పట్టాల పంపిణీలో హోం మంత్రి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం నగరంలోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న బలిజ సంఘంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి ప్రసంగించారు. అనంతరం అర్హులైన పేదలకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు.