నల్గొండ: నడిగూడెం మండలంలోని నారాయణపురం క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. వివరాలు...రెండు ద్విచక్ర వాహనాలు నారాయణపురం క్రాస్ వైపుకు వస్తుండగా మలుపు తిరిగే ప్రయత్నంలో రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం శనివారం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సిరిపురానికి చెందిన తాళ్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. రెండు ద్విచక్ర వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి.
(నడిగూడెం)
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి పరిస్థితి విషమం
Published Sat, Mar 14 2015 9:07 PM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement