వేధింపులపై టీఆర్ఎస్ నేత ఆందోళన | MLA harassments: TRS leader protest in mahabubnagar  | Sakshi
Sakshi News home page

వేధింపులపై టీఆర్ఎస్ నేత ఆందోళన

Published Sat, Oct 7 2017 11:03 AM | Last Updated on Wed, Sep 26 2018 6:15 PM

 MLA harassments: TRS leader protest in mahabubnagar  - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నాడంటూ టీఆర్ఎస్ పార్టీ నేత ఆందోళన చేపట్టాడు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ శనివారం ఉదయం స్థానిక టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ మరికల్ గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఎమ్మెల్యే వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలన్నాడు.

కాగా శ్రీనివాస్ పెట్రోల్ బాటిల్ పట్టుకుని సెల్‌ టవర్‌ పై ఆందోళన చేస్తుండటంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది సెల్‌టవర్ దగ్గరకు చేరుకుని శ్రీనివాస్‌ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement