తెలంగాణ రాజధాని నగరంలో విదేశీ భవన్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నంబర్ 83/1లో మూడెకరాల స్థలాన్ని కేటాయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణ రాజధాని నగరంలో విదేశీ భవన్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నంబర్ 83/1లో మూడెకరాల స్థలాన్ని కేటాయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ఈ కార్యాలయాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు నిధులు విడుదల చేసిన ఆ శాఖ స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి అనుగుణంగా రాయదుర్గంలో స్థలాన్ని సూచిస్తూ రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.