నేడు వామపక్షాల మహాధర్నా | Left parties dharna for farmers suicides today | Sakshi
Sakshi News home page

నేడు వామపక్షాల మహాధర్నా

Published Thu, Dec 11 2014 6:24 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

Left parties dharna for farmers suicides today

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద 10 వామపక్షాలు మహాధర్నాను నిర్వహించనున్నాయి. ఈ ధర్నాలో వామపక్షాలతో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులతో పాటు, రైతు సంఘాల ప్రతి నిధులు పాల్గొంటారు. రైతులసమస్యలపై అసెంబ్లీలో, బయటా ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడం, నిర్దిష్ట మైన కార్యాచరణను ప్రకటించకపోవడాన్ని ఎండగడుతున్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల భరోసాయాత్రకు మంచి స్పందన వచ్చిందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement