ప్లాస్టిక్ కంపెనీ యజమాని ఆత్మహత్య | man suicide due to financial problems | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ కంపెనీ యజమాని ఆత్మహత్య

Published Thu, Oct 15 2015 1:16 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

man suicide due to financial problems

జీడిమెట్ల: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సుబాష్‌నగర్‌లో సుమన్ ప్లాస్టిక్ కంపెనీ యజమాని మలారం చౌదరి(45) గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్‌లో రాశాడు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement