advocate
-
రషీద్ సోదరుడిపై కేసు నమోదు చేయటం దారుణం: అడ్వొకేట్ రోళ్ల మాధవి
-
ఈడీది బాధ్యతారాహిత్యం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థల పనితీరును కొన్నిసార్లు కోర్టులు తప్పుబట్టడం పరిపాటే. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ తీరును కేంద్ర ప్రభుత్వమే తప్పుబట్టిన అసాధారణ ఘటనకు సాక్షాత్తూ సుప్రీంకోర్టే వేదికైంది! ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని అరుణ్పతి తివారీ అనే ఇండియన్ టెలికాం సరీ్వసెస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణకు వచి్చంది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో తామెవరితోనూ సరైన సంప్రదింపులు చేయకుండా ఈడీ పూర్తి అసమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో ఇది చాలా సీరియస్ అంశమంటూ ధర్మాసనం కూడా అసహనం వెలిబుచ్చింది. ‘‘ఈడీ జవాబుదారీతనంపైనే ఈ ఉదంతం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అన్నివిధాలా సరిచూసుకున్న మీదట కౌంటర్ సమగ్రంగా దాఖలు చేయాల్సిన బాధ్యత ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)దే కదా’’ అని వ్యాఖ్యానించింది. ఈ తప్పిదానికి ఏఓఆర్ను బాధ్యున్ని చేయలేమని ఏఎస్జీ బదులివ్వడంతో అయిష్టంగానే విచారణను చేపట్టింది. కానీ ‘‘దీన్ని మేమింతటితో వదిలేయదలచుకోలేదు. మీ వ్యాఖ్యల నేపథ్యంలో, ఈడీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్తో మీకేమీ సంబంధం లేదని చెప్పదలచుకున్నారా?’’ అని ఏఎస్జీని ప్రశ్నించింది. దాంతో అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. అఫిడవిట్ను ఓసారి సరిచూసుకోవాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు. ‘‘ఇది కేవలం సమాచార లోపమే. అయితే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలో ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండాల్సింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యుడైన అధికారిని ధర్మాసనం ముందు నిలబెట్టాల్సిందిగా ఈడీ డైరెక్టర్ను ఇప్పటికే వ్యక్తిగతంగా కోరాను. దయచేసి విచారణ కొనసాగించండి’’ అని అభ్యరి్థంచారు. ధర్మాసనం మాత్రం విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ‘ఆప్’ సర్కార్కు ‘సుప్రీం’లో ఊరట -
ఫార్ములా ఈ రేస్ కేసులో.. అసలు నిందితులు ఎవరు ?
-
ఎప్పుడు తొక్కిసలాటలు జరగలేదా!
-
Formula E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట
-
Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం
ఢాకా: బంగ్లాదేశ్లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్(ఇస్కాన్) తెలిపింది.ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్ దాస్ ట్విట్టర్లో ఒక పోస్ట్లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.Please pray for Advocate Ramen Roy. His only 'fault' was defending Chinmoy Krishna Prabhu in court.Islamists ransacked his home and brutally attacked him, leaving him in the ICU, fighting for his life.#SaveBangladeshiHindus #FreeChinmoyKrishnaPrabhu pic.twitter.com/uudpC10bpN— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 2, 2024బంగ్లాదేశ్కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.బంగ్లాదేశ్లోని ఇస్కాన్ టెంపుల్కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్పూర్లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఛటోగ్రామ్లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్లో హిందువుల అరెస్టులను భారత్ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు -
HYD: ఐమాక్స్ వద్ద న్యాయవాదిపై దాడి.. ఇద్దరు మైనర్ల అరెస్టు
సాక్షి,హైదరాబాద్: ఐమాక్స్ వద్ద అడ్వకేట్ కల్యాణ్పై ఇద్దరు దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం(నవంబర్ 13) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్,సైఫాబాద్ ఏసీపీలు చంద్రశేఖర్, సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు.మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గన్ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్మెంట్ వాచ్మెన్ను కత్తితో బెదిరించిన ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కల్యాణ్ వారిని అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు.ఈ క్రమంలో మైనర్ల చేతిలో కల్యాణ్ గాయపడ్డారు.సెంట్రల్ జోన్ పరిధిలో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్ను అదుపులోకి తీసుకొని విచారించారు.అతని వద్ద ఉన్న వాచ్మెన్ మొబైల్ ఫోన్ను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద న్యాయవాది కల్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు వాడిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారి ఆధార్ కార్డుల ప్రకారం మైనర్లుగా తేలిందని..అయితే, వారి వయసును నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించాం. గతంలో వారిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది’ అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్ -
పోలిసులపై పవన్ ఒత్తిడి.. అందుకే అక్రమ అరెస్టులు
-
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జితో, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జడ్జీ ఛాంబర్ వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కూర్చీలు పట్టుకొని మరీ లాయర్లను బయటకు తరిమేశారు. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.In #UttarPradesh's #Ghaziabad, a major disturbance erupted in the District Court following an argument between a district judge and a lawyer during a bail hearing. The altercation soon escalated, leading to a chaotic scene as large numbers of lawyers gathered and tensions… pic.twitter.com/0RsozCFHag— Hate Detector 🔍 (@HateDetectors) October 29, 2024 -
హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు న్యాయవాదులు
సాక్షి, అమరావతి /సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల కొలీజియం మంగళవారం తీర్మానం చేసింది. హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న మహేశ్వరరావు కుంచం, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఉన్నారు. ఈ ముగ్గురి పేర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం వారి పేర్లను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మహేశ్వరరావు కుంచంకుంచం కోటేశ్వరరావు, సుశీలమ్మ దంపతులకు 1973 ఆగస్టు 12న తిరుపతిలో జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా మహేశ్వరరావు అనంతపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 1998లో తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1998 నుంచి 2001 వరకు అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద ఆరు నెలల పాటు జూనియర్గా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత నుంచి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో పట్టు సాధించారు. ముఖ్యంగా సివిల్ కేసుల్లో మంచి ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరాం గ్రూప్ ఆఫ్ కంపెనీలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.తూట చంద్ర ధనశేఖర్తూట శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు 1975 జూన్ 10న జన్మించారు. తిరుపతి జిల్లా సత్యవేడు స్వస్థలం, తండ్రి చంద్రశేఖరన్ గతంలో చిత్తూరు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. సత్యవేడు జూనియర్ కాలేజీలో విద్యను అభ్యసించారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో చదివారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయవాద విద్య పూర్తి చేశారు. ధనశేఖర్ 1999లో హైకోర్టులో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్గా పనిచేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జీపీగా కొనసాగుతున్నారు. పలు సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు.చల్లా గుణ రంజన్చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు 1976 జూలై 12న జన్మించారు. తాడిపత్రి స్వస్థలం. తండ్రి నారాయణ కూడా న్యాయవాదే. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సోదరుడి వరుస అవుతారు. గుణ రంజన్ 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కోదండరామ్ వద్దే జూనియర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. సుప్రీంకోర్టుతోపాటు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో, పలు ట్రిబ్యునళ్ల ముందు అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. పర్యావరణ, విద్యుత్, ఆర్బిట్రేషన్, కంపెనీ లా, దివాళా, పన్నుల చట్టాలతో పాటు సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి పట్టు సాధించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. సీజే నేతృత్వంలో కొలీజియం సమావేశం..ఈ ఏడాది మే 15వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. మహేశ్వరరావు, ధనశేఖర్, చల్లా గుణరంజన్, ఇడంకంటి కోటిరెడ్డి, గోడ రాజాబాబు, గేదెల తుహిన్ కుమార్ పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా వారి వివరాలు సేకరించింది. కేంద్ర న్యాయశాఖ ఇటీవల వారి పేర్లను సుప్రీంకోర్టుకు పంపింది. దీనిపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన కొలీజియం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. గతంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొనసాగుతున్న నలుగురి అభిప్రాయాలు కూడా అంతకు ముందే తీసుకుంది. వారందరూ కూడా న్యాయమూర్తుల పోస్టులకు ముగ్గురు తగిన వారని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కొలీజియం సమావేశంలో మహేశ్వరరావు, ధనశేఖర్, గుణ రంజన్ పేర్లకు ఆమోదం తెలిపింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఆ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులుగా అన్ని రకాలుగా అర్హులని స్పష్టం చేసింది.ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సీజేతో సహా 26 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు సిఫారసు చేసిన ముగ్గురి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుకుంటుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం ఆరుగురు న్యాయవాదుల పేర్లతోపాటు ముగ్గురు న్యాయాధికారుల పేర్లను కూడా హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ అవధానం హరిహరనాథ శర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు, శ్రీకాకుళం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా పేర్లను సిఫారసు చేసింది. అయితే ఈ ముగ్గురి విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏం నిర్ణయం తీసుకున్నదీ తెలియరాలేదు. -
Supreme Court: మా విశ్వాసం చెదిరిపోతోంది
న్యూఢిల్లీ: వివిధ కేసుల్లో జైలు శిక్ష పడిన దోషులను శిక్షాకాలం ముగియకముందే కారాగారం నుంచి బయటకు రప్పించడానికి న్యాయవాదులు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టు ముందు పదేపదే తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారని ఆక్షేపించింది. దోషులకు శిక్షాకాలం తగ్గించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లలోనూ అసత్య సమాచారం చేరుస్తున్నారని విమర్శించింది. ఇలాంటి కేసులు ఎదురైనప్పుడు తమ విశ్వాసం చెదిరిపోతోందని స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసీతో కూడిన ధర్మాసనం ఈ నెల 10వ తేదీన ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును తాజాగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. ఖైదీల రెమిషన్ విషయంలో లాయర్ల తప్పుడు స్టేట్మెంట్లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మూడు వారాలుగా ఇలాంటి కేసులను పెండింగ్లో పెట్టాం. పరి్మనెంట్ రెమిషన్ మంజూరు చేయడం లేదు. అయినా ఇందుకోసం భారీగా తప్పుడు పిటిషన్లు దాఖలవుతున్నాయి’’ అని ధర్మాసనం ఆగ్రహించింది. -
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్పూర్లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
పిల్లల నుంచి పోషణ కోసం.. తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించవచ్చా?
ప్రదీప్, శాంత భార్యాభర్తలు. ఇద్దరూ 60 ఏళ్లకు పైబడిన వారే! ఇద్దరికీ బీపీ, సుగర్లున్నాయి. వాళ్లకిద్దరు పిల్లలు. మంచి జీతాలు గల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కానీ అమ్మానాన్నలను పూర్తిగాగాలికి వదిలేయడంతో దయనీయమైన స్థితిలో రోజులను గడుపుతున్నారు ఆ దంపతులు. పిల్లల నుంచి పోషణ కోసం వీరు కోర్టును ఆశ్రయించవచ్చా?తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 కింద తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు చాలా హక్కులే ఉన్నాయి. ముఖ్యంగా తమను తాము పోషించుకోలేని, తమ సంక్షేమాన్ని, తమ ఆరోగ్యాన్ని తాము పర్యవేక్షించుకోలేని తల్లిదండ్రులు, వయోవృద్ధులకు... తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు లేదా బంధువుల (వయోవృద్ధుల ఆస్తికి వారసులు లేదా ఆర్థికంగా గానీ, మరేరకంగా గానీ లబ్ధి పొందిన వారు)ను మెయింటెనెన్స్ అడిగే హక్కును కలిపిస్తోందీ చట్టం.ఈ చట్టం కింద వయోవృద్ధులు, తల్లిదండ్రులు నేరుగా ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు (స్థానిక ఆర్డీఓ). అలా ఆశ్రయించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ల పక్షాన ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి ఏ సంస్థ అయినా పిటిషన్ దాఖలు చేయవచ్చు. నోటీసులు అందిన 90 రోజులలోగా పిటిషన్పై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఇంటెరిమ్ మెయింటెనెన్స్కు కూడా ఆదేశించవచ్చు. వారసులు, పిల్లలు లేదా బంధువులు ట్రిబ్యునల్ ముందుకు రానట్లయితే... ట్రిబ్యునల్ క్రిమినల్ కోర్ట్లా కూడా వ్యవహరించవచ్చు. స్థిరాస్తులకు సంబంధించి ఏ ఇతర చట్టాల్లో లేని వెసులుబాటు, హక్కు కేవలం ఈ చట్టంలోనే పేరెంట్స్, సీనియర్ సిటిజన్స్ కలిగి ఉన్నారు.ఏ ఇతర ప్రాపర్టీ చట్టాలకిందైనా ఒకసారి అమ్మేసిన లేదా గిఫ్ట్ గా ఇచ్చిన స్థిరాస్తిని తిరిగి తీసుకోవడం కానీ రద్దు చేయడం కానీ కుదరదు. కానీ ఈ 2007 చట్టం కింద మాత్రం ఆస్తిని తమ సంతానానికి లేదా తన బంధువులకు లేదా మరే ఇతర వ్యక్తికైనా రాసిచ్చేటప్పుడు ‘మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యతను నిర్వర్తించాలి.. లాంటి నిబంధనతోనే ఈ ఆస్తిని రాసిస్తున్నాను’ అంటూ ఆస్తిపత్రాలలో పొందుపరచి.. దాన్ని సదరు వారసులు ఉల్లంఘిస్తే.. తమ ఆస్తిని తాము తిరిగి తీసేసుకోవచ్చు.చాలా సందర్భాలలో ఆస్తి రాయించుకున్న తర్వాత తల్లిదండ్రులను లేదా వృద్ధులను ఓల్డేజ్ హోమ్స్లో వదిలేయడం లేక సరిగ్గా పట్టించుకోకపోవడం చూస్తుంటాం. అలాంటి సందర్భాలకు ఈ చట్టం చక్కటి ఆయుధం. పైన తెలిపిన నిబంధన కలిగి ఉన్న ఆస్తి పత్రాలను మరెవరైనా కొనుగోలు చేస్తే, అలా కొనుక్కున్న వారిపైనా మెయింటెనెన్స్ విధించవచ్చు. అంతేకాదు వయోవృద్ధులను లేదా తల్లిదండ్రులను వదిలించుకుందామని వారిని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయడం లాంటివి చేస్తే అది నేరం. వారికి జరిమానాతో ΄ాటు జైలు శిక్ష కూడా ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
న్యాయవాదులకు ఓర్పు, నేర్పు అవసరం
తాడేపల్లిరూరల్: ఆధారాలను సేకరించడంలో న్యాయవాదులు ఓర్పు, నేర్పు కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా సూచించారు. వడ్డేశ్వరంలోని కేఎల్ వర్సిటీలో ఏపీ బార్ కౌన్సిల్ ఆధ్వర్యాన మూడు రోజులుగా నిర్వహిస్తున్న న్యాయవాదుల అవగాహన సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు సదస్సుకు జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత.. ఐపీసీని పోలి ఉందన్నారు. సైబర్ క్రైమ్, లింగ వివక్ష చట్టం, ఉగ్రవాద వ్యతిరేక చట్టాలలోని పలు సెక్షన్ల గురించి న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఆస్తి బదిలీ చట్టం, ఆస్తి హక్కు, నిర్దిష్ట ఉపశమన చట్టం, రిజిస్ట్రేషన్ చట్టం, మే«ధో సంపత్తి హక్కులు, ఎలక్ట్రానిక్ ఆధారాలు, రాజ్యాంగ లక్ష్యాలను సాధించడంలో న్యాయవాది పాత్ర, డాక్యుమెంటేషన్ వంటి పలు అంశాల గురించి న్యాయవాదులకు వివరించారు. ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్రెడ్డి, కేఎల్యూ వీసీ డాక్టర్ జి.పార్థసారథివర్మ, ప్రో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకటరామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు, రిజిస్ట్రార్ కె.సుబ్బారావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ముగిసింది. మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపధ్యంలో రకరకాల వార్తలు, ప్రకటనలు, ముఖ్యాంశాలు కంటబడుతుంటాయి.లోక్సభ ఎన్నికల వేళ బెట్టింగ్ మార్కెట్ నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివిధ రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై కూడా చాలామంది పందాలు కాస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో అలాంటి ఉదంతమే వెలుగుచూసింది. ఇక్కడ ఇద్దరు న్యాయవాదులు పందెంకాశారు. వీరిద్దరూ తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.2 లక్షల చొప్పున పందెం కాశారు. వీరిద్దరూ బదౌన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని సమాచారం.భారతీయ జనతా పార్టీ బదౌన్ లోక్సభ స్థానం నుండి దుర్విజయ్ సింగ్ శాక్యాను బరిలో నిలిపింది. సమాజ్వాదీ పార్టీ ఇక్కడి నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. వీరి జయాపజయాలపై ఈ లాయర్లు బెట్టింగ్ కట్టారు. ఉఝని పట్టణంలోని గౌతంపూర్కు చెందిన దివాకర్ వర్మ న్యాయవాది. అలాగే బీజేపీ మద్దతుదారు. బరమల్దేవ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ కూడా న్యాయవాదే. ఈయన సమాజ్ వాదీ పార్టీకి మద్దతుదారు. ఈ ఇద్దరు న్యాయవాదులు తమ అభ్యర్థుల గెలుపుపై రూ.రెండు లక్షల చొప్పున పందెం కాశారు.ఇందుకోసం వీరిద్దరూ స్టాంప్ పేపర్పై ఒప్పందం చేసుకుని సంతకం కూడా చేశారు. ఓడిన పార్టీ మద్దతుదారు గెలిచిన పార్టీ మద్దతుదారునికి రూ.రెండు లక్షలు ఇవ్వాలని ఆ ఒప్పందంలో రాసుకున్నారు. ఎన్నికలు ముగిసి, జూన్ 4న వెలువడే ఫలితాల కోసం ఈ లాయర్లిద్దరూ ఎదురుచూస్తున్నారు. -
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని విచారించాలని హైకోర్టు న్యాయవాది సురేష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ మేరకు బుధవారం(ఏప్రిల్ 10) ఆయన ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు. ప్రముఖ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా కోట్లు వసూలు చేశారని, ఈ డబ్బును పోలీసు వాహనాల్లో ఎన్నికల కోసం తరలించారని నిందితులే ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు నిందితులను ఇప్పటివరకు విచారించలేదని, ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తే అసలు నిందితులు బయటికి వస్తారని ఫిర్యాదులో తెలిపారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసులో పోలీసులు ఇప్పటికే ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర వహించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులను ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ చీఫ్గా పనిచేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇదీ చదవండి.. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు రిమాండ్ పొడిగింపు -
హెచ్సీఏఏ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి విజయం
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ఎన్నికలను తలపించేలా సాగిన హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్సీఏఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా అయ్యాడపు రవీందర్రెడ్డి విజయం సాధించారు. అధ్యక్షుడి ఎన్నిక కోసం అయ్యాడపు రవీందర్రెడ్డి, మణికొండ విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ.జగన్ నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో జగన్పై రవీందర్రెడ్డి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఏ.దీప్తి, జనరల్ సెక్రటరీలుగా ఉప్పల శాంతిభూషణ్ రావు, జిల్లెల సంజీవ్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి నవీన్కుమార్, ట్రెజరర్గా కట్టా శ్రావ్య, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా ఎస్.అభిలాష్ విజయం సాధించారు. హైకోర్టుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరగడం, ఫలితాలు ప్రకటించడం విశేషం. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రవీందర్రెడ్డి 1987లో నాటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. గతంలో రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2021లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా: రవీందర్రెడ్డి బార్ అండ్ బెంచ్ సంబంధాలు మరింత బలోపేతం చేస్తా. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా. జూనియర్ న్యాయవాదులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.. వాటి పరిష్కారానికి అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. -
Aarzoo Khurana: ఆమె ఉన్న చోట పులి ఉంటుంది
మన దేశంలో దాదాపు 55 టైగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటన్నింటినీ తన కెమెరాలో నిక్షిప్తం చేసింది ఆర్జూ ఖురానా. సరిగా చెప్పాలంటే పులి ఉన్న చోటల్లా ఆమె ఉంటుంది. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినా ఆ పని మానేసి కెమెరాను నేస్తంగా అడవిని నివాసంగా చేసుకుని తిరుగుతూ ఆమె తీస్తున్న ఫొటోలు పెద్ద గుర్తింపునిచ్చాయి. ఆర్జూ పరిచయం. అక్టోబర్ 1, 2023 నుంచి నేటి వరకూ 29 ఏళ్ల ఆర్జూ ఖురానా అడవుల్లోనే ఉంటూ వందల మైళ్లు తిరుగుతూ ఉందంటే నమ్ముతారా? నిజం. ‘ఆల్ టైగర్ రిజర్వ్స్ ప్రాజెక్ట్’ (ఏటిఆర్) కోసం ప్రభుత్వం అప్పజెప్పిన పనిలో ఆమె తలమునకలుగా నిమగ్నమైంది. మన దేశంలో 55 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. అయితే వాటిలో కొన్నింటికే టూరిస్ట్ అట్రాక్షన్ ఉంది. మిగిలిన వాటిని కూడా అందంగా ఫొటోలలో బంధించి, ప్రచారానికి ఉపయోగించి, టూరిస్ట్లను ఆకర్షించేందుకు నిర్దేశించిన ప్రాజెక్టే ఏ.టి.ఆర్. దానిలో భాగంగా అక్టోబర్ 1న రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్తో మొదలెట్టి మధ్యప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో 43 టైగర్ రిజర్వ్లను కవర్ చేసి మరో రెండు నెలల్లో మిగిలినవి చేసి ఆఖరున నైనిటాల్లో ఉన్నా జిమ్ కార్బెట్ రిజర్వ్ ఫారెస్ట్ను ఫొటోలు తీయడం ద్వారా ఆమె పని ముగిస్తుంది. ‘రోజుకు 14 గంటలు పని చేస్తున్నాను. మానసికంగా శారీరకంగా చాలా కష్టమైనది ఈ పని. కాని ఇందులో నాకు ఆనందం ఉంది’ అంటుంది ఆర్జూ ఖురానా. లా చదివి ‘మాది ఢిల్లీ. మా నాన్నకు నేను అడ్వకేట్ కావాలని కోరిక. నాకేమో వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ కావాలని చిన్నప్పటి నుంచి కల. ఒక్కతే కూతురుని. అడవుల్లో కెమెరా పట్టుకుని తిరగడానికి అమ్మా నాన్నలు ఒప్పుకోలేదు. నాన్న కోసం లా చేశాను కాని చివరకు ఒప్పించి వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ని అయ్యాను. ఇందుకోసం నేను ఢిల్లీలో బేసిక్ ఫొటోగ్రఫీ కోర్సును చేశాను. కాని వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ వేరు. దానికి వేరే శిక్షణ కావాలి. నెట్లో వెతికితే సుధీర్ శివరామ్ అనే ప్రసిద్ధ వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ మాలాంటి వారి కోసం క్యాంప్స్ నిర్వహిస్తారని తెలిసింది. ఆయన రాజస్థాన్లోని భరత్పూర్ రిజర్వ్ఫారెస్ట్లో వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ క్యాంప్ నిర్వహించినప్పుడు హాజరయ్యి పని కొంత తెలుసుకున్నాను. రెండు సారస్ కొంగల సరదా సంప్రదింపులను నేను మొదటిసారి ఫొటో తీశాను. అది అందరికీ నచ్చింది. ఆ క్షణమే అనుకున్నాను... అరణ్యానికి జనారణ్యానికి మధ్య వారధిగా నేను ఉండగలను అని. అడవుల్లో ఉండే పక్షులు జంతువుల తరఫున వకాల్తా పుచ్చుకోగలను అని’ అంటుంది ఆర్జూ ఖురానా. కలిసి బతకాలి ‘మనుషులు కలిసి బతకడానికి కష్టపడుతుంటారు. అడవుల్లో తిరిగితే వందల వేల జీవులు ఎలా ఒకదానితో ఒకటి కలిసి బతుకుతాయో తెలుస్తుంది. అవి మనతో కూడా కలిసి బతకాలనే అనుకుంటాయి. కాని మన స్వార్థం కోసం అడవులు ధ్వంసం చేస్తూ వాటిని నాశనం చేస్తున్నాం. గత 50 ఏళ్లలో భూమి మీద ఉన్న జంతువులలో 50 శాతం నశించిపోయాయంటే నమ్ముతారా? ఇది నిజం. మనలో ప్రతి ఒక్కరం అడవుల పరిరక్షణకు, తద్వారా వన్యప్రాణి పరిరక్షణకు పూనుకోవాలి. లేకపోతే మిగిలేదేమీ ఉండదు. ఒక పులి ఉండదు. ఒక నక్కా కనిపించదు’ అంటోంది ఆర్జూ ఖురానా. -
హైకోర్టు ఆగ్రహం.. న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే
సాక్షి, అమరావతి: ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు మండిపడింది. సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో న్యాయవాదుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ తాము మధ్యంతర ఉత్తర్వులిచ్చినా.. జిల్లాల్లో న్యాయవాదులు ఇప్పటికీ సమ్మె చేస్తూ ఆందోళనలు కొనసాగించడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు, ఇకపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో స్పష్టంగా తెలియచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాద వృత్తిలో ఉన్న వారిలో అనేక మంది పేదలున్నారని, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నారని, సమ్మె వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులు కూడా నష్టపోతారని తెలిపింది. ప్రభుత్వ చట్టంపై అభ్యంతరాలుంటే న్యాయ పోరాటం చేయాలే తప్ప సమ్మె పరిష్కారం కాదంది. ఇప్పటివరకు చేసింది చాలని, ఇక సమ్మె ఆపి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అవసరమైతే ఈ దిశగా ఆదేశాలిస్తామంది. ఈ విషయంలో తమకు మరో మార్గం లేదని స్పష్టం చేసింది. సమస్యకు సమ్మె ఎంత మాత్రం పరిష్కారం కాదంది. వ్యవస్థ నడవడమే తమకు ముఖ్యమంది. సమ్మె చేస్తున్న న్యాయవాద సంఘాలతో చర్చలు జరిపి, సమ్మె విరమించేలా చూడాలని బార్ కౌన్సిల్ను ఆదేశించింది. కోర్టు విధుల బహిష్కరణతో కక్షిదారుల ఇక్కట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా న్యాయవాద సంఘాలు సమ్మెకు పిలుపునిస్తూ కోర్టు విధులను బహిష్కరిస్తున్నాయని, దీనివల్ల కక్షిదారులు ఇబ్బందిపడుతున్నారంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగేష్ వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టుల్లో న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 8.64 లక్షల సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. సమ్మె చేస్తున్న న్యాయవాదుల విషయంలో మీ పాత్ర ఏమిటని రాష్ట్ర బార్ కౌన్సిల్ను ప్రశ్నించింది. దీనికి బార్ కౌన్సిల్ తరఫు న్యాయవాది జి.వెంకటరెడ్డి స్పందిస్తూ.. సమ్మె చేస్తున్న అన్ని న్యాయవాద సంఘాలకు బార్ కౌన్సిల్ కార్యదర్శి సర్క్యులర్లు పంపి, సమ్మె విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారని తెలిపారు. మరి మీ సమ్మె విషయంలో మీ ఆదేశాలను పాటించకుంటే ఏం చర్యలు తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులపై చర్యలు తీసుకున్నారా? తీసుకోకుంటే ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. చర్చలు ఫలించకుంటే చర్యలు తీసుకుంటాం అన్ని న్యాయవాద సంఘాలను చర్చలకు ఆహ్వానించామని వెంకటరెడ్డి చెప్పారు. చర్చలు ఫలించకుంటే అప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ధర్మాసనం.. సర్క్యులర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారా అని ప్రశ్నించింది. ఎప్పుడు సర్క్యులర్లు ఇచ్చారు? ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంత గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వెంకటరెడ్డి చెప్పారు. మరి మీ సంగతేంటని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదిని ప్రశ్నించింది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని బీసీఐ న్యాయవాది కుంచెం మహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే మీరు చర్యలు తీసుకోరా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అలా కాదని, ముందు స్పందించాల్సింది రాష్ట్ర బార్ కౌన్సిలేనని, ఒకవేళ రాష్ట్ర బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోకుంటే అప్పుడు తాము రంగంలోకి దిగుతామని మహేశ్వరరావు తెలిపారు. ఒరిస్సాలో కూడా సమ్మె చేస్తున్న 42 మంది న్యాయవాదులను సస్పెండ్ చేశామని వివరించారు. న్యాయవాదులు న్యాయబద్ధమైన వాటి కోసం ఆందోళనలు చేస్తున్నారా? లేదా? చూస్తామని మహేశ్వరరావు తెలిపారు. రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో బార్ కౌన్సిల్ నిర్ణయంపై, భూ యాజమాన్య హక్కుల చట్టంపై న్యాయవాదులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు ముందు పెండింగ్లో ఉందన్నారు. భూ యాజమాన్య హక్కుల చట్టం వచ్చిన నేపథ్యంలో ఆస్తి వివాదాల దావాలను తిరస్కరించవద్దని కింది కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. అలాగే రూ.20 వెల్ఫేర్ స్టాంపు విషయంలో ప్రభుత్వ చట్ట సవరణ చేసి, జీవో జారీ చేసిందన్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని వివరించారు. మరలాంటప్పుడు సమ్మె ఎందుకు కొనసాగిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటివరకు జరిగింది చాలని, వెంటనే సమ్మె విరమించాలని న్యాయవాదులను ఆదేశించింది. -
Supreme Court: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
న్యూఢిల్లీ: కోర్టు హాల్లో ఎలా ప్రవర్తించాలన్నదానిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ సోమవారం సుప్రీంకోర్టులో ఓ న్యాయవాదికి క్లాస్ పీకారు. ఏ రైలు పడితే అది ఎక్కేయడానికి ఇది రైల్వేస్టేషన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు రూమ్లో ఎలా మెలగాలన్నదానిపై ముందు మీరు వెళ్లి ఎవరైనా సీనియర్ న్యాయవాది వద్ద శిక్షణ తీసుకోండని సూచించారు. జ్యుడిషీయల్ సంస్కరణలపై తాను వేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సోమవారం సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక్కసారిగా లేచి సీజేఐ బెంచ్ను అడగడం ప్రారంభించాడు. కేసు లిస్ట్ కాకుండా మీ వంతు రాకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇలా మెన్షన్ చేయడమేంటని ఆ న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించారు. అయినా వినిపించుకోని ఆ న్యాయవాది న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత త్వరగా తీసుకురావాల్సి ఉందని చెప్పసాగాడు. న్యాయవాది ప్రవర్తన పట్ల ఆగ్రహించిన సీజేఐ అసలు మీరెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ హైకోర్టు, దిగువ కోర్టుల్లో చేస్తా అని చెప్పాడు. దీనికి స్పందించిన సీజేఐ మీరు త్వరగా ఒక సీనియర్ వద్ద జాయిన్ అయి కోర్టు రూమ్లో ఎలా మెలగాలో నేర్చుకోండని చురకంటించారు. ఈ నెల ప్రారంభంలోనూ ఓ అడ్వకేట్ సుప్రీం కోర్టులో గొంతు పెంచి మాట్లాడుతుండగా సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించి వాదించాలని సూచించారు. ఇదీచదవండి.. ఈడీ ఎదుటకు లాలూ -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్లో చేరి, నా కెరీర్ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
పేదల పక్షాన నిలవండి
సాక్షి, అమరావతి: పేదల పక్షాన అడ్వొకేట్ సోదరులు, చెల్లెమ్మలు ఔదార్యం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్ను ఇదే కోరుతున్నానని, దీనిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విడుదల చేశారు. నెలకు రూ.5,000 చొప్పున 2023 జూలై–డిసెంబర్ వరకు 6 నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.30,000 మేరకు మొత్తం రూ.7,98,95,000 కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, అదే రీతిన మీరంతా పేద వాడి పక్షాన నిలవాలన్నారు. వారి పట్ల మానవతా దృక్పథం చూపించాలని కోరారు. లా డిగ్రీ పూర్తి చేసుకుని, న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకునే సమయంలో వారికి ప్రోత్సాహకంగా నిలుస్తూ వరుసగా గత నాలుగేళ్లుగా వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నెలకు రూ.5 వేలు స్టైఫండ్ చొప్పున, సంవత్సరానికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఈ కార్యక్రమం ద్వారా తోడుగా నిలిచామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్లకు మంచి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లలో రూ.49.51 కోట్లు ► ‘ఈ నాలుగేళ్లలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి చేస్తూ.. మనందరి ప్రభుత్వం రూ.49.51 కోట్లు సాయం చేసింది. ఈ మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి ఈ కార్యక్రమం ముందడుగు అవుతుంది. అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వైఎస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరినీ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచాం. ► ఈ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వీళ్లలో 643 కుటుంబాలకు రూ.52 లక్షలు ఇచ్చాం. ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రూ.11.56 కోట్ల రుణాలు ఇచ్చారు. మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద మరో రూ.11.41 కోట్లు చెల్లించాం. అదే టైంలో దాదాపు రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి అడ్వొకేట్ కమ్యూనిటీకి ఇచ్చి, వారికి తోడుగా నిలబడగలిగాం. ► నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. ఆ మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేశాం. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ► ఈ కార్య‘క్రమంలో సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, లా సెక్రటరీ జి సత్యప్రభాకర రావు, ఇతర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. విజనరీ స్కీమ్స్ మీకే సాధ్యం గుంటూరు జిల్లా కోర్టులో నేను జూనియర్ అడ్వకేట్గా కెరీర్ ప్రారంభించాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. మీరు ప్రవేశపెట్టిన విజనరీ స్కీమ్స్ గురించి సచివాలయంలో తెలుసుకున్నాను. హ్యాట్సాఫ్ సార్. నేను ఇటీవల ఆరోగ్య సురక్ష క్యాంప్కు వెళ్లాను. చాలా బాగుంది. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. విదేశీ విద్య చాలా బాగుంది. తుపాను సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, భరోసా చాలా నచ్చింది. మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని మేం కూడా పేదలకు సాయం చేయాలనుకుంటున్నాం. మీరు ఒక విజనరీ. మీరు ఇచ్చే స్టైఫండ్ చాలా ఉపయోగపడుతుంది. మా కాళ్లపై మేం నిలబడుతున్నాం. – శశిధర్, జూనియర్ అడ్వొకేట్, గుంటూరు లా నేస్తం మాకు ధైర్యాన్నిచ్చింది నేను వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాను. నాకు చాలా ఉపయోగపడుతోంది. మేం ఈ డబ్బును కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కు, బుక్స్, రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ వృత్తిలో తొలుత ఎలా నిలదొక్కుకోవాలి.. ఎలా రాణించాలి.. ఖర్చుల మాటేంటి.. అని భయపడ్డాం. కానీ ఈ స్కీమ్ మాకు ధైర్యాన్నిచ్చింది. మా జూనియర్స్కు కూడా ధైర్యం చెబుతున్నాం. గుప్తుల స్వర్ణయుగాన్ని నేను చూడలేదు కానీ మీ పాలనలో చూడగలిగాను. చాలా సంతోషం. మీరు ఇచ్చే అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి. ఆరీ్టసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో చాలా సంతోషపడ్డాం. – కోట ఆశ్రిత, జూనియర్ అడ్వొకేట్, నందిగామ -
యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తోంది. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ.25 కోట్ల ఆర్థికసాయం అందించింది. ఈ ట్రస్ట్ నుంచి ఆర్థికసాయం కోరే అడ్వకేట్స్ ఆన్లైన్లో ట్ఛఛిచి ్చఠీః్చp.జౌఠి.జీnలోగానీ, నేరుగా లా సెక్రటరీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా 1902 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ పథకాన్ని మరింత సమర్థంగా మానిటర్ చేస్తూ యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్దమొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునే విధంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం వారి ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. దరఖాస్తు చేసుకోదలిచినవారు https://ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో తమ పేరు, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబరు, సర్టిఫికెట్లు జతచేయాలి. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
ఆపన్నులకు అండ.. పేదలకు లీగల్ సర్వీసెస్ అథారిటీ భరోసా
హక్కులకు భంగం కలిగితే కోర్టును ఎలా ఆశ్రయించాలో తెలియదు.. పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు నమోదైతే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..న్యాయవాదిని పెట్టుకొనేంత ఆర్థిక స్తోమత లేదు.. ఇదీ సగటు పేదవాడి దుస్థితి. ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు న్యాయం కోసం ఏం చేయాలి.. ఎవరిని ఆశ్రయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏర్పాటైందే ‘లీగల్ సర్విసెస్ అథారిటీ (ఎల్ఎస్ఏ)’. ఈ నెల 9న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ డే, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్: పేదలకు న్యాయ సా యం అందించడం, కోర్టు కేసులను మ ధ్య వర్తిత్వంతో పరిష్కరించడం, లోక్ అదాలత్లు నిర్వహించడమే కాదు.. వృద్ధులకు ఆసరాగా నిలవడం, పేద విద్యార్థులకు సాయం చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాలను లీగల్ సర్విసె స్ అథారిటీ నిర్వహిస్తోంది. పత్రికల్లో వచ్చిన కథనా ల ఆధారంగా లేదా సుమోటోగా పలువురి బాధల ను తీరుస్తోంది. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందేలా చర్యలు తీసుకోవడం, విడిపోయి న భార్యాభర్తలను కలపడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం వసతు లు, వేతనం అందేలా చేయడం, మతిస్థిమితం కో ల్పోయిన వారికి ఆశ్రయం కల్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 1995లో ఏర్పాటు లీగల్ సర్విసెస్ అథారిటీ చట్టం–1987 ప్రకారం 1995 నవంబర్ 9న జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏర్పాటైంది. దీనికి జాతీయ స్థాయిలో ప్యాట్రన్ ఇన్ చీఫ్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలు పని చేస్తాయి. వృద్ధ దంపతులకు ఆసరా.. ఖమ్మం జిల్లాకు చెందిన రామన్న, కృష్టమ్మ దంపతులు. ఉన్న ఆస్తినంతా పిల్లలకు పంచిపెట్టారు. మలి వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారిని సంప్రదించింది. చట్టప్రకారం 3 ఎకరాల 20 గుంటల భూమిని తిరిగి వృద్ధ దంపతుల పేర రిజిస్ట్రేషన్ చేయించి ఆసరా కల్పించింది. అమరచింతలోని కియోస్్కలో వారికి ఆశ్రయం అందించింది. నిరుద్యోగులకు చేయూత.. మహబూబ్నగర్ జిల్లా సెంట్రల్ లైబ్రరీకి రోజూ సుమారు 200 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చిన కొందరు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే చదువుకుంటా రు. వారిలో ఎక్కువ మంది పేదలే కావడం, మధ్యాహా్నలు భోజనం కూడా చేయడం లేదని గుర్తించిన జిల్లా లీగల్ సర్విసెస్ అథారిటీ.. మున్సిపల్ చైర్మన్తో సంప్రదింపులు జరిపింది. రూ. 5కే మంచి భోజనం అందేలా చర్యలు తీసుకొని చేయూతనిచ్చింది. 33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు పేదల కేసులను వాదించేందుకు, న్యాయ సలహా అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాలన్న జాతీయ లీగల్ సర్విసెస్ అథారిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (జిల్లా స్థాయి), డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (సబ్–కోర్టు), అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్ (మేజిస్ట్రేట్ కోర్టు)ను పూర్తిస్థాయిలో నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో 33 జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఏం న్యాయ సేవలు అందిస్తారు? 1). ఉచితంగా న్యాయ సలహాలు అందించడం 2). కేసులు పరిశీలించి బాధితుని తరఫున న్యాయవాదిని నియమించడం 3). కోర్టు ఫీజులను భరించడం 4). తీర్పు వచ్చిన తర్వాత కాపీలను ఉచితంగా అందజేయడం ఆశ్రయించడం ఎలా? ఉచిత న్యాయ సాయం కోసం మండల న్యాయసేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040–23446723 లేదా టోల్ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చు. న్యాయ సాయం ఎవరికి.. 1). షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు 2). మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు 3). మహిళలు, బాలబాలికలు 4). అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 5). ప్రకృతి విపత్తులు, కుల, మత కల్లోలాల బాధితులు 6). పారిశ్రామిక కార్మికులు 7). రక్షణ గృహం, అనాథ గృహం, బాలల గృహం, మానసిక చికిత్సాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి.. 8). సంవత్సర ఆదాయం రూ.3 లక్షలు మించని వారికి... అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేయడం కోసం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను రాష్ట్రంలో ప్రారంభించాం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా సాగు చట్టాలు, నియమాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తాం. కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నాం. – గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి -
కాంగ్రెస్లోకి ప్రముఖ న్యాయవాది దామోదర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది దామోదర్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, ఏఐసీసీ పరిశీలకురాలు దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ దామోదర్రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కొడంగల్, చేవెళ్ల, పాలకుర్తి, భూపాలపల్లి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రేవంత్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. -
‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి?
న్యాయవాదుల హోదా విషయమై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. లాయర్ల సుదీర్ఘకాల డిమాండ్కు ముగింపు లభించింది. ఈ విషయంపై గతంలో పిటిషన్ దాఖలైంది. లాయర్కు సీనియర్ పోస్టు ఇవ్వడాన్ని అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు తిరస్కరించినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోర్టు అధికారిక వెబ్సైట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2023, అక్టోబర్ 19న మొత్తం 535 మంది న్యాయవాదులకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించారు. ఇంతకీ సీనియర్ న్యాయవాది అని ఎవరిని పిలుస్తారు? ఇందుకుగల అర్హతలు, నిబంధనలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వకేట్ చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం న్యాయవాదులు రెండు తరగతులకు చెందినవారై ఉంటారు. మొదటిది సీనియర్ న్యాయవాది. రెండవ ఇతర న్యాయవాది. ఒక న్యాయవాది సీనియర్ కావాలనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టు ఆ హోదాను అందించవచ్చు. సెక్షన్ 23 (5) ప్రకారం కేసును దాఖలు చేసే హక్కు సీనియర్ న్యాయవాదులకు ఉండదు. వారు ఆయా కేసులను పరిష్కరించడమో లేదా కేసును క్రాస్ ఎగ్జామిన్ చేయడమో చేస్తారు. సాధారణ న్యాయవాదులతో పోలిస్తే సీనియర్ న్యాయవాది కేసు దాఖలు చేసే అధికారాన్ని కోల్పోతాడని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రా మీడియాకు తెలిపారు. అయితే పలు కేసుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టు ఈ లాయర్ల నుంచి సలహాలు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సందీప్ మిశ్రాను సీనియర్ లాయర్ హోదా పొందేందుకు వయసుకు సంబంధించిన ప్రమాణాలు ఉంటాయా అని అడగా, దీనికి వయోపరిమితి లేదని బదులిచ్చారు. అయితే ఆ న్యాయవాది ఎన్ని కేసులలో వాదించాడు? అవి ఎలాంటి కేసులు, కేసులలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనే విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. సీనియర్ హోదా పొందడానికి ముందుగా ఎవరైనా న్యాయవాది హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారి దరఖాస్తులను పరిశీలించి, జాబితాను విడుదల చేస్తారు. తాజాగా 535 మంది న్యాయవాదులకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పించింది. కోర్టు వారికి ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైనా సందర్భంలో వారి సలహా తీసుకుంటుంది. ఇది కూడా చదవండి: ‘ఫాస్ట్ రేడియో బరస్ట్’ అంటే ఏమిటి? సూర్యుని కన్నా ఎంత శక్తివంతమైనది? -
చంద్రబాబు, లోకేశ్ లకు ఎందుకు మద్ధతు ఇవ్వాలి: న్యాయవాది
-
సిద్ధార్థ లూద్రాపై రాజమండ్రిలో కేసు
-
చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని ఏఏజీ వెల్లడి
-
జైలులో ఖైదీలు ఉండక.. స్వామీలు ఉంటారా?: సాక్షితో AAG
-
చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషాన్ పై ముగిసిన వాదనలు
-
కస్టడీలోకి తీసుకుంటేనే మరిన్ని వివరాలు తెలుస్తాయి
-
ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
29 కోర్టు హాళ్లలో లైవ్ ప్రసార సేవలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో కేసుల విచారణకు సంబంధించి ఆన్లైన్ లైవ్ ప్రసారాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టులోని 29 హాళ్లలో విచారణల లైవ్ ప్రసార సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి లైవ్ ప్రసారాలు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే మొదటి కోర్టు హాల్లో లైవ్ ప్రసార సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సేవలు న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై మిగతా కోర్టుల్లో జరిగే విచారణలను కూడా వీక్షించే వీలు కలగనుంది. దీనితో న్యాయవాదులకు కూడా ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించే అవకాశం లభిస్తుంది. భవిష్యత్లో న్యాయవాదులే కాకుండా వాదప్రతివాదుల నుంచి న్యాయమూర్తులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్లైన్లో వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని కోర్టులను ఆన్లైన్ లైవ్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువచేస్తామని సుప్రీంకోర్టు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్లైన్ లైవ్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. లైవ్ ప్రసారాలతో పెండింగ్ కేసులు తగ్గే అవకాశం ఉందని, కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు లైవ్ ప్రసారాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఈ–సేవ కేంద్రాన్ని ప్రజలు, న్యాయవాదులు వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కోర్టుకు వచ్చే ప్రజలు, న్యాయవాదులు ఈ–సేవ కేంద్రం సేవలను వినియోగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సూచించారు. అందరికీ న్యాయాన్ని చేరువ చేయడం, న్యాయ సేవలను విస్తరించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కక్షిదారులు ఇక్కడ కేసు స్థితిని కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు ఆవరణలో ఈ–సేవ కేంద్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే శనివారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఈ–కమిటీ ఆధ్వర్యంలో ఈ కేంద్రం పనిచేస్తుంది. ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోర్టు నుంచి ఏదైనా సాఫ్ట్కాపీ కావాలన్నా ఈ కేంద్రం నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, కేసు స్థితి (ప్రస్తుత స్థితి, తదుపరి విచారణ తేదీ), ఈ–కోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి జడ్జీల సెలవుల సమాచారం తెలుసుకోవడానికి, సర్టీఫైడ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు, ఉచిత లీగల్ సర్విస్లు పొందడం వంటి వివరాలు, జైలులో ఉన్న వారిని కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్మెంట్ కోసం, కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఈ–పేమెంట్స్ కోసం, ట్రాఫిక్ చలాన్లు, ఇతర నేరాల్లో చెల్లించాల్సిన నగదు చెల్లించడానికి.. ఇలా పలు రకాల సేవలను ఈ–సేవ కేంద్రం అందించనుంది. సిబ్బందితో మాట్లాడుతున్న సీజే జస్టిస్ అలోక్ అరాధే. చిత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ వినోద్కుమార్, జస్టిస్ సుధీర్కుమార్, జస్టిస్ సాంబశివరావు నాయుడు, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శరత్, జస్టిస్ రాజేశ్వర్రావు, జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ లక్ష్మీనారాయణ తదితరులు -
సుప్రీంకోర్టు స్టే పై లాయర్ల సంబరాలు
-
తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు. చదవండి: Hyderabad: గూబ గుయ్మంటోంది.. నిద్రపోని మహానగరం అలిశెట్టి లక్ష్మీనారాయణ: నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామంలో హెడ్మాస్టర్ గంగాధర్, రాజుబాయ్ దంపతులకు 1968 మే 13న లక్ష్మీనారాయణ జన్మించారు. నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించుకున్నారు. రాజ్యాంగ, ‘సివిల్ లా’లో నైపుణ్యం సాధించారు. ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి అథారిటీ, ఎన్బీసీసీ, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్తోపాటు పలు ఎల్బీసీ, బ్యాంకులకు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. కె.సుజన: నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన మధు సూదన్, ప్రమీల దంపతులకు కె.సుజన 1970 మార్చి 10న జన్మించారు. 1997లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2010లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూనియర్ సివిల్ జడ్జిగా కొనసాగుతూనే 2012లో జిల్లా జడ్జి పరీక్షలు రాసి ఎంపికయ్యారు. కరీంనగర్ అదనపు జిల్లా జడ్జిగా, నిజామాబాద్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగాను, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. గతేడాది నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా సుజన విధులు నిర్వర్తిస్తున్నారు. -
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
అడ్వొకేట్ అరాచకం
విజయనగరం (క్రైమ్): నలుగురికీ న్యాయం చేయాల్సిన న్యాయవాదే భార్యను హింసకు గురిచేశాడు. 11 ఏళ్లపాటు భార్యను బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు. తమ కుమార్తె అసలు బతికి ఉందో లేదోనన్న సందేహంతో ఆమె తల్లిదండ్రులు విజయనగరం వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఎం.దీపికను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులపైనా కేసు పెడతానంటూ న్యాయవాది బెదిరించడంతో చేసేది లేక మేజిస్ట్రేట్ జారీ చేసిన సెర్చ్ వారెంట్తో వెళ్లి గృహ నిర్బంధం నుంచి ఆమెను విడిపించారు. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలోని మార్వాడి వీధిలో ఉంటున్న న్యాయవాది గోదారి మధుసూదనరావు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్నాడు. 2009లో వీరికి పాప పుట్టింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సుప్రియ ఆ తరువాత భర్త దగ్గరకు వచ్చేందుకు నిరాకరించింది. నువ్వు లేకపోతే ఉండలేనంటూ భర్త చెప్పిన మాయమాటలు నమ్మి విజయనగరం వచ్చింది. అప్పటినుంచి భార్యను ఇంట్లోనే బంధించిన మధుసూదనరావు తల్లిదండ్రులతో మాట్లాడటానికి, చూడటానికి కూడా అనుమతించలేదు. ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా బయటినుంచే పంపించేసేవాడు. ఇలా 11 ఏళ్లపాటు ఈ తంతు సాగింది. దీంతో తమ కుమార్తె సుప్రియ అసలు బతికి ఉందో లేదోనని అనుమానించిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతూ వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. మీరు దొంగపోలీసులని, ఎఫ్ఐఆర్ ఉంటేనే రావాలని చెప్పి లోపలికి రానీయలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎస్పీ ఎం.దీపికను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు కోర్టునుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని బుధవారం ఆ ఇంటికి వెళ్లి మహిళను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. -
వైఎస్సార్ ‘లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు ‘లా నేస్తం’ అని సీఎం అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ బుధవారం.. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్ను ఏర్పాటుచేసింది. కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు. -
న్యాయవాదులకు వరం ‘లా నేస్తం’
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తోన్న డాక్టర్ వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు న్యాయవాదులను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకుంటున్నారని న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్రావు చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లా నేస్తం, సంక్షేమ నిధి పథకాలతో న్యాయవాదులు పొందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడం కష్టమని, అలాంటి వారిని ఆదుకునేందుకే లా నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. 2019 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్ల పాటు స్టైఫండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత మూడున్నర ఏళ్లలో 65,537 మంది న్యాయవాదులకు రూ.34.39 కోట్లను స్టైపెండ్ రూపంలో చెల్లించామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్ఫండ్తో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంక్షేమ నిధి నుంచి అర్హులైన న్యాయవాదులకు వైద్య ఖర్చులు, లా పుస్తకాలు, మేజర్ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్ వంటి అత్యవసరాలకు నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధి ద్వారా ఇప్పటివరకు 7,733 మంది న్యాయవాదులకు రూ.25 కోట్ల మేర సాయం చేసినట్లు చెప్పారు. -
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీవ్రంగా వేధిస్తోందని న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యానని, మూడు రోజులపాటు కేవలం సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సిట్ దర్యాప్తు ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ అధికారులు, సీబీఐ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్, సీవీ ఆనంద్తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సిట్ ఎదుట హాజరయ్యానని.. రాజేంద్రనగర్ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. వారు కోరిన విధంగా చెప్పేందుకు నిరాకరిస్తే.. తనను నిందితుడిగా(ఏ7)గా పేర్కొంటూ మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయాన్ని సిట్కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్కు చెప్పినా పట్టించుకోలేదని నివేదించారు. విచారణవీడియోను హైకోర్టుకు సమరి్పంచాలని కోరినా.. 23నాటి∙విచారణలో అధికారులు కోర్టుకు అందజేయలేదని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సిట్ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: హైదరాబాద్లో నీరా కేఫ్ రెడీ -
టీడీపీ, జనసేనలపై లాయర్ల ఆగ్రహావేశాలు
సాక్షి నెట్వర్క్: హెకోర్టులో న్యాయమూర్తుల బదిలీలపై విమర్శలు చేస్తూ వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం గర్హనీయమని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ లీగల్ సెల్కు చెందిన న్యాయవాదులు ఆక్షేపించారు. ఇద్దరు జడ్జీల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు దీనికి రాజకీయం ఆపాదించడంపై వారు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ శనివారం అనేక జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. న్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న దుష్టచతుష్టయం కుతంత్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్కడికక్కడ వినతిపత్రాలు ఇచ్చారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో ర్యాలీ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టి టీడీపీ, జనసేన పార్టీల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టారు. మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరులోనూ న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ, జనసేన తీరును నిరసిస్తూ కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇక గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన న్యాయవాదులు ‘రాజ్యాంగ పరిరక్షణకు దుష్టశక్తుల ఆట కట్టిద్దాం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ జిల్లా, నగర కమిటీ ప్రతినిధులు విజయవాడలోనూ నిరసన ప్రదర్శన నిర్వహించి కోర్టులకు తప్పుడు సాక్ష్యాలు ఇవ్వమని చెప్పడం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. మరోవైపు.. కోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలపై కూడా విమర్శలు చేస్తూ వాటిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ విధులను బహిష్కరించడం తగదంటూ శ్రీకాకుళంలోనూ న్యాయవాదులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం చెంగల్రాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్కు వినతిపత్రం అందించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చివరకు న్యాయవ్యవస్థలో బదిలీలను కూడా తన స్వార్థానికి వాడుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పలువురు లాయర్లు విమర్శించారు. -
న్యాయవ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దు : ఏపీ న్యాయవాదులు
-
విపత్తు నిర్వహణ శాఖ నిర్లక్ష్యంపై ఫిర్యాదు
నాంపల్లి: రాష్ట్రంలో పిడుగుపాటుతో మరణించిన బాధిత కుటుంబాలను ఆదుకుని, వారికి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ శనివారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. పిడుగుపాటు నివారణ చర్యలు చేపట్టడంతోపాటుగా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశంలో పిడుగుపాటు ప్రమాదాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, గడచిన ఆరేళ్లలో ఇక్కడ 398 మంది మృత్యువాతపడ్డారని, ఇందుకు సంబంధించి ‘సాక్షి’లో పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని వివరించారు. ప్రమాదాలకు గురైనవారిలో అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించే రైతులు, రైతుకూలీలు ఉన్నట్లు తెలియజేశారు. పిడుగుపాటుకు బలైన నిరుపేద కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని, వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రోడ్డునపడ్డ కుటుంబాలను ఆదుకోవడం, పిడుగుపాటు నివారణ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, పుణే ఐఐటీ దామిని అనే యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, ఇది 20 కిలో మీటర్ల నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుపాటు ప్రమాదంపై ముందే హెచ్చరికలను జారీ చేస్తుందని తెలిపారు. అధునాతన పరికరాల సహాయంతో అనేక రాష్ట్రాల్లో, మండలాల్లో, గ్రామాల్లో వీటి సందేశాలతో ఎప్పటికప్పుడు స్థానికులను అప్రమత్తం చేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ మాత్రం విపత్తుల నిర్వహణ శాఖ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేలా చూడాలని, పిడుగుపాటుకు గురై మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఉద్యమం
కర్నూలు(లీగల్): హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే వరకు ఉద్యమం ఆపేది లేదని న్యాయవాదులు స్పష్టంచేశారు. కర్నూలులోని ధర్నా చౌక్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు నరసింహ, సంపత్కుమారి, బి.కృష్ణమూర్తి, సోమశేఖర్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరం వద్దకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కదిరితోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, డోన్, ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాదులు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ చౌదరి, కార్యదర్శి దస్తగిరి మరికొందరు మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం నాయకుడు భాస్కర్రెడ్డి కూడా న్యాయవాదులకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం కొలిమిగుండ్ల ప్రాంతంలో కలసి వినతిపత్రం సమరి్పస్తామని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఆర్ కృష్ణ, కాటం రంగడు, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, రాయలసీమ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ కమిటీ నేత వై.జయరాజు, ఓంకార్ తెలిపారు. సీఎం జగన్ను కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు (లీగల్): రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించి సీమ ప్రజల చిరకాల వాంఛను తీర్చాలని కర్నూలు న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కర్నూలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఆర్.కృష్ణ, సీమ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వై.జయరాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పి.రవిగువేరా, సీనియర్ న్యాయవాదులు ఓంకార్, నాగలక్ష్మీదేవి, ఎం.సుబ్బయ్య, పి.సువర్ణరెడ్డి, బి.చంద్రుడు, రాజేష్, రంగనాథ్ మాట్లాడారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. సీమలో హైకోర్టు ఏర్పాటు చరిత్రాత్మక అవసరమే కాకుండా మూడుప్రాంతాల సమతుల్యానికి దోహదం చేస్తుందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. శాసన రాజధాని, కార్యనిర్వాహక రాజధానులతో సంబంధం లేకుండా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్కు, ప్రతిపక్ష నేతకు, సీమప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు. -
హైకోర్టులో 35 మంది ప్యానెల్ అడ్వొకేట్ల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించేందుకు 35 మంది న్యాయవాదులతో కూడిన ప్యానెల్ను నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (అమరావతి)లో వాదనలు వినిపించేందుకు మరో ఏడుగురు న్యాయవాదులను నియమించింది. వీరంతా మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పోస్టుల్లో కొనసాగుతారు. హైకోర్టులో నియమితులైన న్యాయవాదులంతా కూడా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మార్గదర్శకత్వంలో పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ న్యాయవాదులుగా నియమితులైనవారిలో సాగి శ్రీనివాసవర్మ, జోస్యుల భాస్కరరావు, బొమ్మినాయుని అప్పారావు, ఏవీఎస్ రామకృష్ణ, తాత సింగయ్య గౌడ్, గేదెల తుహిన్ కుమార్, అంబటి సత్యనారాయణ, మల్లంపల్లి శ్రీనివాస్, సీవీఆర్ రుద్రప్రసాద్, అరవల శ్రీనివాసరావు, మంచాల ఉమాదేవి, పోతంశెట్టి విజయకుమారి, బేతంపల్లి సూర్యనారాయణ, బాచిన హనుమంతరావు, తానేపల్లి నిరంజన్, అరవ రవీంద్రబాబు, గుడిసేవ నరసింహారావు, గుండుబోయిన వెంకటేశ్వర్లు, పసల పున్నారావు, గేదెల సాయి నారాయణరావు, వి.వెంకట నాగరాజు, ఇ.అంజనారెడ్డి, కామిని వెంకటేశ్వర్లు, తుమ్మలపూడి శ్రీధర్, ఓరుగంటి ఉదయ్ కుమార్, కె.శ్రీధర్ మూర్తి, సోమిశెట్టి గణేష్ బాబు, తడసిన అలేఖ్య రెడ్డి, వైవీ అనిల్ కుమార్, సోమసాని దిలీప్ జయరామ్, పల్లేటి రాజేష్ కుమార్, పామర్తి కామేశ్వరరావు, మన్నవ అపరాజిత, షేక్ బాజీ, గొర్రెముచ్చు అరుణ్ శౌరి ఉన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్లో నియమితులైన వారిలో కవిపురపు పట్టాభి రాముడు, గొరికపూడి అంకమ్మరావు, ఎన్.వీరప్రసాద్, సీతిరాజు రామకృష్ణ, మాదాల ఆదిలక్ష్మి, షేక్ మంజూర్ అహ్మద్, బి.బి.లక్ష్మయ్య ఉన్నారు. -
ప్రముఖ న్యాయ కోవిదుడు సత్తి వెంకట్రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది సత్తి వెంకట్రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నా రు. వెంకట్రెడ్డి అంత్యక్రియలు బుధవారం సా యంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. సత్తి వెంకట్రెడ్డి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, కవిటం గ్రామం. అక్కడే 1926, ఫిబ్ర వరి 25న జన్మించారు. 1951లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కొంత కాలం పాటు రాజమండ్రిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అటు తరువాత 1956లో హైదరాబాద్కు మకాం మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉత్తమ న్యాయవాదుల్లో ఒకరిగా పేరుగాంచారు. 1992–94 మధ్య కాలంలో కోట్ల విజయభాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సత్తి వెంకట్రెడ్డి అడ్వొకేట్ జనరల్గా సేవలు అందించారు. ఆయన పలు కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన ముగ్గురు కుమారులు న్యాయవాదులే. వెంకట్రెడ్డి అల్లుడు సీవీ మోహన్రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అడ్వొకేట్ జనరల్గా వ్యవహరించారు. సత్తి వెంకట్రెడ్డి మృతి పట్ల పలువురు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. -
అడ్వకేట్ మల్లారెడ్డి కేసును చేధించిన పోలీసులు
-
పక్కా ప్లాన్తో మల్లారెడ్డి హత్య.. హంతక ముఠాకు రూ.15 లక్షలకుపైగా సుపారీ?
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రముఖ న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడినట్లే. ములుగు జిల్లా పందికుంట సమీపంలో ఆయన దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును సవాల్గా తీసుకున్న ములుగు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. రెండు రోజులపాటు మల్లంపల్లి మాజీ సర్పంచ్ పిండి రవి, మైనింగ్ వ్యాపారంతో సంబంధమున్న కె.వీరభద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు ఎర్రమట్టి క్వారీల యజమానులను విచారించారు. 44 క్వారీలకు చెందిన సుమారు 24 మందిని విచారించిన పోలీసులు బుధవారం కీలక ఆధారాలు రాబట్టి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య కేసు మిస్టరీ వీడినట్లు సమాచారం. హత్యకు ప్రధాన సూత్రధారి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఓ రైస్ మిల్లు వ్యాపారిగా పోలీసులు అనుమానించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య పూర్తి వివరాలు వెల్లడైనట్లు సమాచారం. ఆయన చెప్పిన వివరాల మేరకు మైనింగ్ క్వారీల నిర్వహణ, మల్లారెడ్డితో దీర్ఘకాలిక వివాదమున్న కీలక వ్యక్తులనూ పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ హత్య కేసుతో సంబంధమున్న మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 15 మందికిపైగా అనుమానితులను ప్రశ్నించిన తర్వాత హత్యకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. రూ.15 లక్షలకుపైగా సుపారీ? మైనింగ్ వివాదమే మల్లారెడ్డి హత్యకు కారణమన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు తెలి సింది. హత్యకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సుపారీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. హత్యకు పథకం తర్వాత నర్సంపేట, శాయంపేటకు చెందిన 2 సుపారీ గ్యాంగ్లతో మాట్లాడినట్లు తెలిసింది. కర్నూలు ప్రాంతానికి చెందిన నలుగురు హంతక ముఠా సుపారీ తీసుకుని మల్లారెడ్డిని హత్య చేసినట్లు సమాచారం. వీరితో పాటు నల్లగొండకు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. కాగా.. ఈ హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. -
మల్లారెడ్డి హత్య వెనుక భారీ స్కెచ్.. రూ.10 లక్షలకుపైనే సుపారీ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి హత్యకు ఓ గ్యాంగ్ రూ.10 లక్షలకుపైనే సుపారీ మాట్లాడుకున్నట్లు తెలిసింది. అయితే ఆ గ్యాంగ్కు సుపారీ ఇచ్చిందెవరు?.. మల్లారెడ్డిని హత్యచేసే అవసరం ఎవరికుంది?.. ఆయనను మట్టుపెడితే మేలు ఎవరికీ?.. ఈ హత్యకు కారణం మైనింగ్ వివాదమా.. భూ వివాదాలా?.. మర్డర్కు ప్రణాళిక రచించిందెవరు? ఘటనలో పాల్గొన్నదెవరు?.. సోమవారం రాత్రి ములుగు జిల్లా పందికుంట సమీపంలో హత్యకు గురైన మూలగుండ్ల మల్లారెడ్డి ఘటనపై సర్వత్రా సాగుతున్న చర్చ ఇది. మల్లంపల్లి మాజీ సర్పంచ్ రవి సహా 10మందినిపైగా విచారించి వదిలేసిన పోలీసులు కీలక వ్యక్తులపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. పక్కా స్కెచ్తో.. మల్లారెడ్డి మర్డర్పై మంగళవారం రాత్రి వరకు స్పష్టత రాకపోగా.. భిన్న కథనాలు వినిపించాయి. ఎర్రమట్టి క్వారీలు, భూ వివాదాల పరిష్కారం కోసం సోమవారం కూడా ములుగు రెవెన్యూ, పోలీసు అధికారులను కలిసినట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ హత్య జరిగే నాలుగు రోజుల ముందు మల్లారెడ్డి ఇద్దరితో తీవ్రస్థాయిలో గొడవపడినట్లు చెబుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఒకరితో జరిగిన గొడవ తారస్థాయికి చేరగా, అవతలి వ్యక్తి లేపేస్తానని మల్లారెడ్డిని హెచ్చరించాడని అంటున్నారు. మల్లారెడ్డి హత్యకు హైదరాబాద్లోని ఒక హోటల్లో పథకానికి రూపకల్పన జరిగినట్లు ములుగు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. హంతకులకు రూ.10 లక్షలకుపైనే సుపారీ ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. హంతకులు కూడా హైదరాబాద్కు చెందిన వారుగా భావిస్తుండగా, హత్య జరిగిన సమయంలో హంతకులు మాస్క్లు ధరించి తెలుగు మాట్లాడారని చెబుతున్నారు. హత్యకు వాడిన కత్తులు, మారణాయుధాలను చూస్తే హైదరాబాద్ నుంచి గానీ, ఆన్లైన్లో గాని తెప్పించినవిగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. హత్య కుట్రలోని ఆ ఇద్దరు ఎవరు.. మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి పేర్లు చెప్పకుండా హత్య వెనుక ఇద్దరి హస్తముందని మంగళవారం మీడియాతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలతో పాటు పలుచోట్ల భూవివాదాల్లో ఆయనను అడ్డు తొలగించుకునేందుకు వ్యూహం రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్లో హత్యకు వ్యూహరచన చేసి, 3 రోజులు ములుగు, హనుమకొండలో రెక్కీ నిర్వహించినట్లుగా సమాచారం. చివరకు పందికుంట వద్ద పధకం అమలు చేసినట్లు తెలిసింది. హత్య వెనుకున్న ఆ ఇద్దరు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్న పోలీసులు బుధవారం గుట్టువిప్పే అవకాశం ఉంది. ములుగు మండలం ఉమ్మాయినగర్, కేఎన్ఆర్ కాలేజీ సమీపంలోని ఐదుగురు ఎర్రమట్టిæ క్వారీల యజమానులను మంగళవారం వేర్వేరుగా విచారించారు. అలాగే మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మి, కూతురు అనూషకు సంబంధించిన 113 ఎకరాల భూమి విషయంలోనూ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మెడ చుట్టూ పది, పొత్తి కడుపులో మూడు చోట్ల.. మొత్తం 13 చోట్ల మల్లారెడ్డిపై కత్తులతో దాడి జరిగినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు. -
‘టైమ్స్’అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో గౌతమ్ అదానీ!..కరుణా నంది ఎవరు?
న్యూయార్క్: ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీల మొదటి100 మంది’ జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అడ్వొకేట్ కరుణా నంది చోటు దక్కించుకున్నారు. 2022 సంవత్సరానికి గాను ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధినేత పుతిన్, చైనా అధినేత జిన్పింగ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, టెన్నిస్ క్రీడాకారుడు రఫేల్ నాదల్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, ప్రముఖ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే తదితరులకు స్థానం లభించింది. ప్రజలకు పెద్దగా కనిపించకుండా, నిశ్శబ్దంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఉంటారని గౌతమ్ అదానీపై టైమ్స్ పత్రిక ప్రశంసల వర్షం కురిపించింది. మహిళా హక్కుల ఛాంపియన్ అడ్వొకేట్ కరుణా నంది అని కొనియాడింది. -
తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇప్పటికే ఈ విషయంలో రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. ముగ్గురు తెలంగాణ న్యాయమూర్తులను ఇప్పటికే బదిలీ చేశారని, త్వరలో మరికొందరిని బదిలీ చేసేందుకు సర్వం సిద్ధమైందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని బదిలీలు చేపట్టబోతున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ బదిలీ యత్నాల వెనుక ఇటీవల తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన ఓ న్యాయమూర్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో సర్వం తానై వ్యవహరిస్తున్న ఆ న్యాయమూర్తి ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని వాడుతున్నట్టు చెబుతున్నారు. ఆ న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ప్రధానమంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం ఓ లేఖను పంపింది. ఊరుకునేది లేదు రాష్ట్ర న్యాయమూర్తులను బలి పశువులను చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని తెలంగాణ న్యాయవాదులు చెబుతున్నారు. ఇందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం సిద్ధమంటున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులు బుధవారం హైకోర్టులో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు గేటు ముందు ‘సేవ్ తెలంగాణ జ్యడీషియరీ, ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం ఆపాలి’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంతో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్రెడ్డి చెప్పారు. ఇలా చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని, రాష్ట్ర న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని ప్రశ్నించడమేనని మరో న్యాయవాది చిన్నోళ్ల నరేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకురావాలన్న ప్రయత్నాలను విరమించుకోకపోతే ఆందోళనలు ఉద్యమ రూపం దాలుస్తాయని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, చిక్కుడు ప్రభాకర్, ఎ. జగన్, రాజేశ్ మెహతా తదితరులు పాల్గొన్నారు. -
ఆ వకీలు నిత్యపెళ్లికొడుకు .. ముచ్చటగా మూడోసారి
సాక్షి, మైసూరు (కర్ణాటక): పేరుకు న్యాయవాది, కానీ చేసేది మాత్రం మహిళలకు అన్యాయం. జిల్లాలోని కేఆర్ నగరలో సీవీ సునీల్ కుమార్ అనే న్యాయవాది మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు. శివమొగ్గ సాగర తాలూకాకు చెందిన 36 ఏళ్ల మహిళను మ్యాట్రిమొని వెబ్సైట్లో పరిచయం చేసుకుని 2020, జూన్ 18న పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ. 5 లక్షలను తీసుకున్నాడు. తరచూ వేధిస్తుండడంతో ఆమె కేఆర్ నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నెలరోజులు జైల్లో ఉండి వచ్చాడు. మైసూరు బాంబూ బజార్కు చెందిన మహిళను గత జూలై 27న కేఆర్ నగర దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నిరోజులకు ఆమెకు భర్త మొదటిపెళ్లి గురించి తెలిసి నిలదీయగా, నీతోనే కాపురం చేస్తా, రూ. 6 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఆమె ససేమిరా అని పెద్దలతో పంచాయతీ పెట్టించింది. ఆమెను పుట్టింటికి పంపించేశాడు. బెంగళూరులో షాదీ.కామ్ అనే వెబ్సైట్ ద్వారా మరో మహిళను పరిచయం చేసుకుని డిసెంబర్ 2న మూడో పెళ్లి చేసుకున్నాడు. కేఆర్ నగర ఇంటిలోనే సంపారం పెట్టాడు. ఇది తెలిసి మొదటి ఇద్దరు భార్యలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు. -
సాధారణ న్యాయవాదులూ న్యాయమూర్తులుగా ఎదగొచ్చు
కందుకూరు: వృత్తిలో సవాళ్లు, ఒత్తిడిలను అధిగమించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా సాధారణ న్యాయవాదులు సైతం న్యాయమూర్తులుగా ఎదగవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పేర్కొన్నారు. తనలాంటి సామాన్యుడికి హైకోర్టు న్యాయమూర్తి పదవి దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ.. కందుకూరు బార్ అసోసియేషన్ సభ్యుడిగా కందుకూరు కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 31 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో పనిచేసిన తరువాత తనకు న్యాయమూర్తిగా అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టుల్లో అవకాశాలు భారీగా పెరిగాయని, ఈ నేపథ్యంలో న్యాయమూర్తిగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. బార్ అసోసియేషన్లు కేవలం కోర్టు విధులు, కోర్టుల్లో సమస్యలకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై కూడా పోరాటం చేయాలని మన్మథరావు కోరారు. నేడు కోర్టులే ప్రజల వద్దకు వస్తుంటే.. బార్ అసోసియేషన్లు ప్రజల వద్దకు ఎందుకు వెళ్లలేవని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జ్యోతిర్మయి, సీనియర్ సివిల్ జడ్జి విజయబాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు. -
కాబోయే వధూవరులు విక్కీ-కత్రీనాలపై రాజస్థాన్లో కేసు
Case File Against Katrina Kaif and Vicky Kaushal In Rajasthan: పెళ్లి వేడుకలు, ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ ఏం జరిగిన బాలీవుడ్ ఫిల్మ్ దునియాలో హాట్ టాపిక్ అవుతాయి. ప్రధానంగా స్టార్ కపుల్స్ వివాహం అంటే చాలు భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఈ క్రమంలో సీక్రెట్గా బాలీవుడ్ లవ్బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఏర్పాట్లు జరగుతున్నాయి. వారి పెళ్లికి సంబంధించిన విషయాలను ఈ జంట గోప్యంగా ఉంచినప్పటికీ ఆ వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాగా రాజస్తాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లా సిక్స్ సెన్సెస్ కోటలో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని టాక్. ఇప్పటికే మెహందీ, సంగీత్లో భాగంగా ఈ జంట రాజస్థాన్కు పయనమైనట్లు సన్నిహిత వర్గాల నుంచి సమచారం. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ రాజస్తాన్లో వీరి పెళ్లి ఏర్పాట్లకు భారీ బందోబస్తును నియమించారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు విక్కీ-కత్రీనాలకు షాకిచ్చారు. రాజస్థాన్కు చెందిన ఓ అడ్వకేట్ ఈ జంటపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా రాజస్థాన్లో చౌత్మాత మందిర్ ఎంత ప్రఖ్యాతిగాంచిందో తెలిసిన విషయమే. నిత్యం భక్తులతో ఈ మందిరం రద్దీగా ఉంటుంది. అయితే విక్కీ-కత్రినాల పెళ్లి ఏర్పాట్లలలో భాగంగా ఈ మందిర్కు వెళ్లే రోడ్డును డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 వరకు తాత్కలికంగా ఈవెంట్ నిర్వాహకులు మూసేశారు. దీంతో స్థానికులు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన నైత్రాబింద్ సింగ్ జాదౌన్ అనే న్యాయవాది జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. చదవండి: ఇండస్ట్రీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్నా.. అయినా కష్టంగా ఉంది: నటుడు ఆవేదన పెళ్లి వేడుకలో భాగంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న అమ్మవారి టెంపుల్ దారిని మూసివేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. తన పిటిషన్లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా మేనేజర్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్తో పాటు జిల్లా కలెక్టర్పై ఫిర్యాదు చేశాడు. అయితే విక్కీ కౌశల్-కత్రీనా పెళ్లికి తాను వ్యతిరేకం కాదని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కేవలం అమ్మవారి టెంపుల్ దారిని మూసివేసిన కారణంగానే తాను ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశాడు. అంతేగాక వెంటనే ఆ దారిని తిరిగి తెరవాల్సిందిగా ఆయన లీగల్ సర్వీసెస్ అథారిటీ కోరారు. -
జస్టిస్ శివశంకర్ మరిన్ని పుస్తకాలు రచించాలి
సాక్షి, అమరావతి: న్యాయవాదులు, న్యాయమూర్తులకు ఉపయుక్తంగా జస్టిస్ డాక్టర్ బులుసు శివశంకరరావు మరిన్ని పుస్తకాలు రచించాలని, ఆయన కలం ఆగకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి ఆకాంక్షించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ శివశంకరరావు రచించిన ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకాన్ని మంగళగిరిలో గురువారం సీజే గోస్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీజే అరూప్ కుమార్ గోస్వామి మాట్లాడుతూ.. ఇటీవల జస్టిస్ శివశంకర్ తనను పుస్తక ఆవిష్కరణకు ఆహ్వానించారన్నారు. ‘ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్’ పుస్తకానికి తొలి పాఠకుడిని తానేనని చెప్పారు. న్యాయవ్యవస్థలోని వివిధ అంశాలను వివరణాత్మకంగా ఈ పుస్తకం ద్వారా అందించారన్నారు. శివశంకర్ పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ఓ మంచి పుస్తకం పది మంది స్నేహితులతో సమానమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి తెలిపారు. ఈ పుస్తకం న్యాయవాద వృత్తిలోకి వచ్చే భవిష్యత్ తరాలకు టార్చ్బేరర్ వంటిది అన్నారు. శివశంకర్, తాను ఇద్దరు గోదావరి జిల్లాలకు చెందినవారమేనని పేర్కొన్నారు. శివశంకర్ రాసిన వర్డ్స్, ప్రిన్సిపిల్స్, ప్రెసిడెంట్స్ పుస్తకం న్యాయవాదులతోపాటు, న్యాయమూర్తులకు కూడా ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఆయన గతంలో రాసిన పుస్తకాలు న్యాయ వ్యవస్థపై సమాచారంతోపాటు జ్ఞానాన్ని అందించాయని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జొయ్మాల్య బాగ్చి, దుర్గాప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాజధాని కేసుల్లో విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో పలువురి అభ్యర్థన మేరకు తదుపరి విచారణను నవంబర్ 15వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఆ తరువాత ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా రోజువారీ పద్ధతిలో విచారణ జరిగేందుకు సహకరించాలని ధర్మాసనం న్యాయవాదులకు తేల్చి చెప్పింది. న్యాయవాదుల వ్యక్తిగత కారణాలు ఏవైనప్పటికీ తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మాట్లాడుకుని ముందు ఎవరు వాదనలు ప్రారంభిస్తారో అందుకు సంబంధించి షెడ్యూల్ను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ విధానంలోనే తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. న్యాయవాదుల నుంచి భిన్న సూచనలు ఈ వ్యాజ్యాల్లో విచారణను సెప్టెంబర్ చివరి వారానికి వాయిదా వేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ అందించామని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ తరఫున జూనియర్ న్యాయవాది సంజయ్ సూరనేని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో విచారణను ఎప్పటికి వాయిదా వేయాలన్న దానిపై కొద్దిసేపు చర్చ జరిగింది. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. సెప్టెంబర్ చివరి వారానికి కోవిడ్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయని, అక్టోబర్ మొదటి వారం నుంచి హైకోర్టుకు దసరా సెలవులు, ఆ తరువాత దీపావళి సెలవులు ఉంటాయని ఏజీ తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో నిరాటంకంగా వాదనలు జరగాల్సి ఉన్నందున విచారణను నవంబర్లో చేపట్టాలని కోరారు. దీనిపైనా న్యాయవాదులు భిన్న సూచనలు చేశారు. పిటిషనర్ల తరఫున హాజరైన సుప్రీంకోర్టు న్యాయవాది దేవదత్ కామత్ జోక్యం చేసుకుంటూ తదుపరి విచారణ సమయంలో ధర్మాసనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమలో తాము మాట్లాడుకుని ఎవరు ఏయే సమయంలో వాదనలు వినిపించాలో నిర్ణయించుకుని కోర్టుకు తెలియచేస్తామని ప్రతిపాదించారు. స్వాగతించిన ధర్మాసనం అత్యధికుల సూచన మేరకు తదుపరి విచారణను నవంబర్ 15కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ దరఖాస్తు చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: న్యాయశాస్త్ర పట్టా పొందిన వారు న్యాయవాదులుగా ఎన్రోల్ చేసుకునేందుకు ఆన్లైన్లోనే దరఖాస్తు సమర్పించవచ్చ ని బార్కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి శనివారం తెలిపారు. ఈ మేరకు కొత్త సాఫ్ట్వేర్ను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తును పరిశీలించి ఆమోదించిన తర్వాత ఏ తేదీన వారికి ఎన్రోల్మెంట్ ఉంటుందో తెలియజేస్తామని, ఆరోజున మాత్రమే బార్ కౌన్సిల్కు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. కార్యదర్శి రేణుక పదవీ విరమణ బార్ కౌన్సిల్ కార్యదర్శి ఎన్.రేణుక శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో 32 ఏళ్లుగా ఆమె బార్ కౌన్సిల్కు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఘంగా రామారావు, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పొన్నం అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బార్ కౌన్సిల్ కార్యదర్శిగా వి.నాగలక్ష్మిని నియమించారు. -
రాష్ట్రాలు దాటొచ్చి.. క్లయింట్ను కోర్టులో హాజరుపరిచేందుకు వెళ్తు..
సాక్షి, గన్నేరువరం (కరీంనగర్): వృత్తిలో భాగంగా రాష్ట్రాలు దాటొచ్చి, క్లయింట్ను కోర్టులో హాజరుపరిచేందుకు వెళ్తున్న రాజస్థాన్కు చెందిన ఓ న్యాయవాది రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని జూలూర్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న రాజేష్కుమార్ పర్వానీ (45)కి హైదరాబాద్కు చెందిన గంగారాం బంధువు. గంగారాంపై శంకరపట్నం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీని విషయమై మంగళవారం ఉదయం హుజూరాబాద్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. ఈ కేసును రాజేష్ కుమార్ పర్వానీ వాదిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఆయన తన క్లయింట్ గంగారాంతో కలిసి కారులో వస్తున్నారు. వీరి వాహనం గుండ్లపల్లి టోల్ప్లాజా వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న రాజేష్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కృష్ణతోపాటు, గంగారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కరీంనగర్ న్యాయవాదుల సంతాపం గుండ్లపల్లి వద్ద మృతిచెందిన వ్యక్తి న్యాయవాది అని తెలుసుకున్న కరీంనగర్ న్యాయవాదులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్రావు ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు ప్రభాకర్రావు, సత్యనారాయణరావు, రాములు, మహేందర్రెడ్డి, శ్రీకాంత్ కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఏసీపీ విజయసారథిని కలిసి వెంటనే పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించాలని కోరారు. ఏసీపీ ఆదేశాల మేరకు సీఐ శశిధర్రెడ్డి, ఎస్సై తిరుపతి ఆస్పత్రికి వచ్చి పంచానామా ముగించారు. కరీంనగర్లో ఉంటున్న రాజస్థాన్కు చెందిన సీనియర్ న్యాయవాది కిరణ్ సింగ్తోపాటు న్యాయవాదులు సంపత్, శ్రీనివాస్లు కేసు నమోదు చేయించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్లో రాజస్థాన్కు పంపించారు. వృత్తి ధర్మంలో భాగంగా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి, మృతిచెందడం బాధాకరమని కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. -
లాయర్ దంపతుల హత్య: విచారణ పూర్తి.. చార్జ్షీట్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులైన గట్టు వామనరావు,నాగమణి హత్యలపై విచారణ వివరాలను తెలపాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా, తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయిందని హైకోర్టుకు విన్నవించారు. అయితే, ఛార్జీషీట్ ఫైల్ చేసారా అన్న ప్రశ్నకు.. గత నెల 19న విచారణను పూర్తి చేసి మంథని లోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్ ముందు చార్జ్షీట్ దాఖలు చేశామని ఏజీ తెలిపారు. ఈ అభియోగపత్రం (చార్జిషీట్)పై విచారణ ఈనెల 10 నుంచి మంథని కోర్ట్లో జరుగుతుందని ఏజీ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యకేసును న్యాయస్థానం సుమోటోగా తీసుకుని విచారిస్తున్నసంగతి తెలిసిందే. చదవండి: ఏడాదిన్నరగా భార్యను, కూతుళ్లను ఇంట్లోనే నిర్భందించాడు! -
లాయర్ దంపతుల హత్య: మే 17లోగా చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణి హత్య కేసులో మే 17 నాటికి 90 రోజులు పూర్తవుతుందని, ఆ లోగా అభియోగపత్రం (చార్జిషీట్) దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. న్యాయవాద దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా గత ఫిబ్రవరిలో సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా దర్యాప్తు పురోగతిని వివరిస్తూ ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదిక సమర్పిం చారు. ఈ కేసులో 32 మంది ప్రత్యక్ష సాక్షులను గుర్తించామని, వారిలో 26 మంది వాంగ్మూలాలను సీఆర్పీసీ సెక్షన్ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని, మిగిలినవారి వాంగ్మూలాలను త్వరలో నమోదు చేస్తామని తెలిపారు. అలాగే ఏడుగురు నిందితుల వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని వివరించారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్కార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని.. ఆ నివేదిక వచ్చేందుకు నాలుగు వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 17న హత్య జరిగిన నేపథ్యంలో మే 17 నాటికి 90 రోజులు అవుతుందని, 17లోగా సమగ్రంగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఇస్తే.. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంటుందని గట్టు వామన్రావు తండ్రి కిషన్రావు తరఫు న్యాయవాది విజయభాస్కర్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. నివేదికపై హైకోర్టు సంతృప్తి.. దర్యాప్తు పురోగతికి సంబంధించి పోలీసుల నివేదిక సంతృప్తికరంగా ఉందని, దర్యాప్తు తీరుతెన్నులపై పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశమని ధర్మాసనం పేర్కొంది. నిర్ణీత గడువులోగా అన్ని ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణలోగా దర్యాప్తుపై స్థాయీ నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. చదవండి: బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు -
బిట్టు శ్రీనుకు ఫోన్ ఇచ్చిన పుట్ట శైలజ, కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడు ఫోన్లో మాట్లాడేందుకు ఆమె తన మొబైల్ ఇచ్చారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, పీవీ నాగమణిల హత్య కేసు నిందితుల్లో ఒకరైన బిట్టు శ్రీనును గత నెల 19వ తేదీన మంథని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అక్కడ బిట్టు శ్రీనుతో మాట్లాడిన మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ.. తన ఫోన్ ద్వారా శ్రీనును వేరే వ్యక్తితో మాట్లాడించినట్లు బందోబస్తుకు వచి్చన రామగుం డం ఆర్ఎస్సై అజ్మీరా ప్రవీణ్ మంథని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులకు రక్షణగా వచ్చిన కానిస్టేబుళ్లు, కోర్టు పీసీ ఫోన్లో మాట్లాడకూడదని వారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ వెళ్లే దారిలో మరోసారి వచి్చన పుట్ట శైలజ ఓ మహిళతో వీడియోకాల్ మాట్లాడించే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో వివరించారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన పుట్ట శైలజపై చర్య తీసుకోవాలని కోరారు. కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరగడంతో మేజిస్ట్రేట్ అనుమతితో మంథని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మార్చి 26న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని మంథని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. పుట్ట శైలజ నిందితుడికి ఫోన్ ఇచ్చి మాట్లాడించారని వామన్రావు తండ్రి గట్టు కిషన్రావు సైతం పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే కేసు నమోదైనా, పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. (చదవండి: రాజన్న సిరిసిల్ల: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం) -
లాయర్ దంపతుల హత్య బాధాకరం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లాయర్ వామన్రావు దంపతుల హత్య చాలా బాధాకరమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశం మంత్రి మాట్లాడుతూ.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తమ పార్టీ చెందినవాడేనని తెలిసి తక్షణమే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. హత్యతో ప్రమేయం ఉన్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా ఉన్నారని, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం తప్పకుండా కృషి చేస్తామని హామీనిచ్చారు. వామన్రావు హత్య కేసును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. న్యాయవాదుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది తెలంగాణ న్యాయవాదులేనని ప్రశంసించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. హైకోర్టు విభజన కోసం సీఎం కేసీఆర్ దాదాపు 10 సార్లు ప్రధాని మోదీని కలిశారని, విభజన జరిగాకే తెలంగాణకు తగిన న్యాయం జరిగిందన్నారు. ఆరున్నరేళ్లలో వ్యవసాయమే అబ్బురపడేలా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ పథకాలను ప్రధాని మోదీ కాపీ కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలు సంతోషంగా ఉండాలనే పెన్షన్లతో సహా ఎన్నో సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్నామన్నారు. కేజీ టూ పీజీ విద్యపై కొందరు అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని,సంక్షేమ గురుకులాల్లో ఈ పథకం ఇప్పటికే నడుస్తోందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్పై కొందరు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని, అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. కనీసం ఆయన వయసుకి గౌరవం ఇవ్వకుండా పరుష పదజాలంతో మాట్లాడటం బాధ కలిగిస్తోందన్నారు. కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ లేవని పేర్కొన్నారు. చదవండి: ‘ఎన్డీయే.. నో డేటా అవైలబుల్’ -
న్యాయవాదుల హత్యపై సీఎం స్పందించాలి
నిజామాబాద్ లీగల్: హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్యలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు స్పందించకుండా తన బాధ్యతలను విస్మరిస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. వామన్రావు, నాగమణిల హత్యలను నిరసిస్తూ సోమవారం నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు రిలే నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈ శిబిరానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్రెడ్డి రాష్ట్రంలో అన్ని రాజకీయ పారీ్ట లు ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తే, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ నోరు మోదపటం లేదన్నారు. సీఎంగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్కు లేదని ధ్వజమెత్తారు. ఈ హత్యలతో సంబంధం ఉన్న వారు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐకి అప్పగించాలి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ హత్యల విచారణకు సీబీఐకి అప్పగించాలని కోరిందని, అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కేసులో బిట్టు శ్రీను కుట్రదారుడిగా నిరూపితమయ్యిండని, పుట్ట మధును పోలీసులు ప్రశ్నించాలన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయటంలేదని, పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సీఎం స్పందించి ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించేలా విచారణకు ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్రెడ్డి, నిజామాబాద్ బార్ అధ్యక్షుడు గోవర్ధన్, కార్యదర్శి శ్రీధర్,డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, మహేశ్కుమార్గౌడ్, నాయకులు తాహెర్బిన్ హందాన్, నగేశ్రెడ్డి పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలపై హామీ ఇవ్వాలి మోర్తాడ్: రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం రోజుకో విధమైన ప్రకటన చేస్తూ రైతులను ఆందోళనకు గురిస్తోందన్నారు. సెంటర్లను నిర్వహించడమే కాకుండా రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. సోమవారం ఏర్గట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. పైకి కేంద్రంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో కొత్త వ్యవసాయ చట్టాల అమలుకు అడుగులు వేస్తుండడాన్ని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. చదవండి : (న్యాయవాదుల హత్య: కీలక ఆధారాలు లభ్యం) (న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్) -
న్యాయవాదుల హత్య: కీలక ఆధారాలు లభ్యం
సాక్షి, పెద్దపల్లి : హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసు నిందితులు ఉపయోగించిన ఆయుధాల వెలికితీత ఆపరేషన్ ముగిసింది. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం పెద్దపల్లి జిల్లా సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీలో 2 రోజులు సుమారు 10 నుంచి 15 మీటర్ల లోతున్న నీటిలో శ్రమించి రెండు కత్తులను బయటకు తీశారు. ఆదివారం ఆయుధాలు లభ్యం కాకపోవడంతో సోమవారం మళ్లీ ఇద్దరు నిందితులను బ్యారేజీ వద్దకు తీసుకొచ్చారు. ఓ పక్క డైవర్స్ గాలింపు చేస్తుండగానే, పోలీసులు 3 కిలోల బరువున్న 5 అయస్కాంతాలను తెప్పించారు. స్థానికుల సాయంతో నీటిలో వెతికించారు. సాయంత్రం సమయంలో 53–54వ పిల్లర్ల మధ్యలో రెండు కత్తులను డైవర్లు కనుగొని.. బయటికి తెచ్చారు. ఆ కత్తులను నిందితులకు చూపించగా అవేనని అంగీకరించారు. పంచనామా నిర్వహించిన తర్వాత కత్తులను రామగుండం పోలీస్ కమిషనరేట్కు తరలించారు. జ్యుడీషియల్ కస్టడీకి బిట్టు శ్రీను మంథని: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు బిట్టు శ్రీను జ్యుడీషియల్ కస్టడీకి పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అనుమతి ఇచ్చింది. హత్య కేసులో శ్రీనును గత నెల 22న అరెస్టు చేసిన పోలీసులు 23న అర్ధరాత్రి దాటిన తర్వాత రిమాండ్కు తరలించారు. శ్రీనును తమ కస్టడీకి ఇవ్వాలని రామగిరి పోలీసులు శనివారం మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం వాదనల అనంతరం ఏడు రోజుల కస్టడీకి మంథని జడ్జి అనుమతి ఇచ్చారు. ఇదే కేసులో ఏ1, ఏ2, ఏ3 నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ల ఏడు రోజుల జ్యుడీషియల్ కస్టడీ గడువు ఈ నెల 4తో ముగుస్తుంది. చదవండి! న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్ ‘కేసీఆర్కు పుట్టా మధు సన్నిహితుడు’ -
న్యాయవాదుల హత్య: పోలీసుల తీరుపై హై కోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతులు హత్యపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీస్శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. ఏ2, ఏ3ల స్టేట్మెంట్ని ఎందుకు సెక్షన్ 164 కింద ఇంకా నమోదు చేయలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ని ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. బాధితులను అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని అడిగారు. మెజిస్ట్రేట్ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, కాల్డాటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీపీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదన్న హైకోర్టు ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులకు ఎటువంటి రక్షణ కల్పించారో తెలపాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీసీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. ఇందుకు పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్మెంట్ రికార్డు చేశారని ఏజీ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపిన ఏజీ.. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు. నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందన్నారు. అందుకే సీఆర్పీసీ సెక్షన్ 161 కింద స్టేట్మెంట్ రికార్డు చేశామని తెలిపారు. పూర్తి సాక్ష్యాలు సేకరించడానికి గాను మరో రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15కు వాయిదా వేసింది. పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్య ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది. చదవండి: న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్ న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు -
కలకలం రేపుతున్న ఆడియో టేపు
-
న్యాయవాదుల హత్య కేసు: వామన్రావు ఆడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో దారుణ హత్యకు గురైన న్యాయవాది గట్టు వామన్ రావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం సృష్టిస్తుంది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై గట్టు వామన్ రావు మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని, నీతిలేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా దుద్దిళ్ల శ్రీపాద రావు కుటుంబానికి దూరంగా ఉన్నానని, నేనంటే ఏమిటో చూపిస్తానని తెలిపారు. నీవు పోటీ చేస్తే నాకు ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరాడని, ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన బిక్షే అంటూ వామన్ రావు కామెంట్ చేశారు. పుట్ట మధు, శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని వారంతా మీకు అండగా నిలుస్తారని మరో వ్యక్తి వామన్ రావుతో చెప్పారు. చాలా రోజుల క్రితం రికార్డు అయిన ఆడియో ఇప్పుడు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు సంచలన విషయాలు వెల్లడించిన బిట్టు శ్రీను! -
న్యాయవాదుల హత్య: పోలీసులపై విమర్శలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు తీరుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. జంట హత్యలు జరిగి పది రోజులు గడిచినా పురోగతి కనిపించట్లేదని దుయ్యబడుతున్నాయి. పోలీసులు మాత్రం తమకు లభించిన ఆధారాల మేరకే దర్యాప్తు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గొడవలు, వ్యక్తిగత కక్షలే హత్యలకు కారణమనే కోణంలోనే కేసు దర్యాప్తు జరుగుతోందని ప్రతిపక్షాలు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ కోణం బహిర్గతం కాలేదని పోలీసులు చెబుతున్నారు. జెడ్పీ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీను హత్యకు సహకరించినా.. అది వ్యక్తిగత వైరంతోనే అని పోలీసులు చెబుతున్నారు. కాగా, భవిష్యత్తులో కేసును సీబీఐకి లేదా సిట్కు బదిలీ చేసినా, తమ దర్యాప్తును తోసిపుచ్చకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. జ్యుడీషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి వచ్చిన ముగ్గురు నిందితులు కూడా విచారణలో కొత్త విషయాలు వెల్లడించట్లేదని తెలుస్తోంది. అరెస్టయినప్పుడు చెప్పిన కారణాలనే పునరావృతం చేస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామ కక్షలపైనే ఫోకస్ గట్టు వామన్రావు దంపతుల హత్యకు సొంత గ్రామం గుంజపడుగులో నాలుగు నెలల కిందటే ప్లాన్ వేసినా.. గ్రామంలో జనం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదని విచారణలో తేలినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గ్రామంలో తన సొంత సోదరుడి చేతిలో సర్పంచిగా ఓడిపోయిన తనను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా.. పెద్దమ్మ దేవాలయ నిర్మాణాన్ని, తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నాడనే కసి కుంట శ్రీనివాస్లో ఉంది. గ్రామంలోని శ్రీ రామస్వామి గోపాలస్వామి దేవాలయ కమిటీ విషయంలో ఏర్పడ్డ వివాదాలకు కూడా గట్టు వామన్రావు కారణమని భావించి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మేనల్లుడు బిట్టు శ్రీనుతో కలసి హత్యకు ప్లాన్ చేశాడనేది పోలీసుల వాదన. ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా ఈ కోణంలోనే కన్పిస్తున్నాయి. గురువారం రామగుండం సీపీ కార్యాలయంలో ఆలయ కమిటీ వివాదంపై విచారణ జరిపారు. రెండు ఆలయాల్లో కమిటీ సభ్యుల్లో బ్రాహ్మణ, ముదిరాజ్, మున్నూరు కాపు, ఎస్సీ తదితర సామాజికవర్గాల వారు ఉన్నారు. గ్రామంలో నెలకొన్న మూడు వివాదాల చుట్టే పోలీసులు కేసును నడిపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిట్టు శ్రీనుకు చంపించేంత కక్ష ఉందా? సోదరుడి చేతిలో అవమానాల పాలు కావడం, ఇల్లు, గుడి నిర్మాణాలను నిలిపివేయించడం, ఓ దేవాలయం కమిటీ విషయంలో అడ్డంకులు సృష్టించడం వంటి కారణాలతో గట్టు వామన్రావును చంపాలని కుంట శ్రీను కక్ష పెంచుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ హత్యలో పాలుపంచుకున్న బిట్టు శ్రీనుకు మాత్రం అంత కక్ష ఎందుకు పెంచుకున్నాడనే విషయంలో పోలీసులు చెబుతున్న కారణాలు అంత బలంగా లేవు. నెలకు రూ.30 వేల రాబడి వచ్చే చెత్త ట్రాక్టర్ కాంట్రాక్టు రద్దు, పుట్ట లింగమ్మ ట్రస్ట్లో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, కేసులు వేయడంతోనే గట్టు వామన్రావుపై కక్ష పెంచుకున్నాడని బిట్టు శ్రీనుపై అభియోగాలు మోపారు. అయితే ఇక్కడే పోలీసులు విచారణ లోతుగా జరపట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక క్వారీలు, ఇతరత్రా అక్రమాల్లో రూ.వందల కోట్లు ఆర్జించారని కోర్టుల్లో దావాలు వేసిన గట్టు వామన్రావు.. ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. దళిత యువకుడి హత్య కేసు అందులో ప్రధానమైంది. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆదాయ మార్గాలేంటి? ఇందులో అవకతవకలు జరిగాయని హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వామనరావు ఫిర్యాదులు చేశారు. ఈ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న బిట్టు శ్రీనుకు ఇక్కడే కక్ష పెరిగిందని అర్థమవుతోంది. ఈ కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపితే కొత్త కోణాలు ఏవైనా బయటకు వస్తాయో చూడాలి. పోలీసుల కస్టడీలో ముగ్గురి విచారణ జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న ముగ్గురు ప్రధాన నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్లను తమ కస్టడీలోకి తీసుకొని రామగుండం కమిషనరేట్లో పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ అశోక్కుమార్ నేతృత్వంలో సీసీఎస్ పోలీసులు వివిధ కోణాల్లో వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా, హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో పడవేసిన నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు గజ ఈతగాళ్లను విశాఖపట్నం నుంచి రప్పించినట్లు తెలిసింది. వీరు శనివారం సుందిళ్ల బ్యారేజీలోకి దిగనున్నారు. -
న్యాయవాదుల హత్య: నేడు కత్తుల వెలికితీత
గోదావరిఖని/వరంగల్: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణిల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నెల 17న వారిద్దరూ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ను రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వరంగల్ జైలుకు వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య రామగుండం పోలీస్ కమిషనరేట్కు తరలించారు. జైలు నుంచి నిందితులను రామగుండం తరలించేసరికి సాయంత్రం కావడంతో హత్యకు ఉపయోగించిన కత్తుల వెలికితీతను వాయిదా వేశారు. కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేసిన విషయం తెలిసిందే. పది మీటర్ల లోతులో ఉన్న వీటిని శుక్రవారం వెలికితీయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు జంటహత్యల్లో ఎవరి పాత్ర ఏమిటి, సహకరించిందెవరనే దానిపై మరింత లోతుగా విచారించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుపై హైకోర్టు, గవర్నర్ సైతం స్పందించడంతో పోలీసులు ప్రతీదీ సాక్ష్యాధారాలతో సహా సేకరిస్తున్నారు. చదవండి: ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?! -
ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?!
ప్రజాస్వామ్య భారతదేశంలో విద్వేషాలకు, దౌర్జన్యాలకు, హింసలకు ఆశ్రయం కల్పిస్తున్న కొందరు స్వార్ధ రాజకీయనేతల చెడు ఆలోచనలను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైనది. న్యాయవాద వృత్తి అత్యంత పవిత్రమైన వృత్తి. సామాజిక అభివృద్ధిలో న్యాయవాదుల పాత్ర చాలా క్రియాశీలమైనది. ఒకరకంగా చెప్పాలంటే న్యాయవాదులు సామాజిక ఇంజ నీర్లు. ప్రజాజీవితంలో అన్ని వర్గాలవారితో ఉండే సత్సంబంధాలు, సాన్నిహిత్యాల వల్ల వారికి ప్రజాజీవి తంతో విడదీయలేని అనుబంధం ఉంటుంది. మన దేశ స్వాతంత్ర పోరాట సమయంలో న్యాయవాదుల పాత్ర చాలా క్రియాశీలమైనది. వారి ఆలోచనలు, కార్యాలు, త్యాగాల ఫలితమే దేశ స్వాతంత్య్రం. అలాంటి న్యాయవాదులకు సరైన భద్రత, రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యత మన సభ్యసమాజంలో ప్రతి ఒక్కరిదీ. న్యాయవాదులు కక్షిదారులకు న్యాయం చేకూర్చే విధిలో ఉంటూ న్యాయాన్ని అందించాలనే ఒక బృహత్తర కార్యంలో అహర్నిశలు పని చేస్తుంటారు. ప్రజాప్రయోజనాలకోసం, కక్షిదార్లకు న్యాయం చేకూర్చడానికి తమ అమూల్యమైన సమయాన్ని, మేధోశక్తిని వెచ్చిస్తూ ఎంతో అంకితభావంతో పని చేస్తూంటారు. ఒక గురుతర బాధ్యతతో తమ సేవలను సమాజ శ్రేయస్సుకు వెచ్చించేవారు న్యాయవాదులు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు ఆయన సతీమణి నాగమణిని రోడ్డు మార్గంలో వెళుతుండగా అడ్డగించి అత్యంత పాశవికంగా వధిం చడం యావత్ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. గట్టు వామనరావు తన స్వగ్రామం మంథని నియోజకవర్గంలో ఉన్న గుంజపడుగు గ్రామంలో జరుగుతున్న అవినీతి కార్యకలాపాలపై ఒక గ్రామస్తుడిగా, వృత్తిరీత్యా ఒక న్యాయవాదిగా అడ్డుకొని ప్రశ్నించేసరికి అక్కడి స్థానిక రాజకీయనాయకులకు మింగుడు పడకుండా పోయింది. వారు చేస్తున్న అక్రమాలపై, అన్యాయాలపై, ఆరాతీస్తూ, ప్రజాప్రయోజనాల వాజ్యాలు, సివిల్, క్రిమినల్ కేసుల ద్వారా చట్టపరంగా, న్యాయపరంగా వారి దురాక్రమణలను నిలువరిస్తుండటమే గట్టు వామనరావు దంపతుల తప్పయిపోయింది. న్యాయపరంగా ఆ కేసులను ఎదుర్కునే శక్తి లేక దుండగులు నిరాయుధులైన వారిని హత్య చేశారు. వామనరావు దంపతులు తమపై దాడి జరగనుందని ముందే ఊహించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించవలసినదిగా స్థానిక పోలీసులను కోరినా వారు పట్టించుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతమిచ్చినట్టయ్యింది. స్థానిక పోలీసులు సరైన సమయంలో చర్యతీసుకుని ఉంటే ఈరోజు గట్టు వామనరావు దంపతులు బతికి ఉండేవారేమో మరి. ప్రజల ప్రాణాలకు అండగా తాము ఉన్నామని భరోసా కల్పించే రక్షకభట వ్యవస్థ సరైన సమయంలో, జవాబుదారిగా వ్యవహరించి ఉంటే ఈరోజు ఈ దారుణాన్ని చూసివుండేవాళ్లం కాదు. ఒక మహిళా న్యాయవాదిని అత్యంత అమానుషంగా హత్య చేయటమే దారుణం కాగా, ఈ హత్యోదంతం జరుగుతున్నప్పుడు అటుగా వెళుతున్న రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, ఇతర వాహనదారులు చోద్యం చూస్తూ కూర్చోవడం షాక్ కలిగిస్తోంది. గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో ఎటువంటి భేషజాలు లేకుండా.. నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులు ఎంతటివారైనాసరే కఠిన శిక్షను విధించి అతి త్వరలో వాటిని అమలు చేసేలా చర్యలను తీసుకోవాలి. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే విధంగా కేసును సీబీఐకి అప్పగిస్తే దోషులందరికి శిక్షపడేలా చేయవచ్చు. న్యాయవాదులపై ఇలాంటి నేరాలు పునరావృత్తం కాకుండా ఉండటానికి న్యాయవాదుల రక్షణ చట్టంను తీసుకువచ్చి అమలు చేయాలి. ప్రజాప్రయోజన వాజ్యాల రూపంలో అన్యాయాలను ప్రశ్నించే గొంతుకలను కాలరాస్తున్న నేరగాళ్ళను అన్ని పార్టీలనుండి బహిష్కరించి వారి కార్యకలాపాలపై డేగ కన్ను వేసి ఉంచే బాధ్యత ప్రతి ఒక్క రాజకీయపార్టీపై ఉంది. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు రాజకీయపార్టీ సభ్యులందరికి క్రమశిక్షణా తరగతులను నిర్వహిం చాలి. సమాజ శ్రేయస్సుకు ఏ రకమైన విలువలతో కృషి చేయాలో, అలాంటి మంచి విలువలతో కూడిన రాజకీయ శిక్షణాతరగతులను బోధించే సంస్కరణలకు ప్రతి రాజకీయ పార్టీ పూనుకోవలసి ఉంది. కె. శివచరణ్ అడ్వకేట్ మొబైల్ : 95158 90088 -
3 నిమిషాల ముందు వెళ్లి.. 5 నిమిషాల్లో హత్య చేసి..
సాక్షి, కరీంనగర్: న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు, నాగమణి హత్యలకు నిందితులు రెండు గంటల్లోనే ప్లాన్ చేసి అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్యకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను నిందితుల ‘రిమాండ్ కేస్ డైరీ’లో వివరించారు. వామన్రావు దంపతుల కన్నా 3 నిమిషాల ముందు మాత్రమే నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి నల్ల బ్రీజా కారులో వెళ్లి కల్వచర్ల వద్ద మాటు వేసినట్లు వీడియో ఫుటేజీల్లో రికార్డు అయిన సమయాన్ని విశ్లేషిస్తే తెలుస్తోంది. హత్యాకాండను ఐదారు నిమిషాల్లోనే పూర్తిచేసి తిరిగి మంథని వైపు వెళ్లినట్టు తేలింది. 2.26 గంటల నుంచి... హత్య జరిగిన 17వ తేదీ మధ్యాహ్నం 2:26.38 గంటలకు నిందితులు ఉపయో గించిన నంబర్ లేని బ్రీజా కారు పొన్నూరు క్రాస్రోడ్స్లో కనిపించింది. 2:27 గంటలకు సెంటినరీ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వద్దకు వచ్చింది. వీరి వెనుకే గట్టు వామన్రావు దంపతులు ప్రయాణిస్తున్న క్రెటా కారు 2:29 గంటలకు పొన్నూరు క్రాస్రోడ్స్ వద్ద పెద్దపల్లి వైపు వెళ్లగా 2:30.09 గంటలకు తెలంగాణ చౌరస్తా వద్ద క్రాస్ అయింది. అంటే, నిందితుల కారుకు, న్యాయవాద దంపతుల కారుకు మధ్య నున్న సమయ వ్యత్యాసం 3 నిమిషాలే. తెలంగాణ చౌరస్తా నుంచి హత్య జరిగిన ప్రాంతానికి రెండున్నర కి.మీ. దూరం ఉండగా కారులో 2 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంది. దీనిని బట్టి హత్య 2:32 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ఐదారు నిమిషాల్లోనే హత్యలు చేసి నిందితులు తిరుగు ప్రయాణమై సీసీటీవీ ఫుటేజీల్లో చిక్కారు. 2:41 గంటలకు హత్యకు వాడిన బ్రీజా కారు తెలంగాణ చౌరస్తాలోకి చేరుకోగా, వీరిని వెంబడించిన కుంట శ్రీనివాస్కు చెందిన వైట్ క్రెటా కారు కూడా 2:42 గంటలకే తెలంగాణ చౌరస్తాలో కనిపించింది. బిట్టు శ్రీనుకు కుంట శ్రీను కాల్.. వామన్రావు దంపతులు మంథని కోర్టుకు రావడాన్ని కుంట శ్రీనివాస్ 17న మధ్యాహ్నం 12:45 గంటలకు బిట్టు శ్రీనుకు చెప్పినట్టు ఫోన్కాల్డేటాను బట్టి తెలుస్తోంది. దీన్ని నిర్ధారించుకోమని బిట్టు శ్రీను అనడంతో కుంట శ్రీనివాస్.. పూదరి లచ్చయ్యకి కాల్ చేసి వామన్రావు వచ్చాడో లేదో చెప్పాలన్నాడు. దీంతో 12:47 గంటలకు లచ్చయ్య కాల్ చేసి వామన్రావు రాకను నిర్ధారించాడు. అప్పుడు కుంట శ్రీనివాస్ మంథని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లొకేషన్ నుంచి మాట్లాడినట్టు కాల్డేటా ఆధారంగా గుర్తించారు. అప్పటి నుంచి ఫోన్ కాల్స్ ద్వారానే కుంట శ్రీనివాస్(ఏ1), బిట్టు శ్రీను(ఏ4), పూదరి లచ్చయ్య(ఏ5), చిరంజీవి (ఏ2), కుమార్ (ఏ3)లు మాట్లాడుకుంటూ ఉన్నారు. హత్యకు ముందు 2:15 గంటలకు చిరంజీవికి చివరి ఫోన్కాల్ చేసిన కుంట శ్రీనివాస్.. అతడిని తీసుకుని కారులో 17 నిమిషాల్లోనే స్పాట్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. గుంజపడుగులో పోలీసుల విచారణ.. హత్యకు గ్రామంలోని కక్షలే కారణమని నిందితులు పేర్కొనడంతో మంథని మం డలం గుంజపడుగులో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన బాబు, రఘు, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కరీంనగర్ జైలులో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్లను భద్రతా పరమైన కారణాల నేపథ్యంలో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. -
లాయర్ తలకు తుపాకీ గురి.. భూవివాదం
సాక్షి, హైదరాబాద్: భూ వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో తాము కేసు ఓడిపోవడానికి న్యాయవాదే కారణమని భావించిన కక్షిదారులు దారుణానికి తెగబడ్డారు. సదరు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతవారం జరిగిన ఈ విషయాన్ని అధికారులు రహస్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమాయత్నగర్ స్ట్రీట్ నంబర్ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. దీంతో కక్షకట్టిన వాళ్లు ఈ నెల 17 సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించి బాహాబాహీకి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. అక్కడకు చేరిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీస్తుండటాన్ని గమనించిన వాళ్లు వెనక్కు తగ్గారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం, సెక్టార్ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది.