైతులను ఆందోళనకు గురిస్తోందన్నారు. సెంటర్లను నిర్వహించడమే కాకుండా రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. సోమవారం ఏర్గట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. పైకి కేంద్రంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో కొత్త వ్యవసాయ చట్టాల అమలుకు అడుగులు వేస్తుండడాన్ని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. చదవండి : (న్యాయవాదుల హత్య: కీలక ఆధారాలు లభ్యం) (న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్) -
న్యాయవాదుల హత్య: కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసు నిందితులు ఉపయోగించిన ఆయుధాల వెలికితీత ఆపరేషన్ ముగిసింది. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం పెద్దపల్లి జిల్లా సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీలో 2 రోజులు సుమారు 10 నుంచి 15 మీటర్ల లోతున్న నీటిలో శ్రమించి రెండు కత్తులను బయటకు తీశారు. ఆదివారం ఆయుధాలు లభ్యం కాకపోవడంతో సోమవారం మళ్లీ ఇద్దరు నిందితులను బ్యారేజీ వద్దకు తీసుకొచ్చారు. ఓ పక్క డైవర్స్ గాలింపు చేస్తుండగానే, పోలీసులు 3 కిలోల బరువున్న 5 అయస్కాంతాలను తెప్పించారు. స్థానికుల సాయంతో నీటిలో వెతికించారు. సాయంత్రం సమయంలో 53–54వ పిల్లర్ల మధ్యలో రెండు కత్తులను డైవర్లు కనుగొని.. బయటికి తెచ్చారు. ఆ కత్తులను నిందితులకు చూపించగా అవేనని అంగీకరించారు. పంచనామా నిర్వహించిన తర్వాత కత్తులను రామగుండం పోలీస్ కమిషనరేట్కు తరలించారు. జ్యుడీషియల్ కస్టడీకి బిట్టు శ్రీను మంథని: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు బిట్టు శ్రీను జ్యుడీషియల్ కస్టడీకి పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. హత్య కేసులో శ్రీనును గత నెల 22న అరెస్టు చేసిన పోలీసులు 23న అర్ధరాత్రి దాటిన తర్వాత రిమాండ్కు తరలించారు. శ్రీనును తమ కస్టడీకి ఇవ్వాలని రామగిరి పోలీసులు శనివారం మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వాదనల అనంతరం ఏడు రోజుల కస్టడీకి మంథని జడ్జి అనుమతి ఇచ్చారు. ఇదే కేసులో ఏ1, ఏ2, ఏ3 నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ల ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈ నెల 4తో ముగుస్తుంది. చదవండి! న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్ ‘కేసీఆర్కు పుట్టా మధు సన్నిహితుడు’ -
న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతులు హత్యపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీస్శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఏ2, ఏ3ల స్టేట్మెంట్ని ఎందుకు సెక్షన్ 164 కింద ఇంకా నమోదు చేయలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ని ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. బాధితులను అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని అడిగారు. మెజిస్ట్రేట్ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, కాల్డాటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీపీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదన్న హైకోర్టు ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులకు ఎటువంటి రక్షణ కల్పించారో తెలపాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇందుకు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్మెంట్ రికార్డు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపిన ఏజీ.. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు. నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందన్నారు. అందుకే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద స్టేట్మెంట్ రికార్డు చేశామని తెలిపారు. పూర్తి సాక్ష్యాలు సేకరించడానికి గాను మరో రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15కు వాయిదా వేసింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్య ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది. చదవండి: న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్ న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు -
కలకలం రేపుతున్న ఆడియో టేపు
-
న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. జంట హత్యలు జరిగి పది రోజులు గడిచినా పురోగతి కనిపించట్లేదని దుయ్యబడుతున్నాయి. పోలీసులు మాత్రం తమకు లభించిన ఆధారాల మేరకే దర్యాప్తు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గొడవలు, వ్యక్తిగత కక్షలే హత్యలకు కారణమనే కోణంలోనే కేసు దర్యాప్తు జరుగుతోందని ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ కోణం బహిర్గతం కాలేదని పోలీసులు చెబుతున్నారు. జెడ్పీ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీను హత్యకు సహకరించినా.. అది వ్యక్తిగత వైరంతోనే అని పోలీసులు చెబుతున్నారు. కాగా, భవిష్యత్తులో కేసును సీబీఐకి లేదా సిట్కు బదిలీ చేసినా, తమ దర్యాప్తును తోసిపుచ్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి వచ్చిన ముగ్గురు నిందితులు కూడా విచారణలో కొత్త విషయాలు వెల్లడించట్లేదని తెలుస్తోంది. అరెస్టయినప్పుడు చెప్పిన కారణాలనే పునరావృతం చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామ కక్షలపైనే ఫోకస్ గట్టు వామన్రావు దంపతుల హత్యకు సొంత గ్రామం గుంజపడుగులో నాలుగు నెలల కిందటే ప్లాన్ వేసినా.. గ్రామంలో జనం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదని విచారణలో తేలినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గ్రామంలో తన సొంత సోదరుడి చేతిలో సర్పంచిగా ఓడిపోయిన తనను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా.. పెద్దమ్మ దేవాలయ నిర్మాణాన్ని, తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నాడనే కసి కుంట శ్రీనివాస్లో ఉంది. గ్రామంలోని శ్రీ రామస్వామి గోపాలస్వామి దేవాలయ కమిటీ విషయంలో ఏర్పడ్డ వివాదాలకు కూడా గట్టు వామన్రావు కారణమని భావించి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీనుతో కలసి హత్యకు ప్లాన్ చేశాడనేది పోలీసుల వాదన. ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా ఈ కోణంలోనే కన్పిస్తున్నాయి. గురువారం రామగుండం సీపీ కార్యాలయంలో ఆలయ కమిటీ వివాదంపై విచారణ జరిపారు. రెండు ఆలయాల్లో కమిటీ సభ్యుల్లో బ్రాహ్మణ, ముదిరాజ్, మున్నూరు కాపు, ఎస్సీ తదితర సామాజికవర్గాల వారు ఉన్నారు. గ్రామంలో నెలకొన్న మూడు వివాదాల చుట్టే పోలీసులు కేసును నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిట్టు శ్రీనుకు చంపించేంత కక్ష ఉందా? సోదరుడి చేతిలో అవమానాల పాలు కావడం, ఇల్లు, గుడి నిర్మాణాలను నిలిపివేయించడం, ఓ దేవాలయం కమిటీ విషయంలో అడ్డంకులు సృష్టించడం వంటి కారణాలతో గట్టు వామన్రావును చంపాలని కుంట శ్రీను కక్ష పెంచుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ హత్యలో పాలుపంచుకున్న బిట్టు శ్రీనుకు మాత్రం అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడనే విషయంలో పోలీసులు చెబుతున్న కారణాలు అంత బలంగా లేవు. నెలకు రూ.30 వేల రాబడి వచ్చే చెత్త ట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు, పుట్ట లింగమ్మ ట్రస్ట్లో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, కేసులు వేయడంతోనే గట్టు వామన్రావుపై కక్ష పెంచుకున్నాడని బిట్టు శ్రీనుపై అభియోగాలు మోపారు. అయితే ఇక్కడే పోలీసులు విచారణ లోతుగా జరపట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక క్వారీలు, ఇతరత్రా అక్రమాల్లో రూ.వందల కోట్లు ఆర్జించారని కోర్టుల్లో దావాలు వేసిన గట్టు వామన్రావు.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. దళిత యువకుడి హత్య కేసు అందులో ప్రధానమైంది. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆదాయ మార్గాలేంటి? ఇందులో అవకతవకలు జరిగాయని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వామనరావు ఫిర్యాదులు చేశారు. ఈ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న బిట్టు శ్రీనుకు ఇక్కడే కక్ష పెరిగిందని అర్థమవుతోంది. ఈ కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపితే కొత్త కోణాలు ఏవైనా బయటకు వస్తాయో చూడాలి. పోలీసుల కస్టడీలో ముగ్గురి విచారణ జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్లను తమ కస్టడీలోకి తీసుకొని రామగుండం కమిషనరేట్లో పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ అశోక్కుమార్ నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు వివిధ కోణాల్లో వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా, హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడవేసిన నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు గజ ఈతగాళ్లను విశాఖపట్నం నుంచి రప్పించినట్లు తెలిసింది. వీరు శనివారం సుందిళ్ల బ్యారేజీలోకి దిగనున్నారు. -
న్యాయవాదుల హత్య: నేడు కత్తుల వెలికితీత
గోదావరిఖని/వరంగల్: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణిల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నెల 17న వారిద్దరూ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ను రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వరంగల్ జైలుకు వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య రామగుండం పోలీస్ కమిషనరేట్కు తరలించారు. జైలు నుంచి నిందితులను రామగుండం తరలించేసరికి సాయంత్రం కావడంతో హత్యకు ఉపయోగించిన కత్తుల వెలికితీతను వాయిదా వేశారు. కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేసిన విషయం తెలిసిందే. పది మీటర్ల లోతులో ఉన్న వీటిని శుక్రవారం వెలికితీయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు జంటహత్యల్లో ఎవరి పాత్ర ఏమిటి, సహకరించిందెవరనే దానిపై మరింత లోతుగా విచారించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుపై హైకోర్టు, గవర్నర్ సైతం స్పందించడంతో పోలీసులు ప్రతీదీ సాక్ష్యాధారాలతో సహా సేకరిస్తున్నారు. చదవండి: ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?! -
ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?!
ప్రజాస్వామ్య భారతదేశంలో విద్వేషాలకు, దౌర్జన్యాలకు, హింసలకు ఆశ్రయం కల్పిస్తున్న కొందరు స్వార్ధ రాజకీయనేతల చెడు ఆలోచనలను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైనది. న్యాయవాద వృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి. సామాజిక అభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర చాలా క్రియాశీలమైనది. ఒకరకంగా చెప్పాలంటే న్యాయవాదులు సామాజిక ఇంజ నీర్లు. ప్రజాజీవితంలో అన్ని వర్గాలవారితో ఉండే సత్సంబంధాలు, సాన్నిహిత్యాల వల్ల వారికి ప్రజాజీవి తంతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. మన దేశ స్వాతంత్ర పోరాట సమయంలో న్యాయవాదుల పాత్ర చాలా క్రియాశీలమైనది. వారి ఆలోచనలు, కార్యాలు, త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం. అలాంటి న్యాయవాదులకు సరైన భద్రత, రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యత మన సభ్యసమాజంలో ప్రతి ఒక్కరిదీ. న్యాయవాదులు కక్షిదారులకు న్యాయం చేకూర్చే విధిలో ఉంటూ న్యాయాన్ని అందించాలనే ఒక బృహత్తర కార్యంలో అహర్నిశలు పని చేస్తుంటారు. ప్రజాప్రయోజనాలకోసం, కక్షిదార్లకు న్యాయం చేకూర్చడానికి తమ అమూల్యమైన సమయాన్ని, మేధోశక్తిని వెచ్చిస్తూ ఎంతో అంకితభావంతో పని చేస్తూంటారు. ఒక గురుతర బాధ్యతతో తమ సేవలను సమాజ శ్రేయస్సుకు వెచ్చించేవారు న్యాయవాదులు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు ఆయన సతీమణి నాగమణిని రోడ్డు మార్గంలో వెళుతుండగా అడ్డగించి అత్యంత పాశవికంగా వధిం చడం యావత్ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. గట్టు వామనరావు తన స్వగ్రామం మంథని నియోజకవర్గంలో ఉన్న గుంజపడుగు గ్రామంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై ఒక గ్రామస్తుడిగా, వృత్తిరీత్యా ఒక న్యాయవాదిగా అడ్డుకొని ప్రశ్నించేసరికి అక్కడి స్థానిక రాజకీయనాయకులకు మింగుడు పడకుండా పోయింది. వారు చేస్తున్న అక్రమాలపై, అన్యాయాలపై, ఆరాతీస్తూ, ప్రజాప్రయోజనాల వాజ్యాలు, సివిల్, క్రిమినల్ కేసుల ద్వారా చట్టపరంగా, న్యాయపరంగా వారి దురాక్రమణలను నిలువరిస్తుండటమే గట్టు వామనరావు దంపతుల తప్పయిపోయింది. న్యాయపరంగా ఆ కేసులను ఎదుర్కునే శక్తి లేక దుండగులు నిరాయుధులైన వారిని హత్య చేశారు. వామనరావు దంపతులు తమపై దాడి జరగనుందని ముందే ఊహించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించవలసినదిగా స్థానిక పోలీసులను కోరినా వారు పట్టించుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతమిచ్చినట్టయ్యింది. స్థానిక పోలీసులు సరైన సమయంలో చర్యతీసుకుని ఉంటే ఈరోజు గట్టు వామనరావు దంపతులు బతికి ఉండేవారేమో మరి. ప్రజల ప్రాణాలకు అండగా తాము ఉన్నామని భరోసా కల్పించే రక్షకభట వ్యవస్థ సరైన సమయంలో, జవాబుదారిగా వ్యవహరించి ఉంటే ఈరోజు ఈ దారుణాన్ని చూసివుండేవాళ్లం కాదు. ఒక మహిళా న్యాయవాదిని అత్యంత అమానుషంగా హత్య చేయటమే దారుణం కాగా, ఈ హత్యోదంతం జరుగుతున్నప్పుడు అటుగా వెళుతున్న రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, ఇతర వాహనదారులు చోద్యం చూస్తూ కూర్చోవడం షాక్ కలిగిస్తోంది. గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో ఎటువంటి భేషజాలు లేకుండా.. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటివారైనాసరే కఠిన శిక్షను విధించి అతి త్వరలో వాటిని అమలు చేసేలా చర్యలను తీసుకోవాలి. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే విధంగా కేసును సీబీఐకి అప్పగిస్తే దోషులందరికి శిక్షపడేలా చేయవచ్చు. న్యాయవాదులపై ఇలాంటి నేరాలు పునరావృత్తం కాకుండా ఉండటానికి న్యాయవాదుల రక్షణ చట్టంను తీసుకువచ్చి అమలు చేయాలి. ప్రజాప్రయోజన వాజ్యాల రూపంలో అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలను కాలరాస్తున్న నేరగాళ్ళను అన్ని పార్టీలనుండి బహిష్కరించి వారి కార్యకలాపాలపై డేగ కన్ను వేసి ఉంచే బాధ్యత ప్రతి ఒక్క రాజకీయపార్టీపై ఉంది. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రాజకీయపార్టీ సభ్యులందరికి క్రమశిక్షణా తరగతులను నిర్వహిం చాలి. సమాజ శ్రేయస్సుకు ఏ రకమైన విలువలతో కృషి చేయాలో, అలాంటి మంచి విలువలతో కూడిన రాజకీయ శిక్షణాతరగతులను బోధించే సంస్కరణలకు ప్రతి రాజకీయ పార్టీ పూనుకోవలసి ఉంది. కె. శివచరణ్ అడ్వకేట్ మొబైల్ : 95158 90088 -
3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి..
సాక్షి, కరీంనగర్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్యలకు నిందితులు రెండు గంటల్లోనే ప్లాన్ చేసి అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను నిందితుల ‘రిమాండ్ కేస్ డైరీ’లో వివరించారు. వామన్రావు దంపతుల కన్నా 3 నిమిషాల ముందు మాత్రమే నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి నల్ల బ్రీజా కారులో వెళ్లి కల్వచర్ల వద్ద మాటు వేసినట్లు వీడియో ఫుటేజీల్లో రికార్డు అయిన సమయాన్ని విశ్లేషిస్తే తెలుస్తోంది. హత్యాకాండను ఐదారు నిమిషాల్లోనే పూర్తిచేసి తిరిగి మంథని వైపు వెళ్లినట్టు తేలింది. 2.26 గంటల నుంచి... హత్య జరిగిన 17వ తేదీ మధ్యాహ్నం 2:26.38 గంటలకు నిందితులు ఉపయో గించిన నంబర్ లేని బ్రీజా కారు పొన్నూరు క్రాస్రోడ్స్లో కనిపించింది. 2:27 గంటలకు సెంటినరీ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్దకు వచ్చింది. వీరి వెనుకే గట్టు వామన్రావు దంపతులు ప్రయాణిస్తున్న క్రెటా కారు 2:29 గంటలకు పొన్నూరు క్రాస్రోడ్స్ వద్ద పెద్దపల్లి వైపు వెళ్లగా 2:30.09 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద క్రాస్ అయింది. అంటే, నిందితుల కారుకు, న్యాయవాద దంపతుల కారుకు మధ్య నున్న సమయ వ్యత్యాసం 3 నిమిషాలే. తెలంగాణ చౌరస్తా నుంచి హత్య జరిగిన ప్రాంతానికి రెండున్నర కి.మీ. దూరం ఉండగా కారులో 2 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. దీనిని బట్టి హత్య 2:32 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఐదారు నిమిషాల్లోనే హత్యలు చేసి నిందితులు తిరుగు ప్రయాణమై సీసీటీవీ ఫుటేజీల్లో చిక్కారు. 2:41 గంటలకు హత్యకు వాడిన బ్రీజా కారు తెలంగాణ చౌరస్తాలోకి చేరుకోగా, వీరిని వెంబడించిన కుంట శ్రీనివాస్కు చెందిన వైట్ క్రెటా కారు కూడా 2:42 గంటలకే తెలంగాణ చౌరస్తాలో కనిపించింది. బిట్టు శ్రీనుకు కుంట శ్రీను కాల్.. వామన్రావు దంపతులు మంథని కోర్టుకు రావడాన్ని కుంట శ్రీనివాస్ 17న మధ్యాహ్నం 12:45 గంటలకు బిట్టు శ్రీనుకు చెప్పినట్టు ఫోన్కాల్డేటాను బట్టి తెలుస్తోంది. దీన్ని నిర్ధారించుకోమని బిట్టు శ్రీను అనడంతో కుంట శ్రీనివాస్.. పూదరి లచ్చయ్యకి కాల్ చేసి వామన్రావు వచ్చాడో లేదో చెప్పాలన్నాడు. దీంతో 12:47 గంటలకు లచ్చయ్య కాల్ చేసి వామన్రావు రాకను నిర్ధారించాడు. అప్పుడు కుంట శ్రీనివాస్ మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లొకేషన్ నుంచి మాట్లాడినట్టు కాల్డేటా ఆధారంగా గుర్తించారు. అప్పటి నుంచి ఫోన్ కాల్స్ ద్వారానే కుంట శ్రీనివాస్(ఏ1), బిట్టు శ్రీను(ఏ4), పూదరి లచ్చయ్య(ఏ5), చిరంజీవి (ఏ2), కుమార్ (ఏ3)లు మాట్లాడుకుంటూ ఉన్నారు. హత్యకు ముందు 2:15 గంటలకు చిరంజీవికి చివరి ఫోన్కాల్ చేసిన కుంట శ్రీనివాస్.. అతడిని తీసుకుని కారులో 17 నిమిషాల్లోనే స్పాట్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గుంజపడుగులో పోలీసుల విచారణ.. హత్యకు గ్రామంలోని కక్షలే కారణమని నిందితులు పేర్కొనడంతో మంథని మం డలం గుంజపడుగులో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన బాబు, రఘు, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్లను భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. -
లాయర్ తలకు తుపాకీ గురి.. భూవివాదం
సాక్షి, హైదరాబాద్: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్నగర్ స్ట్రీట్ నంబర్ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. దీంతో కక్షకట్టిన వాళ్లు ఈ నెల 17 సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, సెక్టార్ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
పది నెలల క్రితమే ప్లాన్: చంపకపోతే
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్న, ఎవరినైనా, ఎంతటివారినైనా వదలిపెట్టేదిలేదని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్ చేశామన్నారు. వామన్రావును హత్య చేయాలని పది నెలల క్రితమే ప్లాన్ చేశారని, చాలా సార్లు స్కెచ్ విఫలమైందని తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రధాన నిందితుల వాంగ్మూలం, నిందితుడు బిట్టు శ్రీను అలియాస్ తులసిగరి శ్రీను ఇచ్చిన వాంగ్మూలంను విశ్లేషించగా పలు విషయాలు తెలిసినవని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాలు (బిట్టు వాంగ్మూలం) బిట్టు శ్రీను 2016 సంవత్సరం నుండి మంథనిలో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. మంథని ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ ట్రస్టుపై మృతుడు గట్టు వామన్ రావు ట్రస్ట్పై పలు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో చులకన చేస్తూ పలు వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించేవాడు. బిట్టు శ్రీనుపై అవమానకరంగా అవినీతి కార్యక్రమాలు చేస్తున్నాడని ప్రచారం చేసేవాడు. ట్రస్టు మరియు ట్రస్ట్ యొక్క ఆదాయాల పై హైదరాబాద్, ఇతర చోట్ల గట్టు వామన్ రావు తన అనుచరులతో ఫిర్యాదులు చేపించేవాడు. 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామపంచాయతీలో బిట్టు శీను చెత్త రవాణా కొరకు ఒక ట్రాక్టర్ పెట్టగా బిట్టు శ్రీనుకు నెలకు 30 వేల రూపాయలు ఆదాయం వచ్చేది. దానిపై 2019 మార్చి లో గ్రామ పంచాయతీలోని అధికారికి బిట్టు శ్రీను యొక్క ట్రాక్టర్ పై ఫిర్యాదు చేసి దానిని తీసి వేయాలి అని పంచాయతీ అధికారిపై గట్టు వామన్ రావు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దానితో ఆ అధికారి ట్రాక్టర్ని గ్రామపంచాయతీ నుండి తొలగించాడు. దానిపై వచ్చే నెల వారి 30 వేల ఆదాయం బిట్టు శ్రీను కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని గట్టు వామనరావు బిట్టు శ్రీనుపై సాధించిన విజయంగా మంథని ప్రాంతంలో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. బిట్టు శ్రీను- కుంట శ్రీను కి గల సంబంధం మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు గత ఆరు సంవత్సరాలుగా పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. రెగ్యులర్గా కలిసి ఉండేవారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మందు తాగే సమయంలో పంచుకునేవారు. వీళ్ళతో అప్పుడప్పుడు చిరంజీవి కూడా కలిసేవాడు. ఈ క్రమంలో కుంట శ్రీనివాస్ గుంజపడుగు గ్రామస్తుడైన గట్టు వామన్ రావు పీవీ నాగమణి దంపతులు హైకోర్టు న్యాయవాదులుగా చలామణి అవుతూ కొన్ని సంవత్సరాలుగా కుంట శ్రీనివాస్ను టార్గెట్ చేసుకొని ఒక ఫోన్ కాల్ విషయంలో హైదరాబాదులో కుంట శ్రీనివాస్ పై కేసు పెట్టించారు . కుంట శ్రీను వాళ్ళ కులదైవం పెద్దమ్మ తల్లి గుడి కట్టుటకు కుంట శ్రీనును చైర్మన్గా పెట్టి గుడి కడుతున్న క్రమంలో దానిని అక్రమ నిర్మాణం అని ఫిర్యాదు చేసి నోటీసులు ఇప్పించి వామన్ రావు దంపతులు గుడి నిర్మాణం ఆపించడం జరిగింది. కుంట శీను ఇంటి నిర్మాణం చేస్తుండగా నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోలేదని అక్రమ నిర్మాణం చేస్తున్నాడని నిర్మాణం ఆపుదల చేస్తూ గ్రామపంచాయతీ నుండి నోటీసు ఇచ్చి నోటీసును ఫ్లెక్సీ తయారు చేపించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గట్టు వామన్ రావు ప్రచారం చేయడం జరిగింది. గుంజపడుగు లో రామ స్వామి గోపాల స్వామి ఆలయానికి సంబంధించిన కమిటీ చైర్మెన్ గా చాలా సంవత్సరాల నుండి వామన్ రావు తమ్ముడు చైర్మన్ గా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడని, ఈ మధ్యకాలంలో గుంజపడుగు గ్రామస్తులు అందరూ కలిసి పాత కమిటీ రద్దుపరచి కొత్త కమిటీ చైర్మన్ గా వెల్ది వసంతరావు నీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి విషయంలో కూడా గట్టు వామన్ రావు, నాగమణి, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో ఫిర్యాదు చేయుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవ జరిగిందని ఆ విధంగా కుంట శ్రీను గ్రామంలో తన అధిపత్యానికి వామన్ రావు నాగమణి లు అడ్డువస్తున్నారని దానికి బిట్టు శీను కూడా కుంట శ్రీను తో తనకి కూడా ఆదాయ మార్గాలు రాకుండా చేసి ప్రజలలో అవమాన పరిచాడు వ్యక్తిగతంగా తీవ్ర నష్టం చేసాడని గట్టు వామన్ రావు ని చంపే విషయాలలో ఏలాంటి సహాయం కావాలన్నా చేస్తానని కుంట శ్రీనుతో చెప్పాడు. అందాద నాలుగు నెలల క్రితం వామన్ రావు గురించి చర్చించే సమయంలో కుంట శ్రీను రెండు కత్తులు తయారు చేయించి పెట్టు అన్నా అని బిట్టు శ్రీనుకి చెప్పగా బిట్టు శ్రీను రెండు ట్రాక్టర్ పట్టీలు తీసుకొని మంథనిలో కత్తులు తయారు చేపించి చిరంజీవి ఇంట్లో పెట్టారు. బిట్టు శీను అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం వామన్ రావుని చంపకపోతే మనకు భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది ఉంటుందని చాలా సందర్భాల్లో గత 10 నెలల నుండి కుంట శీను, బిట్టు శ్రీనుకు చెప్పడం జరిగింది. అందదా నాలుగు నెలల క్రితం వామన్ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా చిరంజీవి వారిని చూసి బిట్టు శీనుకు చెప్పగా వెంటనే ఇట్టి విషయం కుంట శ్రీనుకి బిట్టు శ్రీను తెలియజేశాడు. కుంట శ్రీను మంథనికి వచ్చేలోపే వామన్ రావు మూడు కార్లలో గుంజపడుగు వచ్చాడు. అప్పుడు కుంట శ్రీను వామన్ రావు గురించి గుంజపడుగు బస్ స్టాప్లో వెయిట్ చేశాడు. వామన్ రావు వాళ్ళ ఇంటికి వారితో పాటు వచ్చిన ఒక వ్యక్తికి సన్మానం చేస్తుండగా కుంట శ్రీను వామన్ రావు ఇంటికి ఎదురుగా ఉన్నా పాత స్కూల్ బిల్డింగ్ నుంచి చూసి ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు వీలు కాదని చెప్పగా వామన్ రావుని హత్యా ప్లాన్ విరమించుకున్నారు. వామన్ రావు హత్య పథకంలో ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న క్రమంలో తేదీ 17.2.2021 రోజు మధ్యాహ్నం సమయంలో మంథని కోర్టుకి గట్టు వామన్ రావు దంపతులు వచ్చారు అని తెలిసి కుంట శీను బిట్టు శ్రీనుకి ఫోన్ ద్వారా తెలపగా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకో అని చెప్పగా అప్పుడు కోర్టు దగ్గర లో ఉన్న కుంట లచ్చయ్య కి ఫోన్ చేసి వామన్ రావు ఉన్నది నిజమని నిర్ధారణ చేసుకుని మరల చెప్పడం జరిగింది. వెంటనే బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని అర్జెంట్గా మంథని బస్ స్టాప్ దగ్గరికి రమ్మని చెప్పినాడు. చిరంజీవి టూ వీలర్ పై కత్తులు తీసుకొని రాగా అంతలో బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇవ్వగా కత్తులు కార్ లో పెట్టుకుని కుంట శ్రీను వద్దకు వెళ్లి పోయాడు. కల్వచర్ల సమీపంలో వామన్ రావు, తన భార్య నాగమణి ఇద్దరిని చంపాము అని కుంట శ్రీను బిట్టు శ్రీను కి ఫోన్లో తెలపగా బిట్టుశ్రీను మంచిది, మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పి బిట్టు శ్రీను ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడు. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి న అవసరం ఉంది. ఇంకా కొంతమంది సాక్ష్యులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిందితులను అందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. దీనికిగాను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు మరియు సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ గారు ప్రధాన విచారణ అధికారిగా సమగ్ర విచారణ చేస్తున్నారు. సాక్ష్యాలు గానీ,హత్యకు సంబంధించిన వీడియో లు సమాచారం,ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం అందిస్తే, ఇచ్చిన ప్రతి అంశాన్ని దర్యాప్తులో నిర్ధారించుకొని పరిశోధనలో ముందుకు పోవడం జరుగుతుంది అంటూ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం!
సాక్షి, పెద్దపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యకేసు విచారణ కీలక దశకు చేరింది. హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరు అనేది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు, మరోసారి వారిని విచారించేందుకు కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. పోలీసుల కస్టడీలో ఉన్న బిట్టు శ్రీనును ఏ క్షణానైనా కోర్టులో హజరుపరుచనున్నారు. బిట్టు శ్రీను ఇచ్చిన కీలక సమాచారంను రుజువు చేసుకునేందుకు రిమాండ్లో ఉన్న ముగ్గురిని వారం రోజులు కస్టడికి ఇవ్వాలని రామగిరి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్జి లేకపోవడం పిటిషన్ పెండింగ్లో ఉంది. మరోవైపు నిందితులకు బెయిల్ కోసం బందువులు ప్రయత్నిస్తుండగా నిందితుల పక్షాన ఎవరు వకాలత్ చేయవద్దని, మార్చి ఒకటో తేదీ వరకు విధులు బహిష్కరించాలని మంథని కోర్టు న్యాయవాదులు తీర్మానించారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య చిక్కుముడి త్వరలో వీడనుంది. హత్య కేసును హైకోర్టు సుమోటగా స్వీకరించడంతో పాటు న్యాయవాదులు నిరసన ఆందోళనలు వ్యక్తం చేస్తుండడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇద్దరు ఐజీలు, ఓ డిఐజి, సిపి పర్యవేక్షణలో దర్యాప్తు బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. న్యాయవాదుల హత్యకు కారు, కత్తుల సమకూర్చిన బిట్టు శ్రీను వాగ్మూలం పైనే కేసు అంతా ఆధారపడి ఉండడంతో నాలుగు రోజులుగా పోలీసులు అతన్ని కస్టడిలో ఉంచుకుని రహస్యంగా విచారించారు. వీడియో ఎవిడెన్స్ లతో బిట్టు శ్రీను నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది. ఆయన ఇచ్చిన సమాచారం ఏమేరకు సరైనదో తెలుసుకునేందుకు ఇప్పటికే అరెస్ట్రై జైలులో ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్లను వారం రోజుల పాటు కస్టడీ కోరుతు పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నల్లకోటును అడ్డుపెట్టుకుని.. గుంజపడుగు గ్రామస్థులతో పాటు వామన్ రావు బాదితులు ఒక్కొక్కరు బయటికి వస్తు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న న్యాయవాదులను, రాజకీయ పార్టీల నాయకులను నిలదీస్తున్నారు. దంపతుల హత్యను ఓ వైపు ఖండిస్తూనే మరోవైపు వారికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రజలందరు భావిస్తున్నట్లు వామన్ రావు మంచోడుకాదన్నారు. నల్లకోటును అడ్డుపెట్టుకుని గ్రామాభివృద్దిని అడ్డుకున్నారని ఆరోపించారు. క్రిమినల్ మైండ్తో బ్లాక్ మెయిల్కు పాల్పడుతూ అనేక మందిని ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. గ్రామంలో బడి, గుడి, గ్రామపంచాయితీ భవన నిర్మాణాలను అడ్డుకోవడంతోపాటు 90 మందికి పించన్లు రాకుండా చేశాడని, ఏ ఉద్యోగి సరిగా పని చేయకుండా ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని హైకోర్టులో పిల్ వేసి అనేక మందికి అన్యాయం చేశాడని అలాంటి వ్యక్తికి మద్దతుగా వస్తున్నవారు వాస్తవాలను తెలుసుకుని అన్యాయానికి గురైన వారందరికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. పుట్టమధు పాత్రపై అనుమానం..! మరోవైపు వామన్ రావు హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో అయన కుటుంబాన్ని పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. హత్యకు పాల్పడింది టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కావడంతో న్యాయవాదులతోపాటు కాంగ్రెస్, బీజేపీ నేతలు వామన్ రావు కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇద్దరిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. హత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్యకు కారు, కత్తుల సమకూర్చిన బిట్టు శ్రీను జడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు కావడంతో హత్యకు రాజకీయంగా ప్రాధాన్యత పెరిగింది. మధు ఆత్మలా వ్యవహరించే బిట్టు శ్రీను గుంజపడుగుకు చెందిన కుంట శ్రీనివాస్తో హత్య చేయించాడా, లేక మేనమామ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. అందులో బాగంగానే బిట్టు శ్రీనును నాలుగురోజులపాటు విచారించి అతను ఇచ్చిన సమాచారంతో రిమాండ్ లో ఉన్న నిందితులను కస్టడిలోకి తీసుకుని విచారించనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా రెండుమూడు రోజుల్లో హత్యకు గల కారణాలు, దానివెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. -
వికారాబాద్లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
సాక్షి, వికారాబాద్: పాత కక్షల నేపథ్యంలో పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదుల హత్యోదంతాన్ని మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలి భర్తను.. గ్రామ సర్పంచ్ దారుణంగా హత్య చేశాడు. పెద్దేముల్ మండలం హన్మపూర్లో సోమవారం ఈ దారుణం చోటు చేసుకుంది. పెద్దేముల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వాణిశ్రీ భర్త వీరప్పకు, స్థానిక గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సర్పంచ్ కుటుంబ సభ్యులు వీరప్పపై దాడి చేశారు. ఊరడమ్మ గుడి దగ్గర కర్రలతో కొట్టి హత్య చేశారు. రాజకీయ కక్షల వల్లే హత్య జరిగిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
వికారాబాద్లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
-
న్యాయవాదుల హత్య: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, కరీంగనర్/పెద్దపల్లి: హైకోర్టు న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. కుంట శీను, చిరంజీవి ఇద్దరూ పథకం ప్రకారమే న్యాయవాద దంపతులను హతమార్చినట్టు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత నిందితులు రామగిరి నుంచి మహరాష్ట్రకు పరారయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్లో కత్తులు, బట్టలు పడేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం సుందిళ్ల బ్యారేజ్ దగ్గరే వేరే బట్టలు మార్చుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. న్యాయవాది వామన్రావుకు సంబంధించిన సమాచారాన్ని లచ్చయ్య ఎప్పటికప్పుడు కుంట శీనుకు అందించేవాడని తెలిసింది. హత్యకు వినియోగించిన కత్తులు, వాహనం బిట్టు శీను సమకూర్చాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న పోలీసులు.. మరో ఇద్దరు నిందితులు కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. చదవండి: 'నా భర్తను వామన్రావు హత్య చేశాడు’ న్యాయవాద దంపతుల హత్య: బిట్టు శ్రీను ఏం చెప్పాడు? -
న్యాయవాద దంపతుల హత్య: బిట్టు శ్రీను ఏం చెప్పాడు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు–నాగమణి హత్యల కేసులో కొంత పురోగతి వచ్చినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా బార్ కౌన్సిళ్లన్నీ ఈ జంటహత్యలపై ఆందోళన వ్యక్తం చేయడం, హైకోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలతో ఐజీ నాగిరెడ్డి, డీఐజీ ప్రమోద్కుమార్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. రామగుండం కమిషనర్ వి.సత్యనారాయణ, డీసీపీ (అడ్మిన్) అశోక్కుమార్ దర్యాప్తును వేగవంతం చేశారు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఈ కేసులో కీలకంగా మారాడు. ఈనెల 19న అతడిని అదుపులోకి తీసుకున్న రామగుండం కమిషనరేట్ అధికారులు.. నిజాలు రాబట్టే పనిలో పడ్డారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్కు కారు, కత్తులు, డ్రైవర్ను ఎందుకు ఇచ్చాడనే విషయంలో స్పష్టత వచ్చినట్లు సమాచారం. బిట్టు శ్రీనుకు వామన్రావుపై కక్ష ఎందుకు? గుంజపడుగు గ్రామ గొడవల కారణంగా వామన్రావుపై కుంట శ్రీనివాస్ కక్ష పెంచుకున్నారనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ మధు మేనల్లుడు బిట్టు శ్రీనుకు వామనరావుపై పగ ఎందుకు అనే కోణంలో పోలీసులు విచారణ జరిపినట్టు తెలిసింది. బిట్టు శ్రీనుకు గతంలో చెప్పుకోదగ్గ నేరచరిత్ర లేదు. వామన్రావుతో నేరుగా గొడవలు జరిగిన దాఖలాల్లేవు. వామనరావు జెడ్పీ చైర్మన్ పుట్ట మధుపైనే దావాలు వేశారు. బిట్టు శ్రీనును ఆయన ఎక్కడా టార్గెట్ చేయలేదు. ఈ నేపథ్యంలో వామన్రావును చంపాలనుకున్న కుంట శ్రీనివాస్కు బిట్టు శ్రీను ఎందుకు సహకరిం చాడనే అంశంపైనే పోలీసుల విచారణ సాగినట్లు సమాచారం. హత్యలు పథకం ప్రకారం జరిగాయా లేక అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా అనే వాటిపైనా సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. వామన్రావు హత్యకు సహకరించాలని శ్రీనును ఎవరు ప్రోత్సహించారు? ఏం జరిగినా చూసుకుంటామనే అభయం ఇచ్చి పంపారా? అనే కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. నిందితులను కస్టడీకి తీసుకునే యోచన బిట్టు శ్రీనును అరెస్టు చేసి తమ అదుపులో ఉంచుకొని విచారణ జరిపిన పోలీసులకు కొంత సమాచారం లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పుట్ట మధు మేనల్లుడిగా ఆయనకు సంబంధం లేకుండా హత్యలో ఎందుకు పాలుపంచుకోవలసి వచ్చిందనే విషయంలో బిట్టు శ్రీను తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది. సోమవారం అతడిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అలాగే బిట్టు శ్రీను విచారణలో చెప్పిన విషయాలను సరి చూసుకునేందుకు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్ను పోలీస్ కస్టడీకి తీసుకోవాలని రామగుండం పోలీసులు భావిస్తున్నారు. కస్టడీలో ఆ ముగ్గురూ ఇచ్చే సమాచారంతో పోలీసులు కేసుపై ఓ నిర్ణయానికి రానున్నారు. కాగా, కోర్టు దగ్గర వామన్రావు కదలికల గురించి కుంట శ్రీనుకు ఫోన్లో తెలియజేసిన లచ్చయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హత్య జరిగిన స్థలంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆదివారం సాయంత్రం ఆధారాలు సేకరించింది. -
'నా భర్తను వామన్రావు హత్య చేశాడు’
సాక్షి,కరీంనగర్: ఇరిగేషన్శాఖలో పనిచేస్తుండే తన భర్త వెంకటేశ్వర్లును ఇటీవల హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామన్రావు హత్య చేశాడని వెంకటేశ్వర్లు భార్య నల్లవెల్లి అరుణజ్యోతి ఆరోపించారు. శనివారం కరీంనగర్ ప్రెస్భవన్లో విలేకరులతో మాట్లాడుతూ 2008లో తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించలేదని పేర్కొన్నారు. డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తన భర్తను కరీంనగర్ అల్గునూర్ వద్ద కిడ్నాప్ చేసి నల్గొండ జిల్లా వెలిగొండ గ్రామంలో హత్య చేసినట్లు ఆమె ఆరోపించారు. హోంమంత్రి, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల వద్దకు వెళ్లినా తనకు న్యాయం జరగలేదన్నారు. తన లాంటి బాధితులు చాలా మంది ఉన్నారని తెలిపారు. అతడిపై చాలా కేసులున్నాయని, పోలీస్లు న్యాయం చేయాలని కోరారు. నల్లవెల్లి సందీప్, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు
సాక్షి, కరీంనగర్: మంథని నియోజకవర్గానికి 70 ఏళ్ల తర్వాత ఓ గరీబ్ బిడ్డ ఎమ్మెల్యే అయితే అగ్రవర్గాలు తట్టుకోలేదని, ఇప్పుడు జెడ్పీ చైర్మన్ అయ్యాక మరింత బురదజల్లుతున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. ‘నేను వజ్రం లాంటి వాడిని.. మోసగాడిని కాదు’అంటూ వ్యాఖ్యానించారు. మంథనిలో శనివారం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. తనను కేసులో ఇరికించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఇందుకు మీడియా తోడైందని ధ్వజమెత్తారు. తనను కొంద రు మీడియా మిత్రులు సంప్రదించగా ‘పోలీసుల విచారణ జరుగుతోంది. మా మండల పార్టీ అధ్యక్షుడి పేరు చనిపోయిన అతడు చెప్పాడు. ఏమైందో పోలీసులు తేలుస్తారు. విచారణ అనంతరమే స్పందిస్తా’ అని చెప్పగా.. మొహం చాటేసినట్లు ఓ టీవీ చానల్ ప్రసారం చేసిందని మండిపడ్డారు. ‘నేను నియోజకవర్గంలోనే తిరుగుతుంటే హైదరాబాద్ పరారైనట్లు వార్తలు వేస్తున్నారు. వారికేమైనా మెదడుందా? నేను ఇక్కడే ఉన్న. నిన్న మంత్రి వచ్చిండంటే పెద్దపల్లికి పోయి వచ్చిన’ అని ధ్వజమెత్తారు. ‘హైదరాబాద్లో కూర్చొని వార్తలు రాస్తున్నారా? పోలీస్ వాళ్లను పక్కన బెట్టి మీరే ఎంక్వైరీ చేస్తారా?’అంటూ వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్, కేటీఆర్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, వారు తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు ఎందుకు కక్షగట్టాయో అర్థం కావట్లేదని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేసేందుకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు కొందరిని కొనుగోలు చేశాడంటూ విమర్శించారు. పోలీసుల విచారణ జరుగుతున్నప్పుడే మీడియా సమాంతర విచారణ చేస్తున్నారని ఆరోపించారు. ‘నన్ను లోపల వేయించేందుకు మీడియా ఆరాటపడుతోంది. మీరే ఓ దరఖాస్తు పెట్టి ఆ పని చేయండి’ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో నిత్యం ప్రజా సంక్షేమ, పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతుంటే నాపై, నా కుటుంబంపై ఎందుకు విషం కక్కుతున్నారంటూ మీడియాపై నిప్పులు చెరిగారు. పోలీసుల విచారణ పూర్తయ్యాక హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినా తనపై విషం చిమ్మిన పత్రికలు, చానల్స్ వ్యవహరంపై ఆధారాలతో మాట్లాడుతాన ని ‘నేను ఎన్నడూ రౌడీయిజం చేయలేదు. నువ్వు, నీ తమ్ముడు చేశారు’అంటూ శ్రీధర్బాబు, శ్రీనుబాబులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఆ హత్యల కేసులో ఎంతటివారున్నా వదలం) (దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య) -
దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘గ్రామంలో కులపెద్దనైన నన్ను ఇబ్బంది పెట్టిండు. నా తమ్ముడైన సర్పంచితో నోటీసులు ఇప్పించిండు. కలెక్టర్కు ఫిర్యాదు చేయించిండు. ఇన్ని అవమానాల పాలు చేసినందుకే వామన్రావును చంపాలని నిర్ణయించుకున్నా’అని న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచినట్లు తెలిసింది. ‘వామన్రావు దంపతులు కోర్టుకు వచ్చిన విషయాన్ని లచ్చయ్య అనే వ్యక్తి కుంట శ్రీనివాస్కు చేరవేశాడు. ఆ వెంటనే వామన్రావును హత్య చేసే విషయమై సహకరించాలని కుంట శ్రీను.. చిరంజీవిని, బిట్టు శ్రీనును కోరాడు. ఇందుకు వారు ఒప్పుకున్నారు. వామన్రావును ఎలాగైనా చంపాలని బిట్టు శ్రీను.. కుంట శ్రీనుకు చెప్పడంతోపాటు రెండు కత్తులు, కారు సమకూర్చాడు. అనంతరం బిట్టు శ్రీను సీన్లో నుంచి వెళ్లిపోయాడు. హత్య తర్వా త కుంట శ్రీను కారులో పరారవుతూ బిట్టు శ్రీను కు ఫోన్ చేస్తే.. మంథనిలో ఉండొద్దని అతడికి సూచించాడు. దాంతో సుందిళ్ల బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తూ బ్యారేజీ మీద ఆగి బట్టలు, కత్తులు కట్ట కట్టి, దానికి బండ కట్టి బ్యారేజీలో వేశారు. ఫోన్లు కూడా బ్యారేజీలో పడేశారు. డ్రైవర్ చిరంజీవి తన ఫోన్లో సిమ్ విరిచి కొత్తది వేసుకున్నాడు’అని రిమాండ్ రిపోర్టులో పోలీసు లు పొందుపరిచినట్లు సమాచారం. లచ్చయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారని తెలిసింది. చదవండి: (ఆ హత్యల కేసులో ఎంతటివారున్నా వదలం) -
న్యాయవాదుల హత్య: ‘ఆ ఆరోపణల్లో నిజం లేదు’
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణిలను పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని చాలెంజింగ్గా తీసుకున్నామని.. హత్య జరిగిన 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. మంథనికి సంబంధం లేని పోలీస్ అధికారులతో దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్య అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రామగుండం సీపీని ‘సాక్షి’ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 24 గంటల్లోపే అరెస్టు చేశాం.. గట్టు వామన్రావు, నాగమణిలను దారుణంగా పట్టపగలు, నడిరోడ్డు మీద హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. దంపతులపై దాడిచేసినవారిని 24 గంటలలోపే అరెస్టు చేశాం. వారికి రెక్కీగా ఉపయోగపడ్డ కుమార్ను అరెస్టు చేశాం. ఈ క్రమంలోనే శాస్త్రీయపరమైన దర్యాప్తులో బిట్టు శ్రీను పాత్ర బయటకొచ్చింది. అతడు కారు, కత్తులు సమకూర్చినట్టు తేలింది. మాతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రీయ, సాంకేతిక బృందాలు దర్యాప్తులో పాలు పంచుకుంటున్నాయి. విచారణలో నిందితులుగా తేలితే వారు ఎంతటివారైనా సరే కచ్చితంగా అరెస్టు చేస్తాం. శాస్త్రీయ విధానంలో దర్యాప్తు.. బిట్టు శ్రీను అనే వ్యక్తి మంథనికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మేనల్లుడు. చిరంజీవి, కుంట శ్రీనుతో హత్యకు ముందు, తర్వాత చాలాసార్లు మాట్లాడాడు. వారికి కారు, కత్తులు ఇచ్చాడు. మరోవైపు ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు ఊరిలో ఉన్న ఇల్లు, పెద్దమ్మ గుడి, రామస్వామి గోపాలస్వామి గుడి వివాదాలతోపాటు వామన్రావు కుటుంబంతో విభేదాలు ఉండటంతో హత్యలో నేరుగా పాల్గొన్నాడు. బిట్టు శ్రీను కీలక పాత్ర వహించాడన్న ఆధారాలు దొరికిన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నాం. కేసును ఇతర ప్రాంతాల వారే దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ సీజ్ చేశాం.. వామన్రావు తొలుత పుట్ట మధు పేరు ప్రస్తావించినట్లు వైరల్ అయింది నిజమే. ఒరిజనల్గా వామన్రావును వీడియో తీసిన వ్యక్తి ఫోన్ను సీజ్ చేశాం. ఎలాంటి మార్ఫింగ్లు, కటింగ్లు లేని ఒరిజనల్ వీడియోను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కి పంపిస్తున్నాం. అందులో పుట్ట మధు అనే పదం లేదు. ఐదు సెకన్లు ముందు వచ్చిందది. పెదాల కదలిక, సౌండ్స్ చూస్తే కరెక్ట్ అనిపించలేదు. అయినా నిజానిజాల కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపించాం. అవి కాకుండా చాలా వీడియోలు, ఆడియోలను 2018 కంటే ముందువి, ఇటీవల కాలంలోనివి వేరే వాళ్ల వాయిస్ కూడా కుంట శ్రీను వాయిస్గా పెడుతున్నారు. దర్యాప్తును ఇవి ప్రభావితం చేస్తాయి. ఘటనను ప్రత్యక్షంగా చూసిన చాలామంది సాక్షులను విచారించాం. వీడియోలను సేకరించాం. దర్యాప్తుకు ఉపయోగపడే వీడియోలు ఉంటే ఇవ్వాలని కోరాం. ఈ సమయంలో ఫేక్ వీడియోలు, ఆడియోలు వైరల్ చేయడం కరెక్ట్ కాదు. భద్రత అడిగితే ఇచ్చేవాళ్లమే.. వామన్రావు, నాగమణిలకు సంబంధించి కొన్ని కేసుల్లో వ్యాజ్యాలు వేయగా.. ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు దంపతులిద్దరినీ తెలంగాణలోని ఏ పోలీస్స్టేషన్కు పిలవొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని పాటించాం. లోక్ అదాలత్కు సంబంధించి ఒకటి రెండుసార్లు కానిస్టేబుల్ ఫోన్ చేస్తేనే ‘కంటెప్ట్ ఆఫ్ కోర్టు’అని వామన్రావు చెప్పారు. ఐదారు నెలలుగా వారితో ఎవరూ టచ్లో లేరు. వాళ్లకు ముప్పు ఉంటే లిఖితపూర్వకంగా పిటిషన్ ఇస్తే చర్యలు తీసుకొనేవాళ్లం. వాళ్లు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో కూడా మాకు తెలియదు. గుంజపడుగులో గొడవలు జరగకుండా పెట్రోలింగ్ చేశాం. కానీ ఇంత దారుణంగా హత్య చేస్తారని భావించలేదు. బ్యారేజీలో లోతు ఎక్కువ ఉండటంతో.. హత్య జరిగిన తరువాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో వేసినట్లు తేలింది. వాటిని తీయాలని భావించినా, అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో గజ ఈతగాళ్లను పిలిపించాలని నిర్ణయించాం. ఆయుధాలను తీసే విషయంలో శ్రద్ధ చూపించలేదనే ఆరోపణల్లో నిజం లేదు. త్వరలోనే వాటిని వెలికి తీస్తాం. ఇక ఈ కేసును త్వరలోనే పరిష్కరిస్తాం. బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తరువాత ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేస్తాం. చదవండి: దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు -
న్యాయవాదుల హత్య : సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై సీఎం కేసీఆర్ అదేశాలతోనే పోలీసులు దాడులు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు తండాలో గిరిజనులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, 60 రోజులు జైల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ఆ భూమి గిరిజనులదే అని చెప్పిన హైకోర్టు ఉత్తర్వులను సైతం విస్మరించారని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. గిరిజనుల భూములకోసం పోరాటానికి వెళ్లిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని అన్నారు. ఇష్టానుసారంగా లాఠీచార్జి చేశారని, ప్రయివేట్ గుండాలతో దాడులు చేయించారని ఆవేదన చెందారు. గుర్రంపోడు ఘటనలో బీజేపీ కార్యకర్తలు, గిరిజనులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయలైనందుకు బండి సంజయ్ క్షమాపణలు కోరారు. రిటర్డ్ ఐజీ ప్రభాకర్ రావు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గుండాగిరి చేస్తున్నారని ఆరోపించారు. 2023 తర్వాత తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రభాకర్ రావు అక్రమాస్తుల చిట్టా విప్పుతానని.. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. పెద్దపల్లి అడ్వకేట్ దంపతుల హతపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. వామనరావు దంపతులది ప్రభుత్వ హత్యేనని అన్నారు. యధా రాజా తథా ప్రజా అన్నట్టుగా రాష్ట్రంలో గుండాలు, రౌడీలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. సొంత ఎమ్మెల్యేలు, మంత్రులే కేసీఆర్పై తిరగబడే రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరి అవినీతి చిట్టా బయటకు తీస్తున్నాఅని అన్నారు. -
న్యాయవాదుల హత్య: సీబీఐ విచారణకు డిమాండ్
సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాదలు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల దారుణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. అడ్వకేట్ జేఏసి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు వామన్రావు దంపతులు హత్యకు గురైన ప్రాంతం రామగిరి మండల కల్వచర్ల సందర్శించి పరిశీలించారు. వామన్ రావు కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కోసం పోరాడిన న్యాయవాదులకు ప్రభుత్వం పై నమ్మకం కలగాలంటే వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. వామన్ రావు కుటుంబానికి రక్షణ కల్పించి, ఆర్థిక సహాయం అందిచాలని డిమాండ్ చేశారు. అన్యాయాలపై, భూ కబ్జాలపై పోరాడడమే నేరమా అని ప్రశ్నించారు. హత్య వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని, వామన్ రావు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు న్యాయవాదులు అంతా గట్టు కుటుంబానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, న్యాయవాదులు తడకపల్లి సుష్మిత, సౌమ్య, సంధ్య, ఆయేషా, రాజేందర్ పాల్గొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేసులో మరికొన్ని వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు -
న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు
-
న్యాయవాదుల హత్య: పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దారుణ హత్య ఉదంతపై పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్రావు హత్య కేసులో తనను ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనుకూల మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి శ్రీధర్బాబు తనపై అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా తనపై విద్వేషపూరిత వార్తలను ప్రచురిస్తోందని, కేసు దర్యాప్తు చేస్తోంది పోలీసులా..? లేక మీడియానా అని ప్రశ్నించారు. శనివారం మంథనిలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమలో పాల్గొన్న పుట్ట మధుకర్.. తొలిసారి వామన్రావు దంపతుల హత్యపై స్పందించారు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. హత్య అనంతరం తాను పారిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని, తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానని, దానికి సీఎం నిరాకరించారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కొంతమంది తన వ్యతిరేకులు పుట్ట మధును ఎప్పుడెప్పుడు అరెస్టు చేస్తారని ఎదురుచూస్తున్నారని అన్నారు. పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. పోలీసు విచారణ తర్వాత వాస్తవాలతో హైదరాబాద్లో మీడియా ముందుకు వస్తానని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న పత్రికలు, టీవీల గురించి కూడా చెప్తానని అన్నారు. తాను రౌడీయిజం చేస్తున్నట్లు శ్రీధర్బాబు ప్రచారం చేస్తున్నారని, అసలు దొంగలు వారేనని విమర్శించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితులు కుంట శ్రీనివాస్ను(ఏ1), చిరంజీవిని (ఏ2), అక్కపాక కుమార్(ఏ3)ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం పుట్టమధ మేనల్లుడు బిట్టు శ్రీనును కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యలో భాగంగా రిజిస్ట్రేషన్ కాని బ్రీజా కారును, కొబ్బరికాయలు కోసే కత్తులను బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు కుంట శ్రీనివాస్కు సమకూర్చాడు. ఈ క్రమంలోనే పుట్టమధు పాత్రపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మేనల్లుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో విమర్శల తాకిడి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. లాయర్ దంపతుల హత్య.. రెండు గంటల్లోనే స్కెచ్ -
‘కేకులు కోసినట్లు పీకలు కోస్తారా?’
సాక్షి, మంథని: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటడం.. కేకులు కట్ చేయడంతోపాటు హైకోర్టు న్యాయవాద దంపతులుగట్టు వామన్రావు–నాగమణి దంపతుల గొంతు కూడా కోశారని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. న్యాయవాద దంపతుల స్వగ్రామం మంథని మండలం గుంజపడుగులో మృతులకు టుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్బాబుతో కలిసి శుక్రవారం పరామర్శించారు. అనంతరం మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఇంత పెద్ద సంఘటన జరిగినా మంత్రులు, నాయకులు స్పందించకపోవడమే కాకుండా, తమకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన, మంథని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్తున్న న్యాయవాద దంపతులను హత్య చేయడం పాశవిక చర్య అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు జరిగిన ఈ దారుణం గురించి ఇకపై ప్రతీ పుట్టినరోజు మాట్లాడుకుంటారని తెలిపారు. న్యాయవాదుల కుటుంబ సభ్యులు కోరుతున్నట్లుగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పేరు నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నించారు. హనమంత రావుతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, మండల అధ్యక్షుడు సెగ్గెంరాజేశ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శశిభూషణ్ కాచే, డీసీసీ అధికార ప్రతినిధి ఇనుముల సతీశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతియాదవ్, నాయకులు మంథని సత్యం, ఆజీంఖాన్ ఉన్నారు. హత్య స్థలాన్ని పరిశీలించిన వీహెచ్.. రామగిరి(మంథని): రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపైన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, వెంకటనాగమణిని హత్యచేసిన స్థలాన్ని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు శుక్రవారం పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు గురించి స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్ -
న్యాయవాదుల హత్య: సీన్ రీకన్స్ట్రక్షన్?!
రామగిరి(మంథని): హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యపై తమ అదుపులో ఉన్న నిందితులతో పోలీసులు శుక్రవారం పొద్దుపోయాక సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలిసింది. రామగిరి మండలం కల్వచర్ల శివారులోని మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, వెంకట నాగమణి దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిని శుక్రవారం కోర్టులో రిమాండ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే రిమాండ్ చేయకుండా సంఘటన స్థలికి నిందితులను సాయంత్రం భారీ బందోబస్తు మధ్య తీసుకొచ్చినట్లు సమాచారం. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో మర్డర్ సీన్ను రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రధాన రహదారిపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న విషయం తెలియని ప్రయాణికులు మళ్లీ ఏదైన జరిగిందా అని ఆసక్తిగా తిలకించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిందితులకు కరోనా పరీక్షలు కోల్సిటీ(రామగుండం): హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, పీవీ.నాగమణి జంట హ్యత కేసులో ప్రధాన నిందితులైన కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ను పోలీసులు శుక్రవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించా రు. ముగ్గురికీ కరోనా నెగిటివ్గా రిపోర్టు వచ్చింది. వైద్యులు వారికి ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. రిమాండ్కు తరలించడం కోసం ముందస్తుగా టెస్టులు చేయించారు. కాగా, నిందితులను భారీ బందోబస్తు మధ్య ఆస్పత్రికి తీసుకొచ్చారు. వాహనంలో నిందితులతోపాటు వారికి కత్తులు సమకూర్చినట్లు పోలీసులు తెలిపిన బిట్టు శ్రీను కూడా ఉన్నాడు. అయితే బిట్టు శ్రీనుకు కూడా కరోనా పరీక్షలు చేయించనున్నట్లు తెలిసింది. రాత్రి 11 గంటల కోర్టుకు.. మంథని: రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో బుధవారం జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ను రాత్రి 11 గంటలకు భారీ బందోబస్తు మధ్య పోలీసులు పెట్రోలింగ్ వాహనంలో మంథని కోర్టుకు తీసుకొచ్చారు. జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్క్లాస్, జూనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావు ఎదుట ముగ్గురినీ హాజరు పర్చారు. జడ్జి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించా రు. అనంతరం వారిని పోలీసులు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. గురువారం అరెస్టు చేసిన ముగ్గురితోపాటు శుక్రవారం అదుపులోకి తీసుకున్న బిట్టు శ్రీను సైతం మంథని కోర్టులో రిమాండ్ చేస్తారనే సమాచారం మేరకు నిందితుల కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కోర్టు వద్దకు చేరుకున్నారు. మీడియా ఉదయం నుంచి రాత్రి వరకు కోర్టు వద్దే పడిగాపులు కాశారు. మొదట మధ్యాహ్నం ఒంటిగంటకు అని తర్వాత సాయంత్రం 4 గంటలకని తెలిపారు. కోర్టు సమయం ముగిశాక.. రాత్రి 8 గంటల వరకు మంథని లేదా గోదావరిఖనిలో న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తారని ప్రచారం జరిగింది. కానీ రాత్రి 11 గంటలకు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ను కోర్టుకు తీసుకొచ్చారు. నిందితులు మీడియా, ప్రజల కంట పడకుండా కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం ‘కేకులు కోసినట్లు పీకలు కోస్తారా?’ న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య కేసు మరో మలుపు తిరిగింది. గుంజపడుగు రామాలయం విషయంలో తమకు రక్షణ కల్పించాలని న్యాయవాది నాగమణి డీసీపీ రవీందర్ను కోరిన ఆడియో కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గుంజపడుగు గ్రామంలోని ఆలయం విషయంలో కుంట శ్రీనివాస్ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తమకు రక్షణ కల్పించాలని నాగమణి డీసీపీని కోరారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, ఎస్సై తమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, మీరైనా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, డీసీపీ రవీందర్ ఆమెకు రక్షణ విషయం కల్పించే విషయాన్ని పదే పదే దాటవేస్తూ.. ప్రతీది పోలీసుల పరిధిలోకి రాదని, ఆలయానికి సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతీదానికి పోలీసులను మధ్యలోకి లాగొద్దని ఆమెకు సూచించడం గమనార్హం. అయితే రక్షణ కల్పించాలంటూ న్యాయవాద దంపతులు తమను ఎప్పుడూ సంప్రదించలేదని గురువారం పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత ఆడియో క్లిప్పింగ్ సంచలనం సృష్టిస్తోంది. చదవండి: సర్కారు గట్టి సందేశం ఇవ్వాలి: హైకోర్టు -
ఆడియో క్లిప్పింగ్ వైరల్: రక్షణ కల్పించాలని లాయర్ నాగమణి వేడుకోలు
-
న్యాయవాద దంపతుల హత్య: అదే కారణం
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి దారుణ హత్య కేసులో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, మరోవ్యక్తి చిరంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రామగుండం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించిన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వామన్రావు, నాగమణి నిర్మిస్తున్న పెద్దమ్మగుడి వివాదం కారణంగానే ఈ హత్య జరిగిందని వెల్లడించారు. అక్కపాక కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిందితులు న్యాయవాద దంపతులను హత్యచేశారని తెలిపారు. ఘటన అనంతరం సుందిళ్ల వైపు వెళ్లారని, రక్తపు బట్టలను అక్కడి బ్యారెజ్లో పడేసి మహారాష్ట్రకు పారిపోయారని పేర్కొన్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయంలో వామన్రావు అడ్డుపడుతున్నాడనే కారణంతోనే కుంట శ్రీనివాస్ ఈ హత్యకు పథకం రచించాడని చెప్పారు. పాతకక్షల కారణంగానే న్యాయవాద దంపతులను హత్య చేశారని పేర్కొన్నారు. బ్రీజా కారుతో తొలుత వామన్రావు వాహనాన్ని ఢీకొట్టారని, వామన్రావుపై చిరంజీవి, శ్రీనివాస్ కలిసి ఏకకాలంలో వారిపై దాడి చేసినట్లు వివరించారు. తొలుత కారులో ఉన్న నాగమణిపై కత్తులతో పాశవికంగా దాడిచేయడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం వేటకొడవళ్లతో వామన్రావుపై దాడికి తెగబడ్డారని వెల్లడించారు. కేసులో మరికొంత మంది విచారణ జరుగుతోందని, త్వరలోనే విచారణ పూర్తిచేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్ న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం
-
టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్
సాక్షి, కరీంనగర్ : న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో ఏ2గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్పై టీఆర్ఎస్ పార్టీ చర్యలకు ఆదేశించింది. శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ మంథని మండలాధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాద దంపతుల దారుణ హత్య వ్యహహారంలో కుంట శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. వామన్రావు మరణ వాగ్మూలంలోనూ ఆయన పేరునే ప్రస్తావించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీపై, శ్రీనివాస్పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు వ్యవహారంలో నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్పందించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అతనిపై వేటు వేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం .శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కేసీఆర్ జన్మదిన వేడుకల్లో నిందితుడు కుంట శ్రీనివాస్ (హత్యకు కొన్ని గంటల ముందు) గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంట శ్రీనివాస్.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎంపీటీసీగా ఉన్నప్పటి నుంచే వామన్రావుతో విభేదాలున్నాయి. ఇటీవల శ్రీనివాస్కు చెందిన ఇంటి నిర్మాణంపై వామన్రావు ఫిర్యాదుచేసి, పనులను నిలిపివేయించారు. అలాగే గుంజపడుగులోని రామస్వామి గోపాలస్వామి దేవాలయ నిర్వహణ దశాబ్దాలుగా వామన్రావు కుటుంబసభ్యులే చేసుకుంటుండగా.. కొందరు మరో కమిటీని ఏర్పాటుచేసి గుడికి చెందిన పనులు చేస్తున్నారు. దీనిపై వామన్రావు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదుచేసి, ఆ పనులు కూడా నిలిపివేయించారు. గుంజపడుగు చెరువు శిఖం భూమిలో అనుమతి లేకుండా పెద్దమ్మ గుడి నిర్మాణం చేపడుతున్నారని ఆయన పంచాయతీకి ఫిర్యాదు చేశారు. ఆ పనులు కూడా ఆగిపోయాయి. దీంతో గ్రామంలో తమకు అడ్డు వస్తున్నారనే కక్షతోనే శ్రీనివాస్ తదితరులు ఈ దారుణానికి పాల్పడ్డారని వామన్రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
ఒకే చితిపై న్యాయవాద దంపతుల దహనం
సాక్షి, పెద్దపల్లి : దారుణహత్యకు గురైన న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. మంథని మండలం గుంజపడుగులో గోదావరి ఒడ్డున శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. ఒకే చితిపై దంపతులిద్దరికీ దహన సంస్కారాలు నిర్వహించారు. వామన్ రావు సోదరుడు ఇంద్రశేఖర్ రావు తలకొరివి పెట్టారు. వారి నివాసం నుంచి గోదావరినది వరకు రెండు కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అంత్యక్రియల్లో మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబుతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గట్టు వామన్ రావు నాగమణి దంపతుల మృతదేహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నివాళులర్పించారు. మరోవైపు దంపతుల అంత్యక్రియలు పూర్తికావడంతో నిందితులను అరెస్టు చూపే పనిలో పోలీసులు నిమగ్నమైయ్యారు. కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు A-1 వసంతరావు, A-2 కుంట శ్రీనివాస్, A-3 కుమార్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. వారిని మరికాసేట్లో మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు -
న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు
సాక్షి, కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి దారుణ హత్య కేసుకు సంబంధించిన ఒక్కొక్క విషయం బయపడుతోంది. ఘటన వెనుక దాడి ఉన్న అనేక నిజాలు వెల్లడవుతున్నాయి. స్థానికులు, బాధితుల సమీప వ్యక్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాది వామన్రావు అనేక వివాదాస్పద కేసులను టెకప్ చేస్తున్నారు. అంతేకాకుండా గుంజపడుగు గ్రామంలోని రామ స్వామి గోపాల స్వామి ఆలయ కమిటీ విషయంలో గతకొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. దీనిలో ఓ వర్గానికి చెందిన వారు రెండు గ్రూపులుగా విడిపోయారు. గట్టు వామన్ రావు ఒక గ్రూపుకు, రిటైర్డ్ డీఈ వెల్ది వసంతరావు మరో గ్రూపుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గట్టు వామన్ రావు సోదరుడు ఇంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీని కాదని సర్పంచ్ కుంట రాజుకు తెలియకుండా ఆయన సోదరుడు కుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో వసంతరావు మరో కమిటీని ఏర్పాటు చేశారు. రాజు, శ్రీనివాస్ మధ్య విభేదాలు.. అయితే సర్పంచ్ కుంట రాజుకు, కుంట శ్రీనివాస్కు మధ్య ఎప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి. గత సర్పంచ్ ఎన్నికల్లో శ్రీనివాస్పై పోటీచేసిన రాజు విజయం సాధించారు. అప్పటికే మాజీ ఎంపీటీసీగా ఉన్న శ్రీనివాస్ ఓటమిని జీర్ణించుకులేక పోయాడు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ కక్షలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఈనెల 22 నుంచి 25 వరకు ఆలయంలో జరిగే చండీయాగం పాత కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని వామన్ రావు వర్గం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కొత్త కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వసంతరావు సైతం సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వివాదం పెద్దదిగా మారడంతో సర్పచ్ రాజు సూచనల మేరకు హైకోర్టులో ఫిల్ వేయడానికి వామన్రావు దంపతులు సిద్ధమయ్యారు. స్థానికులు, కమిటీ సభ్యుల సంతకాలు తీసుకుని హైదరాబాద్కు బయలుదేరగా.. దారి మధ్యలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆలయ విషయంలో వసంతరావు కుట్ర పన్నాడని వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య చేసింది మాత్రం కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ అని స్పష్టంచేస్తున్నారు. కీలకంగా మారిన ఆడియో క్లిప్.. వామన్రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ–1గా కుంట శ్రీనివాస్ను, ఏ–2గా అక్కపాక కుమార్ను, ఏ–3గా వసంతరావును పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణను పోలీసులు మరింత ముమ్మరం చేశారు. మృతుడు వామన్రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంటా శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్ డేటాను అనాలసిస్ చేయగా... ‘గుడి కూలితే వామన్రావు కూలిపోతాడు’ అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ లభించింది. విచారణలో ఇది కీలకంగా మారనుంది. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంటా శ్రీనివాస్పై గతంలో అనేక కబ్జా, బెదిరింపు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుంట శ్రీనివాస్ను త్వరిగతిన అరెస్టు చేస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల శివారులో మంథని–పెద్దపల్లి ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నాం వీరిపై దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా లాయర్ల హత్య.. మరోవైపు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు- వెంకట నాగమణి హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హత్యపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి పరోక్షంగా హైకోర్టు చురకలు అంటించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలన్న సూచించడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తును పూర్తి చేయాలన్న హైకోర్టు ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. న్యాయవాదుల హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు ఎక్కడికక్కడ నిరసనకు దిగారు. హైకోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. హైకోర్టుతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో న్యాయవాదులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. వామనరావు ఫ్యామిలీ జంట హత్యలపై సిట్టింగ్ జడ్పీ తో విచారణ జరిపించి.. సీబీఐకి కేసు విచారణ అప్పగించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ వచ్చే వరకు పోరాటం ఆగదని న్యాయవాద సంఘాలు హెచ్చరించాయి. అంత్యక్రియలు పూర్తి మంథని మండలం గుంజపడుగు గ్రామంలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు నాగమణి దంపతుల మృతదేహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. దంపతుల హత్యతో గుంజపడుగు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి అంతిమ సంస్కాలు పూర్తి అయ్యాయి. ఇంటి నుంచి గోదావరినది వరకు రెండు కిలోమీటర్లు సాగిన అంతిమయాత్రలో పాల్గొన్న వారంత కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం గోదావరి ఒడ్డున దహన సంస్కారం పూర్తిచేశారు. వామన్ రావు సోదరుడు ఇంద్రశేఖర్ రావు తలకొరివి పెట్టారు. -
బిడ్డ నాలుక కోసి తల్లి తినేసిందనేది అవాస్తవం
సాక్షి, మదనపల్లె(చిత్తూరు జిల్లా): మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులైన తల్లిదండ్రులు చేసినవి క్షుద్ర పూజలు కాదు.. రుద్రపూజలని హైకోర్టు న్యాయవాది రజని తెలిపారు. బిడ్డ నాలుక కోసి తల్లి తినేసిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. నిందితుడు పురుషోత్తం నాయుడిని హైకోర్టు న్యాయవాది రజని మదనపల్లె సబ్జైలులో శనివారం కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వీరికి శిక్ష వేయడం కంటే.. ప్రేరేపించిన వ్యక్తులను శిక్షించాల్సిన అవసరముందన్నారు. ఆధ్యాత్మిక శక్తిలో క్షుద్రుడు, రుద్రుడు.. రెండు రకాలని పేర్కొన్నారు. వీరు చేసింది రుద్రపూజలని చెప్పారు. ఆడపిల్లలకు రక్షణ లేదని బలంగా నమ్మడం వల్లే పెద్దమ్మాయి అలేఖ్య ఆధ్యాత్మిక శక్తి తెచ్చుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసిందని న్యాయవాది రజని చెప్పారు. చదవండి: (నేను మూడో కన్ను తెరిస్తే భస్మమే : పద్మజ) అలేఖ్య భోపాల్లో ఉన్నప్పుడు స్పిర్చ్యువల్ పవర్ నేర్చుకున్నట్లు ఆమె తండ్రి చెప్పారన్నారు. చదువులో ఉన్నతస్థితి సాధించి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు నిరోధిస్తానని ఆమె చెప్పేదని తెలిసిందన్నారు. బిడ్డలను చంపేందుకు డంబెల్ ఉపయోగించారని పోలీసులు చెబుతున్నా.. తల్లిదండ్రులు మాత్రం దానిని శివుడి ఢమరుకంగా భావించి ఉంటారన్నారు. ‘నేనే శివుడ్ని..’ అనుకుంటూ డంబెల్ను ఢమరుకంగా భావించి తలపై కొడితే బిడ్డ తిరిగి వస్తుందనే భ్రమతో కొట్టి ఉంటారన్నారు. పిల్లలిద్దరూ చనిపోయారని తల్లిదండ్రులిద్దరూ ఇంకా భావించట్లేదని చెప్పారు. పూజ మధ్యలో పోలీసులు షూలతో వెళ్లి గదిని అపవిత్రం చేసి.. పిల్లల దేహాలను తీసుకెళ్లడం వల్లే వారు తిరిగి రాలేదనే భ్రమలో ఉన్నారన్నారు. జైలులో దూరంగా ఉంచి మాట్లాడించడం వల్ల.. పూర్తిస్థాయిలో విషయాలు తెలుసుకోలేకపోయానని చెప్పారు. చదవండి: (జంట హత్యల కేసు: అమ్మాయిల చెవిలోఊదిందెవరు?) పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ రవిమనోహరాచారి అక్కచెల్లెళ్లు అలేఖ్య, సాయిదివ్య హత్యలకు సంబంధించి తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు. ఇప్పటివరకు 10 మందిని విచారించినట్లు చెప్పారు. హత్య జరగడానికి ముందు వారింటికి ఎవరెవరు వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. భోపాల్లో అలేఖ్యకు ఓ ట్రస్టుతో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. చదవండి: (ఇంకా మూఢత్వంలోనే.. తానే శివుడు, అవంతికనంటూ) -
హత్రాస్: నిందితుల తరఫున ప్రముఖ న్యాయవాది
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార, హత్య ఉదంతంపై నిందితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది అజయ్ ప్రకాశ్ సింగ్ (ఏపీ సింగ్) మరోసారి అదే తరహా కేసునే ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఓ దళిత బాలికపై హత్యాచారానికి ఒడిగట్టి ఆమె మరణానికి కారణమైన మానవ మృగాల తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. నలుగురు నిందితులను రక్షించేందుకు వకాల్తా పుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హత్రాస్ ఘటనలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు యువకుల తరఫున ప్రమున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తారని పేర్కొంది. తమ విజ్ఞప్తిని మన్నించి అమాయకులైన ఠాకూర్ యువకులను రక్షించేందుకు ముందుకొచ్చిన ఏపీ సింగ్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది. (హాథ్రస్ ఘటన: అంతా ఆ నలుగురి వైపే) ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొంతమంది తమ వర్గానికి చెందిన యువకులను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని, దాని నుంచి వారిని కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా అఖిల భారతీయ క్షత్రియ మహాసభ చైర్మన్గా కేంద్ర మాజీమంత్రి రాజా మానవేంద్ర సింగ్ ప్రస్తుతం ఆ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఈ కేసు నిమిత్తం న్యాయవాదికి అయ్యే ఖర్చును తమ సంఘమే భరిస్తుందని తెలిపారు. దీని కోసం పెద్ద ఎత్తున చందాలను సైతం వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఏపీ సింగ్కు అప్పగించామని వెల్లడించారు. క్రిమినల్ న్యాయవాదిగా మంచి పేరును సింగ్.. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అనేక వాయిదాల అనంతరం నలుగురు దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్లను ఉరితీశారు. మరోవైపు నిర్భయ కేసులో బాధితురాలి పక్షాన వాదనలు వినిపించి.. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ హత్రాస్ బాధితురాలి తరఫున వాదించేందుకు ముందుకొచ్చారు. నిర్భయ కేసులో ఉన్నట్లే హాథ్రస్ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. కానీ హత్రాస్ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు. ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు అని అడిషనల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అంటున్నారు. ‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’ అని జిల్లా మేజిస్ట్రేట్ ఇదివరకే సెలవిచ్చారు. జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్ అధికారులు హత్రాస్ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియాను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాథ్రస్లోకే అడుగు పెట్టనివ్వ లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతేకాకుండా నిందితుల తరఫును పేరున్న సీనియర్ న్యాయవాది ఏపీ సింగ్ వాదిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీమ ఈ కేసును ఎదుర్కోవడం సవాలు లాంటింది. అయితే నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడినట్లే తమ కుమార్తెను బలితీసుకున్న దోషులకు సైతం మరణశిక్ష పడుతుందని బాలిక తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కోర్టు ధిక్కరణ: రూపాయి జరిమానాకు సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించిన కేసులో దోషిగా తేలిన ఆయన.. క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సోమవారం తుది తీర్పును వెల్లడించిన అత్యున్నత న్యాయస్థానం సీనియర్ అటర్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు ఒక్క రూపాయి జరిమాన విధించింది. ఇక కోర్టు తీర్పు అనంతరం స్పందించిన ప్రశాంత్ భూషన్ న్యాయస్థానంపై తనకు అపారమైన నమ్మకం ఉందని, సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు తన సీనియర్, న్యాయవాది రాజీవ్ ధవన్ తనకు ఒక రూపాయి ఇచ్చారని ట్విటర్ వేదికగా ప్రకటించారు. (జరిమానా చెల్లించండి.. లేదంటే జైలుకే: సుప్రీంకోర్టు) కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం విధించిన జరిమానాను అంగీకరించినట్లు వెల్లడిస్తూ.. తన సీనియర్తో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. కాగా తాను తప్పేమీ చేయలేదని, కోర్టుకు క్షమాపణ చెబితో తప్పు చేసినట్లు అవుతుందని ప్రశాంత్ భూషన్ ఇదివరకే స్పష్టం చేశారు. అయితే తీర్పు సందర్భంగా ప్రశాంత్ భూషన్పై న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబరు 15లోగా జరిమానా చెల్లించకపోతే.. మూడు నెలల జైలు శిక్షతో పాటు మూడు నెలల పాటు న్యాయవాద వృత్తి నుంచి సస్పెన్షన్ చేస్తామని తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఒక్క రూపాయి జరిమానా చెల్లించేందుకు అతని అంగీకరించినట్లు తెలుస్తోంది. (క్షమాపణ కోరితే తప్పేముంది) -
అడ్వకేట్ల డ్రస్కోడ్ మారింది, ఇకపై వారు...
భువనేశ్వర్: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తోన్నాయి. అత్యవసర సర్వీసులు వారు తప్ప మిగిలిన వారందరూ ఇంటి దగ్గర నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తోన్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతున్నాయి. సాధారణంగా అడ్వకేట్లు అంటే నల్లని కోర్టు వేసుకొని కేసులు వాదిస్తూ ఉంటారు. అయితే ఒడిషా హైకోర్టు మాత్రం ఇకపై లాయర్లందరూ తెల్లని వస్త్రాలు ధరించి తమ వాదనలు వినిపించాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. (లాక్డౌన్: మహిళపై అఘాయిత్యం) వర్చువల్ కోర్టు సిస్టమ్ ద్వారా అడ్వకేట్లందరూ కోర్టు ముందు హాజరవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోన్న ఈ తరుణంలో జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్లాక్కోర్టుని, గౌన్ను ధరించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. తెల్ల షర్ట్, తెల్లసెల్వార్కమీజ్, తెల్లటి చీరలో కోర్టు ముందు హాజరు కావాలని ఒడిషా హైకోర్టు ఆదేశాలు జారిచేసింది. దీంతోపాటు బుధవారం నాడు వాదనలు వినే జడ్జీలు పొడుగాటి గౌన్లు ధరించాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (కోల్కతా నగర వీధుల్లోకి ఎల్లో టాక్సీలు) -
అడ్వకేట్లకు అండగా నిలిచిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకి ధన్యవాదాలు తెలిపింది. కరోనా కారణంతో లాక్డౌన్ విధించడంతో ఇబ్బంది పడుతున్న అడ్వకేట్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లను మంజూరు చేసింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది అడ్వకేట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని బార్ కౌన్సిల్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 40,000వేల మంది అడ్వకేట్లు ఉన్నారని వారిలో కొత్తగా ఈ వృత్తిని ఎంచుకున్న వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారని బార్ కౌన్సిల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. (ఢిల్లీలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం) కేవలం ఈ వృత్తి మీదే ఆధారపడిన వారు కేసులు లేక జీవనం కొనసాగించడం కష్టంగా ఉందని వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందిన ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు రూ. 25 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందుకు గాను బార్కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. (వలస కార్మికులను పంపిస్తాం : కానీ...!) -
కర్నూలులో హైకోర్టు ‘సీమ’వాసుల ఆకాంక్ష
సాక్షి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటనేది ‘సీమ’వాసుల ఆకాంక్ష. దశాబ్దాల తరబడి పాలకులు ఈ విషయంలో కర్నూలుకు న్యాయం చేయలేకపోయారు. రాయలసీమ అభివృద్ధి, ప్రయోజనాల నేపథ్యంలో పుట్టుకొచ్చిన సంఘాలు కూడా హైకోర్టు ఏర్పాటు చేయాలని, శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలని వాణి విన్పిస్తూనే ఉన్నాయి. రాష్ట్రవిభజన సమయంలో, ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి పేరును ప్రకటించే సమయంలో కూడా కర్నూలును రాజధానిగా ప్రకటించాలని గళం విప్పారు. అమరావతి పేరు ప్రకటించిన తర్వాత చివరకు హైకోర్టు అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదీ నెరవేరకపోగా..తుదకు హైకోర్టు బెంచ్ను కొన్ని పక్షాలు కోరాయి. అయితే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలా వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాలనా వికేంద్రీకరణలో భాగంగా కర్నూలులో హైకోర్టుతో కూడిన న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదించి.. శాసనమండలికి పంపించారు. కానీ మండలిలో బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు పథకం ప్రకారం అడ్డుకున్నారు. పాలనా వికేంద్రీకరణ విషయంలో నెల రోజులుగా టీడీపీ జిల్లా ప్రయోజనాలకు విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. అభివృద్ధిని విస్మరించి.. రాజకీయాలే పరమావధిగా.. ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నేతలు ఇంతకుముందు రాజకీయాలు చేసేవారు. తమ ప్రాంతానికి నష్టం జరిగేలా, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏవైనా చర్యలు తీసుకుంటే పదవులు, పార్టీలకు రాజీనామాలు చేసేవారు. ఇప్పుడు హైకోర్టు కర్నూలుకు రాకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నా.. జిల్లాలో అధికార పార్టీ నేతలు మినహా తక్కిన రాజకీయపక్షాల నాయకులు నోరుమెదపడం లేదు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పుడు టీడీపీ అధిష్టానానికి విరుద్ధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటును టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో పాటు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఇతర టీడీపీ నేతలు స్వాగతించలేకపోయారు. పైగా అమరావతికి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు. జిల్లావాసి అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా టీడీపీ బాటలోనే నడుస్తున్నారు. ఆయన తీరును స్వయాన సీపీఐ జిల్లా నాయకులు తప్పుబట్టినా, ఆయన మాత్రం చంద్రబాబును వీడడం లేదు. వీరితో పాటు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఎం కూడా “హైకోర్టు’ విషయంలో మాట్లాడకపోవడంపై పరిశీలకులు పెదవివిరుస్తున్నారు. జిల్లాకు మేలు జరిగే అంశంలో అన్ని పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిస్తున్నారు. హైకోర్టుకు మద్దతుగా అలుపెరగని పోరు హైకోర్టుకు మద్దతుగా న్యాయవాదులు మోహన్రెడ్డి, గోపాలకృష్ణతో పాటు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల రిలేదీక్షలు చేపట్టారు. మండలిలో టీడీపీ వ్యవహారం తర్వాత ఆ పార్టీ తీరుకు నిరసనగా, ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల్లో నాయకులు, పార్టీ శ్రేణులు హైకోర్టుకు మద్దతుగా ర్యాలీలు చేశారు. రాయలసీమ విద్యార్థి, యువజన విభాగాలు జేఏసీగా ఏర్పడి.. పోరాటం చేస్తున్నాయి. రాయలసీమ ప్రజాసంఘాలు సైతం జేఏసీగా ఏర్పడి... శేషఫణి, సత్తెన్న ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నాయి. పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా, కులసంఘాల నాయకులు పోరాడుతున్నారు. అయితే వీరికి అధికారపక్షం మినహా ఇతర రాజకీయపార్టీల నుంచి మద్దతు లభించడం లేదు. ‘నోటిదాకా వచ్చిన కూడును దూరం చేసినట్టు’ జిల్లా వరకూ వచ్చిన హైకోర్టును దూరం చేసేలా టీడీపీ వ్యవహరిస్తుంటే.. జిల్లా ప్రయోజనాలకు అనువుగా ఇతర పార్టీలు గళం విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ పరిణామాన్ని మేధావులు, విశ్లేషకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రాంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. హైకోర్టుకు మద్దతుగా కడప, అనంతపురం, తిరుపతిలో రోజూ ఉద్యమాలు చేస్తుంటే..కర్నూలులో అంతా మౌనంగా ఉండటం మంచిదికాదని, ఇది ‘మనకు మనం అన్యాయం చేసుకోవడమే’ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ హైకోర్టుకు మద్దతుగా వాణి విన్పించాలని సూచిస్తున్నారు. ‘శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. రాయలసీమ అభివృద్ధిపై ఇన్నాళ్లూ పాలకులు శీతకన్ను వేశారు. హైకోర్టు ఏర్పాటు చేసేదాకా ఉద్యమం ఆగదు.’ కొన్నేళ్లుగా రాయలసీమ వాదుల ప్రకటనలు ఇవీ.. ‘పాలన ఒకేచోట కేంద్రీకృతమైతే అభివృద్ధి కూడా కేంద్రీకృతమవుతుంది. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది. అందుకే కర్నూలును న్యాయరాజధానిగా చేస్తూ హైకోర్టును ఏర్పాటు చేస్తున్నాం.’ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లులో రాష్ట్ర ప్రభుత్వం ‘ఒకే రాజధాని ఉండాలి. అందులోనే చట్టసభలు, హైకోర్టు, సచివాలయం ఉండాలి. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం’ – జిల్లా వాసులైన సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత సోమిశెట్టి మాట ఇదీ.. స్వార్థంతో ఆలోచన చేస్తున్నారు జిల్లాలోని టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు వారి పార్టీలు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ తప్పా అందరూ వ్యతిరేకమే. ఇన్నాళ్లూ సీపీఎం, సీపీఐ, బీజేపీ నాయకులు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. చివరకు హైకోర్టు వచ్చే సమయంలో మిన్నకుండిపోయారు. ప్రజల అభిప్రాయంతో పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. – టి.చంద్రప్ప, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీమకు న్యాయం చేయాలన్నదే సీఎం ఆలోచన 2014లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా అమరావతిలో రాజధాని ప్రకటించారు. ఆనాడు అన్ని పార్టీలు కర్నూలులో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలని కోరాయి. అయినా పట్టించుకోలేదు. కర్నూలుకు 1956లో ఒకసారి, 2014లో మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. దీన్ని సరిదిద్దాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలి. – ఇందిరాశాంతి, లెక్చరర్, కేవీఆర్ కళాశాల, కర్నూలు టీడీపీ ఎమ్మెల్సీల తీరు బాగోలేదు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీనాయుడు, ఫరూక్ మద్దతు తెలపకపోవడం అన్యాయం. కర్నూలుకు న్యాయం చేసుకునే అవకాశాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. వీరిని చరిత్ర క్షమించదు. – రోషన్ అలీ, రిటైర్డ్ తహసీల్దార్ గళం విప్పాలి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావాలి. ఇందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా.. ఇతర పార్టీలు స్వాగతించకపోవడం తగదు. ప్రజల ఆకాంక్షల మేరకు నడుచుకోవాలి. – అంబన్న, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
‘సమత’కేసు నిందితుల తరఫు న్యాయవాది రహీం
ఆదిలాబాద్టౌన్: సంచలనం రేపిన సమత కేసు విషయంలో నిందితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది రహీంను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును వాదించేందుకు అయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో నిందితుల కేసు పత్రాలను స్వీకరించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దూమ్లను బుధవారం మరోసారి కోర్టు ఎదుట హాజరు పర్చనున్నారు. కాగా, ఈ కేసులో పోలీసులు 44 మంది సాక్షులను విచారించారు. ఈ నెల 19 నుంచి కేసు కోర్టులో ట్రయల్కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, నిందితుల తరపు న్యాయవాది రహీం తెలిపారు. -
మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఈజ్ బ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం సుప్రీంకోర్టులో లాయర్గా దర్శనమిచ్చారు. ముఖ్యంగా ఐఎన్ఎక్స్మీడియా కేసులో బెయిల్ లభించిన అనంతరం తన న్యాయవాద వృత్తిలో తిరిగి కొనసాగనున్నారు. బుదవారం ముంబైకి చెందిన గృహహింస కేసులో న్యాయవాదిగా ఆయన సుప్రీంకోర్టులో కనిపించారు. సీనియర్ న్యాయవాదులు, పార్టీ సహచరులు, తోటి రాజ్యసభ ఎంపీలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి తో కలిసి ఆయన చీఫ్ జస్టిస్ కోర్టుకు హాజరయ్యారు కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో 106 రోజులకు గడిపిన ఆయనకు గత వారం (డిసెంబర్ 4) బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజకీయ-ఆర్థికవేత్త చిదంబరం. చెన్నైలయోలా కాలేజీ, మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నైలా కాలేజీల్లో చదువుకున్న చిదంబరంవృత్తిపరంగా న్యాయవాది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీయే కూడా పూర్తి చేశారు. సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లోనూ ఆయన న్యాయవాదిగా పనిచేశారు. చిదంబరం భార్య నళిని కూడా న్యాయవాదే. ఏడుసార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేసిన చిదంబరం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. -
15 ఎకరాల్లో అడ్వొకేట్స్ అకాడమీ
కమాన్చౌరస్తా (కరీంనగర్): హైదరాబాద్ సమీపంలోని షామీర్పేట, నల్సార్ లా యూనివర్సిటీ సమీపంలో 15 ఎకరాల్లో అడ్వొకేట్స్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. కరీంనగర్ కోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈ–ఫైలింగ్ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ పి.నవీన్రావుతో కలసి శనివారం ఆయన ప్రారంభించారు. కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ మాట్లాడారు. జనవరిలోగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్లు కూడా న్యాయవాదుల కోసం వర్క్షాప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరీంనగర్ పోర్ట్ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. మరో న్యాయమూర్తి పి.నవీన్రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు ఆనందకరమని, త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నంది మేడారం పంప్హౌస్ సందర్శన ధర్మారం: రైతులకు ఎల్లకాలం సాగునీరు అందేలా కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం సంతోషకరమని జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 6లో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద నిర్మించిన పంప్హౌస్ను శనివారం న్యాయమూర్తులు కోదండరాం, నవీన్రావు, కరీంనగర్ జిల్లా జడ్జి అనుపమా చక్రవర్తితో కలసి సందర్శించారు. పంప్హౌస్లోని సర్జిఫూల్, మోటార్లు, విద్యుత్తు సబ్స్టేషన్లను పరిశీలించారు. ప్రాజెక్టు గురించి ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్ వివరించారు. అనంతరం మేడారంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. త్రికుటాలయం, నంది ఆలయాలను సందర్శించారు. న్యాయమూర్తి నవీన్రావు నివాసానికి వెళ్లి కాసేపు గడిపారు. -
న్యాయమూర్తి అయ్యారు.. మాతృమూర్తి
అమెరికాలో ఒక జడ్జి తన హోదాను పక్కన పెట్టారు. లాయర్గా ప్రమాణస్వీకారం చేయడానికి వచ్చిన మహిళ చేతిలో ఉన్న బిడ్డను తాను ఎత్తుకుని ఆ మాతృమూర్తి చేత అడ్వకేట్గా ప్రమాణం చేయించారు! వాషింగ్టన్లో ఈమధ్యే జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలందుకుంటోంది. ఆ జడ్జి పేరు రిచర్డ్ డింకిన్స్, ఆ తల్లి పేరు జూలియానా లామర్. ఆమె న్యాయశాస్త్రం చదివేటప్పుడు గర్భవతి. కోర్సు పూర్తయ్యే లోపు తల్లయింది. లా కోర్సు పూర్తి చేసి అడ్వకేట్గా వృత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. స్టేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పత్రాన్ని చదవడం అనే అధికారికంగా వస్తున్న సంప్రదాయం. ఆ కార్యక్రమంలో బిడ్డను ఎత్తుకునే, జడ్జి చెప్పినట్లు ప్రమాణం చేస్తోంది. అయితే ఆమె చేతుల్లో ఉన్న బిడ్డ క్షణం కూడా కుదురుగా ఉండడం లేదు. కిందకు దూకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె అలా ప్రమాణ స్వీకారం చేయడానికి తంటాలు పడడాన్ని చూస్తూ ఊరుకోలేకపోయారు డింకిన్స్. ఆమె చేతుల్లోంచి బిడ్డను తీసుకుని, ఒక చేత్తో ఆ బిడ్డను ఎత్తుకుని మరో చేత్తో ప్రమాణ పత్రాన్ని పట్టుకుని ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఆ వీడియోను లామర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కొన్ని గంటల్లోనే డెబ్బై వేల వ్యూస్ వచ్చాయి! లామర్తోపాటు న్యాయశాస్త్రం చదివిన స్నేహితురాలు సారా మార్టిన్ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ వీడియో చూసిన వాళ్లలో ఒకరు.. జడ్జి గారికి ఈ ఏడాది ప్రెసిడెన్షియల్ గుడ్ హ్యూమానిటీ అవార్డు ఇవ్వాలని, మరొకరు... స్త్రీల పట్ల గౌరవం కలిగిన సమాజానికి ఇదొక ఉదాహరణ అని, ఒక మహిళ తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్న సమాజానికి ఇదొక ప్రతీక అని కామెంట్ చేశారు. ►మారాం చేసి జడ్జి చేత గారం చేయించుకున్న పిల్లాడు బెకమ్ కూడా హీరో అయిపోయాడు. వాడు అంత అల్లరి చేయకపోయి ఉంటే ఇంత మంచి మానవీయ దృశ్య ప్రపంచానికి దక్కేది కాదు. ఒక నెటిజన్ అయితే ఆ బిడ్డ పెద్దయిన తర్వాత చూసుకోవడానికి వీలుగా ఈ వీడియో దాచి ఉంచమని లాయరమ్మకు సలహా కూడా ఇచ్చారు. -
‘తీస్ హజారీ’ ఘటనపై న్యాయ విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఢిల్లీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఆదివారం విచారణ జరిపిన న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ గార్గ్ న్యాయ విచారణ చేస్తారని తెలిపింది. విచారణ సమయంలో స్పెషల్ కమిషనర్ సంజయ్ సింగ్, అడిషనల్ డీసీపీ హరీందర్ సింగ్లను బదిలీ చేయాలని ఆదేశించింది. లాయర్లపై ఎలాంటి నిర్భందపు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఘటనకు కారకులుగా భావిస్తున్న ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశామని, మరొకరిని బదిలీ చేశామని పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు తెలిపారు. -
రణరంగంగా తీస్హజారీ కోర్టు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్హజారీ కోర్టు ఆవరణ శనివారం రణరంగాన్ని తలపించింది. లాయర్లు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణలో పదిమంది పోలీసులు, పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు ఒక పోలీస్ వ్యానుకు నిప్పుపెట్టారు. మరో 17 వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీస్హజారీ బార్ అసోసియేషన్ సెక్రటరీ జైవీర్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘కోర్టు ఆవరణలో ఉన్న పోలీస్ జైలు జీప్కు ఓ న్యాయవాది కారు పొరపాటున ఢీకొట్టడంతో ఈ గొడవ మొదలైంది. సదరు లాయర్ను స్టేషన్లోకి తీసుకెళ్లి పోలీసులు విపరీతంగా కొట్టారు. ఎస్హెచ్వో మమ్మల్ని లోపలికి వెళ్లనివ్వలేదు. సెంట్రల్, వెస్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జీలు వెళ్లి చెప్పినా పోలీసులు లాయరును విడిచిపెట్టలేదు’అని ఆయన ఆరోపించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత, నిరసన తెలుపుతున్న లాయర్లపైకి పోలీసులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రంజిత్కు బుల్లెట్ గాయాలయ్యాయి. మరో నలుగురు లాయర్లు గాయపడ్డారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మాపై చేయి చేసుకున్నారు’అని చౌహాన్ పేర్కొన్నారు. అరగంట తర్వాత అరెస్టు చేసిన లాయరును పోలీసులు విడిచిపెట్టారని వివరించారు. ఈ ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ లాయర్లు కోర్టు గేటు వద్ద నిరసన తెలిపారు. లాయర్లు ఒక పోలీసు వాహనానికి నిప్పు పెట్టడంతోపాటు, మరో 17 ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. ఘటనకు నిరసనగా 4న ఢిల్లీలోని జిల్లా కోర్టుల్లో బంద్ పాటించనున్నట్లు ఢిల్లీ బార్ అసోసియేషన్ తెలిపింది. తాము కాల్పులు జరిపామన్న లాయర్ల ఆరోపణను పోలీసు అధికారులు ఖండించారు. లాయర్ల దాడిలో అడిషనల్ కమిషనర్ హరీందర్ కుమార్, సివిల్, కొత్వాల్ స్టేషన్ల ఎస్హెచ్వో తదితరులు 10 మంది గాయపడ్డారని తెలిపారు. -
మరో ఎన్నికల హామీ అమలుకు జీవో జారీ
సాక్షి, అమరావతి: మరో ఎన్నికల హామీ అమలుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జూనియర్ లాయర్ల (అడ్వకేట్)కు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం అమలుకు ఉత్తర్వులిచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ‘వైఎస్సార్ లా నేస్తం’ ప్రకారం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు.. అంటే మూడేళ్ల పాటు నెలకు రూ.5000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3వ తేదీన ఈ పథకం ప్రారంభం కానుంది. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు.. దరఖాస్తు దారు లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి. దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్లో నమోదై ఉండాలి. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం రోల్లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్ను పరిగణనలోకి తీసుకుంటారు. జీవో జారీ అయ్యే నాటికి జూనియర్ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్కు అర్హులు. 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు లేదా సంబంధిత బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్ను సమర్పించాలి. న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి. బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్ కౌన్సిల్లో ఉంచాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు. కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు. ప్రతి దరఖాస్తు దారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. జీవో జారీ చేసేనాటికి జూనియర్ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు జూనియర్ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు నాన్ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు అర్హులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్ను పొందుపరచాలి. దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి. -
నాయీ బ్రాహ్మణ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లింగం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నాయీ బ్రాహ్మణ అడ్డకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైకోర్టు అడ్వకేటు మద్దికుంట లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కర్మాన్ఘాట్లోని జస్టిస్ వేణుగోపాలరావు కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో న్యాయవాదులు సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకుందుకు కమ్యూనిటీ న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్థానని పేర్కొన్నారు. మద్దికుంట లింగం గతంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. -
మద్రాసు హైకోర్టు సీజే రాజీనామాపై మరో కోణం
సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తహిల్రమణి రాజీనామా వ్యవహారంలో గురువారం మరో కొత్తకోణం ఆవిష్కృతమైంది. సీజేకు మద్దతుగా గత ఐదురోజులు సంఘీభావాలు కొనసాతుండగా.. గురువారం అందుకు భిన్నమైన వాదనలు చోటుచేసుకోవడంతో రాజీనామా వ్యహారం చిత్రమైన మలుపుతిరిగే అవకాశం ఉంది. దేశంలోని అతిపెద్ద రాష్ట్ర స్థాయి న్యాయస్థానాల్లో మద్రాసు హైకోర్టు కూడా ఒకటి. 75 మంది న్యాయమూర్తులు కలిగిన మద్రాసు హైకోర్టులో ప్రస్తుతం 4.5 లక్షల కేసులు విచారణ దశలో ఉన్నాయి. ఈ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజయ్ కిషన్ కౌల్ గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిపోయారు. దీంతో ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తహిల్ రమణి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. క్రిమినల్, అప్పీలు కేసులు, మహిళలపై లైంగిక వేధింపులు కేసుల విచారణలో ఆమెకు మంచి పేరుంది. గుజరాత్ అల్లర్ల కేసుల నుంచి కొందరు నిర్దోషులుగా బయటపడగా ముంబై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో ఆ తీర్పును రద్దు చేసి వారిలో కొందరికి శిక్షపడేలా చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపుపొందారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏడాది కాలం పూర్తయిన దశలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆమె కంటే జూనియర్ అయిన ఒక న్యాయమూర్తికి పదోన్నతి కల్పించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం, దీంతో తహిల్ రమణి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అసంతృప్తికి లోనై ఉన్న జస్టిస్ తహిల్ రమణికి సుప్రీంకోర్టు కొలీజియం మరింత మనస్థాపం కలింగించేలా వ్యవహరించినట్లు కొందరు న్యాయవాదులు విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్, సీనియర్ న్యాయమూర్తులైన ఎస్కే బాప్డే, ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్లతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం సీజే తహిల్ రమణిని మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేలా గతనెల 28వ తేదీన కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానాల్లో ఒకటైన 75 న్యాయమూర్తులు కలిగి ఉన్న మద్రాసు హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులున్న మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడంపై ఆమె మరింత కలతచెందినట్లు సమాచారం. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘాలు, సీనియర్ న్యాయవాదులు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మద్రాసు హైకోర్టులో 4.5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కేవలం 1,400 కేసులున్న చిన్నపాటి మేఘాలయా న్యాయస్థానానికి తహిల్ రమణిని బదిలీ చేయడాన్ని పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందానికి, ప్రధాన న్యాయమూర్తికి ఆమె లేఖరాయగా వారు తోసిపుచ్చారు. దీంతో తహిల్ రమణి తన పదవికి రాజీనామా చేశారు. అండదండలు సీజే రాజీనామా చేయడంతో ఆవేదన, ఆందోళన చెందిన తమిళనాడు, పుదుచ్చేరి న్యాయవాదులు బహిరంగంగా ఆమెకు సంఘీభావం తెలిపారు. విధులను బహిష్కరించారు. తాము అండాదండా ఉంటామని పేర్కొన్నారు. మేఘాలయాకు బదిలీ చేయరాదని మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన న్యాయమూర్తుల బృందానికి విన్నవించుకున్నారు. అతిపెద్ద మద్రాసు హైకోర్టు నుంచి అతి చిన్న మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం అంటే ‘పనిష్మెంట్ ట్రాన్స్ఫర్’తో సమానమని అన్నారు. తగిన కారణాలతోనే బదిలీ: కొలీజియం న్యాయమూర్తులు బదిలీలు, పరిపాలనపరమైన ఇతర వ్యవహారాల్లో నిబద్దతతో వ్యవహరిస్థామని కొలీజియం గురువారం ఢిల్లీలో ప్రకటించింది. తగిన కారణాలతోనే ఎవరినైనా బదిలీ చేస్తాము, అకారణమైన నిర్ణయాలు ఎంతమాత్రం ఉండవని స్పష్టం చేసింది. తమ బదిలీలపై ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు కొలీజియం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. కొలీజియం ఆదేశాలు శిరోధార్యం కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సీజే తహిల్ రమణి శిరసావహించాలని పేర్కొంటూ అఖిలభారత న్యాయవాదుల సంఘం ఢిల్లీలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొలీజియం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తహిల్ రమణికి మేలుజరిగిందని, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతల నుంచి తహిల్ రమణిని బదిలీ చేయడంలో దురుద్దేశం దాగి ఉందని ఎవరైనా ప్రచారం చేస్తే అది ఎంతమాత్రం సరికాదు. ముంబై హైకోర్టులో అమె మూడుసార్లు తాత్కాలిక న్యాయమూర్తిగా, తరువాత శాశ్వత న్యాయమూర్తిగా, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సులతో నియమితులు కావడాన్ని ఆమె మరువరాదు. కొలిజియం ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేయనందున వారు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె శిరసావహించాలి. మేఘాలయా హైకోర్టును, దానితో సంబంధాలున్న వ్యక్తులను వేర్వేరుగా చూడకుండా బదిలీ ఉత్తర్వులను అనుసరించి బాధ్యతలు స్వీకరించి ఉంటే బాగుండేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
నోటరీలో నకి‘లీలలు’
ఆధార్ కార్డులు మార్చాలన్నా, పుట్టిన తేదీ, డెత్ సర్టిఫికెట్లు, వీలునామాలు, భూ వివాదాలు, ఎన్నికల్లో పోటీ, స్వీయ ధ్రువీకరణలు ఇలా అన్నిరకాల పనులకు అధికారిక ధ్రువీకరణ కలిగిన న్యాయవాది చేత నోటరీ చేయించుకోవాలి. నోటరీ చేస్తేనే దానికనుగుణంగా పనులు జరుగుతాయి. దీనిని ఆసరాగా చేసుకుని అర్హతలేని కొందరు వారి వద్ద తయారు చేసి ఉంచిన స్టాంపులు, సంతకాలు పెట్టి అర్జీదారుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. అర్హత ఉన్న న్యాయవాదుల పేరుతో కొందరు ఏజెంట్లు, కంప్యూటర్ దుకాణదారులు, సిబ్బంది డమ్మీ స్టాంపులు రూపొందించి వాటిపై ఫోర్జరీ సంతకాలతో నోటరీలు జారీ చేస్తున్నారు. త్వరగా పనులు జరుగుతుండటంతో ప్రజలు వాటిపై పెద్దగా ఆలోచన చేయకుండా అడిగినంత సమర్పించుకుంటున్నారు. సాక్షి, అమరావతి : విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాలైన మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, నూజివీడు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో ఈ విధమైన అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్, కోర్టు ప్రాంగణాలలోని కొన్ని కంప్యూటర్ దుకాణాల నిర్వాహకులే లాయర్ల పేరుతో స్టాంపులు తయారు చేసుకున్నారు. వినియోగదారులు వచ్చినప్పడు లాయర్ గారు అందుబాటులో లేరని, తమకు అదనపు సొమ్ము అందజేస్తే ఇప్పటికిప్పుడే సంతకాలు చేసి సీల్ వేసిన నోటరీ పేపర్లు ఇస్తామని బేరాలకు దిగుతున్నారు. నోటరీ ద్వారా చేయించే పనులు దాదాపుగా అత్యవసరం కావడంతో ఓ రెండు వందలు అధిక మొత్తం చెల్లించైనా నోటరీ సంపాదిస్తున్నారు. ఇలా సదరు నకిలీ నోటరీల ద్వారా నిత్యం వేలాది రూపాయల్లో అక్రమమార్గంలో సంపాదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ అర్జీదారుడు పూర్తి సమ్మతితో రూపొందించిన ప్రమాణపత్రాన్ని ఆధారాలను పరిశీలించి నోటరీ లైసెన్స్ ఉన్న న్యాయవాది స్టాంపు వేసి సంతకం ధ్రువీకరిస్తారు. అర్హత ఉన్న న్యాయవాదులు, లైసెన్స్ పొందని న్యాయవాదుల పేరుతో అక్రమార్కులు డమ్మీ స్టాంపులను తయారు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్కో నోటరీకి రూ. 300 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం సాధారణ నోటరీకి రూ.50, రూ.100 మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వ పథకాల్లో నోటరీల అవశ్యకత ఉండటంతో వీటి ప్రభావం పథకాల్లో అవకతవకలు జరిగే ప్రమాదముంది. అర్హతలు ఇవీ... భారత ప్రభుత్వం రూపొందించిన నోటరీ యాక్ట్–1952 నోటరీకి ఉండవల్సిన అర్హతలు, నియమాలు, విధివిధానాలను సూచిస్తోంది. నోటరీ చేయడానికి న్యాయవాది పట్టా పొంది పది సంవత్సరాలు కోర్టులో ప్రాక్టీసు చేసి అనంతరం నోటరీ చేయడానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఏడేళ్లకే నోటరీకి అర్హత లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని భారతీయ లీగల్ సర్వీసెస్లో సభ్యులై ఉండి ప్రత్యేక అనుమతులను పొంది ఉండాలి. ఇలా పొందిన లైసెన్సులను ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. జిల్లాలో కొందరికి నోటరీ అర్హత ఉన్నప్పటికి లైసెన్స్ రెన్యూవల్ చేయించకుండా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారు ఇప్పటికీ సంతకాలు పెట్టి నోటరీలు జారీచేస్తున్నారు. అడ్డుకోకపోతే ప్రమాదమే... అక్రమమార్గంలో నోటరీలు జారీచేస్తుండటంతో చాలా ప్రమాదాలు జరిగే అవకాశముంది. అర్హతలు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పథకాలు పొంది, వాటికి అన్ని అర్హతలు ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. మరోవైపు ఆస్తి సంబంధిత విషయాల్లోను సంఘర్షణలు తలెత్తుతాయి. సంఘ విద్రోహులు సులువుగా ప్రభుత్వ గుర్తింపుకార్డులు పొందే అవకాశముంది. బంగ్లాదేశ్ మీదుగా భారత్లో చొరబడిన పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ విధంగా నకిలీ పత్రాలతో పశ్చిమ బెంగాల్ పౌరసత్వం పొందిన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. పైకి చిన్నగా కనిపించినప్పటికీ దాని వల్ల జరిగే పరిణామాలు గుర్తించి అధికారులు స్పందించి నకిలీ నోటరీల ఆటకట్టించాలి. మరోవైపు వీటితో ఏమాత్రం సంబంధంలేని న్యాయవాదులకు కూడా మకిలి అంటే ప్రమాదం ఉంది. -
‘ఆంధ్రజ్యోతి’పై చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోందని తప్పుడు వార్తను ప్రచురించిన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ కె.గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. రామగుండం రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డు తగులుతుందని నిరాధారమైన వార్తలు ప్రచురించిందన్నారు. కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో కల్పిత వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. గత 15 రోజుల్లో విద్యుత్పై ఆంధ్రజ్యోతిలో అసత్య కథనాలు వచ్చాయన్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తూ ప్రజల అభిమానం పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై ఇలాంటి కథనాలు ప్రచురించడం సబబు కాదన్నారు. దీని వెనుక పెద్దల కుట్ర ఉందని ఆరోపించారు. అసత్య వార్తలు ప్రచురించిన సదరు దినపత్రికపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా రవిప్రసాద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా సీనియర్ న్యాయ వాది వై.వి.రవిప్రసాద్ ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ మద్దతుతో బరిలో దిగిన రవిప్రసాద్ తన సమీప ప్రత్యర్థి గూడపాటి వెంకటేశ్వరరావుపై 156 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రవిప్రసాద్కు 621 ఓట్లు రాగా, వెంకటేశ్వరరావుకు 465 ఓట్లు వచ్చాయి. అధ్యక్ష స్థానానికి పోటీపడిన మరో అభ్యర్థి జాగర్లమూడి కోటేశ్వరిదేవికి కేవలం 60 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా జీవీఎల్ నాగేశ్వరరావు గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి ఎలీషాపై 304 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక రెండు కార్యదర్శుల పోస్టులకు జేయూఎంవీ ప్రసాద్, పీటా రామన్ ఎన్నికయ్యారు. సం యుక్త కార్యదర్శిగా ఈర్ల సతీష్కుమార్, కోశాధికారిగా తోట సునీత విజయం సాధించారు. వీ రితో పాటు మరికొందరు కార్యవర్గ సభ్యులుగా విజయం సాధించారు. గురువారం 10.30 గంటలకు మొదలైన ఓటింగ్ సాయం త్రం వర కు జరిగింది. ఏపీ హైకోర్టు ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. -
ప్రత్యేక హోదా కోసం న్యాయవాది ఆత్మహత్యా యత్నం
-
ప్రత్యేక హోదా; న్యాయవాది ఆత్మహత్యా యత్నం
సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో కర్నూలుకు చెందిన న్యాయవాది అనిల్ కుమార్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నంద్యాల కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అనిల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ పిటిషన్లను ఏపీకి బదిలీ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునః సమీక్షా పిటిషన్లపై విచారణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 40(3) చెబుతోందని, దీని వల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, కాబట్టి ఈ వ్యవహారంపై న్యాయపరంగా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో కొన్ని కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిపై విస్తృత ధర్మాసనం విచారించడం మేలన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ వ్యవహారంపై విస్తృత ధర్మాసనం విచారణ జరుపుతుందంటూ సీజే ధర్మాసనం జ్యుడీషియల్ ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఈ విస్తృత ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎవరుండాలన్న దానిపై సీజే పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై నిరసన
లీగల్ (కడప అర్బన్) : రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్ ఒప్పందానికి శాశ్వత సమాధి కడుతూ చివరికి హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రాయలసీమ న్యాయవాద జేఏసీ, స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు ఎదురుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనకారులు నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మస్తాన్వలి, స్టూడెంట్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ మల్లెల భాస్కర్, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పి.సుబ్రమణ్యంలు మాట్లాడుతూ చరిత్రలో రాయలసీమకు ఎలాంటి ద్రోహం జరిగిందో అలాగే అన్యాయాలు కూడా జరిగాయన్నారు. ఇందుకు నిదర్శనం రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును అమరావతికి పోవడమేనన్నారు. సీమ న్యాయవాదులు, విద్యార్థులు, యువకులు చేసిన పోరాటం అనాథ పోరాటంలా రాజకీయ పార్టీలు చూశాయే తప్ప పరిపాలన వికేంద్రీకరణలో భాగమైన డిమాండులాగా చూడలేదన్నారు. సీమ చరిత్రలోనే ఇదొక చీకటిరోజని, చరిత్రలో రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్కు సమాధి కట్టిన రోజుగా నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియతృత్వంగా, అహంకార పూరితంగా తీసుకున్న ఈ నిర్ణయానికి బాధ్యవ వహించి తీరాల్సిందేనన్నారు. ప్రభుత్వ చర్య సీమ ప్రజల ఆకాంక్షలను హేళన చేసేవిధంగా, అవమానపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ఏ హక్కు లేని విధంగా ఉందన్నారు. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ద్రోహం చేసి ఒట్టి కపట ప్రేమను మాత్రమే చూపాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ఏడాది దాదాపు వంద రోజులపాటు న్యాయవాదులు విద్యార్థి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎంత పోరాటం చేసినా దానిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కనీసం ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారన్నారు. అమరావతిలో ఇప్పుడు హైకోర్టు కూడా ఏర్పాటు చేయడాన్ని తామంతా బహిష్కరిస్తున్నామని, ఇది రాయలసీమ ప్రజల హక్కుల పత్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇన్నిరోజులు కలిసి ఉండటానికి కారణమైన శ్రీబాగ్ ఒప్పం దాన్ని ప్రభుత్వ చర్యలు నేటితో కాలం చెల్లిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే గతంలో హైదరాబాదులాగానే ప్రస్తుతం అమరావతిలో కూడా రాజధాని విద్య, వైద్య సంస్థలు, పరిశోధన సంస్థలు కేంద్రీకరించడమే కాకుండా చివరికి కోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు. కార్యక్రమంలో ఓటీడీఆర్ జిల్లా అధ్యక్షులు శివా రెడ్డి, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు రాజ గోపాల్రెడ్డి, హోమియపతి డాక్టర్ శ్రీనివాసులు, ఎరుకల హక్కుల పోరాటసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాస్, రాయలసీమ స్టూ డెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ జగదీష్, కార్తీక్, కేశవ, నిఖిల్లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
రాయలసీమ న్యాయవాదుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనను నిరసిస్తూ ఏపీ న్యాయవాదులు హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు వద్ద రాయలసీమకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైకోర్టు విభజనకు కొంత సమయం కావాలని కోరుతూ ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించడంతో విభజకు లైక్క్లియరైంది. దీంతో ఏపీకి చెందిన న్యాయవాదులు, న్యాయసిబ్బంది అమరావతికి తరలివెళ్లక తప్పట్లేదు. ఇదిలావుండగా సహచర ఉద్యోగులు తరలివెళ్లిపోతుండటంతో హైకోర్టు వద్ద ఉద్విగ్న పరిస్థితి నెలకొంది. కొందరు న్యాయమూర్తులు తమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఏపీకి తరలివెళ్తున్న న్యాయవాదులకు తెలంగాణ సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. అమరావతిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రేపు ఏపీ న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. -
హైకోర్టు విభజనపై సీజేను కలిసిన సీనియర్ న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్ : అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవనంలో న్యాయవాదులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని సీనియర్ న్యాయవాదులు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకున్న సమాచారం ప్రకారం న్యాయవాదులకు అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవని, హైకోర్టును అమరావతికి తరలించేలోపే అడ్వకేట్లకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తే తదుపరి ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు సీజేకు వివరించారు. తినేందుకు చిన్నపాటి హోటళ్లు కూడా లేవని తెలిపారు. సీనియర్ న్యాయవాదులకు చాంబర్లను ఏర్పాటు చేయాలని కోరారు. హైకోర్టు భవన నిర్మాణం నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తయ్యే విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయని వారు సీజే దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణ పనులను ఎల్అండ్టీ చూస్తోందని, చెప్పిన సమయానికి భవనాన్ని అప్పగిస్తామని అది హామీ ఇచ్చిందని సీజే ఈ సందర్భంగా వారికి తెలిపారు. తాము (న్యాయమూర్తుల కమిటీ) కూడా ఆ హామీని నిలబెట్టుకుంటుందని నమ్ముతున్నామని ఆయన వారికి చెప్పారు. సానుకూలంగా స్పందించిన సీజే.. సీనియర్ న్యాయవాదులు చెప్పిన విషయాలను రాసుకున్న ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు విభజన కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రామసుబ్రమణియన్తో మాట్లాడి లాయర్లకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. కొన్ని రకాల కేసులను హైకోర్టు విభజనకు ముందే తేల్చాల్సిన అవసరం ఉందని, విభజన జరిగితే వాటిని సుప్రీంకోర్టు మాత్రమే తేల్చాల్సి ఉంటుందని వారు సీజే దృష్టికి తీసుకొచ్చారు.ఆ పరిస్థితి తలెత్తకుండా విభజనకు ముందే ఆ కేసుల పరిష్కరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సీజే జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ సానుకూలంగా స్పందించారు. -
బాల్రాజా మజాకా!
ప్లీడర్ బాల్రాజు దగ్గరికి పెద్దగా క్లయింట్లు రారు. ఆ వచ్చినవాడు కూడా రూపాయి చేతిలో పెట్టి ‘‘ఎలాగైనా సరే కేసు గెలిపించాలి. నీదే పూచీ’’ అంటాడు. ఇలాంటి బాల్రాజుకి గట్టి కేస్ ఒకటి తగిలితే! కమ్మని సంగీతం, కడుపుబ్బా నవ్వించే హాస్యం విందు చేసే సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘ఇదేనా ప్లీడర్ ఇల్లు?’’ అని ప్రశ్నించి ‘‘ఇదే అయ్యుంటుందిలే’’ అని సమాధానం చెప్పుకున్నాడు రాకరాక వచ్చిన క్లయింటు.ఇంట్లో నుంచి ఒక వ్యక్తి నల్లకోటుతో బయటకు వచ్చాడు. క్లయింట్గారి సందేహానికి నల్లకోటే సమాధానం చెబుతుంది. అయినా సరే...‘‘ఏయ్... ప్లీడర్ బాల్రాజు ఇల్లు ఇదేనా?’’ అని సాక్షాత్తు ప్లీడర్నే పట్టుకొని అడిగాడు క్లయింటు.ప్లీడర్గారు లైట్గా నొచ్చుకొని...‘ఏందయ్యా మంచీమర్యాద లేకుండా. కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా’’ అన్నారు.ఇప్పటికైనా క్లయింటు ఊరుకున్నాడా? ఎక్కడ ఊరుకుంటాడు. మళ్లీ అలాగే అడిగాడు...‘‘ప్లీడర్ బాల్రాజు ఇల్లుఇదేనా?’’‘‘నేనేనయ్యా బాల్రాజును. కావాలంటే చూడు ఒక కేసు స్టడీ చేస్తున్నాను’’ అని క్లయింట్ను నమ్మించడానికి కళ్లలోని భావాల సహాయ సహకారాలతో తెగ ప్రయత్నించాడు ప్లీడరు.అయినా సరే...‘‘నాకు డౌటే బావా!’’ అన్నారు క్లయింట్గారి బామ్మర్దిగారు.ఇలా కొంచెంసేపయ్యాక... అతడు ప్లీడరేనని, అతని పేరు బాల్రాజేనని, అతడి ఇల్లు ఇదేనని క్లయింట్గారు బలహీనంగా నమ్మారు. తాను ఎందుకొచ్చింది ఇలా చెప్పారు...‘‘ఇంతకీ కేసేమిటంటే, నాకో అరటితోట ఉంది. అందులో రోజూ ఒకడు అరటిగెల మాయం చేస్తున్నాడు. ఆడ్ని చితగ్గొట్టాను...’’‘‘ఓస్ అంతేగా... ముందు ఫీజు ఇవ్వు’’ క్లయింట్కు ధైర్యం చెప్పాడు బాల్రాజు.క్లయింట్గారు చాలా జాగ్రత్తగా రూపాయి బిళ్లను ప్లీడర్ చేతిలో పెట్టాడు. ప్లీడర్గారు నవ్వలేడు. ఏడ్వలేడు. అలా అని మౌనంగానూ ఉండలేడు.... అయ్యో! అంతమాత్రాన మీరు అతడిని చెవిలో దూదిలా తేలిగ్గా తీసిపారేయకండి... ఈ సీన్లలో చూడండి ఎలా విజృంభిస్తున్నాడో... ‘‘యువరానర్ ఇది గోపాలకృష్ణ–సుజాత మ్యారేజి సర్టిఫికెట్. వాళ్లిద్దరికీ పెళ్లైందనడానికి ఇదే ఆధారం’’ అన్నాడు ప్లీడర్ బసవరాజు.‘‘వందరూపాయలకు కూడా పోస్ట్గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు దొరికే ఈరోజుల్లో ఇలాంటివి బోలెడు సంపాదించవచ్చు’’ అని తేలికగా ఆ సర్టిఫికెట్ను తీసేశాడు ప్లీడర్ బాల్రాజు. అంతేకాదు...‘‘నా కేసులో నిజం తేల్చడానికి బసవరాజును ఎగ్జామిన్ చేయాలి. విల్ యూ ప్లీజ్ పర్మిట్ మీ’’ అని జడ్జివైపు గౌరవపూర్వకంగా చూశాడు బాల్రాజు.ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆబగా...‘‘యస్. యూ కెన్ ప్రొసీడ్’’ అని అనుమతి ఇచ్చారు జడ్జిగారు.బసవరాజు బోనులోకి వచ్చాడు. బాల్రాజు ప్రశ్నల ఆయుధం అందుకున్నాడు...‘‘మీకు గోపాలకృష్ణగారు ఎంతకాలంగా తెలుసు?’’‘‘పది పదిహేనేళ్లుగా తెలుసు. వాళ్ల కంపెనీకి నేనే లీగల్ అడ్వైజర్ని. పైగా... హీ వాజ్ క్లోజ్ఫ్రెండ్ ఆఫ్ మైన్’’‘‘ఐసీ. అంత క్లోజ్ఫ్రెండై ఉండి ఈ లీగల్ అడ్వైజర్గారు పెళ్లికి ఎందుకు వెళ్లలేకపోయారు?’’‘‘వెళ్లేవాణ్ణే. కానీ వాళ్లకు పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే’’‘‘ఆన్సర్ టు ద పాయింట్ సార్. మీరు ఆ పెళ్లికి వెళ్లారా లేదా?’’‘‘వెళ్లలేదు’’బసవరాజు చెప్పింది అబద్ధమని పదినిమిషాల్లో నిరూపించాడు బాల్రాజు.‘‘మీ ముందు మరో బలమైన సాక్ష్యం ప్రవేశపెడతాను’’ అని జడ్జిగారి అనుమతి కోరాడు. ఆ సాక్షి మనిషి కాదు.టీవీ! ఆ టీవీ ఠీవిగాకోర్టుహాలులోకి వచ్చి నిజమేమిటో చెప్పింది... కాదు... కాదు... చూపించింది. టీవీలో గోపాలకృష్ణ పెళ్లి వీడియో రన్ అవుతోంది. అందులో ప్లీడర్ బసవరాజు చాలా స్పష్టంగా కనిపించాడు!‘పోల్చుకున్నారా బసవరాజుగారూ. ఇది డ్యూయెల్ రోల్ కాదు. మీరే’’ బసవరాజును వెక్కిరింపు ధోరణిలో అన్నాడు బాల్రాజు.తేలుకుట్టిన దొంగైపోయాడు బసవరాజు!‘‘ఈ కేసును నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకు వారసురాలిని చేయాలని మాత్రం కాదు. ఏ భారత స్త్రీకైనా ఆస్తుల కంటే మించిన సౌభాగ్యం ఏముంటుంది? కానీ, ఆ సౌభాగ్యాన్ని చేతులారా తుడిచేసిన దుర్మార్గుల్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది.ఒక ఆడదాన్ని ఎంతమంది హింసించారు? ఆమె కన్నీటికే గనుక శపించే శక్తి ఉంటే వీళ్లందరినీ సర్వనాశనం చేసి ఉండేది’’ బాల్రాజు డైలాగులకు కోర్టు హాలు అదిరిపడింది. బాల్రాజా మజాకా! మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి.నిందితుడు కోర్టు బోనులో ఉన్నాడు.‘‘మీకు పెళ్లై ఎంత కాలమైంది?’’‘‘23 ఏళ్లు. నా భార్య పేరు వర్ధనమ్మ’’‘‘మీకెంతమంది పిల్లలు?’’‘‘ఇద్దరు. ఆదిబాబు, గోపాలకృష్ణ’’‘‘జనరల్గా పెద్దపిల్లాడి పేరు మొదట చెబుతారు. ఆ.. అది వదిలేయండి. మీకు పుట్టింది సక్రమమైన సంతానమేనా?’’‘‘ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది?’’‘‘అలా అని రుజువులేమీ లేవు కదా.అయినా కోర్టువారు నమ్ముతారు లెండి. మీ పిల్లలే అని. మీకు పెళ్లై ఎన్ని సంవత్సరాలవుతుంది?’’‘‘ఆ... డిసెంబరు.... 1965’’‘‘అంతసేపు ఆలోచించారు. మరుపు సహజం. వయసు కదా, సరే 1966లో ఆదిబాబు మీకు పుట్టాడు కదా...అంటే గోపాలకృష్ణా, ఆదిబాబు కవలపిల్లలా?’’‘‘కాదు... గోపాలకృష్ణ ఆదిబాబు కంటే పెద్దవాడు’’‘‘ఎన్నేళ్లు?’’‘‘పదకొండు’’‘‘అంటే, పదకొండేళ్ల ముందు నుంచే వర్ధనమ్మకు మీకు శారీరక సంబంధం ఉందన్నమాట!’’‘‘బాబూ... ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది’’‘‘పొరపాటు, సమాధానం చెప్పడంలోనా? పిల్లల్ని కనడంలోనా? చెప్పండి ఎన్నేళ్ల నుంచి?’’‘‘పెళ్లికి ముందు ఐదేళ్ల నుంచి’’‘‘ఐసీ. ఇంతవరకు గోపాలకృష్ణ మీకు అక్రమసంతానం అనుకున్నా. అసలు మీ కొడుకే కాదన్నమాట’’. ∙ -
నేరస్తులను లగడపాటి ఎలా రక్షిస్తారు?
-
రైతువాది
టెన్నిస్ అంటే ఇష్టం.. స్విమ్మింగ్ హాబీ.. రన్నింగ్ డైలీ రొటీన్... యోగా స్ట్రెస్ బస్టర్... ఇవన్నీ రచనారెడ్డి డే స్టార్టర్స్. మానవహక్కుల పోరాటం... రైతుల భూమికి న్యాయసహాయం... మహిళలకు న్యాయసేవ.. ఇవీ, సామాజిక న్యాయ సాధన కోసం ఆమె ఎంచుకున్న మార్గాలు. అన్నం పెట్టిన నేలతల్లిని వదల్లేక.. ప్రభుత్వంతో పోరాడలేక కన్నీళ్ల పర్యంతమవుతున్న రైతుల పక్షాన నిలిచారామె. 9న ‘వరల్డ్ లీగల్ సర్వీసెస్ డే’ సందర్భంగా.. ఆమె పరిచయం ఇది. రచన పుట్టింది హైదరాబాద్లో. సొంతూరు కామారెడ్డి (నిజామాబాద్) జిల్లా, నాగిరెడ్డిపేట గ్రామం. ‘‘నాలుగేళ్ల వరకు నాగిరెడ్డిపేటలోనే పెరిగాను. స్కూల్లో చేరడానికి మళ్లీ హైదరాబాద్కి తీసుకొచ్చి, వెస్ట్ మారేడ్పల్లిలో సెయింట్ ఆన్స్ గాళ్స్ స్కూల్లో చేర్చారు అమ్మానాన్న. నాన్న బొల్లు నర్సింహా రెడ్డి సోషల్సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రైతు. అమ్మ ఇందిర గృహిణి. ఆమె సెయింట్ ఆన్స్ స్టూడెంట్. ఇద్దరూ చదువుకున్న వాళ్లు, సొసైటీ పట్ల అవగాహనతో విశాలమైన దృక్పథం ఉన్న వాళ్లు కావడంతో నాకు మంచి దారి ఏర్పడింది. ఆ రకంగా నేను బ్లెస్డ్ చైల్డ్ని అనే చెప్పాలి’’ అంటారు రచన. రచన కాలేజ్ ఎడ్యుకేషన్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో. ఆ తర్వాత పూనాలోని ఇండియన్ లా సొసైటీస్ లా కాలేజ్ (ఐఎల్ఎస్ లా కాలేజ్)లో న్యాయశాస్త్రం చదవడం ఆమె కెరీర్కి ఒక డైరెక్షన్ని ఇచ్చింది. ఆ కాలేజ్లో చదివిన వారిలో సుప్రీంకోర్టు జడ్జిలు చాలా మందే ఉన్నారు. ‘‘మాస్టర్స్ కోర్సుకి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్లో సీటు తెచ్చుకోగలిగానంటే ప్రతిష్ఠాత్మకమైన పూనా విద్యాసంస్థలో చదవడం వల్లనే’’ అంటారు రచన. అక్కడ అంతర్జాతీయ మానవహక్కులు, అంతర్జాతీయ చట్టాల మీద ఎక్కువ వర్క్ చేశారు. ఇంటర్నేషనల్ లా క్లాసులు తీసుకోవడం కూడా ఆమెకో టర్నింగ్ పాయింట్. కాలిఫోర్నియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లా ఫోరమ్లో గెస్ట్ ఫ్యాకల్టీగా చేయడం.. ఇండియాకు వచ్చేటప్పుడు కెరీర్ ప్లానింగ్లో ఓ భరోసానిచ్చింది. నల్సార్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆహ్వానం వచ్చింది. అక్కడ మూడేళ్ల పాటు పాఠాలు చెప్పిన తర్వాత హైకోర్టులో అడుగుపెట్టారామె. భూమి హక్కుల కోసం న్యాయపోరాటం ఆమె స్పెషలైజేషన్గా మారిపోయింది. పేపర్లకు, లీగల్ జర్నల్స్కి వ్యాసాలు రాయడం అమెరికాలో ఉండగానే వ్యాపకంగా మారింది. ఇదా లోకం?! లా కోర్సులో చదివేటప్పుడు నేర్చుకున్న దానికంటే.. ఆచరణలో నేర్చుకునేదే చాలా ఎక్కువ. ఆ విషయమే చెబుతూ.. ‘‘నా పాతికేళ్ల వయసులో అమెరికాలో అంతర్జాతీయ మానవహక్కులు, అంతర్జాతీయ చట్టాల మీద అధ్యయనం చేసేటప్పుడు ఒక్కో కేసు ఒక్కో పాఠం అయింది. ఇథియోపియా, జాంబియా, సోమాలియా దేశాల నుంచి పారిపోయి వచ్చే మహిళల కేసులు కొల్లలుగా ఉండేవి. వారంతా జెనిటికల్ మ్యుటేషన్కు భయపడి పారిపోయి వచ్చినవాళ్లు! కొలంబియా నుంచి డ్రగ్ విష వలయంలో చిక్కుకున్న వాళ్లు, శ్రీలంక, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాల నుంచి రాజకీయ కల్లోలాల కారణంగా ఎదురయ్యే హింసకు భయపడి పారిపోయే వాళ్లు, చైనా నుంచి రెండవసారి గర్భం దాల్చిన వాళ్లు (ఒక కుటుంబానికి ఒకే బిడ్డ చట్టం ఉన్న రోజుల్లో), నార్త్ కొరియా నుంచి ఆకలి బాధలు తట్టుకోలేక పారిపోయి వచ్చేవాళ్లు ఎక్కువ . వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. తమ దేశాల నుంచి ఒక్క ధృవీకరణ పత్రమూ ఉండదు, అమెరికా రావడానికి అనుమతి పత్రమూ ఉండదు. ఎటువంటి డాక్యుమెంట్లూ లేకుండా.. రైళ్లు, పడవలు ఏదో ఒక దొరికిన రవాణా సాధనంలో అమెరికాకి చేరుకుంటారు. ఇలాంటి కేసుల్లో గ్వాటిమెలా మహిళ ఉదంతం నన్ను బాగా కలచి వేసింది. ఆమె భర్త ఆ దేశంలో పెద్ద పొజిషన్లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. అతడు ఆమెను శారీరకంగా, మానసికంగా భయంకరంగా వేధించేవాడు. ఆమె భర్త బారి నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఆ దేశం నుంచే పారిపోయి వచ్చింది. అమెరికాలో తలదాచుకున్నప్పటికీ అతడు ఆమెను వదల్లేదు. ఆమె వివరాలను సేకరిస్తూ వేధింపు కొనసాగించాడు. అంతటి కష్టాల్లో ఉన్న వాళ్లకు అండగా నిలబడే ప్రొఫెషన్ కావడంతో ఇందులో సంతోషం ఉంటుంది’’ అన్నారు రచన. రైతు బిడ్డని రైతు కేసుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో రచన పేరును ప్రస్తావించారు. ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు.. ‘‘అన్ని రకాల కేసులనూ చేస్తున్నప్పటికీ రైతు బిడ్డను కావడంతోనో ఏమో భూమిని కోల్పోయిన రైతు బాధ వింటుంటేనే తీరని ఆవేదన కలిగేది. ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేయడంతో బాధిత రైతులు న్యాయసహాయం కోసం వచ్చినప్పుడు జీవోఎంఎస్ 123ని ప్రశ్నిస్తూ కేసు వేశాం. క్రయవిక్రయాల్లో విక్రయించే వ్యక్తి ఇష్టపూర్వకంగా అమ్ముతున్నారా లేక ఏదైనా ఒత్తిడి కారణంగా ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో అమ్ముతున్నారా అనేది చాలా ముఖ్యం. అయితే ఇక్కడ కొంటున్నది ప్రభుత్వం కావడంతో, అమ్మక తప్పని విధంగా ఒత్తిడి చేస్తుండడంతో రైతులు ఆవేదనను మనసులో దాచుకుని, కన్నీళ్లను దిగమింగుకుని సంతకాలు చేయాల్సి వస్తోంది. ‘ఇష్టపూర్వకంగానే విక్రయిస్తున్నాను’ అనే మాట అనడానికి గొంతు పెగలక మౌనంగా తలూపితే దానినే ఆమోదంగా నమోదు చేసి పని కానిచ్చేస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో నా చదువుని రైతుల పక్షాన పోరాడడానికి వినియోగించకుండా ఉండగలనా?’’ అని తిరిగి ప్రశ్నించారు రచన. అస్తిత్వ పోరాటం మహిళలకు కొన్ని తరాలుగా కనిపించని అడ్డుగోడగా ఉన్న గ్లాస్ సీలింగ్ని బ్రేక్ చేయగలుగుతున్నారిప్పుడు. ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే ప్రొఫెషన్లో రాణిస్తున్న వైనం ఇది. అలాగని మహిళలకు ఫ్రీ హ్యాండ్ ఉందని కాదు. ప్రతి దశలోనూ తనను తాను నిరూపించుకుంటూనే ముందుకుసాగాలి. భర్త, అత్తమామలు, అమ్మానాన్నలకు సమాధానం చెప్పుకోవాల్సిందే. మగవాళ్లకు ఆ దుస్థితి ఉండదు. ఒకవేళ అతడు తన ఉద్యోగంలో వెనుకబడినా, వ్యాపారంలో నష్టపోయినా సమాజం అతడిని తప్పు పట్టదు. పైగా జీవితంలో ఒడిదొడుకులుంటాయని సపోర్టుగా నిలుస్తుంది కూడా. అదే స్త్రీ విషయానికి వచ్చే సరికి... ఆమె వ్యాపారంలో చిన్న పొరపాటు జరిగినా, ఉద్యోగంలో ఒకడుగు వెనుకబడినా ఆమెకు ఎవరి నుంచి ఎటువంటి మాట వంతు ధైర్యం చెప్పే వారుండరు. వెంటనే... ‘ఇంట్లో కూర్చోక ఇవన్నీ అవసరమా’ అని ఆమె చుట్టూ ఉన్న వాళ్లే అంటారు. ఆమె అస్తిత్వ పోరాటం చేస్తూనే ఉంది. ప్రకృతి ఆమెకి సొంత అస్తిత్వాన్నిచ్చింది. ఆ అస్తిత్వాన్ని గుర్తించడానికి సమాజానికి మనసొప్పడం లేదు. ‘‘అయితే ఇది మన దేశంలో మాత్రమే కాదు, దాదాపుగా ప్రపంచం అంతా ఇలాగే ఉంది. తేడా అంతా... తమ సమస్యలను భారతీయ మహిళలు ఎదుర్కొనే పద్ధతికి, బయటి దేశాల మహిళలు ఎదుర్కొనే పద్ధతికి మధ్యనే ఉంటోంది. మన మహిళల్లో సహనం, సహించే గుణం, సహించగలిగినస్థాయులు ఎక్కువ. చాలా దేశాల్లో అది కనిపించదు. తమ సంతోషాన్ని హరించే ఏ పరిస్థితినీ భరించరు. చాలా దేశాల్లో మహిళలకు రాజకీయ హక్కులు, రాజకీయరంగంలో పాల్గొనే హక్కులు, అవకాశాలు మనకంటే పుష్కలంగా ఉన్నాయి. అయినా మహిళ ఎదుర్కొనే ఇబ్బందుల గురించి చర్చ పెడితే మన దగ్గరకంటే ఏ మాత్రం తగ్గవు. మహిళలు ఆర్థికంగా భర్త మీద ఆధారపడే పరిస్థితులు మాత్రం మనదేశంలోనే ఎక్కువ. ఆర్థిక స్వావలంబన మనిషిలో ధైర్యాన్ని పెంచుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యాక్టర్స్ ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఆర్థిక స్థిరత్వం ఉన్న మహిళలు కూడా సామాజిక సమీకరణల కారణంగా ఇబ్బందులను భరిస్తూనే ఉన్నారు. ఈ భరించే తత్వం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతోంది’’ అన్నారామె. సరిదిద్దే ప్రయత్నం.. మీటూ లైంగిక వేధింపుల మీద సాగుతున్న మీటూ పోరాటం.. మహిళలకు ఎదురవుతున్న వేధింపుల తీవ్రతకు ప్రతీక. ఈ ఉద్యమం మీద స్పందిస్తూ... ‘‘ఎమోషనల్ ఫీలింగ్స్ను తెలియచేయడం వరకు తప్పనలేం, కానీ పవర్ను అడ్డుపెట్టుకుని మహిళల మీద ఒత్తిడి తేవడం, వేధింపులకు దిగజారడాన్ని సహించకూడదు. ప్రతి బాధితురాలూ తప్పనిసరిగా తనకు ఎదురైన ప్రతికూల సందర్భాన్ని బయటపెట్టాలి. మగవాళ్లు కూడా మీటూని తమకు వ్యతిరేకంగా, తమ మీద జరుగుతున్న పోరాటం అని భావించాల్సిన పని లేదు. సమాజంలో వేళ్లూనుకుని ఉన్న ఒక తప్పును సరిదిద్దే ప్రయత్నం ఇది. ఇందులో మహిళలు తమవంతు భాగస్వామ్యాన్ని ఇవ్వాలి. పని చేసే ప్రదేశంలో మహిళల మీద సెక్సువల్ హెరాస్మెంట్ మగవాళ్లు ఆడుతున్న పవర్గేమ్. ఇలాంటి వాటన్నింటినీ ఛేదించుకుంటూనే ఇంత వరకు వచ్చారు మహిళలు. వల్నరబుల్ కండిషన్లో ఎదురీదుతూ ఇంత వరకు వచ్చిన మహిళలను గౌరవించాల్సిన సమయమిది. అలాగే గృహిణులు మీటూ ఉద్యమం నుంచి తమను తాము వేరు చేసుకుని చూడడం సమర్థనీయం కానేకాదు. తమ ఇంట్లో మర్యాదస్థులుగా ఉండే మగవాళ్లలో ఇల్లు దాటగానే ఇలాంటి కోణం బయటపడుతోందా అని కూడా ఆలోచించాలి. మనదేశంలో మహిళలు ఇప్పటికీ తమ జీవితం భర్త చేతుల్లో ఉందనే అనుకుంటారు. బయటి దేశాల్లో మహిళలు తమ జీవితం తమ చేతుల్లో ఉందనుకుంటారు, ఈ తేడా ప్రతి చోటా ప్రతిబింబిస్తూనే ఉంటుంది. మహిళల్లో తమ హక్కుల గురించిన అవగాహన పెరగాలి. న్యాయసేవ గురించిన చైతన్యం లేకపోవడం వల్ల ఎమోషనల్గా వీక్ మూమెంట్లో కేసులంటూ వెళ్లడం, ఎవరు ఎలా డైరెక్షన్ ఇస్తే అలా ముందుకుపోవడం జరుగుతోంది. దాంతో ఎదురయ్యే ప్రతికూలాంశాలకు తిరిగి ఆ మహిళలే బాధ్యులు కావల్సి వస్తోంది’’ అని ఆవేదన చెందారు రచన. న్యాయవ్యవస్థ అండ లైంగిక వేధింపులకు గురైన విషయాన్ని ఎండగట్టాల్సిందే. ఈ దౌష్ట్యాన్ని నివారించడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ భర్త నుంచి ప్రియారమణికి (ఎం.కె.అక్బర్పై లైంగిక ఆరోపణలు చేసిన జర్నలిస్టు) ఉన్నంత అండ ఉండవచ్చు ఉండకపోవచ్చు. ‘‘అయితే తన కోసం ఎవరో ఒకరు వచ్చి, అండగా నిలుస్తారని చూస్తూ ఉండడం కంటే, పర్యవసానాలు ఎలా ఉన్నా సరే తొలి అడుగును వేయడమే కరెక్ట్. ఎటువంటి పర్యవసానమైనా సరే, అది మహిళల తెలివితేటలు, పట్టుదలకు మించినవి కాలేదు. సమాజాన్ని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉన్న పరిస్థితి ఇది. ధైర్యం చేయాల్సిందే. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా మహిళల మనోధైర్యాన్ని పెంచేదిగా ఉంది. మహిళ అస్తిత్వ పోరాటం చేస్తున్న ఈ సందర్భంలో ఈ తీర్పు రావడం అంటే... న్యాయవ్యవస్థ మహిళలకు అండగా ఉందని చెప్పడానికి నిదర్శనం. అది 1997 నాటి పంకజ్ చౌదరి, గుంజేశ్, మరో ఇద్దరు స్నేహితులు ఒక మహిళ మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసు. సదరు మహిళ నైతిక వర్తన మీద బురద జల్లుతూ అలాంటి మహిళ విషయంలో జరిగిన రేప్ను నేరంగా పరిగణించరాదని వాదించారు వాళ్లు. జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలు ‘నో అంటే నో, ఆమె శీలవర్తనల విశ్లేషణలకు తావే లేదు’ అని, ముద్దాయిలకు ఒక్కొక్కరికి పదేళ్లు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు’’ అని గుర్తుచేశారు రచన. ఇది మా నైతిక విధి ప్రతి న్యాయవాది కూడా తప్పనిసరిగా ఎథికల్ డ్యూటీ చేయాలని చెబుతుంది న్యాయశాస్త్రం. న్యాయపోరాటం చేయడానికి ఆర్థిక స్థోమత లేని వాళ్ల కేసులను వాదించాల్సిన బాధ్యత ప్రతి న్యాయవాది మీదా ఉంది. ఇది పూర్తిగా సేవాదృక్పథంతో నిర్వర్తించాల్సిన బాధ్యత. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటు కూడా ఇందు కోసమే. ఇందులో లాయర్లు వాలంటరీగా సర్వీస్ ఇస్తారు. కొందరు ఈ కేసులు ఎక్కువ చేస్తారు, కొందరు తక్కువ చేస్తారు, అంతే తప్ప అసలే చేయకుండా ఉండకూడదు. సామాన్యుల్లో చైతన్యం తీసుకురావడానికి సదస్సులు నిర్వహిస్తుంది న్యాయవ్యవస్థ. కానీ వీటికి ప్రచారం తగినంతగా ఉండడం లేదు. వైద్యరంగానికి ఉన్నంత విస్తృత ప్రచారం ఉండాలి. మనిషికి వైద్య సేవ ఎంత అవసరమో, న్యాయసేవ కూడా అంతే అవసరం. లాయర్గా సమాజానికి నేను చేయాల్సిన సేవ చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇక కుటుంబం విషయానికి వస్తే నా భర్త రాహుల్ యర్రంరెడ్డి కూడా లాయరే. నా కొడుకు రేయాన్ష్కి నిద్రపోయే ముందు ప్రతిరోజూ కనీసం రెండు కథలైనా చెప్పాలి. తల్లిగా నాకు అవి హ్యాపీయెస్ట్ మూమెంట్స్. అప్పుడు నాకు నేను బ్లెస్డ్ అని మళ్లీ మళ్లీ అనిపిస్తుంది. వైద్యం– న్యాయం మనదేశంలో తమకు ఎంత అన్యాయం జరుగుతున్నా సరే న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సంశయిస్తారు. సమాజానికి– న్యాయవ్యవస్థకు మధ్య కనిపించని దూరం కరడు గట్టి ఉంది. సమాజంలో మారుతున్న అభిప్రాయాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ చట్టాల్లో సవరణలు చేసుకుంటోంది. కానీ చట్టాలు ఎంత హ్యూమన్ ఫ్రెండ్లీగా మారుతున్నాయనే చైతన్యం సమాజంలో కొరవడుతోంది. నిజానికి మనిషి సంతోషంగా జీవించడానికి వైద్యరంగంతోపాటు న్యాయవ్యవస్థ కూడా ప్రధానమే. సకాలంలో వైద్య సేవలు అందకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది, సమయానికి న్యాయసహాయం అందకపోతే జీవిక ప్రమాదంలో పడుతుంది. -
నిబ్బరం... నిండుదనం
అతనొక బాలుడు. చేతిమీద పెద్ద కురుపు ఏర్పడింది. ఆ రోజుల్లో అలాంటి వాటికి కణకణ లాడే నిప్పుల్లో ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీని పెట్టడమే వైద్యం. అలాంటి ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆ వైద్యుడు ఇనపకడ్డీని కాల్చాడు. అయితే, అంత చిన్నపిల్లాడు ఆ బాధను తట్టుకోగలడా లేడా అని ఆలోచిస్తున్నాడు. అతని మనసులోని ఆలోచనను గ్రహించినట్లున్నాడా బుడతడు. కణకణలాడే ఆ కడ్డీని తీసుకుని చటుక్కున తనే ఆ కురుపు మీద పెట్టుకున్నాడు. వైద్యుడితోపాటు ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారతని ధైర్యానికి, సహన శక్తికి. ఆ తర్వాత కొంతకాలానికి అంటే ఆ కుర్రాడు యువకుడయ్యాక అతనికి అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసి వచ్చింది. డాక్టరు మత్తుమందు ఇస్తానన్నాడు. అందుకు ఆ యువకుడు ఒప్పుకోలేదు. మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయమన్నాడు.మత్తివ్వకపోతే ఆ బాధను తట్టుకోలేవని వైద్యులు ఎంత చెప్పినా వినలేదు. చివరికి అతని పట్టుదలే నెగ్గింది. ఆపరేషన్ చేస్తున్నంత సేపూ ఏమాత్రం చలించకుండా నిబ్బరంగా ఉన్నాడు. అతను కష్టపడి చదువుకుని న్యాయవాది అయ్యాడు. రైతుల పక్షాన నిలబడి ఎన్నో కేసులు వారికి అనుకూలంగా వచ్చేలా వాదించి, విజయం సాధించాడు. ఒకసారతను కోర్టులో కేసు వాదిస్తుండగా ఎవరో ఇతనికి ప్లీడర్గా పెద్దగా డిగ్రీలు లేవని వ్యాఖ్యానించారు. దాంతో ఇతను రోషంతో లండన్ వెళ్లి చదువుకుని బారిస్టరీ పట్టా సాధించాడు. ఆ తర్వాత అతను మరింత పేరుమోసిన న్యాయవాది అయ్యాడు. అలాగే ఓసారి కోర్టులో కేసు వాదిస్తుండగా ఆయన భార్య మరణించినట్లు టెలిగ్రామ్ వచ్చింది. ఆయన ఆ టెలిగ్రామ్ను చదువుకుని, మడిచి జేబులో పెట్టుకుని వాదనలు కొనసాగించి, కేసు గెలిచాడు. ఇంతటి నిబ్బరం, ఓరిమి ఉన్నాయి కనకనే అతను గాంధీజికి ప్రియశిష్యుడయ్యాడు. స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్ర పోషించాడు. స్వతంత్ర భారతదేశానికి ఉపప్రధానిగా, హోమ్ మినిస్టర్గా సేవలందించారు. 500కు పైగా సంస్థానాలను విలీనం చేశాడు. ఆ ఉక్కుమనిషే సర్దార్ వల్లభాయ్ పటేల్. అహ్మదాబాద్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట ప్రపంచంలోనే అతి ఎల్తైన విగ్రహంగా నిర్మించిన పటేల్ భారీ విగ్రహాన్ని నేడు ఆవిష్కరిస్తున్నారు. – డి.వి.ఆర్. -
రైళ్లలో ధ్రువీకరణకు లాయర్ ఐడీ కార్డులు
న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రం(ఐడెంటిటీ ప్రూఫ్)గా న్యాయవాదులు తమకు ఆయా బార్ కౌన్సిల్స్ జారీ చేసే ఐడెంటిటీ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలను రైల్వే శాఖ గుర్తిస్తోంది. వాటిలో ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, విద్యార్థులకు వారి పాఠశాలలు, కళాశాలలు జారీ చేసే గుర్తింపు కార్డ్లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డులు మొదలైనవి ఉన్నాయి. కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల కారణంగా బార్ కౌన్సిల్స్ జారీ చేసే ఐడీ కార్డులను ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగించుకునేందుకు అవకాశమిస్తున్నామని రైల్వే బోర్డు సోమవారం ప్రకటించింది. -
జస్టిస్ పీసీ రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: న్యాయకోవిదుడు, పద్మభూషణ్ జస్టిస్ పాటిబండ్ల చంద్రశేఖరరావు (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ పీసీ రావుకు భార్య, నలుగురు కుమార్తెలున్నారు. ఆయన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.82లో నివాసముండేవారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో ఆయన 1936 ఏప్రిల్ 22న జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, బీఎల్, ఎంఎల్, ఎల్ఎల్డీ (డాక్టర్ ఆఫ్ లాస్) పట్టాలు, హైదరాబాద్ నల్సార్ వర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. రాజ్యాంగపరమైన అంశాల్లో బాగా లోతుగా అధ్యయనం చేసి ఆయన తనదైన ముద్ర వేశారు. ఆర్బిట్రేషన్ లా (మధ్యవర్తిత్వ న్యాయ), అంతర్జాతీయ సముద్ర జలాల న్యాయ వివాదాలు తదితర చట్టాల్లో ఆరితేరిన వ్యక్తిగా పేరొందారు. దేశం తరఫున అంతర్జాతీయ జల చట్టాల పరిశోధనాధికారిగా కూడా పనిచేశారు. భారత ప్రభుత్వ న్యాయశాఖ, డిప్యూటీ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్లో అదనపు కార్యదర్శి, కార్యదర్శితో సహా పలు ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలను ఆయన చేపట్టారు. 2017 వరకు ‘ట్రిబ్యునల్’ న్యాయమూర్తిగా.. హంబర్గ్లోని అంతర్జాతీయ సముద్ర జల వివాదాల ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా (1999 నుంచి 2002 వరకు), న్యాయమూర్తిగా 2017 వరకు జస్టిస్ పీసీ రావు పనిచేశారు. ఇటలీ–చైనా సముద్ర జలాల వివాదాలపై 1996 నుంచి మధ్యవర్తిగా వ్యవహరించారు. భారత ప్రధానులుగా చేసిన ఐదుగురితో కలసి పనిచేశారు. రాజ్యాంగ అంశాలపై సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. స్థానిక సంస్థలు, మానవహక్కులు, న్యాయపరమైన పలు రాజ్యాంగ సవరణలు తీసుకురావడంలో జస్టిస్ పీసీ రావు సేవలున్నాయి. రాజ్యాంగ అంశాలపైనే కాకుండా మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ చట్టాలపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్రప్రభుత్వం 2012లో పద్మభూషణ్తో సత్కరించింది. జస్టిస్ పీసీ రావు మరణ వార్త తెలియగానే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఢిల్లీ నుంచి ఫోన్ చేసి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ జస్టిస్ పీసీ రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అమెరికా నుంచి కుమార్తెలు వచ్చాక ఆదివారం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో జస్టిస్ పీసీ రావు అంత్యక్రియలు జరుగనున్నాయి. -
టీజేఎస్లో చేరిన న్యాయవాది రచనారెడ్డి
-
న్యాయవాద వృత్తిలో విలువలే ప్రధానం
పుట్టపర్తి అర్బన్: న్యాయవాద వృత్తిలో విలువలే ప్రధానమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులు, న్యాయమూర్తులందరిపై ఉందని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ అన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న 2రోజుల జాతీయ న్యాయ సదస్సు ఆదివారం ముగిసింది. ఆదివారం ఉదయం 7.50కు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద ప్రత్యేక పూజలు, వేద పఠనం అనంతరం సుప్రీం కోర్టు మాజీ జడ్జీ జస్టిస్ ఏపీ మిశ్రా, రైల్వే క్లెయిమ్ ట్రిబ్యునల్ చైర్మన్ కె.కన్నన్, సత్యసాయి సేవా సంస్థల ఆలిండియా అధ్యక్షుడు నిమీష్పాండే, ఉపాధ్యక్షుడు జితేందర్ చీమా, ట్రస్ట్ మెంబర్లు ఆర్జే రత్నాకర్, ప్రసాదరావు సన్మానించారు. ఉదయం 11 గంటలకు పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన న్యాయ సదస్సులో.. ఉమ్మడి హైకోర్టు జడ్జీ జస్టిస్ రామసుబ్రమణ్యం, ఢిల్లీ హైకోర్టు జడ్జీ జస్టిస్ సంగీత ధింగ్రా సెహగల్, మణిపూర్ హైకోర్టు జడ్జ్జీలు జస్టిస్ కోటేశ్వర్సింగ్, జస్టిస్ హరిశంకర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వం, లౌకిక సిద్ధాంతాలు చాలా గొప్పవని, పౌర హక్కులు, విధులు ముఖ్యమైనవని చెప్పారు. న్యాయమూర్తులు కొందరు గాంధీ తత్వాన్ని, మరికొందరు గాడ్సే తత్వాన్ని అవలంబించకుండా అందరూ సత్యాన్ని అవలంబిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. న్యాయవాదులు వారి కక్షిదారులను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. కక్షిదారులకు హక్కులు తెలుస్తున్నాయి.. కానీ కేసు పూర్వాపరాలు తెలియడం లేదన్నారు. కేసు ఓడినా న్యాయాన్ని గెలిపించాలన్నారు. చేసే పనిలో ఏది తప్పు... ఏది ఒప్పు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీని వల్ల శాంతిని, ధర్మాన్ని రక్షిస్తూ విలువలు పెంపొందించే అవకాశం లభిస్తుంద న్నారు. అనంతరం వేదికపై ఉన్న జడ్జీలను నిర్వాహకులు సత్కరించారు. -
హైకోర్టులో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి హైకోర్టులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దామోదర్రెడ్డి, కోర్టు అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు హాజరయ్యారు. -
కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలొద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల ప్రాంగణాల్లో న్యాయవాదులు, న్యాయవాద సంఘాలు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించకుండా చూడాలని ఇరు రాష్ట్రాల జిల్లా జడ్జీలను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. కొందరు న్యాయవాదులు అనుమతులు తీసుకోకుండానే కోర్టు ప్రాంగణాల్లో మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఈ సర్క్యులర్ జారీ చేశామని హైకోర్టు పేర్కొంది. సర్క్యులర్ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. -
ఆ లేఖను బాబు రాసినట్టా, రాయనట్టా?
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్కు 2017లో రాసిన లేఖలను జస్టిస్ ఈశ్వరయ్య ఈమధ్యే బహిర్గతం చేశారు. ఇద్దరు బీసీ న్యాయవాదులు అమరనాథ్ గౌడ్, అభినవ కుమార్లను హైకోర్టు జడ్జీలుగా నియమించాలని హైకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా, ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బాబు ఆ లేఖలు రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా విచారణ జరిపించింది. బీసీ న్యాయవాదులపై బాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలడంతో ఆ ఇద్దరినీ హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్రం నియమించింది. ఈ అంశాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ఆ లేఖల ప్రతులతో సహా విశాఖపట్నంలో మీడియా ప్రతినిధుల ఎదుట బహిర్గతం చేశారు. తర్వాత సీఎం బాబు, యనమల రామకృష్ణుడుతోపాటు బీసీ మంత్రులు ఈశ్వరయ్యను విమర్శిస్తూ ప్రకటనలు చేశారు. కానీ వీరెవ్వరూ ఆ లేఖలు బాబు రాయలేదని గానీ, రాసిన లేఖల్లో బీసీ న్యాయవాదులపై ఆరోపణలు చేయలేదని గానీ, వాటిని తిరస్కరించిన విషయాన్నిగానీ ఖండించలేదు. తమ హయాంలో బీసీ న్యాయవాదులు 9 మంది హైకోర్టు న్యాయమూర్తులుగా అయ్యారంటూ చెబుతున్నారు తప్ప ఆ ఇద్దరు బీసీ న్యాయవాదులకు వ్యతిరేకంగా బాబు కేంద్రానికి లేఖలు రాశారా లేదా అనేదే కీలక ప్రశ్న. ఈ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక్క బీసీ కూడా నియమితులు కాలేదు కానీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదులు ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఎలా నియమితులయ్యారు. ఇందులో బాబు దొడ్డిదారి ప్రయత్నం లేదా? ఏపీ హైకోర్టులో గత 7 దశాబ్దాల కాలంలో ఆయా ప్రభుత్వాల హయాంలో ఎంతమంది బీసీ న్యాయవాదులు జడ్జీలుగా నియమితులయ్యారు. అప్పుడు మొత్తం హైకోర్టు జడ్జీల సంఖ్య ఎంత? వారిలో బీసీ జడ్జీలు ఎందరు? అలాగే హైకోర్టులో, జిల్లా కోర్టుల్లో కూడా ఎంతమందిని లా ఆఫీసర్లుగా ప్రభుత్వాలు నియమించాయి? వారిలో బీసీలు ఎంత మంది? వంటి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్రప్రభుత్వం, మంత్రి యనమల తక్షణమే ప్రకటించాలి. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయాన్ని ఏపార్టీ, ఏమేరకు చేసిందో తేలిపోతుంది. – వై. కోటేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్, బీసీ మహాజన సమితి, 98498 56568 -
ఎంపీ కనకమేడలకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఏపీ టీడీపీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ను బుధవారం హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఇరు సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ తదితరులు పాల్గొన్నారు. -
సల్మాన్ న్యాయవాదికి బెదిరింపులు
సాక్షి, జోధ్పూర్ : కృష్ణజింకను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల శిక్ష విధించిన క్రమంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభమయ్యేందుకు కొద్ది నిమిషాల ముందు సల్మాన్ న్యాయవాది మహేష్ బోరా తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. ‘ సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హాజరుకారాదని హెచ్చరిస్తూ నిన్న (గురువారం) తనకు పలు ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయ’ని ఆయన తెలిపారు. ఈ కేసు నుంచి విరమించుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. కాగా, సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును సెషన్స్ కోర్టు రిజర్వ్లో ఉంచడంతో ఆయన శుక్రవారం వరుసగా రెండో రోజు రాత్రి సెంట్రల్ జైల్లో గడపనున్నారు. బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో సల్మాన్ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్ షేరా సెషన్స్ కోర్టుకు వచ్చారు. మరోవైపు సల్మాన్ సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ త్వరలోనే జోధ్పూర్కు రానున్నారు. -
సీనియర్ న్యాయవాది మూర్తికి హైకోర్టు నివాళి
సాక్షి, హైదరాబాద్: గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన సీనియర్ న్యాయవాది వీఎల్ఎన్జీకే మూర్తికి హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. మూర్తికి నివాళులు అర్పించేందుకు బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూర్తితో తనకున్న అనుబంధాన్ని ఏసీజే గుర్తుచేసుకున్నారు. అంతకుముందు తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు మూర్తి అందించిన సేవలను కొనియాడారు. మూర్తి మృతికి సంతాపంగా అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మూర్తి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
నేడు తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి నేడు ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష స్థానానికి ఆర్.వినోద్రెడ్డి, సి.దామోదర్రెడ్డి, పొన్నం అశోక్గౌడ్, మద్దిరెడ్డి శంకర్ పోటీపడుతున్నారు. ఉపాధ్యక్ష స్థానానికి ఆరుగురు పోటీ చేస్తున్నారు. కార్యదర్శుల పోస్టుల బరిలో ఐదుగురు ఉన్నారు. వీరిలో నుంచి ఇద్దరు కార్యదర్శులుగా ఎన్నికవుతారు. సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పోస్టులకు సైతం పలువురు పోటీ చేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఎన్నిక జరుగుతుంది. -
మహిళా రక్షణ చట్టాల కోసం..
ప్రస్తుత సమాజం కన్నా ఆదిమ సమాజం ఎంతో మెరుగ్గా ఉంది. ఎందుకంటే అప్పటికి మనుస్మృతి ఇంకా వెలువడలేదు. అందుకే ఆ సమాజంలో అసమానతలు లేవు. జాతి,మత, కుల వైషమ్యాలు లేవు. ఆడ, మగ అనే తేడాలు అసలే లేవు. కాలం గడుస్తున్న కొద్ది సమాజం విస్తరిస్తూ పోయింది. రాజ్యాలు, రాజులు కాలం ప్రారంభమయ్యింది. విజ్ఞానం పెరిగిన కొద్ది విచక్షణ నశిస్తుందేమో అనేట్టుగా సమాజం మారింది. ఆడవారిని వంటింటికే పరిమితం చేయడం ప్రారంభమయ్యింది. చివరికి మగ వారి అండ లేకుండా వారి మనుగడ కష్టం అనే స్థాయికి పరిస్థితులు మారాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో ఎన్నో దురాచారాలు రాజ్యమేలాయి. వీటి నిర్మూలనకు కృషి చేసిన మహనీయులేందరో. ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. నేటి సమాజంలో ఉన్న ఆధునిక రుగ్మతలను రూపుమాపడానికి, సమానత్వం కోసం న్యాయవాద వృత్తిని ఎంచుకుని పోరాటం సాగిస్తున్నమహిళలెందరో.... కర్నేలియా సోరాబ్జి 1866లో జన్మించిన కర్నేలియా సోరాబ్జి దేశంలోనే తొలి మహిళ న్యాయవాది. బ్రిటన్లో, భారతదేశంలో అలహబాద్ హై కోర్టులో ప్రాక్టీస్ చేసిన తొలి మహిళ. బాంబే యూనివర్సీటి నుంచి తొలి మహిళ పట్టభద్రురాలు. అంతేకాదు ఆక్స్ఫర్డ్ యూనివర్సీటిలో న్యాయశాస్రం చదివిన తొలి మహిళ భారతీయ మహిళ కూడా కర్నేలియా సోరాబ్జినే. ఇందిరా జైసింగ్ కట్నం కోసం వేధింపులు, అత్తాఆడుచుల ఆరళ్లు, ఆడపిల్లను కంటే కాటికే, కట్టుకున్నవాడే కసాయిగా మారి బంధాన్ని, బతుకును నరకప్రాయం చేస్తుంటే ఆదుకునే వారు లేక మూగగా రోదించారు. సహనం నశించి ప్రాణాలు తీసుకున్న వారెందరో. ఈ హింసనుంచి ఆడవారిని బయటపడెయ్యటానికి ప్రభుత్వం 2005లో గృహ హింస చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రూపుదిద్దికోవడానికి వెనక ఓ మహిళ న్యాయవాది అసమాన కృషి ఉంది. ఆమె ఇందిరా జైసింగ్. ప్రముఖ న్యాయవాది. అంతేకాదు స్త్రీల హక్కుల కోసం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. మన దేశంలో అడిషనల్ సోలిసిటర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ ఇందిరా జైసింగ్. మీనాక్షి అరోర నేటికి ఆడవారు స్వేచ్ఛగా ఉద్యోగం చేసే పరిస్థితులు లేవు. ప్రధాన కారణం లైంగిక వేధింపులు. దీనికి ఏ రంగం మినహాయింపు కాదు. ఈ వేధింపులను నిరోధించాడనికి 2013లో ప్రభుత్వం పనిప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రూపోందించడంలో మీనాక్షి అరోర పాత్ర కీలకమైనది. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది. స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నారు. వ్రింద గ్రోవర్ దేశంలో సోని సోరి అత్యాచార కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ కేసులో బాధితుల తరుపున నిలబడ్డారు వ్రిదా గ్రోవర్. ఆమె గృహ హింస బాధితుల కోసం, లైంగిక వేధింపులకు గురయిన పిల్లల గురించి పోరాడుతున్నారు. ఆమె కృషి ఫలితంగా 2010లో హింసా నిరోధక చట్టం, 2012లో పోస్కో చట్టం, 2013లో క్రిమినల్ లా సవరణ ముసాయిదాలు రూపోందించారు. మానవ హక్కులు, స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న వ్రిందా గ్రోవర్ను 2013లో టైమ్స్ మాగ్జైన్ 100మంది ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తించారు. లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి, ఒక రాష్ట్ర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ లీలా సేథ్. కుమార్తెలకు కూడా ఉమ్మడి కుటుంబం ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయని 2005లో హిందూ వారసత్వ సవరణ చట్టం రావడానికి ఆమె చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్ హక్కుల గురించి సానుకూల ప్రకటనలు చేశారు. మేనక గురుస్వామి రాజ్యంగం అంటే ప్రాణం, రాజ్యంగం కల్పించిన హక్కులు అందరికి సమానం అని నమ్మే వ్యక్తి మేనక గురుస్వామి. తనను తాను‘‘తమ బాధలు చెప్పుకోలేని, తమ స్వేచ్ఛకు భంగం కలుగుతున్నా మౌనంగా భరించే పేదల పక్షపాతిగా’’ చెప్పుకోవడానికి ఇష్టపడతారు మేనక. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మేనకా గురుస్వామి విద్యాహక్కు చట్టంగా రూపొందడంలో విశేష కృషి చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377 ను సవాలు చేసినప్పుడు నాజ్ ఫౌండేషన్ తరుపున వాదించిన న్యాయవాదుల్లో ఆమె ఒకరు. కరుణ నంది సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న కరుణ నంది లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనలోని బాధితుల తరుపున న్యాయం కోసం పోరాడుతున్నారు కరుణ నంది. వాక్ స్వాతంత్రాన్ని నిరోధించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని 66ఏ సెక్షన్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంలో కరుణ నంది పాత్ర కీలకం. ఫ్లావియా ఆగ్నెస్ మహిళలకు చట్టపరమైన ప్రాతినిధ్యాన్ని అందించే 'మజ్లిస్' సహ వ్యవస్థాపకురాలైన ఫ్లావియా ఒక ప్రముఖ రచయిత, న్యాయవాది, మహిళా హక్కుల కార్యకర్త. ఆమె చేసిన స్త్రీవాద రచనలు చాలా ప్రాముఖ్యత కలిగివున్నాయి. ఆమె సేవలను అప్రతిష్ట చేయడానికి ఆమె ప్రసిద్ధి చెందింది. చట్టపరమైన విషయాలలో మహిళలకు ఆమె చేసిన సేవలు అసమానం. 1979లో ఆమె ఫోరం ఎగైనెస్ట్ ఒప్ప్రెషన్ ఆఫ్ విమెన్ (ఎఫ్ఏఓడబ్ల్యూ)ను ఏర్పాటు చేసి భార్యను కొట్టడం, వరకట్నం, లైంగిక వేధింపులు వంటి సమస్యల గురించి ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పింకీ ఆనంద్ పింకీ ఆనంద్ సుప్రీం కోర్టులో ఒక సీనియర్ న్యాయవాది. ఆమె రాజ్యాంగ లా, కుటుంబ లా, పర్యావరణం లా వంటి రంగాలలో నిపుణురాలు. ఆమె భారతదేశపు అడిషనల్ సొలిసిటర్ జనరల్గా నియమితులైన రెండో మహిళ. తృప్తి దేశాయ్ లింగ సమానత్వం కోసం పోరాడుతున్న కార్యకర్త. ముఖ్యంగా మహిళలను నిషేధించిన ఆలయాల్లో వారి ప్రవేశం కోసం ముంబైలో భుమాత బ్రిగేడ్ సంస్థను స్థాపించరు. ఆ సంస్థ కార్యకర్తలతో కలిసి మహారాష్ట్రలోని శని శింగాపూర్ ఆలయం, మహాలక్ష్మీ దేవాలయం, త్రైయంబకేశ్వరాలయం వంటి ఆడవారి ప్రవేశాన్నినిషేధించిన ఆలయాల్లో వారిక ప్రవేశం కల్పించాలని ప్రచారం చేశారు. కేవలం హిందూ దేవలయాలనే కాకుండా హాజీ ఆలీ దర్గాలో స్త్రీలు ప్రవేశించే హక్కును పోరాడి సాధించారు. ఇటీవల కాలంలో ఆమె శబరిమలలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటున్న నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూన్నారు. - పిల్లి ధరణి -
పాక్ ఉద్యమకారిణి కన్నుమూత
లాహోర్: పాకిస్తాన్కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పాకిస్తాన్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అస్మా.. శక్తిమంతమైన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్ఐల వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించేవారు. 1952లో లాహో ర్ జన్మించిన అస్మా, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్ఎల్బీ పట్టా పొందారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని 1983లో అప్పటి పాక్ నియంత జియా ఉల్ హక్కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో సైనిక ప్రభుత్వం ఆమెను జైల్లో నిర్బంధించింది. జైలు నుంచి విడుదలైన అనంతరం 1986లో స్విట్జర్లాండ్లోని జెనీవాకు వెళ్లిన ఆమె..డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థకు రెండేళ్లు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1987లో పాకిస్తాన్లో స్థాపించిన జాతీయ మానవహక్కుల సంఘానికి 1993 వరకూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత చైర్మన్గానూ వ్యవహరించారు. 2007లో అప్పటి పాక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ చౌధురిని సైనిక నియంత పర్వేజ్ ముషార్రఫ్ పదవి నుంచి తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పెద్దఎత్తున చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మానవహక్కుల రంగంలో చేసిన కృషికి గానూ 2014లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు, 2010లో ఫ్రీడమ్ అవార్డు, హిలాల్ ఏ ఇంతియాజ్ అవార్డులను ఆమె అందుకున్నారు. అస్మా మృతి పట్ల బాలీవుడ్ దర్శకులు మహేశ్ భట్, నందితా దాస్, రచయిత జావేద్ అక్తర్, నటి షబానా అజ్మీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
వాట్సాప్లో ఆ ఎమోజీ...నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్మరోసారి చిక్కుల్లో పడింది. ముఖ్యంగా ఎమోజీల్లో అసభ్యకరమైన చిహ్నం ఉందంటూ ఢిల్లీ న్యాయవాది ఒకరు వాట్సాప్కు నోటీసులు పంపారు. ఢిల్లీ న్యాయవాది గుర్మీత్ సింగ్ వాట్సాప్కు తాజా నోటీసులు పంపారు. దీనిపై 1 5రోజులలోపు అభ్యంతరకరంగా ఉన్న మిడిల్ ఫింగర్ చిహ్నాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది అశ్లీలమైనదిగాను, హానికరంగాను ఉందని గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమైనదని కూడా ఆయన వాదిస్తున్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని 354 ,509 సెక్షన్ల ప్రకారం, ఎవరైనా అశ్లీలమైన, అప్రియమైన, అశ్లీల సంజ్ఞల వాడకం చట్టవిరుద్ధమన్నారు. -
లాయర్లకే ఆర్డర్
బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు.. పాతికేళ్లుగా నలిగిపోయిన డైలాగ్ ఇది..కానీ విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే డైలాగ్కు కొత్త వెర్షన్ వినిపిస్తోంది. ‘నేను ఒక్కసారి చెబితే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వందసార్లు చెప్పినట్లే’.. అంటూ టీడీపీ పార్టీ నేత కాళ్ల శంకర్ హల్చల్ చేసేస్తుంటాడు. లిక్కర్ సిండికేట్ వ్యవహారాలు, సెటిల్మెంట్లు, ఇతరత్రా అన్ని వ్యవహారాలను ఎమ్మెల్యే తరఫున చక్కబెట్టేస్తుంటాడు.. చక్రం తిప్పేస్తుంటాడు.. సరే.. వారిద్దరి మధ్య లావాదేవీలు. అనుబంధాల గురించి వారు ఏం చెప్పుకున్నా ఎవరికీ ఇబ్బంది లేదు కానీ.. చివరికి న్యాయవాదులను సైతం ఎమ్మెల్యే పేరు చెప్పి సదరు శంకర్ బెదిరింపులకు దిగడమే ఇప్పుడు చర్చనీయాంశం.. కోర్టుల్లో తేలాల్సిన కేసులను తానే బయట సెటిల్ చేస్తానని వకాలత్ నుంచి తప్పుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు.. ఓ జంట విడాకుల కేసు.. ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసుల వాదనల నుంచి తప్పుకోవాలంటూ న్యాయవాదులను ఒత్తిళ్లకు, పోలీసులను ప్రలోభాలకు గురిచేయడం వివాదాస్పదమవుతోంది. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎమ్మెల్యేల పేర్లు చెప్పి చోటామోటా నేతలు సెటిల్మెంట్లు, పంచాయితీలు చేసేయడం సహజమే. కానీ కోర్టులో ఉన్న కేసులను సైతం నేను బయట సెటిల్ చేస్తానంటూ బరితెగించి న్యాయవాదులనే బెదిరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు కాళ్ల శంకర్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నగరంలోని దొండపర్తికి చెందిన ఓ మహిళ తన భర్త మస్తాన్వలిపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసింది. కోర్టులో ఆ మహిళ తరఫున న్యాయవాది ఎం.శ్రీలక్ష్మి వాదిస్తున్నారు. అయితే ఈ కేసు తేలకముందే ఆ మహిళ చింతపల్లి అటవీశాఖ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న ఖాదర్బాషాను వివాహం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో న్యాయవాది శ్రీలక్ష్మి ఇలాంటి కేసు తాను వాదించలేనని స్పష్టం చేసింది. వాస్తవాలను దాచిపెట్టి తనకు సమగ్ర సమాచారం ఇవ్వకుండా కేసు తప్పుదోవపట్టించడం సరికాదని చెప్పింది. అయితే ఆ కేసును విడాకుల కేసుగా మార్చి రాజీ చేయాల్సిందిగా ఆ మహిళ, కుటుంబ సభ్యులు అభ్యర్ధించడంతో ఆ మేరకు అంగీకరించి న్యాయవాది కేసు వాది స్తూ వస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వివాహం చేసుకుం దంటూ సదరు మహిళపై మొదటి భర్త మస్తాన్వలి ఎదురుకేసు వేయడం, రెండో వివాహానికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్న నేపథ్యంలో ఆ కేసు తేలేవరకూ తనకు, కుటుంబ సభ్యుల కు ఆశ్రయం ఇవ్వాలని ఆ మహిళ కోరడంతో నగరానికి చెందిన న్యాయవాది ఆనంద్ తనఇంట్లో ఆశ్రయం కల్పించారు. కాళ్ల దూకుడుతో అడ్డం తిరిగిన కేసు కేసు కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో గత ఆగస్టు 12న ఆనంద్ ఇంట్లో చోరీ జరిగింది. వెండి వస్తువులతో పాటు 38వేల రూపాయల నగదు చోరీకి గురయ్యాయి. తన ఇంట్లో ఉంటున్న సదరు మహిళ, ఆమె కుటుంబ సభ్యులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆనంద్ నాలుగో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి నుంచి వాస్తవాలు తొక్కిపెట్టడం, ఆ మహిళకు తప్పుడు చిరునామాలతో రెండు ఆధార్కార్డులు ఉన్నాయని తేలడం, ఆశ్రయమిచ్చిన తన తోటి న్యాయవాది ఇంట్లోనే చోరీ జరగడంతో ఇక విడాకుల కేసు తాను వాదించలేనని శ్రీలక్ష్మి ఆ మహిళకు స్పష్టం చేసేశారు. 2014 నుంచి కేసు వాదిస్తున్నందున తన ఫీజును సెటిల్ చేయాల్సిందిగా ఆ మహిళ, కుటుంసభ్యులను కోరారు. సరిగ్గా ఇక్కడే టీడీపీ నేత కాళ్ల శంకర్ రంగంలోకి దిగారు. నేరుగా న్యాయవాది శ్రీలక్ష్మికి ఫోన్ చేసి.. ‘నేను కాళ్ల శంకర్.. ఆ కేసు వదిలేయండి’.. అని మాట్లాడారు. ఆ కేసును నేనే వద్దనుకున్నా.. కానీ ఫీజు కూడా ఎగ్గొట్టి బెదిరింపులకు దిగడం ఏమిటో అర్ధం కావడం లేదని అని న్యాయవాది శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫోర్త్టౌన్లో చోరీ విషయమై ఫిర్యాదు చేసిన న్యాయవాది ఆనంద్ను కూడా శంకర్ వదలిపెట్టలేదు. కేసు విచారణ ఏమైందని కనుక్కోవడానికి వెళ్లిన ఆనంద్ను ఏకంగా పోలీస్ స్టేషన్లోనే.. ఈ కేసు వదిలేయ్.. కోర్టులు,. స్టేషన్లు ఎందుకు.. ఏమైనా ఉంటే నేను సెటిల్ చేస్తాలే .. అని బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు ఆనంద్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వెలగపూడికి నేను ఎంత చెబితే అంతే.. మీరు వాళ్ళ జోలికి వెళ్లకండి.. వాళ్లు నాకు కావాల్సిన వాళ్లు అని చెప్పగా.. పోలీస్ స్టేషన్లోనే ఇవన్నీ ఎందుకు నేను బయటికొచ్చి మాట్లాడతానండీ .. అని సమాధానమిచ్చినట్టు ఆనంద్ చెబుతున్నారు. విడాకుల కేసు వాదించిన, కేసు విచారణలో భాగంగా ఆశ్రయమిచ్చిన న్యాయవాదులపైనే ఎమ్మెల్యే అనుచరుడు బెదిరింపులకు దిగిన వైనం ఇప్పుడు న్యాయవాదవర్గాల్లోనే చర్చనీయాంశమవుతోంది. కాగా. చోరీ కేసు విచారణ చేపట్టాల్సిన పోలీసులు దాన్ని అటెక్కించేయడం వివాదాస్పదమవుతోంది. తాను అనుమానితుల పేర్లు చెప్పినా ఇంతవరకు కనీసం వారిని పిలిచి విచారించలేదని న్యాయవాది ఆనంద్ ఆరోపిస్తున్నారు. కాళ్ల శంకర్ రంగప్రవేశంతోనే కేసును పక్కనపడేశారని ఆనంద్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై సీఐ రాంబాబును సాక్షి ప్రశ్నించగా.. కేసు విచారణ మొత్తం ఎస్ఐ రమేష్ చూస్తున్నారని చెప్పారు. ఎస్ఐ రమేష్ వద్ద ప్రస్తావించగా.. కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని ముక్తసరిగా చెప్పారు.