శ్రీకంఠమహేశ్వరుడి సన్నిధిలో మంత్రి పూజలు | minister jagadeesh reddy Worship in srikantamaheshwaraswamy temple | Sakshi
Sakshi News home page

శ్రీకంఠమహేశ్వరుడి సన్నిధిలో మంత్రి పూజలు

Published Sat, Jun 13 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

minister jagadeesh reddy Worship in srikantamaheshwaraswamy temple

ఆత్మకూర్ (ఎస్) : మండల కేంద్రంలోని శ్రీకంఠమమహేశ్వరస్వామి ద్వితీయ కల్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గౌడ కులస్తులు ఈ సందర్భంగా మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కంఠమహేశ్వరస్వామి-సురమాంబదేవిల సన్నిధిలో పూజలు చేసిన తర్వాత మంత్రిని పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. దీంట్లోభాగంగా స్థానికులు స్వామివారికి బోనాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కసగాని లక్ష్మిబ్రహ్మంగౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తేరా చిన్నపరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, వై.వెంకటేశ్వర్లు, కాకి దయాకర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గునగంటి శ్రీను, బట్టిపెల్లి వెంకన్న, వెంకట్రాములు, గునగంటి వెంకన్న, భిక్షం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement