టీఆర్ఎస్లో చేరితే పవిత్రులు, బీజేపీలో చేరితే పాపులా? | Kishan Reddy slams trs for meaningless comments | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో చేరితే పవిత్రులు, బీజేపీలో చేరితే పాపులా?

Sep 2 2014 11:51 AM | Updated on Mar 29 2019 9:24 PM

టీఆర్ఎస్లో చేరితే పవిత్రులు, బీజేపీలో చేరితే పాపులా? - Sakshi

టీఆర్ఎస్లో చేరితే పవిత్రులు, బీజేపీలో చేరితే పాపులా?

టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  మూడు పార్టీలు మారిన మైనంపల్లి హన్మంతరావును టీఆర్ఎస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్లో చేరితే పవిత్రులు...బీజేపీలో చేరితే పాపులా అని కిషన్ రెడ్డి అని ఘాటుగా స్పందించారు.

 

టీఆర్ఎస్కు జై కొడితే తెలంగాణవాదులు... జై కొట్టినివారు తెలంగాణ ద్రోహులా అని వ్యాఖ్యానించారు.  కొండా సురేఖ టీఆర్ఎస్లో చేరగానే పునీతమైనట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీపై విమర్శలు చేసే అర్హత టీఆర్ఎస్కు లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement