'ఏపీ సర్కార్ ఒక్కరైతుకైనా రుణహాఫీ చేసిందా?' | Minister harish rao question Andhra pradesh government over loan waiver | Sakshi
Sakshi News home page

'ఏపీ సర్కార్ ఒక్కరైతుకైనా రుణహాఫీ చేసిందా?'

Nov 10 2014 11:20 AM | Updated on Oct 1 2018 2:03 PM

'ఏపీ సర్కార్ ఒక్కరైతుకైనా రుణహాఫీ చేసిందా?' - Sakshi

'ఏపీ సర్కార్ ఒక్కరైతుకైనా రుణహాఫీ చేసిందా?'

మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

హైదరాబాద్ : మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాల ప్రశ్నకు హరీష్ రావు సమాధానం ఇస్తూ  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రైతుకైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు.

 

పొరుగు రాష్ట్రం డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేయటం లేదని ఆయన అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. . ఆంధ్రా ప్రభుత్వం లాగా మాట తప్పటం తమ ప్రభుత్వ విధానం కాదని హరీష్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రైతులకు రూ.8,123 కోట్లు మంజూరు చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement