bikes
-
భారత్లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్తో మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.హీరో ఎక్స్పల్స్ 210 (Hero XPulse 210)ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా అందిస్తుంది.కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్, పొడవైన విండ్స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదురాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
రైతు మెచ్చిన ‘మెకానిక్’
కందుకూరు రూరల్: మెకానిక్ షేక్ హజరత్ వలి.. చదివింది తక్కువే.. అయినా తన నైపుణ్యంతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. పాత బైకులు, సైకిళ్లతో విభిన్న వ్యవసాయ పరికరాలు తయారు చేస్తూ.. రైతుల మన్ననలు పొందుతున్నాడు. వాటిని అతి తక్కువ ధరకే అన్నదాతలకు అందజేసి.. అందరి అభిమానం చూరగొంటున్నాడు. బైక్ మెకానిక్గా మొదలుపెట్టి..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలోని ఎడ్లూరుపాడుకు చెందిన షేక్ హజరత్ వలి ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నాడు. ఆ తర్వాత బైక్ మెకానిక్ పని నేర్చుకొని.. ఇంటి వద్దే చిన్న షాపు ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం లేత్ మిషన్ కొనుగోలు చేసుకొని.. వెల్డింగ్ పనులు చేస్తూ మల్టీపర్పస్ షాపుగా మార్చుకున్నాడు. రైతుల కష్టాన్ని కళ్లారా చూసిన హజరత్వలి.. ఖాళీ సమయంలో చిన్నచిన్న వ్యవసాయ పరికరాలు తయారు చేసి వారికి అందిస్తుండేవాడు. ఈక్రమంలో పాత బైక్ ఇంజన్తో మల్టీపర్పస్ వ్యవసాయ యంత్రాన్ని తయారు చేశాడు. దానికి సరిగ్గా సరిపోయేలా గొర్రును కూడా తయారుచేసి.. రైతులకు మరింత చేరువయ్యాడు. మెకానిక్ షాపును కాస్తా ‘అగ్రికల్చర్ ఫార్మింగ్ టూల్స్’గా మార్చేశాడు. పాత బైక్తో నూతన యంత్రం..ఎవరైనా పాత బైక్ను తీసుకెళ్లి హజరత్ వలికి ఇస్తే.. దానికి ఆరు చెక్కల గొర్రు అమర్చి.. నాలుగు చక్రాలు, మూడు చక్రాలు ఏర్పాటు చేసుకునే విధంగా తయారు చేసి ఇస్తున్నాడు. పొగాకు, మిరప, బొబ్బాయి, అరటి, పత్తి తదితర పంటల్లో దున్నేందుకు వీలుగా ఉంటుంది. గొర్రు, గుంటక, నాగలి వంటివి ఆ బైక్కు అమర్చుకోవచ్చు. ఒక లీటర్ పెట్రోల్తో ఒకటిన్నర ఎకరా పొలం దున్నుకోవచ్చని హజరత్ వలి చెబుతున్నాడు. ఈ యంత్రం తయారీకి రూ.15 వేలు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇలా ఇప్పటికే 20 యంత్రాలు తయారు చేసి రైతులకు అందజేసినట్లు వెల్లడించాడు.పారిశుధ్య కార్మికులకుసాయంగా..పారిశుధ్య కార్మికులకు సాయంగా ఓ పరికరాన్ని కూడా హజరత్ వలి తయారు చేశాడు. చెత్తాచెదారంతో పాటు దుర్వాసన వెదజల్లే ఏ వ్యర్థాన్ని అయినా పారిశుధ్య కార్మికులు చేతితో పట్టుకోకుండా.. తాను తయారు చేసిన పరికరం ద్వారా చెత్తబుట్టలో వేయొచ్చని వలి చెప్పాడు. పది కిలోల బరువును సులభంగా తీసి చెత్తబుట్టలో వేయొచ్చని తెలిపాడు. తన వద్ద కొనుగోలు చేసిన యంత్రాలు ఏవైనా మరమ్మతులకు గురైతే.. వాటిని బాగు చేసి ఇస్తానని తెలిపాడు.ప్రభుత్వం సహకారం అందిస్తే మరింతగా రాణిస్తారైతులకు తక్కువ ఖర్చుతో వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తేవడమే నా లక్ష్యం. అయితే నా దగ్గర చాలా ఆలోచనలు ఉన్నా.. తగినంత డబ్బు లేదు. అందుకే కేవలం పాత సామగ్రితో అతి తక్కువ ఖర్చుతో రైతులకు యంత్రాలు, పరికరాలు తయారు చేసి ఇస్తున్నా. ప్రభుత్వం నుంచి సహకారం అందితే మరిన్ని యంత్రాలు తయారు చేస్తా. రైతులు ఎవరైనా అతి తక్కువ ధరకు పరికరాలు కావాలంటే 75699 72889 నంబర్ను సంప్రదించవచ్చు. – షేక్.హజరత్వలి, మెకానిక్ -
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
-
భారత్లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!
మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. క్రూయిజర్ మోటార్సైకిళ్లకు కూడా జనాదరణ లభిస్తోంది. దీంతో చాలామంది ఈ బైకులను కొనొగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న టాప్ 5 బెస్ట్ క్రూయిజర్ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175)భారతదేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్ బైకులలో కవాసకి డబ్ల్యు175 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 1.22 లక్షలు. ఈ బైకులోని 177 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.8 హార్స్ పవర్, 12.2 ఏంఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 45 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, స్పోక్డ్ రిమ్స్.. అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.టీవీఎస్ రోనిన్ (TVS Ronin)చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులోని 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 20.1 హార్స్ పవర్, 19.93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 42.95 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైకులో లేటెస్ట్ ఫీచర్స్.. సస్పెన్షన్ సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. ఇది నగరంలో, హైవేపై రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ అవెంజర్ 220 (Bajaj Avenger 220)మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్రూయిజర్ బైకులలో బజాజ్ అవెంజర్ 220 కూడా ఒకటి. దీని ధర రూ. 1.45 లక్షలు. ఇందులో 18.76 హార్స్ పవర్, 17.55 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 40 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.క్యూజే ఎస్ఆర్సీ 250 (QJ SRC 250)మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యూజే ఎస్ఆర్సీ 250 బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ 249 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 17.4 హార్స్ పవర్, 17 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇదిరాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన సరసమైన బైక్ ఈ హంటర్ 350. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 36 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన క్రూయిజర్ బైకులలో ఒకటైన హంటర్ 350 మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. -
హార్లే - హీరో సరికొత్త బైక్: త్వరలో..
మార్కెట్లో అప్డేటెడ్ బైకులు పెరుగుతున్న తరుణంలో.. కొత్త వెర్షన్స్ను పరిచయం చేసేందుకు అమెరికన్ బ్రాండ్ 'హార్లే డేవిడ్సన్'తో సహకారాన్ని విస్తరించినట్టు హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తెలిపింది.హీరో మోటోకార్ప్ & హార్లే డేవిడ్సన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే.. కొత్త వెర్షన్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 (Harley Davidson X440) బైక్ రానుంది. ఈ రెండు కంపెనీల సహకారంతో తయారైన తొలి మోడల్ 'ఎక్స్ 440'. ఇది గతేడాది మార్కెట్లో అడుగుపెట్టింది. మంచి అమ్మకాలను కూడా పొందుతోంది.హీరో మోటోకార్ప్.. హార్లే డేవిడ్సన్ మధ్య భాగస్వామ్యం 2020 అక్టోబరులో జరిగింది. ఆ తరువాత దేశంలో హార్లే డేవిడ్సన్ బ్రాండ్ ప్రీమియం మోటార్సైకిళ్లను అభివృద్ధి చేసి హీరో మోటోకార్ప్ విక్రయిస్తుంది. సర్వీస్, విడిభాగాల సరఫరా బాధ్యత కూడా హీరో మోటోకార్ప్ చేపట్టింది. -
ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!
భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.హోండా షైన్ (Honda Shine)రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.బజాజ్ ప్లాటినా (Bajaj Platina)సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హ్యుందాయ్ కారు ఇదేయమహా ఎఫ్జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)యమహా కంపెనీకి చెందిన ఎఫ్జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
కొన్ని కంపెనీలు దసరాకు బోనస్లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి. అయితే ఇటీవల చెన్నైకి చెందిన సుర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ ఉద్యోగులకు బైకులు, కార్లను గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది.సుర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తమ ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా 20 మందికి టాటా కార్లు, యాక్టివా స్కూటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అందించింది.చెన్నైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న సుర్మౌంట్ లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా, పారదర్శకత, సరఫరాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్ను మరింత సరళీకృతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు, ఎండీ డెంజిల్ రాయన్ పేర్కొన్నారు. -
టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకులు: తక్కువ ధర.. ఎక్కువ పర్ఫామెన్స్
భారతదేశంలో 400సీసీ బైకులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీ ఈ విభాగంలో కూడా బైకులు లాంచ్ చేశాయి. ఈ బైకులు ధరలు సాధారణ బైక్ ధరల కంటే కొంత ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ కథనంలో కొంత తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బెస్ట్ 400సీసీ బైకుల గురించి తెలుసుకుందాం.బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్400 సీసీ విభాగంలోని సరసమైన బైకుల జాబితాలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 400జెడ్ ఒకటి. దీని ధర రూ. 1.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో ఎల్ఈడీ హెడ్ల్యాంప్, డీఆర్ఎల్, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.ట్రయంఫ్ స్పీడ్ టీ4మార్కెట్లో అందుబాటులో ఉన్న ట్రయంఫ్ స్పీడ్ టీ4 ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ట్రయంఫ్ లైనప్లో అత్యంత సరసమైన 400సీసీ బైక్. ఇందులో హజార్డ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్లైట్స్, టెయిల్లైట్స్ వంటివి ఉన్నాయి. ఈ బైకులోని 398 సీసీ ఇంజిన్ 30 Bhp పవర్, 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411400 సీసీ విభాగంలో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటి 'రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 411'. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైకులో అనలాగ్ స్పీడోమీటర్లు, హజార్డ్ ల్యాంప్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులోని 411 సీసీ ఇంజిన్ 24 Bhp పవర్, 32 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.బజాజ్ డామినార్ 400బజాజ్ డామినార్ 400 కూడా 400 సీసీ విభాగంలో లభిస్తున్న ఓ సరసమైన బైక్. దీని ధర రూ. 2.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 373 సీసీ ఇంజిన్ 39 Bhp పవర్, 35 Nm టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో లభించే ఈ బైక్ డ్యూయల్ డిస్ప్లేలు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ పొందుతుంది.ఇదీ చదవండి: అప్పు కంటే ఎక్కువ రికవరీ చేశారు: విజయ్ మాల్యా ట్వీట్ వైరల్హార్లే డేవిడ్సన్ ఎక్స్440హార్లే డేవిడ్సన్ అంటే ధరల భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ బ్రాండ్ అంటే ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ఎక్స్440 బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 440 సీసీ ఇంజిన్ 27 Bhp పవర్, 38 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఈ బైక్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. -
సూపర్ స్టైలిష్ బైకులు.. కాలేజ్ స్టూడెంట్స్ కోసం!
భారతదేశంలో లాంగ్ రైడ్ చేయడానికి, రోజువారీ ప్రయాణానికి, మహిళలు కోసం, కాలేజ్ స్టూడెంట్స్ కోసం.. ఇలా వివిధ రకాల టూ-వీలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో ప్రత్యేకించి కాలేజ్ స్టూడెంట్లకు అనువైన ఐదు బెస్ట్ బైకుల గురించి తెలుసుకుందాం.యమహా ఎంటీ-15యమహా అంటే ముందగా గుర్తొచ్చేది స్టైల్. కాబట్టి ఇవి యువతను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటాయి. కాలేజ్ స్టూడెంట్లు బాగా ఇష్టపడే యమహా బైకులలో ఒకటి.. ఏంటీ-15. రూ.1.78 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్ మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 155 సీసీ ఇంజిన్ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తుంది.కేటీఎం 125 డ్యూక్యువత ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే బైకులతో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ బ్రాండ్ కేటీఎం. ఈ కంపెనీకి చెందిన 125 డ్యూక్ కాలేజ్ విద్యార్థులకు కూడా మొదటి ఎంపిక. దీని ధర రూ.1.78 లక్షలు. ఈ బైకులో 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ వినియోగానికి, లాంగ్ రైడ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.బజాజ్ పల్సర్ ఎన్ఎస్200రూ.1.40 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే 'బజాజ్ పల్సర్ ఎన్ఎస్200' బైక్ కూడా కాలేజ్ స్టూడెంట్లకు నచ్చిన బైకులలో ఒకటి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 199.5 సీసీ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అందించే ఈ బైకును స్టూడెంట్స్ మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఇష్టంగా కొనుగోలు చేస్తారు.రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి చెందిన హంటర్ 350 మంచి డిజైన్ కలిగి ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు మాత్రమే. ఇది స్టైలిష్ స్ట్రీట్ బైక్. ఇందులో 349.34 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 Bhp, 27 Nm టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 96,781 ప్రారంభ ధర వద్ద లభించే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన 'ఎక్స్ట్రీమ్ 125ఆర్'. ఇందులోని 124.7 సీసీ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. చూడటానికి స్టైలిష్గా కనిపించే ఈ బైక్ 124.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. -
రూ.2 లక్షల కంటే తక్కువ ధర.. ఇవిగో బెస్ట్ బైకులు!
మంచి స్టైల్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కోరుకునేవారు.. కొంత ఎక్కువ డబ్బు వెచ్చించి బైక్ కొనాలని చూస్తారు. అలాంటి వారి కోసం ఈ కథనంలో రూ.2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల గురించి తెలుసుకుందాం.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 'కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్' విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బైక్ ధర రూ. 1.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులోని 210 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 9250 rpm వద్ద 25.1 Bhp పవర్, 7250 rpm వద్ద 20.4 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్బాక్స్తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్.. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్ వంటి వాటితో పాటు టర్న్-బై-టర్న్ న్యావిగేషన్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.యమహా ఆర్15 వీ4రూ.1.82 లక్షల నుంచి రూ.1.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద లభించే 'యమహా ఆర్15 వీ4' మన జాబితాలో చెప్పుకోడదగ్గ బైక్. ఈ బైకులోని 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 10,000 rpm వద్ద 18.1 Bhp పవర్, 7500 rpm వద్ద 14.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.యమహా ఆర్15 వీ4 బైక్ 282 మిమీ ఫ్రంట్ డిస్క్, 220 మిమీ రియర్ డిస్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటివి కూడా కలిగి ఉంది.బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200బజాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది పల్సర్. ఈ బైక్ మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతోంది. బజాజ్ ఆర్ఎస్ 200 ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 200 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 24.1 Bhp పవర్, 18.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎల్ఈడీ లైటింగ్ వంటివి పొందుతుంది.కేటీఎమ్ ఆర్సీ 125రూ.2 లక్షల కంటే తక్కువ ధర వద్ద కేటీఎమ్ బైక్ కావాలనుకునేవారికి.. ఆర్సీ 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైకులోని 124.7 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 9250 rpm వద్ద 14.34 Bhp పవర్, 8000 rpm వద్ద 12 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, అడ్జస్టబుల్ హ్యాండిల్బార్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ఎక్కువమందికి ఇష్టమైన మోడల్. -
తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్: ఇదిగో టాప్ 5 బైకులు
మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.బజాజ్ ఫ్రీడమ్ 125'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ ప్లాటినా 110రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్లు, వైడ్ ఫుట్పెగ్లు, 5 స్పీడ్ గేర్బాక్స్ వంటివి ఉన్నాయి.హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..హీరో స్ప్లెండర్ ప్లస్భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు. -
2025లో లాంచ్.. ఇప్పుడే సిద్దమైన డుకాటీ
ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటీ' సరికొత్త మల్టిస్ట్రాడా వీ2, వీ2 ఎస్ బైకులను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ ఈ బైకులను వచ్చే ఏడాది (2025) లాంచ్ చేయనున్నట్లు సమాచారం.2025లో లాంచ్ కానున్న కొత్త డుకాటీ మల్టీస్ట్రాడా వీ2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 18 కేజీల తక్కువ బరువుతో ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 19 లీటర్లు. ఇందులోని 890 సీసీ ఇంజిన్ 115.6 హార్స్ పవర్, 92.1 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్ అండ్ బైడైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది.కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా డిజైన్, ఫీచర్స్ వంటివన్నీ రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఎస్ వేరియంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ యూనిట్. ఈ బైక్ ముందు భాగంలో 120/70-ఆర్19 టైర్, వెనుక 170/60-ఆర్19 టైర్లు ఉన్నాయి. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్లు, వెనుక 265 మిమీ రియర్ డిస్క్ ఉన్నాయి.మల్టీస్ట్రాడా వీ2 ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్లు, స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, పవర్ మోడ్లు, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్తో కూడిన సరికొత్త ఎలక్ట్రానిక్స్ వంటివన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ 5 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేలో కనిపిస్తాయి. ప్రస్తుతం కంపెనీ ఈ బైక్ ధరలను వెల్లడించలేదు. అయితే ధరలు రూ. 16 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. -
క్లాసిక్ లుక్లో కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ 650 (ఫొటోలు)
-
కేటీఎమ్ బ్రాండ్ మొదటిసారి అలా..
-
హోండా మోటార్సైకిల్ కీలక ప్రకటన: ఆ బైకులకు రీకాల్
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా తన 'సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్' బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి - 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది.ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రూపొందించనుంది.వారంటీతో సంబంధం లేకుండా ప్రభావిత బైక్లలో సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. హోండా బిగ్వింగ్ వెబ్సైట్లో VINని నమోదు చేయడం ద్వారా కస్టమర్లు.. తమ బైక్ జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. ఈ బైక్ ధరలు మార్కెట్లో రూ. 16.01 లక్షల నుంచి రూ. 17.55 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. -
నమ్మండి ఇది 'రాయల్ ఎన్ఫీల్డ్' బైకే.. (ఫోటోలు)
-
బాక్స్ అనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ - రేటెంతో తెలుసా?
-
భారత్లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
హ్యాండిల్, సీటు లేని హోండా ఇంజిన్!
-
EICMA 2024 : కళ్ళు చెదిరే సరికొత్త బైకులు.. చూస్తే మతిపోవాల్సిందే! (ఫోటోలు)
-
లక్షల ఖరీదైన బైకులు: మరింత కొత్తగా..
మారుతున్న ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా.. చాలా వాహన తయారీ సంస్థలు బైక్లను అప్డేట్ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా చేరింది. ఇది ఒకేసారి నాలుగు బైకులను (ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్, ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ఆర్) అప్డేట్ చేయనుంది. ఇందులో నేకెడ్ ఆర్ మోడల్స్ కొత్త స్టైలింగ్ పొందుతాయి. పుల్ ఫెయిర్డ్ ఆర్ఆర్ బైకులు రీడిజైన్ పొందుతాయి.బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్, ఎం 1000 ఆర్ వంటి నేకెడ్ బైక్స్ ట్విన్ పాడ్ ఎల్ఈడీ హెడ్లైట్ పొందుతాయి. పవర్, టార్క్ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. బైక్ ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ పొందుతుంది. సీటు కింద యూఎస్బీ-సీ ఛార్జర్ ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైకులు యాంత్రికంగా మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ బైకులలో ఎక్కువ భాగం నలుపు రంగు ఉండటం చూడవచ్చు.ఇక బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, ఎం 1000 ఆర్ బైకుల విషయానికి వస్తే.. ఎం 1000 ఆర్ఆర్ కొంత ఎక్కువ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. వింగ్లెట్లు కొంత పెద్దవిగా ఉంటాయి. కాస్మొటిక్ అప్డేట్స్ కూడా ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ స్పోర్ట్బైక్ కూడా రీడిజైన్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎటువంటి మార్పు పొందదు.బీఎండబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ ఈ నాలుగు బైకులను భారతదేశంలో లాంచ్ చేస్తుందా? లేదా అనే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్న ఈ బైకుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్: రూ. 19 లక్షల నుంచి రూ. 23.30 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్: రూ. 33 లక్షల నుంచి రూ. 38 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్: రూ. 20.75 లక్షల నుంచి రూ. 25.25 లక్షలు➤బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్: రూ. 49 లక్షల నుంచి రూ. 55 లక్షలు -
ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ బైకులు: ధర లక్ష కంటే తక్కువే..
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మంచి మైలేజ్ ఇచ్చే బైకులకు కొదువే లేదు. అయితే రూ.1 లక్ష కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ బైకులు గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ కంపెనీకి చెందిన స్పోర్ట్ బైక్ అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్స్ జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 59,881 కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 71,383 (ఎక్స్ షోరూమ్). ఇది 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ కలిగిన ఈ బైక్ 80 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది.బజాజ్ సీటీ 110ఎక్స్రూ. 70,176 ప్రారంభ ధర (ఎక్స్ షోరూమ్) వద్ద లభించే బజాజ్ సీటీ 110ఎక్స్ కూడా మంచి మైలేజ్ అందించే బెస్ట్ బైక్. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 8.48 హార్స్ పవర్, 9.81 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.హీరో హెచ్ఎఫ్ డీలక్స్హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రారంభ ధర రూ. 59,998. సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్ కలిగిన టాప్ వేరియంట్ ధరలు రూ. 69,018 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 7.91 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.టీవీఎస్ రేడియన్రూ. 59,880 నుంచి రూ. 81,394 మధ్య (ఎక్స్ షోరూమ్) లభించే టీవీఎస్ రేడియన్ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.08 హార్స్ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఫోర్ స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఈ బైక్ 68.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: 90వేల కార్లు వెనక్కి: హోండా కీలక ప్రకటనహోండా ఎస్పీ 125హోండా ఎస్పీ 125 ధరలు రూ. 87,468 నుంచి రూ. 91,468 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైక్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 10.72 Hp, 10.9 Nm టార్క్ అందిస్తుంది. 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. ఈ బైక్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. -
వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ చూశారా
-
కార్లు, బైక్లు అబ్బో.. అదృష్టమంటే ఈ ఐటీ కంపెనీ ఉద్యోగులదే!
చెన్నైకి చెందిన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ అద్భుతమైన బహుమతులతో తమ ఉద్యోగులను ఆశ్చర్యపరిచింది. 28 కార్లు, 29 బైక్లను బహుమతిగా ఇచ్చింది. ఉద్యోగుల్లో మరింత ప్రేరణ కల్పించడానికి, ఉత్పాదకతను పెంచడానికి కంపెనీ ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.2005లో ప్రారంభమైన టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్, డిటైలింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కణ్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, అభినందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ గుర్తింపు ఉద్యోగులను తమ పాత్రల్లో రాణించేలా మరింత ప్రేరేపిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన కార్లలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలతోపాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు కూడా ఉండటం విశేషం. కార్లు, బైక్లతో పాటు, టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు వివాహ కానుకను కూడా అందిస్తోంది. గతంలో రూ.50,000గా ఉన్న ఈ కానుకను ఈ ఏడాది రూ.లక్షకు కంపెనీ పెంచింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు రీకాల్.. కారణం ఇదే
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. నవంబర్ 2022 - మార్చి 2023 మధ్య తయారు చేసిన బైకులకు రీకాల్ ప్రకటించింది. రొటీన్ టెస్టింగ్ సమయంలో వెనుక, సైడ్ రిఫ్లెక్టర్లతో సమస్యను గుర్తించిన కంపెనీ, దీనిని పరిష్కరించడానికి రీకాల్ ప్రకటించింది.నిర్దేశించిన సమయంలో తయారైన మోటార్సైకిళ్లలోని రిఫ్లెక్టర్లు.. రిఫ్లెక్టివ్ పనితీరు సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల కాంతి తక్కువగా ఉండటం వల్ల దృశ్యమానత దెబ్బతింటుంది. ఇది రోడ్డుపైన ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. అయితే ఈ సమస్యపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు, కానీ కంపెనీ ముందు జాగ్రత్తగానే రీకాల్ ప్రకటించింది.ఇదీ చదవండి: చెట్టుకింద వచ్చిన ఆలోచన.. వేలకోట్లు సంపాదించేలా..కంపెనీ ఈ సమస్యను ఉచితంగా పరిష్కరిస్తుంది. బైకులో ఈ సమస్యను పరిష్కరించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి భర్తీ ప్రక్రియ త్వరగా, సమర్ధవంతంగా ఉంటుందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది. బ్రాండ్ సర్వీస్ టీమ్లు వారి సమీప సర్వీస్ సెంటర్లో రీప్లేస్మెంట్ షెడ్యూల్ చేయడానికి ప్రభావిత మోటార్సైకిళ్ల యజమానులను నేరుగా సంప్రదించనున్నట్లు సమాచారం. -
రూ.1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు.. ఇవే!
భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఇండియన్ మార్కెట్లో 110 సీసీ బైకులు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు ఈ స్థానంలో 125 సీసీ.. 200 సీసీ బైకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ విఫణిలో రూ. 1.5 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ కమ్యూటర్ బైకుల గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం.హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్రూ. 95000 (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే 'హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్' అనేది ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న బైక్. 125 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 11.4 Bhp పవర్, 10.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది ఎల్ఈడీ హెడ్ల్యాంప్, షార్ప్ ఎల్ఈడీ ఇండికేటర్స్, లేటెస్ట్ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది.టీవీఎస్ రైడర్ 125టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన 'రైడర్ 125' బైక్ కేవలం రెండున్నర సంవత్సరాల్లో 7,00,000 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ బైకుకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది 124.8 సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125సీఎన్జీ బైక్ విభాగంలో అడుగుపెట్టిన మొట్ట మొదటి బైక్.. ఈ బజాజ్ ఫ్రీడమ్ 125. ఇది పెట్రోల్ అండ్ సీఎన్జీ ట్యాంక్స్ కలిగి 330 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 125 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో 8000 rpm వద్ద 9.37 Bhp పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హోండా హార్నెట్ 2.0రూ. 1.40 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ బైక్ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. 184.4 సీసీ ఇంజిన్ కలిగిన హార్నెట్ 2.0 బైక్ 5 స్పీడ్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 17 బ్రేక్ హార్స్ పవర్, 15.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..బజాజ్ పల్సర్ ఎన్160అతి తక్కువ కాలంలో ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించిన బైకులలో ఒకటి బజాజ్ పల్సర్. ఇది ప్రస్తుతం మల్టిపుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ పల్సర్ ఎన్160. దీని ప్రారంభ ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 164.82 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 17.7 Bhp పవర్, 14.65 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. -
హోండా బైకులకు రీకాల్: జాబితాలోని మోడల్స్ ఇవే..
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా' తన సీబీ350, హైనెస్ సీబీ350 బైకులకు రీకాల్ ప్రకటించింది. వీల్ స్పీడ్ సెన్సార్, క్యామ్షాఫ్ట్ సమస్యల కారణంగానే ఈ రీకాల్ ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన సీబీ300ఎఫ్, సీబీ300ఆర్, సీబీ350, హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైకులకు కంపెనీ రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ బైకులలో ఎలాంటి సమస్య తలెత్తలేదు, కానీ కంపెనీ ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.వీల్ స్పీడ్ సెన్సార్లో ఉన్న సమస్య వల్ల అందులోని నీరు ప్రవేశించే అవకాశం ఉంది. ఇది స్పీడోమీటర్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ వంటి వాటిమీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను రీకాల్ ద్వారా పరిష్కరించడానికి కంపెనీ సిద్ధమైంది.ఇదీ చదవండి: 809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే? ఇక క్యామ్షాఫ్ట్ కాంపోనెంట్తో వచ్చే సమస్యలు.. వెహికల్ పనితీరు మీద ప్రభావితం చూపుతాయి. కాబట్టి 2020 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య తయారైన.. కంపెనీ వెల్లడించిన బైకులకు సంస్థ ఉచితంగానే సమస్యను పరిష్కరిస్తుంది. వాహనం వారంటీతో సంబంధం లేకుండా సమస్యకు కారణమైన భాగాలను కంపెనీ ఉచితంగానే రీప్లేస్ చేస్తుంది. -
షో రూమ్ కే నిప్పు పెట్టిన యువకుడు
-
మరమ్మతుల ఖర్చూ ముంచుతోంది
బుడమేరు వరద ధాటికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు వారం రోజులకు పైగా నీటిలోనే ఉన్నాయి. భారీ వర్షాలు, కృష్ణా నదిలో భారీ ప్రవాహం, బుడమేరు వరద.. ఇలా అన్ని వైపులా నీరు చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లల్లో విలువైన వస్తువులతోపాటు ద్విచక్రవాహనాలు, కార్లు సైతం నీట మునిగాయి. దీంతో అవి పూర్తిగా పాడయ్యాయి. –లబ్బీపేట (విజయవాడ తూర్పు)/మధురానగర్ (విజయవాడ సెంట్రల్)ఒక్కో వాహనానికి రూ.వేలల్లో ఖర్చుఇప్పటికే వరదలతో తమ సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ఇప్పుడు తమ వాహనాల మరమ్మతులకు కూడా భారీగా వెచ్చించాల్సి రావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మరమ్మతులకు మెకానిక్లు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. చేతిలో వాహనం లేకపోతే అనేక పనులు ఆగిపోతాయి కాబట్టి అప్పోసొప్పో చేసి బాగు చేయించక తప్పడంలేదని వాహనదారులు వాపోతున్నారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్లు సెంటర్, పైపుల రోడ్డు, ఆంధ్రప్రభ కాలనీ రోడ్డుల్లోని మెకానిక్ల వద్ద రిపేర్లు కోసం పెద్ద సంఖ్యలో బైక్లు స్కూటర్లు బారులు తీరాయి.కొన్ని వాహనాల ఇంజన్లు పాడైపోవడంతో పూర్తిగా స్తంభించిపోయి కనీసం నడపడానికి కూడా వీలు కావడం లేదు. ఒక్క సింగ్నగర్లోనే 25 నుంచి 30 వేలకు పైగా ద్విచక్రవాహనాలు పాడయ్యాయని అంచనా. మరోవైపు కార్లను కూడా రిపేర్లు కోసం రికవరీ వెహికల్స్తో షెడ్లకు తరలిస్తున్నారు. సింగ్నగర్ ప్రాంతంలో సోమవారం ఎక్కడ చూసినా కార్లు తరలించే దృశ్యాలే కనిపించాయి. మా వాహనాలన్నీ మునిగిపోయాయి..నాకు, మా పిల్లలకు మూడు ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు ఉన్నాయి. అన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. రిపేరు కోసం తీసుకెళ్తే రూ.7 వేలు నుంచి రూ.10 వేలు అవుతుందని మెకానిక్లు చెబుతున్నారు. ఆటోలకు ఎంత అవుతుందో తెలియడం లేదు. అంత ఖర్చు ఎలా భరించాలో అర్థం కావడం లేదు. – ఎస్కే కరీముల్లా, సింగ్నగర్జీవనోపాధి పోయింది.. బుడమేరు వరద ఉధృతికి నా టాటా ఏస్ నీట మునిగింది. దీంతో జీవనోపాధి కోల్పోయాను. వాహనం ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మరమ్మతులు చేయించాలంటే కనీసం రూ. 70 వేలు అవుతుందని అంటున్నారు. వరద వల్ల అన్నీ కోల్పోయిన నేను ఇప్పుడు అంత డబ్బులు ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదు. – గౌస్, బాధితుడు -
అప్డేటెడ్ జావా 42 బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ జావా మోటార్సైకిల్ అప్డేటెడ్ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త జావా 42 బైక్ ధరలు రూ. 1.73 లక్షల నుంచి రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 16000 తక్కువ ధరకే లభిస్తుంది.2024 జావా 42 బైక్ 294 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27.32 హార్స్ పవర్ మరియు 26.84 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. రీడిజైన్ పొందిన ఈ బైక్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. అనలాగ్ ఎల్సీడీ సెటప్ కూడా ఇందులో గమనించవచ్చు.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అప్డేటెడ్ జావా 42 సీటు ఎత్తు 788 మిమీ వరకు ఉంటుంది. ఈ అప్డేటెడ్ బైక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.The 2024 Jawa 42 is here! This is the answer you’ve been waiting for. With the perfect trinity of Performance, Neo-Classic Design and Engineering - you are in for a ride like no other!#Jawa42TheAnswer #Jawa42 #JPanther #JawaMotorcycles pic.twitter.com/AA4qFLCT3g— Jawa Motorcycles (@jawamotorcycles) August 13, 2024 -
గుద్దుకుంటూ పోయిన బస్సు..
-
జూన్ 13న లాంచ్ అయ్యే బీఎండబ్ల్యూ బైక్ ఇదే - వివరాలు
ఖరీదైన బైకులను లాంచ్ చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ సరికొత్త 'ఆర్ 1300 జీఎస్'ను జూన్ 13న లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ బైక్ ఆధునిక హంగులతో, అద్భుతమైన పనితీరును అందించడానికి కావాల్సిన ఇంజిన్ ఆప్షన్ పొందనున్నట్లు తెలుస్తోంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ పాడ్ హెడ్లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్టాండర్డ్ రైడింగ్ మోడ్లు, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ పొందుతుంది.బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 Bhp పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, BMW రాడార్ అసిస్టెడ్ క్రూయిజ్ కంట్రోల్, మల్టిపుల్ రైడ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, స్విచ్ చేయగల ఏబీఎస్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ధర రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర వద్ద లాంచ్ అవుతుందని సమాచారం. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
ఒక్క చూపుకే ఫిదా చేస్తున్న 'బీఎండబ్ల్యూ ఆర్20' - వివరాలు
ప్రముఖ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) సరికొత్త కాన్సెప్ట్ మోటార్సైకిల్ 'బీఎండబ్ల్యూ ఆర్20' ఆవిష్కరించింది. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ బైక్ ఓ ప్రత్యేకమైన డిజైన్ కలిగి.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది.కొత్త బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 2000 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజన్ను పొందుతుంది. అయితే ఈ ఇంజిన్ పనితీరు గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. ఇంజన్ కొత్త సిలిండర్ హెడ్ కవర్లు, కొత్త బెల్ట్ కవర్, కొత్త ఆయిల్-కూలర్ కూడా ఉన్నాయి.మోడ్రన్ క్లాసిక్ మోటార్సైకిల్ డిజైన్ కలిగిన ఈ బైక్ సరికొత్త గులాబీ రంగులో ఉంటుంది. సింగిల్ సీటును క్విల్టెడ్ బ్లాక్ ఆల్కాంటారా అండ్ ఫైన్-గ్రెయిన్ లెదర్లో అప్హోల్స్టర్ చేసారు. ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్లైట్, 3డీ ప్రింటెడ్ అల్యూమినియం రింగ్లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటివి ఉన్నాయి.బీఎండబ్ల్యూ ఆర్20 బైక్ 17 ఇంచెస్ ఫ్రంట్ స్పోక్ వీల్.. 17 ఇంచెస్ రియర్ బ్లాక్ డిస్క్ వీల్ పొందుతుంది. వెనుక టైర్ 200/55, ముందు టైరు 120/70 పరిమాణం పొందుతుంది. బీఎండబ్ల్యూ పారాలెవర్ సిస్టమ్ క్రోమ్-మాలిబ్డినం స్టీల్ స్వింగార్మ్, అల్యూమినియం పారాలెవర్ స్ట్రట్ ఇందులో ఉపయోగించారు. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు. -
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
ఇండియా బైక్ వీక్లో కనిపించే బైకులు ఇలాగే ఉంటాయి - మైండ్ బ్లోయింగ్ (ఫొటోలు)
-
హైదరాబాద్ రోడ్లపై కొట్టుకుపోతున్న బైకులు..!
-
ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే?
చిన్నవైనా, పెద్దవైనా వాహనాలకు చక్రాలు, వాటికి టైర్లు ఉంటాయి. టైర్లలో గాలి నింపడం పెద్ద పని. సైకిల్ టైర్లలోకి గాలి కొట్టడం కొద్దిపాటి శ్రమతో కూడుకున్న పని అయితే, భారీ వాహనాల టైర్లకు గాలి కొట్టడం అంత తేలిక పనికాదు. వాటిలో గాలి నింపుకోవడానికి పెట్రోల్ బంకులకో, మెకానిక్ షెడ్లకో వెళ్లక తప్పదు. ఎటూకాని తోవలో బండి చక్రాల్లో గాలి అయిపోతే ఎదురయ్యే తిప్పలు వర్ణనాతీతం. అలాంటి తిప్పలను తప్పించడానికే అమెరికన్ కంపెనీ ‘థామస్ పంప్స్’ ఇంచక్కా చేతిలో ఇమిడిపోయే ‘మినీ పంప్’ను అందుబాటులోకి తెచ్చింది. దీన్ని చక్కగా జేబులో వేసి తీసుకుపోవచ్చు. దీని బరువు 115 గ్రాములు మాత్రమే! ఎలాంటి తోవలోనైనా వాహనం చక్రాల్లోని గాలి అయిపోతే, అక్కడికక్కడే దీంతో క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దీని బ్యాటరీ 25 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. దీని సాయంతో సైకిల్ టైర్లలో 70 సెకన్లలోనే గాలి నింపుకోవచ్చు. మోటార్ సైకిళ్లు మొదలుకొని భారీ వాహనాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. కాకుంటే, టైరు పరిమాణాన్ని బట్టి కొంత ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఫుట్బాల్, బాస్కెట్బాల్ బంతుల్లో కూడా క్షణాల్లో గాలి నింపుకోవచ్చు. దీని ధర 119 డాలర్లు (రూ.9898). -
వరల్డ్ ఛాంపియన్ 'నీరజ్ చోప్రా' అద్భుతమైన కార్లు, బైకులు - ఓ లుక్కేసుకోండి!
టోక్యో ఒలంపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త చరిత్రను సృష్టించిన 'నీరజ్ చోప్రా' (Neeraj Chopra) తాజాగా వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కూడా స్వర్ణ పతకం గెలిచి యావత్ భారతదేశం మొత్తం గర్వపడేలా మరో రికార్డ్ నెలకొల్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మొదటి భారతీయుడిగా ప్రసిద్ధి చెందిన నీరజ్ ఎలాంటి కార్లు & బైకులు వినియోగిస్తారనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోర్డ్ మస్టాంగ్ జీటీ (Ford Mustang GT).. నీరజ్ చోప్రా గ్యారేజిలోని మొదటి కారు ఈ ఫోర్డ్ మస్టాంగ్ జీటీ. దీని ధర రూ. 75 లక్షల వరకు ఉంటుందని సమాచారం. చాలామంది సెలబ్రిటీలకు కూడా ఈ అమెరికన్ బ్రాండ్ కారంటే చాలా ఇష్టం. ఇది 5.0 లీటర్ ఇంజన్ కలిగి 396 హార్స్ పవర్, 515 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మస్టాంగ్ టాప్ స్పీడ్ గంటకు 180 మైల్స్/గం. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (Range Rover Sport).. రేంజ్ రోవర్ కంపెనీకి చెందిన 'స్పోర్ట్స్' కారు కూడా నీరజ్ చోప్రా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 2.20 కోట్లు ధర కలిగిన ఈ లగ్జరీ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 5.0 లీటర్ V8 ఇంజన్ కలిగి 567 హార్స్ పవర్ & 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ SUV టాప్ స్పీడ్ గంటకు 260 కిమీ. మహీంద్రా థార్ & XUV700.. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన 'థార్' నీరజ్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 17 లక్షలు విలువైన ఈ కారు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇది 2.2 లీటర్ డీజిల్ & 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మంచి పనితీరుని అందిస్తుంది. ఇక మహీంద్రా ఎక్స్యూవీ700 విషయానికి వస్తే, ఇది నీరజ్ కోసం ప్రత్యేకంగా రూపోంచిన కారు. ఇందులో చాలా వరకు కస్టమైజ్ చేసిన డిజైన్స్ చూడవచ్చు. ఈ SUV మిగిలిన కార్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది కూడా పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner).. భారతదేశంలో ఎక్కువమంది వినియోగించే టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ నీరజ్ చోప్రా గ్యారేజిలో ఉంది0 దీని ధర రూ. 51 లక్షలు అని తెలుస్తోంది. 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మోడల్ 2.7-లీటర్ పెట్రోల్ అండ్ 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లతో వస్తుంది. ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా! హార్లే డేవిడ్సన్ 1200 రోడ్స్టర్ (Harley-Davidson 1200 Roadster).. బైక్ విభాగంలో ఖరీదైనవిగా భావించే హార్లే డేవిడ్సన్ 1200 రోడ్స్టర్ నీరజ్ చోప్రా వద్ద ఉంది. దీనిని 2019లో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ. 10 లక్షల కంటే ఎక్కువ. ఇదీ చదవండి: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 'ఏఐ'పై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన బజాజ్ పల్సర్ 200ఎఫ్ (Bajaj Pulsar 200F).. ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బజాజ్ పల్సర్ 200ఎఫ్ కూడా నీరజ్ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కార్లు, బైకులు మాత్రమే కాకుండా ఒక ట్రాక్టర్ కూడా నీరజ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Neeraj Chopra (@neeraj____chopra) -
Ola Electric Bike Concept: మునుపెన్నడూ చూడని ఓలా కొత్త ఎలక్ట్రిక్ బైకులు (ఫొటోలు)
-
10 Best KTM Bikes: టాప్ 10 బెస్ట్ కేటీఎమ్ మోటార్ సైకిల్స్
-
ధోని బైక్స్ కలెక్షన్ చూస్తె మతిపోతుంది
-
Dhoni Cars, Bikes Collection: ధోనీ అంటేనే సెన్సేషన్ అదో..వైబ్రేషన్ చూడండి ఆయన క్లాసిక్ కలెక్షన్ (ఫోటోలు)
-
అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్!
ప్రముఖ లగ్జరీ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ మార్కెట్లో అమ్మకాల్లో దూసుకెళ్తుంది. జూన్ నెలలో 26శాతం వృద్దిని సాధించి 77,109 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది జూన్లో 61,407 బైక్స్ అమ్మింది. భారత్లో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు ఏడాది క్రితం 50,265 యూనిట్లు అమ్ముడు పోగా..ఈ ఏడాది 34 శాతం పెరిగి 67,495 అమ్మినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2022 జూన్ లో 11,142 యూనిట్లను ఎగుమతి చేయగా.. గత నెలలో వాటి సంఖ్య 9,614 యూనిట్లతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ బీ గోవింద రాజన్ మాట్లాడుతూ.. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన మోటారు సైకిళ్లతో తాము దేశీయంగా, గ్లోబల్ మార్కెట్లలో మంచి సేల్స్ నమోదు చేశామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ బైక్ లవర్స్ను ఆకట్టుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!
Yamaha RX: గత కొన్ని సంవత్సరాల క్రితం బైక్ ప్రేమికులకు బాగా ఇష్టమైన మోడల్ 'యమహా' (Yamaha) కంపెనీకి చెందిన 'ఆర్ఎక్స్100' (RX100). ఒకప్పుడు కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బైక్ కోసం ఎదురు చూసే కస్టమర్లు ఇంకా భారత్లో ఉన్నారు అనటంలో ఏ మాత్రమే సందేహం లేదు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ మళ్ళీ ఈ బైకుని లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, యమహా ఆర్ఎక్స్100 భారతీయుల గుండెల్లో నిలిచిపోయిన బైక్ మోడల్. కావున ఆ పేరుకి ఏ మాత్రం భంగం కలగకుండా 'ఆర్ఎక్స్' (RX) అనే పేరుతో మళ్ళీ మార్కెట్లో బైకుని విడుదల చేయనున్నట్లు యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ 'ఈషిన్ చిహానా' ఇటీవల ధృవీకరించినట్లు తెలుస్తోంది. భారతదేశపు ఐకానిక్ మోడల్ అయిన ఆర్ఎక్స్100 మంచి స్టైలింగ్, లైట్ వెయిట్, ప్రత్యేకమైన సౌండ్ సిస్టం కలిగి ఉండేది. ఇది అప్పటి వినియోగదారులను మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో బైక్ కొనుగోలు చేస్తున్న వారిని మంత్రముగ్దుల్ని చేసింది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న టీవీఎస్ కొత్త బైక్ - వివరాలు) ఈ బైకుని మళ్ళీ పునఃరూపకల్పన చేయాలంటే కనీసం 200సీసీ ఇంజిన్ అయినా అమర్చాలి. అయినప్పటికీ ఒకప్పటి సౌండ్ మళ్ళీ వస్తుందా? అనేది ప్రశ్నగానే ఉంటుంది. కావున ఆర్ఎక్స్100 బైకుకి ఉన్న పేరును నాశనం చేయదలచుకోలేదు. ప్రస్తుత లైనప్తో 155 సీసీ సరిపోదు. కానీ భవిష్యత్తులో యమహా ఆర్ఎక్స్ పేరుతో తీసుకురావడానికి తప్పకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి ఆర్ఎక్స్ మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. అయితే లాంచ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. -
మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్.. డెలివరీలు షురూ!
Keeway SR250 Delivery: 2023 ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్పోలో హంగేరియన్ టూ వీలర్ తయారీ సంస్థ 'కీవే' (Keeway) దేశీయ మార్కెట్లో తన SR250 నియో రెట్రో మోటార్సైకిల్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ 17 నుంచి మొదలయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఎస్ఆర్250 మొదటి 500 మంది కస్టమర్లకు లక్కీ డ్రాతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది. అంతే కాకుండా మొదటి 5 మంది కస్టమర్లకు 100 శాతం పూర్తి క్యాష్ బ్యాక్ అందించే అవకాశం కూడా ఉంది. కంపెనీ ఇప్పుడు 'My SR My Way' అనే ఒక కొత్త కస్టమైజేషన్ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది. దీని ద్వారా కీవే బైకులను కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమర్లకు మరింత సౌకర్యాన్ని అందించడానికి కీవే త్వరలో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC) కూడా ప్రవేశపెట్టడానికి యోచిస్తోంది. దీని కింద లేబర్ ఛార్జ్, ఇంజిన్ ఆయిల్, విడిభాగాలు, యాక్ససరీలపైన తగ్గింపు అందించే అవకాశం ఉంటుంది. ఈ బైకులు భారతదేశంలోని బెనెల్లీ అవుట్లెట్ల ద్వారా అమ్ముడవుతాయి. కావున దేశవ్యాప్తంగా ఉన్న బెనెల్లీ డీలర్షిప్లలో కీవే బైకులు కొనుగోలు చేయవచ్చు. (ఇది చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే.. రౌండ్ హెడ్ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ సరౌండ్లతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సిలిండర్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్, నాబ్డ్ టైర్లు, స్పోక్డ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో సింగిల్ పీస్ సీటు లభిస్తుంది. ఫీచర్స్ పరంగా కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, LED DRL లు, హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. (ఇది చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) కీవే ఎస్ఆర్250 బైకులో 223 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 7,500 rpm వద్ద 16 bhp పవర్ 6,500 rpm వద్ద 16 Nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ బైక్ బరువు 120 కేజీల వరకు ఉంటుంది, కావున రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైకులు - అన్నీ రూ. కోట్లలోనే (ఫోటోలు)
-
ఈ బైక్స్ కొనుగోలుపై కనీవినీ ఎరుగని బెనిఫిట్స్ - రూ. 4 లక్షల వరకు..
Ducati Benefits: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ బైక్ బ్రాండ్స్లో ఒకటైన 'డుకాటి' (Ducati) తన 10వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా కంపెనీకి చెందిన కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద రూ. 4 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ అందించనున్న ఈ బెనిఫీట్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బెనిఫీట్స్.. నివేదికల ప్రకారం, డుకాటి ఇండియా ఇప్పుడు తన స్ట్రీట్ఫైటర్ వి4, మల్టీస్ట్రాడా వి4 మోడల్స్ మీద ఏకంగా రూ. 4 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ బైక్స్ అసలు ధరలు దేశీయ మార్కెట్లో రూ. రూ. 22.15 లక్షలు, రూ. 21.48 లక్షలు కావడం గమనార్హం. అదే సమయంలో స్ట్రీట్ఫైటర్ వి2, మల్టీస్ట్రాడా వి2, మాన్స్టర్ మోడల్స్ మీద రూ. 2 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ మోడల్ బైకుల అసలు ధరలు రూ. 18.10 లక్షలు, రూ. 16.05 లక్షలు, రూ. 12.95 లక్షలు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) కంపెనీ అందిస్తున్న ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ కాదు, అయితే డుకాటి బ్రాండ్ దుస్తులు, యాక్ససరీస్ వంటివి పొందవచ్చు. ఈ బెనిఫీట్స్ కూడా స్టాక్ ఉన్నత వరకు మాత్రమే లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను కొనుగోలుదారులు సమీపంలో ఉన్న డీలర్షిప్లను సందర్శించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
బైక్లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్షా సీరియస్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో కార్యకర్తల కంటే ఎక్కువగా బైక్లే దర్శనమిచ్చాయి. దీంతో అమిత్షా బీజేపీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. జనాల కంటే బైక్లే ఎక్కువగా కన్పిస్తున్నాయి.. ఏంటిది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాగా.. బెంగళూరులో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు(ఆదివారం) నిర్వహించిన రోడ్షోకు విశేష స్పందన లభించింది. అభిమానులు బీజేపీ శ్రేణులు భారీగా తరిలివచ్చారు. మోదీపై పూలవర్షం కురిపించారు. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించాయి. చదవండి: బీజేపీది చీకటి పాలన: సోనియా -
ఖరీదైన బైకు.. కంట పడిందో మాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జల్సాలకు అలవాటు పడిన ఆ యువకులు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలే మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఆటో మొబైల్ రంగంలో పనిచేసి ఉండటంతో, ద్విచక్ర వాహనాల చోరీలు మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్ సీఐ టి.గణేష్ ఈ వివరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరానికి చెందిన గుడి పవన్కుమార్, నగరంలో తాడితోట వీరభద్రనగర్కు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, గుత్తాల నవీన్ కుమార్ స్నేహితులు. వీరికి గతంలో ఆటోమొబైల్ మెకానిక్లుగా పనిచేసిన అనుభవం ఉంది. జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకుల చోరీలు మొదలు పెట్టారు. కురక్రారు ఎక్కువగా మక్కువ పడే ఖరీదైన స్పోర్ట్స్ బైకులను లక్ష్యంగా ఎంచుకుని చోరీలు చేసేవారు. తాళం వేసి ఉన్న బైకులను చిటికెలో దొంగిలించేవారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా నేరాల బాట వీడలేదు. ఇటీవల నగరంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువగా జరుగుతూండటంతో ఎస్పీ సీహెచ్.సుధీర్ కుమార్రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో సీఐ గణేష్ దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేరాల చిట్టా బయటపడింది. ఇటీవల రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అనపర్తి, అమలాపురం ప్రాంతాల్లోనే కాకుండా భీమవరం, గుంటూరు నగరాల్లో కూడా వారు దొంగిలించిన 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు, వాహనాల రికవరీలో ప్రతిభ చూపిన ఎస్సైలు జీవీవీ సత్యనారాయణ, కేఎం జోషీ, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్.రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, వీరబాబు, బీఎస్కే నాయక్, ఎస్వీవీఎస్ఎన్ మూర్తి, కె.కామేశ్వరరావు, కరీమ్ బాషా, కె.సత్యనారాయణ, డి.శ్రీనివాస్లను డీఎస్పీ అభినందించారు. వేసవి చోరీలపై జాగ్రత్త ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీలత ప్రజలకు సూచించారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తూంతుంటారని, అటువంటి సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఇల్లు విడిచి వెళ్లేవారు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే గస్తీ పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా పెడతారని చెప్పారు. -
ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్గా ఆ బైక్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్సైకిల్' (Suzuki Motorcycle) ఇటీవల ఉత్పత్తిలో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇందులో భాగంగానే గురుగ్రామ్లోని ఖేర్కి ధౌలా ప్లాంట్ నుండి 7 మిలియన్ల యూనిట్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ 7 మిలియన్ యూనిట్గా ఎల్లో కలర్ ఫినిషింగ్ పొందిన 'సుజుకి వి-స్ట్రామ్ ఎస్ఎక్స్' విడుదల చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన అపూర్వమైన విజయం అనే చెప్పాలి. ఫిబ్రవరి 2006లో ఇండియన్ మార్కెట్లో కార్యకలాలను ప్రారంభించిన సుజుకి మోటార్సైకిల్ ఇండియా మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 9.38 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) సుజుకి మోటార్సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్ఎక్స్, జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్, యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్మాన్ స్ట్రీట్, బర్గ్మాన్ స్ట్రీట్ ఈఎక్స్ వంటి ద్విచక్ర వాహనాలను దేశీయ విఫణిలో తయారు చేస్తోంది. అంతే కాకుండా పెద్ద-బైక్ పోర్ట్ఫోలియోలో వి- స్ట్రామ్ 650XT, కటన, హయబుసా మోడల్స్ ఉత్పత్తి చేస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. -
లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'రైడర్ సింగిల్-పీస్ సీట్' బైక్ లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో లభిస్తుంది రైడర్ స్ప్లిట్ సీట్, స్మార్ట్-ఎక్స్నెక్ట్ (SmartXonnect) వేరియంట్కి దిగువన ఉంటుంది. ఇది కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ అవుతుంది. ఈ బైక్ ధర, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్ సింగిల్ పీస్ సీట్ మోడల్ ధర రూ. 94,719 కాగా, స్మార్ట్-ఎక్స్నెక్ట్ వేరియంట్ ధర లక్ష వరకు ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో, రైడర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ నిలిపివేసింది. డిజైన్ & ఫీచర్స్: టీవీఎస్ కొత్త రైడర్ బైక్ ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో మంచి డిజైన్ పొందుతుంది. కాగా ఇందులోని LCD డిస్ప్లే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో USB ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద చిన్న స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!) ఇంజిన్ & పర్ఫామెన్స్: టీవీఎస్ రైడర్ ఇంజిన్ ముందుపతి మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో 124.8 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి 11.4 హెచ్పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడుతుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టీవీఎస్ రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ కలిగి ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒకే ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ సెటప్ పొందుతుంది. ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్ల వరకు ఉంటుంది. -
బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్: కీవే బైక్స్పై భారీ ఆఫర్
సాక్షి, ముంబై: కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే మీకో చక్కటి అవకాశం. కీవే ఇండియా కంపెనీ తన లేటెస్ట్ 300 సీసీ బై బైక్స్ ధరలను భారీగా తగ్గించింది. కే300 ఎన్, కే 300 ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. (మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా కన్నుమూత) కంపెనీ తాజా నిర్ణయంతో నేక్డ్ స్ట్రీట్ వెర్షన్ బైక్ కే 300 ఎన్ ధర రూ. 2.65 లక్షల -రూ. 2.85 లక్షల దాకా ఉంది. ఈ మోడల్పై ఇపుడు 33వేల రూపాయల దాకా తగ్గింపు లభిస్తోంది. అలాగే రూ. 2.99 లక్షల నుంచి రూ. 3.2 లక్షల ధర పలికే కే 300 ఆర్ ధర ఇపుడు రూ. 55 వేలు దిగి వచ్చింది. అంటే దీన్ని రూ. 2.65 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. కే 300 ఎన్, కే 300 ఆర్ అనే బైక్స్ రెండూ కూడా ఒక ప్లాట్ఫామ్పై తయారైనవే. వీటిల్లో 292 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది హెచ్పీ 27.5. అలాగే టార్క్ 25 ఎన్ఎం ను అందిస్తాయి. బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, అలాగే డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED లైట్లు , 2 రైడింగ్ మోడ్లు(ఎకో & స్పోర్ట్)హైలైట్ ఫీచర్లుగా చెప్పుకోవచ్చు. ఈ ధరలు 6 ఏప్రిల్ 2023 నుండి అమల్లోకి రాగా రెండు మోడల్లలోని మొత్తం 3 కలర్ ఆఫర్లలో ప్రామాణికంగా ఉంటాయి. -
‘AI’తో పనిచేసే అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే?
చూడటానికి మామూలు సైకిలు మాదిరిగా ఉన్న ఈ–బైక్ ఇది. ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ–బైక్స్ కంటే చాలా తేలికైనది. దీని బరువు దాదాపు 15 కిలోలు మాత్రమే! దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఇది నిరాటంకంగా 113 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. రోడ్డుపైన ఇది గంటకు 32 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో పయనిస్తుంది.ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ‘ఏసెర్’ ఈ తేలికపాటి ఈ–బైక్ను ‘ఈబీ’ పేరిట రూపొందించింది. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. ప్రయాణించే దారిలోని రోడ్ల పరిస్థితిని బట్టి తనంతట తానే గేర్లు మార్చుకుంటుంది. డ్రైవర్ సౌకర్యానికి, వాహనం నడిపే తీరుకు అనుగుణంగా సర్దుకుంటుంది. దీని ధర 999 డాలర్లు (సుమారు రూ.82 వేలు) మాత్రమే! -
పవర్ ఫుల్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 బెస్ట్ బైక్స్!
భారతీయ మార్కెట్లో ప్రస్తుతం లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులు నుంచి అత్యంత ఖరీదైన బైకుల వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల మధ్య లభించే టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం. కెటిఎమ్ 390 డ్యూక్: ఎక్కువ మంది యువతకు ఇష్టమైన బైకులలో కెటిఎమ్ 390 డ్యూక్ ఒకటి. దీని ధర రూ. 2.96 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2017 నుంచి చిన్న చిన్న అప్డేట్లను పొందుతూనే ఉంది. కావున అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ 373సీసీ ఇంజిన్ కలిగి 9000 ఆర్పిఎమ్ వద్ద 43.5 పిఎస్ పవర్, 7000 ఆర్పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310: ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ టీవీఎస్ కంపెనీకి చెందిన అపాచీ ఆర్ఆర్ 310 కూడా ఎక్కువమంది ఇష్టపడే బైకుల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్పోర్ట్బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 312.2 సీసీ ఇంజిన్ 33.5 బిహెచ్పి పవర్, 27.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హోండా సిబి300ఆర్: హోండా కంపెనీకి చెందిన సిబి300ఆర్ బైక్ ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30.7 బిహెచ్పి పవర్, 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా రైడర్ కు సులువైన క్లచ్ ఆపరేటింగ్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్లర్ క్లచ్ వంటివి కూడా ఇందులో లభిస్తాయి. సుజుకీ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్: మన జాబితాలో మూడు లక్షలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో ఒకటి సుజుకీ వీ స్ట్రోమ్ ఎస్ఎక్స్. దీని ధర రూ. 2.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 249 సీసీ, 4 స్ట్రోక్,సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350: భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ క్లాసిక్ 350. ఈ బైక్ ధర రూ. 1.90 లక్షల నుంచి రూ. 2.21 లక్షల వరకు ఉంటుంది (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 6,100 ఆర్పిఎమ్ వద్ద 20.3 బిహెచ్పి పవర్, 4,000 ఆర్పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. -
వచ్చే నెలలో విడుదలకానున్న టూ వీలర్స్, ఇవే!
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను వినియోగించాలనే ఆసక్తికలిగిన కస్టమర్ల కోసం కంపెనీలు కూడా ఆధునిక వెహికల్స్ విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎప్పటిలాగే వచ్చే నెలలో కూడా కొన్ని లేటెస్ట్ కార్లు, బైకులు దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్నాయి. వచ్చే నెల నుంచి బీఎస్6 పేస్-2 ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొత్తగా విడుదలయ్యే వాహనాలు తప్పకుండా దానికి లోబడి ఉండాలి. సింపుల్ వన్: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు విడుదలైన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికీ విక్రయానికి రాలేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో గొప్ప ఆదరణ పొందిన ఈ టూ వీలర్ బుకింగ్స్ పరంగా కూడా ఉత్తమ వృద్ధిని కనపరిచింది. కాగా ఈ స్కూటర్ వచ్చే నెల ప్రారంభం నుంచి విక్రయానికి రానున్న సమాచారం. డుకాటీ మాన్స్టర్ ఎస్పీ: ద్విచక్ర వాహన ప్రియులకు ఎంతగానో ఇష్టమైన బైకులతో ఒకటైన డుకాటీ 2023 ఏప్రిల్ చివరి నాటికి తన మాన్స్టర్ ఎస్పీ బైక్ విడుదల చేయాలని ఆలోచిస్తోంది. కంపెనీ గతంలోనే 9 బైకులను విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో మరిన్ని డుకాటీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. హోండా యాక్టివా 125 హెచ్- స్మార్ట్: హోండా మోటార్సైకిల్ దేశీయ మార్కెట్లో వచ్చే నెలలో ఇప్పటికే విక్రయానికి ఉన్న యాక్టివా స్కూటర్లో కొత్త వెర్షన్ విడుదల చేయనుంది. దీని పేరు 'హోండా యాక్టివా 125 హెచ్-స్మార్ట్'. దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. కావున డిజైన్ పరంగా పెద్ద తేడా లేనప్పటికీ.. రిమోట్ ఇంజిన్ స్టార్ట్, కీలెస్ ఇగ్నీషన్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయని తెలిసింది. 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్: ఇప్పటికే భారతదేశంలో విడుదల కావాల్సిన 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ & ఆర్ఎస్ బైకులు కొన్ని అనివార్య కారణాల వల్ల లాంచ్ కాలేదు. అయితే ఇవి రెండూ వచ్చే నెలలో విడుదలకానున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైకులకు సంబంధిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
‘హీరో’ లవర్స్కు షాక్: ఏప్రిల్ 1 నుంచి షురూ!
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ మేకర్ హీరో మోటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై వచ్చే నెల నుండి 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్ , మార్కెట్లను బట్టి మారుతూ ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. (ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !) OBD-2 నిబంధనలకు అనుగుణంగా మారడం, ఉద్గార ప్రమాణాల అమలుతో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకోసం తమ తమ వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. (ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్బర్గ్ ఆగ్రహం) హీరో మోటోకార్ప్ తాజా లాంచ్లు: హీరో మోటోకార్ప్ ఇటీవల భారతదేశంలో రూ. 68,599 (ఎక్స్-షోరూమ్) వద్ద సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. అలాగే రూ. 83,368, ఎక్స్-షోరూమ్ ధరతో సూపర్ స్ప్లెండర్ కొత్త హైటెక్ XTEC వేరియంట్ను కూడా పరిచయం చేసింది. కాగా ఇలీవలి కాలంలో హీరో కంపెనీ ధరల పెంపు ఇదిరెండోసారి. అటు టాటా మోటార్స్ సైతం తాజాగా తన కమర్షియల్ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది. -
భారత్లో తక్కువ ధర వద్ద లభించే టాప్ 5 బైకులు - వివరాలు
సాధారణంగా చాలామంది వాహన వినియోగదారులు మంచి మైలేజ్ అందించి సరసమైన ధర వద్ద లభించే వాహనాలను (బైకులు, కార్లు) కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. దేశీయ విఫణిలో ద్విచక్ర వాహన విభాగంలో సరసమైన ధర వద్ద లభించే ఐదు బైకులు గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. హీరో హెచ్ఎఫ్ 100: భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో చెప్పుకోదగ్గ బైక్ హీరో హెచ్ఎఫ్ 100. ఈ బైక్ ధర రూ. 54,962 (ఎక్స్-షోరూమ్). ఇది 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హెచ్పి పవర్ 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ కేవలం ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్: హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ మన జాబితాలో సరసమైన ధర వద్ద లభించే పాపులర్ బైక్. దీని ధర రూ. 61,232 నుంచి రూ. 68,382 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 100 సిసి విభాగంలో తిరుగులేని అమ్మకాలు పొందుతూ ఇప్పటికీ ఎక్కువ మంది కస్టమర్ల మనసు దోచేస్తున్న బైక్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కావడం విశేషం. టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలు మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇందులో ఒకటి 'టీవీఎస్ స్పోర్ట్' బైక్. దీని ధర రూ. 61,500 నుంచి రూ. 69,873 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి 8.3 హెచ్పి పవర్ 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. హోండా షైన్ 100: మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఎక్కువ అమ్ముడవుతున్న బైకులలో హోండా షైన్ 100 కూడా ఒకటి. దీని ధర రూ. 64,900 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ 99.7 సీసీ ఇంజిన్ కలిగి 7.61 హెచ్పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన సెల్ఫ్-స్టార్ట్ మోటార్సైకిల్గా నిలిచింది. బజాజ్ ప్లాటినా 100: భారతీయ మార్కెట్లో లభించే సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా 100. ఈ బైక్ ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్). ఇది సిగ్నేచర్ DTS-i టెక్నాలజీ 102 సిసి ఇంజిన్ ద్వారా 7.9 హెచ్పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్స్.. వచ్చేస్తున్నాయ్
భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా కంపెనీ అమ్మకాలు తారా స్థాయిలో చేరుకుంటున్నాయి. 2023 ఫిబ్రవరిలో 71,544 యూనిట్లను విక్రయించి 2022 ఫిబ్రవరి కంటే 20.93 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. అమ్మకాల్లో దూసుకెళ్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకురావడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ లైనప్లో హంటర్ 350సీసీ, బుల్లెట్ 350సీసీ, క్లాసిక్ 350సీసీ, మీటియోర్ 350సీసీ, హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650, మరియు సూపర్ మెటోర్ 650 వంటి తొమ్మిది మోడళ్లు ఉన్నాయి. కంపెనీ కొత్త ప్రణాళికలో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మరో రెండు 350సీసీ బైకులు విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికల ద్వారా తెలుస్తోంది. అవి బుల్లెట్ 350, షాట్గన్ 350 బాబర్ బైకులు. అంతే కాకుండా 450 సీసీ విభాగంలో, 650 సీసీ విభాగంలో కొత్త బైకులు విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350: రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న కొత్త బైక్ ఈ బుల్లెట్ 350. ఇది దాని మునుపటి మోడల్ కంటే అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. మీటియోర్ 350 మాదిరిగానే ఇది కూడా 5 స్పీడ్ గేర్బాక్స్తో 346 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందనుంది. (ఇదీ చదవండి: బజాజ్ నుంచి అప్డేటెడ్ బైక్స్ విడుదల) రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 350 బాబర్: ఇక కంపెనీ విడుదలచేయనున్న మరో కొత్త బైక్ 'రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 350 బాబర్'. ఇది కూడా మీటియోర్ 350 మాదిరిగానే అదే ఇంజిన్, పర్ఫామెన్స్ పొందే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్స్ కంటే ఉత్తమంగా ఉంటుంది. దీని ధర రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
60కిపైగా దేశాల్లో రయ్.. రయ్, అపాచీ సరికొత్త రికార్డులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ మరో రికార్డు నమోదు చేసింది. భారత్తోపాటు అంతర్జాతీయంగా 50 లక్షల యూనిట్ల అపాచీ ప్రీమియం మోటార్ సైకిళ్లను విక్రయించి కొత్త మైలురాయిని అధిగమించింది. 2005లో అపాచీ మోటార్ సైకిల్ తొలిసారిగా రోడ్డెక్కింది. 60కిపైగా దేశాల్లో ఈ బైక్స్ పరుగెడుతున్నాయి. అంతర్జాతీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లలో అపాచీ ఒకటిగా నిలివడం విశేషం. సెగ్మెంట్లో తొలిసారిగా, అలాగే వినూత్న ఫీచర్లతో ఈ బైక్ అప్గ్రేడ్ అవుతూ వస్తోందని కంపెనీ తెలిపింది. రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రైడ్ మోడ్స్, డ్యూయల్ చానెల్ఏబీఎస్, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ వంటివి వీటిలో ఉన్నాయి. అపాచీ సిరీస్లో ఆర్టీఆర్ 160, 160 4వీ, 180, 200 4వీ, ఆర్ఆర్ 310 మోడళ్లు ఉన్నాయి. అత్యుత్తమ పనితీరు, సాంకేతికత, శైలితో ప్రీమియం మోటార్సైకిల్స్ విభాగంలో అపాచీ కొత్త ప్రమాణాలను సృష్టిస్తోందని టీవీఎస్ మోటార్ తెలిపింది. -
గర్ల్ఫ్రెండ్ కోసం దొంగగా మారిన యువకుడు.. 13 ఖరీదైన బైక్లు చోరీ
ముంబై: గర్ల్ఫ్రెండ్ను ఇంప్రెస్ చేయాలని ఓ యువకుడు దొంగగా మారాడు. ఖరీదైన బైకులు దొంగతనం చేశాడు. మొత్తం 13 ద్విచక్ర వహనాలకు తస్కరించి కటకటాలపాలయ్యాడు. మహారాష్ట్ర థానె జిల్లా కల్యాణ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ యువకుడి పేరు శుభం భాస్కర్ పవార్. ఓ బైక్ను దొంగిలించిన ఇతడ్ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే అతడ్ని విచారించగా అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. తాను మొత్తం 13 బైక్లు దొంగిలించినట్లు శుభం విచారణలో ఒప్పుకున్నాడు. కేవలం తన ప్రేయసిని సంతోష పెట్టేందుకే ఈ చోరీలకు పాల్పడినట్లు చెప్పాడు. ఈ బైక్ల విలువ రూ.16లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు చెప్పారు. చదవండి: లఖీంపూర్ ఖేరీ కేసులో మిశ్రాకు బెయిల్ -
వావ్! ఎలక్ట్రిక్ వెహికల్గా..లూనా మళ్లీ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: చిన్న బండి లూనా గుర్తుంది కదూ. ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న ఈ మోపెడ్ కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ లూనా రూపంలో వస్తోంది. కినెటిక్ గ్రీన్ ఎనర్జీ, పవర్ సొల్యూషన్స్ దీనిని ప్రవేశపెట్టనుంది. చాసిస్, ఇతర విడిభాగాల తయారీ ఇప్పటికే మొదలైందని కినెటిక్ గ్రూప్ ప్రకటించింది. నెలకు 5,000 యూనిట్ల తయారీ సామర్థ్యంతో ప్రత్యేక యూనిట్ సైతం అహ్మద్నగర్ ప్లాంటులో ఏర్పాటైంది. లూనా అమ్మకాల ద్వారా వచ్చే 2–3 ఏళ్లలో ఏటా రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతుందని కినెటిక్ ఇంజనీరింగ్ ఎండీ ఆజింక్యా ఫిరోదియా తెలిపారు. -
కొత్త ప్రపంచం @ 16 October 2022
-
యమహా గుడ్న్యూస్ చెప్పిందిగా!
సాక్షి, ముంబై: పెరుగుతున్న ఇంధన ధరలు, కర్బన ఉద్గారాల కాలుష్యం, ఇథనాల్లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తన వినియోగ దారులకు మంచి వార్త చెప్పింది.ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న రైడర్లకు ఊరట కలిగేలా పెట్రోలు, ఇథనాల్ లేదా రెండిటితో కలిసి పనిచేసి అద్భుతమైన ఇంజీన్తో కొత్త బైక్ను తీసుకొచ్చింది. 2023 యమహా ఎఫ్జెడ్-15ను బ్రెజిల్లో లాంచ్ చే సింది. కంపెనీ ఈ బైక్ను దక్షిణ అమెరికా దేశంలో Fazer FZ-15 పేరుతో విక్రయిస్తోంది. అయితే ఇదే ఇంజీన్తో అప్డేట్ చేసి ఇండియాలో ఇథనాల్ ఆధారిత Yamaha FZ V3 బైక్ను త్వరలోనే తీసుకురావచ్చని భావిస్తున్నారు. యమహా ఎఫ్జెడ్-15ను బ్లూఫ్లెక్స్ సిస్టమ్తో కూడిన 150సీసీ ఇంజిన్తో వచ్చింది. ఇది పెట్రోల్, ఇథనాల్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ పొదుపుగా ఉంటుందో దాన్ని ఎంచుకునేలా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త యమహా బైక్లు ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్లైట్, ముందు భాగంలో ABS బ్రేక్లు, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్లు, మోనోక్రాస్ సస్పెన్షన్, వైడ్ టైర్లు, క్లాక్, గేర్ ఇండికేటర్, టాకోమీటర్,ఈకో ఫంక్షన్గా విడదుల చేసింది.రేసింగ్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు మాగ్మా రెడ్ అనే మూడు రంగుల ఎంపికలో లభ్యం. ధర సుమారు రూ. 2.69 లక్షలుగా ఉంటుంది. -
విజయవాడ కేంద్రంగా..అవేరా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైక్స్ విడుదల
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రెండు సరికొత్త ఎలక్ట్రికల్ స్కూటర్లను అవేరా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. విజయవాడ సమీపంలోని తయారీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విన్సిరో పేరుతో ప్రీమియం, రెట్రోసా లైట్ పేరుతో ఎకానమీ స్కూటర్ను విడుదల చేసింది. పూర్తి భద్రతా ప్రమాణాలతో ఉండే ఎల్ఎఫ్పీ బ్యాటరీతో రూపొందించిన ‘విన్సిరో’ గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణించడమే కాకుండా ఒకసారి చార్జింగ్ చేస్తే 236 కి.మీ. ప్రయాణం చేస్తుందని అవేరా ఫౌండర్ సీఈవో వెంకట రమణ పేర్కొన్నారు. సబ్సిడీలు పోను ఈ స్కూటర్ ధరను రూ. 1.40 లక్షలుగా నిర్ణయించారు. అలాగే విన్సిరో లైట్ గంటకు 60 కి.మీ. వేగంతో ఒకసారి చార్జింగ్చేస్తే 100 కి.మీ. ప్రయాణం చేయనుంది. విన్సిరో లైట్ ధరను రూ.99,000 గా నిర్ణయించారు. -
తగ్గిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు!
దేశవ్యాప్తంగా రిటైల్లో వాహన అమ్మకాలు జూలైలో 14,36,927 యూనిట్లు నమోదయ్యాయి.2021 జూలైతో పోలిస్తే ఇది 8 శాతం తగ్గుదల. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) ప్రకారం.. క్రితం ఏడాదితో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 5 శాతం తగ్గి 2,50,972 యూనిట్లకు వచ్చి చేరాయి. ద్విచక్ర వాహనాలు 11 శాతం తగ్గి 10,09,574 యూనిట్లుగా ఉంది. ట్రాక్టర్ల అమ్మకాలు 28 శాతం పడిపోయి 59,573 యూనిట్లకు వచ్చి చేరాయి. త్రిచక్ర వాహనాలు 80 శాతం అధికమై 50,349 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 27 శాతం దూసుకెళ్లి 66,459 యూనిట్లకు పెరిగాయి. -
ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది!
యూత్లో బైక్లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో బోలెడన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా మార్కెట్లో యమహా ఆర్ఎక్స్ 100కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 దశకంలో యువతని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ బైక్లను నిలిపేసి 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అవి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మోడల్ బైక్ కోసం కలలు కనే వారి కోసం తాజాగా యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది. ఆర్ఎక్స్ 100 బైక్ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యువత కలల బైక్ రానుంది యమహా ఇండియా చైర్మన్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా RX100 ఆధునిక డిజైన్ , స్టైలిష్ లుక్తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ పాత మోడల్కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్ లవర్స్ని ఆకట్టుకునేలా డిజైన్, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్ ఆర్ఎక్స్100 బైక్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే వచ్చే మూడేళ్లలో యమహా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందని చిహానా పేర్కొన్నారు. ప్రస్తుతానికి, రాబోయే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్లో గ్రేటర్ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వాటితో 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. కాగా యమహా కంపెనీ 1985 నుంచి ఉత్పత్తి ప్రారంభించి ఆర్ఎక్స్100బైక్ను 1996 వరకు కొనసాగించారు. చదవండి: 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
విచిత్ర వ్రతం.. చెప్పులు తొడగరు.. బండ్లు నడపరు.. ఎందుకంటే?
యశవంతపుర(కర్ణాటక): ఆ గ్రామస్తులు చెప్పులు తొడగరు..బైక్లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇది వారు ఆచరిస్తున్న విచిత్ర వ్రతం. ఈ ఊరు పేరు కాలేబాగ్. విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్లపై నుంచి పడి కొందరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. దీంతో గ్రామస్తులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడిని కలిసి తమను కాపాడాలని కోరారు. గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని, ఈక్రమంలో ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు ధరించరాదని, ఎలాంటి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు. -
మోస్ట్ ఎవైటెడ్ బైక్ వచ్చేసింది, ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: ప్రీమియం ద్విచక్ర వాహనాల సంస్థ కేటీఎం సోమవారం 2022 కేటీఎం ఆర్సీ 390 మోటర్సైకిల్ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 3,13,922 (ఎక్స్ షోరూం ఢిల్లీ). వీటి తమ షోరూమ్లలో బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ వివరించింది. 2014 నుంచి ఆర్సీ 390 అత్యంత ప్రాచుర్యం పొందిన సూపర్ స్పోర్ట్స్ మోడల్స్లో ఒకటి. అవుట్గోయింగ్ మోడల్లో పోలిస్తే ఈ కొత్త-తరం ఆర్సీ 390 బైక్లో ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, సూపర్మోటో మోడ్తో కూడిన డ్యూయల్-ఛానల్ ABS ,పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్, టీఎఫ్టీ మల్టీకలర్ డిస్ప్లే సహా ఇతర ఎలక్ట్రానిక్ అప్గ్రేడ్లతో వస్తుంది. అలాగే క్విక్షిఫ్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. లేటెస్ట్ మోడల్లో అధునాతన 373 సీసీ ఇంజిన్, 13.7 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. 4వాల్వ్, లిక్విడ్-కూల్డ్, DOHC ఇంజిన్తో వస్తుంది. ఇది 42.9బీహెచ్పీ గరిష్ట శక్తిని, 37ఎన్ఎం వద్దగరిష్ట టార్క్ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ను పొందుపర్చారు. రేసింగ్ బ్లూ , ఆరెంజ్ రెండు రంగుల్లో లభ్యం. -
ఇటలీ సంస్థతో ఒకినావా ఆటోటెక్ జట్టు!
ముంబై: ఇటలీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టేసిటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఒకినావా ఆటోటెక్ వెల్లడించింది. దీని ప్రకారం స్కూటర్లు, మోటర్సైకిళ్లతో పాటు దేశ, విదేశీ మార్కెట్లకు పవర్ట్రెయిన్ల తయారీ కోసం జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయనున్నారు. భారత్ కేంద్రంగా జేవీ ఏర్పాటవుతుందని, రాజస్థాన్లోని తమ రెండో ప్లాంటులో 2023 నుంచి ఉత్పత్తి ప్రారంభం కాగలదని ఒకినావా ఆటోటెక్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ తెలిపారు. వచ్చే ఏడాది తయారు చేసే వాటిలో ఒక స్కూటర్, హై–ఎండ్ మోటర్సైకిల్ మోడల్ ఉంటాయని ఆయన వివరించారు. ప్రథమార్ధంలో డిజైనింగ్, అభివృద్ధి మొదలైన పనులు చేపట్టనున్నట్లు శర్మ చెప్పారు. టేసిటా సొంతంగా పవర్ట్రెయిన్, కంట్రోలర్, మోటర్, బ్యాటరీ ప్యాక్లు మొదలైన వాటిని డిజైన్ చేసుకుని, ఉత్పత్తి చేస్తుంది. జేవీలో భాగంగా టేసిట్ పవర్ట్రెయిన్ మొదలైనవి అందించనుండగా స్థానికంగా ఉత్పత్తి అభివృద్ది, తయారీని ఒకినావా చేపడుతుంది. మార్కెట్పై గట్టి పట్టు ఉన్న ఒకినావాతో జట్టు కట్టడంపై టేసిటా ఎండీ పీర్పాలో రిగో సంతోషం వ్యక్తం చేశారు. -
ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్..కొనేవారు కరువయ్యారు..! కానీ..!
ముంబై: ఆటోమొబైల్ పరిశ్రమపై కోవిడ్–19 ప్రభావాలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ పరిణామాలతో సామాన్యుల ఆదాయాల సెంటిమెంటు గణనీయంగా దెబ్బతింది. దీంతో ఎంట్రీ స్థాయి కార్లు కొనుక్కోవాలనుకునే వారు లేదా అప్గ్రేడ్ అవ్వాలనుకునేవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సంపన్న వర్గాల ఆదాయాలకేమీ ఢోకా లేకపోవడంతో ప్రీమియం కార్ల (రూ. 10 లక్షలు పైబడినవి) అమ్మకాలు మాత్రం గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు నివేదిక పేర్కొంది. ద్విచక్ర వాహనాల విభాగంలో అధిక రేటు ఉండే (రూ. 70,000 పైగా) టూ–వీలర్ల వాటా 40 శాతం స్థాయిలో ఉండనున్నట్లు వివరించింది. దేశీయంగా సాధారణంగా తొలిసారి కొనుగోలు చేసేవారు, లేదా సెకండ్ హ్యాండ్ వాహనాల నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్న వారు ఎంట్రీ స్థాయి కార్లపై దృష్టి పెడుతుంటారు. సరఫరాపరమైన సమస్యలు వాహనాల తయారీ సంస్థలన్నింటిపైనా ప్రభావం చూపుతున్నప్పటికీ, ఎంట్రీ లెవెల్ కన్నా ఎక్కువ రేటు ఉండే మోడల్స్పై కొనుగోలుదారుల ఆసక్తి కొనసాగుతోందని క్రిసిల్ నివేదిక వివరించింది. ప్రీమియం.. అయిదు రెట్లు అధికం.. గత ఆర్థిక సంవత్సరం చౌక ధరల కార్లతో పోలిస్తే ప్రీమియం సెగ్మెంట్ వాహనాలు అయిదు రెట్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎంట్రీ కార్ల విభాగం 7 శాతం పెరగ్గా ప్రీమియం విభాగం విక్రయాలు 38 శాతం వృద్ధి నమోదు చేశాయి. దీంతో ప్రీమియం కార్ల మార్కెట్ వాటా 500 బేసిస్ పాయింట్లు పెరిగి సుమారు 30 శాతానికి చేరింది. సంపన్నుల ఆదాయాలపై పెద్దగా ప్రతికూల ప్రభావాలు లేకపోవడం, ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ వివరించింది. అలాగే అధిక రేటు ఉండే టూ–వీలర్లవైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండటం, మరిన్ని మోడల్స్ అందుబాటులో ఉండటం తదితర అంశాల కారణంగా మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో వీటి వాటా 40 శాతం స్థాయిలో కొన్నాళ్లు కొనసాగవచ్చని పేర్కొంది. రేటు ఎక్కువ .. చాయిస్ తక్కువ.. కఠిన భద్రతా ప్రమాణాలు (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సర్లు మొదలైనవి) అమలు చేయాల్సి రావడం వల్ల గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో చౌక కార్ల రేట్లు 15–20 శాతం మేర పెరిగాయి. ఎంట్రీ లెవెల్ కార్ల ధరలు గణనీయంగా పెరగడం, మోడల్స్ లభ్యత తక్కువగా ఉండటం (కొన్ని సంస్థలు ఈ విభాగం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి) వంటి అంశాలు ఒక మోస్తరు ఆదాయాలుండే కొనుగోలుదారుల నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. క్రిసిల్ నివేదిక ప్రకారం .. పెద్ద, మధ్య స్థాయి కంపెనీల్లో ఉద్యోగులపై వెచ్చించే వ్యయాలు, చిన్న స్థాయి సంస్థల్లో కన్నా ఎక్కువగా పెరిగాయి. తదనుగుణంగానే అధికాదాయం ఆర్జించే పెద్ద సంస్థల ఉద్యోగులు ఎక్కువ వెచ్చించి ప్రీమియం కార్లను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరల్లో కార్లను కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా చిన్న స్థాయి సంస్థల్లోనే ఉంటుంది. ఇలాంటి సంస్థల్లో ఉద్యోగులపై వ్యయాలు పెద్దగా పెరగని నేపథ్యంలో ఆదాయాల సెంటిమెంటు ఆశావహంగా లేకపోవడం వల్ల వారు కొనుగోలు నిర్ణయాలు వాయిదా వేసుకుంటున్నట్లు క్రిసిల్ తెలిపింది. ఆదాయాల సెంటిమెంట్ను మదింపు చేసేందుకు ఈ విధానాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్లు వివరించింది. ప్రీమియంలో సెకండ్ హ్యాండ్ అయినా ఓకే.. రేట్లు పెరిగిపోయిన కొత్త ఎంట్రీ లెవెల్ కారుకు బదులు అదే ధరకు వస్తున్న ఖరీదైన సెకండ్ హ్యాండ్ కారునయినా కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారని క్రిసిల్ తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో మారుతీ ఆల్టో, స్విఫ్ట్, డిజైర్ వంటివి, హ్యుందాయ్ ఐ10, ఐ20 మొదలైన ప్రాథమిక స్థాయి వాహనాల అమ్మకాల వాటా మొత్తం కార్ల విక్రయాల్లో 56 శాతం పైగా నమోదైంది. కానీ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఇది క్రమంగా తగ్గుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా కార్ల విభాగంలో 54 పైచిలుకు మోడల్స్ ఉండగా ప్రస్తుతం 39 స్థాయికి పడిపోయింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి తక్కువ ధర కార్ల సెగ్మెంట్లో కొత్త మోడల్స్ ఆవిష్కరణ కూడా పెద్దగా లేదు. ఖరీదైన కార్ల విభాగంలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అయిన హ్యుందాయ్ క్రెటా, మారుతీ ఎర్టిగా, హోండా సిటీ మొదలైన వాటి వాటా 2019లో దాదాపు 68 శాతం ఉండేది. వాటి విక్రయాలు తర్వాత కాస్త తగ్గినా కొత్త అప్గ్రేడ్స్ ఆ ఖాళీని భర్తీ చేస్తున్నాయి. కియా సెల్టోస్, మారుతి ఎక్స్ఎల్6, ఎంజీ హెక్టర్, మహీంద్రా ఎక్స్యూవీ 700, హ్యుందాయ్ అల్కజర్ మొదలైన మోడల్స్ అమ్మకాలు గణనీయ స్థాయిలో ఉన్నాయి. ఇక గడిచిన 5–6 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 70,000 పైగా ధర ఉన్న టూ–వీలర్ల విక్రయాలు నిలకడగా అధిక స్థాయిలో నమోదవుతున్నట్లు క్రిసిల్ తెలిపింది. కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతుండటంతో దానికి అనుగుణంగా తయారీ సంస్థలు కూడా అధిక రేట్ల వాహనాలపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2015 ఆర్థిక సంవత్సరంలో తక్కువ రేట్ల విభాగంలో 29 మోడల్స్ ఉండగా ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయని తెలిపింది. దానికి విరుద్ధంగా అధిక ధర సెగ్మెంట్లో మోడల్స్ సంఖ్య 71 నుంచి 93కి పెరిగినట్లు వివరించింది. చదవండి👉 పాప్ స్టార్ జస్టిన్ బీబర్కు భారీ షాక్! -
కాలిపోతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్..కేంద్రం సంచలన నిర్ణయం!
ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్స్లో ఉండే బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకోనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. “మేం సెల్ ప్రమాణాలు, బ్యాటరీల పరీక్షా ప్రమాణాలు, నిర్వహణ పద్దతుల్ని సవరిస్తాం. నిర్దిష్ట టెంపరేచర్ దాటిన తర్వాత బ్యాటరీలలోని ద్రావణంలో రాపిడి జరిగి (ఉదాహరణకు లిథియం అయాన్ బ్యాటరీలోని ఎలక్ట్రోలేడ్ ద్రావణం) ప్రమాదాలు జరుతున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారంటూ వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక పేర్కొంది. మరోవైపు కేంద్రం తీసుకోనున్న ఈ కొత్త నిర్ణయం ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ దారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే..ప్రస్తుతం ఆయా ఆటోమొబైల్ సంస్థలు మార్కెట్లో ఈవీ వెహికల్స్ ఉన్న డిమాండ్ను బట్టి విపరీతంగా తయారీని పెంచుతున్నాయి. ఒకవేళ కేంద్రం బ్యాటరీల నిబంధనల్ని సవరిస్తే..కంపెనీలు తయారీ కాకుండా.. భద్రతపై దృష్టిసారించి..ఉత్పత్తి అనుకున్నంతగా చేయలేవని నిపుణులు అంటున్నారు. 30 రోజుల్లో ఆరు వెహికల్స్ దగ్ధం దేశ వ్యాప్తంగా గత ముప్పై రోజుల్లో దాదాపు అర డజను ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నికి ఆహుతైనట్లు రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. ఏప్రిల్ 9న మహారాష్ట్రలోని నాసిక్లో కంటైనర్లో లోడ్ చేసిన జితేంద్ర న్యూ ఈవీ టెక్కు చెందిన 20 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. నో రీకాల్..కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్ధమవ్వడంపై..ప్రభుత్వం ఈ సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేయాలని ఆదేశించడంపై కేంద్రం ఆలోచించడం లేదని, బదులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, డీఆర్డీఓ ల్యాబ్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాలపై నిజ నిర్ధారణ పరిశోధనల రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గిరిధర్ అరమనే ఏం చెప్పారు అంతకుముందు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలపై..కేంద్రం వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే చెప్పారు. చదవండి: టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా! -
టపా టప్: వరుసగా పేలుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్! కారణం అదేనా!
దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో వాహనదారుల ఆలోచన మారుతుంది. నిత్యం పెట్రోల్, డీజిల్ను కొనేకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలని ఎగబడుతున్నారు. కానీ వరుస ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమాదాలు వాహనదారుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, మహరాష్ట్ర, పూణేలలో ఈవీబైక్లు దగ్ధమవ్వగా..ఇవ్వాళ వరంగల్లో మరో ఎలక్ట్రిక్ బైక్ అగ్నికి ఆహుతైంది. వరంగల్లో ఎలక్ట్రిక్ బైక్ దగ్ధమైంది. ఉదయం 6గంటలకు వరంగల్ చౌరస్తాలోని అప్నా పాన్ షాప్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసింది. పార్కు చేసిన ఎలక్ట్రికల్ బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా కాలిపోయింది. మనం వాడే అన్నీ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్లో మనం ఉపయోగిస్తున్న ల్యాప్ట్యాప్లు, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా అన్నింటిలోనూ లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. తేలికైన బ్యాటరీ సామర్ధ్యం. అత్యధిక నిలువ సామర్ధ్యం. ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి ఈ రకం బ్యాటరీలో ఉన్న ప్లస్ పాయింట్స్. లిడ్ యాసిడ్లతో పోల్చితే..లిథియం ఆయాన్ బ్యాటరీల సామర్ధ్యం సుమారు 6రెట్లు ఎక్కువ. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఎలక్ట్రోలేడ్ ద్రావణం రోజుల వ్యవధిలో వరుసగా ఎలక్ట్రిక్ బైక్లు తగలబడిపోవడం..ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై భయాల్ని రేకెత్తిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులు ఈ లిథియం అయాన్ బ్యాటరీలను వాడాలంటే జంకుతున్నారు. ఎందుకంటే సరైన పద్దతిలో వినియోగించుకోకపోతే లిథియం అయాన్ బ్యాటరీలో పేలే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లిథియం అయాన్ బ్యాటరీల్లో రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్లు ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ టెర్మినళ్ల వద్ద ఎలక్ట్రోలేడ్ ద్రావణం ఉంటుంది. ఈ ద్రావణమే ఎలక్ట్రిక్ బైక్లు ప్రమాదానికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు దీనిలో ఉన్న ఆయాన్లు ఒక ఎలక్ట్రోడ్ నుంచి మరో ఎలక్ట్రోడ్కు ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో ఎలక్ట్రిక్ ద్రావణం అగ్ని ప్రమాదం జరిగేలా ప్రేరేపిస్తుంది. కాబట్టే ఎలక్ట్రోడ్లు ఉండే బ్యాటరీలను విమానాల్లోకి అనుమతించరు. ఏథర్ ఏం చెబుతుందంటే ఏ బ్యాటరీలు ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతాయో అంతే ప్రమాదకరమైనవని ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ ఏథర్ తన బ్లాగ్లో పేర్కొంది. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉండే బ్యాటరీలను సురక్షితమైన విధానంలో వినియోగించినప్పుడే బాగా పని చేస్తాయి. లేదంటే.. ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం లిథియం అయాన్ బ్యాటరీకి వర్తిస్తుంది. అంటే బ్యాటరీ ఛార్జింగ్ డిస్చార్జింగ్ రేటు. సామర్థ్యం, లైఫ్ సైకిల్, ఛార్జింగ్ అయ్యే సమయంలో ఏ స్థాయిలో వేడెక్కుతుంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఎలక్ట్రిక్ వెహికిల్స్ను వినియోగించుకోవచ్చని, అప్పుడే పేలుడు ప్రమాదాల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని ఎథర్ తన బ్లాగ్లో స్పష్టం చేసింది. చదవండి: ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే షేపులు ఇలా మారిపోయాయేంటీ? -
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లవర్స్కు శుభవార్త!
డుగ్..డుగ్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్కు శుభవార్త. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీఎస్, హీరో, అథేర్, బీఎండబ్ల్యూ వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు మే నెలలో ఎలక్ట్రిక్ బైక్స్ను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ కంపెనీల వెహికల్స్తో పోటీపడుతూ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ను విడుదల చేసేందుకు సిద్ధమైందని రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడుదలపై కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ రిపోర్ట్ల ప్రకారం..చెన్నై కేంద్రంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ద్విచక్రవాహన ఆటోమొబైల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ల కోసం ప్రోటోటైప్లను సిద్ధం చేస్తుందని, త్వరలో ఈవీ బైక్స్ తయారీని ప్రారంభించనుందని రిపోర్ట్లు హైలెట్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే! ఇండియా కార్ న్యూస్ నివేదికల ప్రకారం బైక్ 8కేడ్ల్యూహెచ్ నుండి 10కేడబ్ల్యూహెచ్ వరకు బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించవచ్చు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ల ప్రకారం బైక్ల శక్తి, గరిష్ట టార్క్ 40బీహెచ్పీ, 100ఎన్ఎం ఉందని అంచనా. ఇక ఈబైక్ ప్రస్తుతం ఈ బైక్ ప్రోటోటైప్లు యూకేలో డిజైన్ చేస్తుండగా వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల కానుంది. -
ఈ–వాహనాల వృద్ధి.. పవర్ ఫుల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్రమంగా విద్యుత్ (ఈ) వాహనాల సంఖ్య పెరుగుతోంది. వీటి సంఖ్య నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. 2017లో ద్విచక్రవాహనాలు, త్రిచక్ర వాహనాలు (ఆటోలు), కార్లు కలిపి విద్యుత్ వాహనాల సంఖ్య 5,653 ఉంటే గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 21,565కు పెరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ ఆటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017తో పాటు 2018 సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఆటోలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 2,587కు పెరిగింది. విద్యుత్ స్కూటర్ల సంఖ్య కూడా నాలుగేళ్ల నుంచి భారీగానే పెరుగుతోంది. 2017లో 3,195 ఎలక్ట్రికల్ స్కూటర్లున్నాయి. వీటి సంఖ్య గత డిసెంబర్ చివరి నాటికి 14,441. విద్యుత్ కార్ల వినియోగం మాత్రం ఇప్పుడే పెరుగుతోంది. 2017లో 2,452 విద్యుత్ కార్లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 4,537కు చేరింది. చార్జింగ్ స్టేషన్లు వస్తే ఈ–వాహనాలు మరింత పెరుగుతాయి పెట్రోల్, డీజిల్ బంక్లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్య మరింత పెరుగుతుందని రవాణాశాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరుగుతోందని చెప్పారు. చార్జింగ్ స్టేషన్లు వస్తే వీటి వినియోగం పెరుగుతుందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలపై పన్ను లేకపోవడం వల్ల కూడా ఇటీవల వాటి వినియోగం పెరుగుతోందని చెప్పారు. విద్యుత్ కార్ల వినియోగం పుంజుకుంటోందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. -
పెండింగ్ చలాన్ వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్
-
ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు.. కారు స్పెషల్ ఇదే!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్, కార్లు అంటే ఇష్టం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. తన గ్యారేజీలోకి అడుగుపెడితే ఎన్నో రక రకాల వాహనాలు దర్శమిస్తాయి. తాజాగా ధోనీ గ్యారేజీలోకి మరో కారు వచ్చి చేరింది. ఎంఎస్ ధోని తన కోసం వింటేజ్ క్లాసిక్ ల్యాండ్ రోవర్ 3 కారును కొనుగోలు చేశాడు. బిగ్ బాయ్ టాయ్జ్ అనే సంస్థ నిర్వహించిన ఆన్లైన్ వేలంలో పాల్గొని ఇతరులతో పోటీ పడీ మరీ ఈ కారును ధోనీ దక్కించుకున్నాడు. ఆ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేలంలో భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ వేలంలో పాల్గొన్నారు. బిగ్ బాయ్ టాయ్జ్ అనే సంస్థ రోల్స్ రాయిస్, కాడిలాక్, బ్యూక్, చేవ్రొలెట్, ల్యాండ్ రోవర్, ఆస్టిన్, మెర్సిడెస్ బెంజ్ వంటి 19 రకాల కార్లను వేలంలో ఉంచింది. ఇందులో ధోనీ 1970 మోడల్ ల్యాండ్ రోవర్ 3 కారును రూ.25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ ల్యాండ్ రోవర్ కారుకు ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్స్మిషన్తో నడుస్తుంది. ఆన్లైన్ వేలంలో వేలానికి ఉంచిన వాహనాల్లో 50 శాతం విక్రయించినట్లు బీబీటీ పేర్కొంది. (చదవండి: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?) -
రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు
ద్విచక్ర వాహనాల ఎగుమతుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2021లో కొత్త రికార్డు సృష్టించింది. 2021 ఏడాది కాలంలో భారతీయ, ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు ఎదురైనప్పటికి హీరో మోటోకార్ప్ అత్యధిక సంఖ్యలో 2.89 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏ సంవత్సరంలో నమోదు చేయని విధంగా భారత్తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ గత సంవత్సరంలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ & మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతంలో తన మార్కెట్ విస్తరించింది. ఈ మార్కెట్ విస్తరణ వల్ల భారతదేశం వెలుపల మార్కెట్లలో అమ్మకాల పరంగా 71 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2020లో విదేశీ మార్కెట్లలో 1.69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య (2.89 లక్షల యూనిట్లు) చాలా ఎక్కువ. కానీ, హీరో మోటోకార్ప్ తన పనితీరుతో సంతృప్తిగా లేదు. "ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లై ఛైయిన్ లో ఉన్న అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లలో విక్రయాలు ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయి" అని సంజయ్ భాన్, హెడ్ - గ్లోబల్ బిజినెస్, హీరో మోటోకార్ప్ అన్నారు. "2025 నాటికి గ్లోబల్ బిజినెస్ అమ్మకాల వాటా కంపెనీ మొత్తం వాటాలో 15% చేరుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు" తెలిపారు. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం 42 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తుంది. భారత్తో సహా గ్లోబల్ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో, హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 3,94,773 యూనిట్లను విక్రయించింది. (చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్ ప్రభంజనం..!) -
రయ్..రయ్..డుగ్ డుగ్ మంటూ వచ్చేస్తున్నాయ్!
చిరు ఉద్యోగికి జీవితంలో సొంతిల్లు కట్టుకోవాలనేది ఒక అందమైన కల. అదే కుర్ర కారుకి స్పోర్ట్స్ బైక్ కొనాలనేది కల. కొన్న కొత్త బైక్తో రయ్..రయ్ అంటూ లేదంటే డుగ్ డుగ్ మంటూ చక్కెర్లు కొట్టడం అంటే మహా పిచ్చి. అందుకే బైక్ రైడ్లతో కిర్రాకు పుట్టించే కుర్రకారు కోసం బైక్స్ కంపెనీలు కొత్త మోడళ్లు, సరికొత్త హంగులతో కొత్త బైక్స్ను మార్కెట్కు పరిచయం చేస్తున్నాయి.యువతను అట్రాక్ట్ చేయనున్నాయి. అయితే ఎప్పటిలాగే ప్రతి ఏడాది విడుదలయ్యే కొత్త బైక్స్ ఈ ఏడాది విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411 రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రామ్ 411. ఈ బైక్ ను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారు. 19 అంగుళాలతో చిన్నగా ఫ్రంట్ వీల్ ఉండనుంది. ఈ నెలలో మార్కెట్లో విడుదల కావాల్సి ఉండగా..బైక్ ధర రూ.1.9లక్షలుగా ఉంది. కేటీఎం ఆర్సీ 390 కేటీఎం ఆర్సీ 390 స్పోర్ట్స్ బైక్. బైక్ విండ్స్క్రీన్ బ్లాస్ట్ను తగ్గిస్తుంది. బైక్ రైడింగ్ సమయంలో అలసట లేకుండా చేస్తుంది. మరో ఆరు నెలలో ఈ బైక్ మార్కెట్లో విడుదల కానుండగా.. ఈ బైక్ ధర రూ.2.5లక్షలుగా ఉంది. కవాసకీ డబ్ల్యూ 175 కవాసకీ డబ్ల్యూ 175 ఈ ఏడాదిలోనే విడుదల కానున్న ఈ బైక్ అత్యంత సరసమైన బైక్గా నిలవనుంది. ఇక ఈ బైక్ ధర రూ.1.75లక్షలుగా ఉంది. 2022 హోండా సీబీ300ఆర్ మరో వారంలో 2022 హోండా సీబీ300ఆర్ బైక్ దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. బీఎస్ వీఐ ఇంజిన్తో వస్తున్న ఈ బైక్ ధర రూ.2.5లక్షలుగా ఉంది. ట్రయంప్ టైగర్ స్పోర్ట్స్ 660 ట్రయంప్ టైగర్ స్పోర్ట్స్ 660 ప్రీమియం బైక్. ట్రిడెంట్ 660 మోడల్తో ఆరు నెలల్లో విడుదల కానున్న బైక్ ధర రూ. 12లక్షలుగా ఉంది. husqvarna svartpilen 125 బైక్ husqvarna svartpilen 125 బైక్ 125సీసీ కేటీఎం డ్యూక్ 125బైక్ తరహాలో ఈ బైక్లో సైతం సింగిల్ సిలిండర్ ఇంజిన్తో మార్కెట్లో విడుదల కానుంది. ఈ బైక్ ధర రూ.1.3లక్షలుగా ఉంది. హీరో ఎక్స్ ట్రీమ్ 160ఎస్ హీరో ఎక్స్ ట్రీమ్ 160ఎస్ స్పోర్ట్స్ బైక్. 163 సీసీ ఇంజిన్తో ఈ ఏడాదిలో విడుదల కానున్న బైక్ ధర రూ. 1.1లక్షలుగా ఉంది. టీవీఎస్ జెప్పిలిన్ ఆర్ టీవీఎస్ జెప్పిలిన్ ఆర్ క్రూజర్ బైక్ 2018 ఆటోఎక్స్పోలో కనిపించింది. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత ఏడాదిలో ఈ బైక్ విడుదల కానుంది. ఈ బైక్ ధర రూ.1.5లక్షలుగా ఉంది. ఏజిద్ రోడ్ కింగ్ ఏజిద్ రోడ్ కింగ్ బైక్ ఈ ఏడాది మార్కెట్లో విడుదల కానుండగా ఈ బైక్ ధర రూ.1.75లక్షలుగా ఉంది. కవాసకీ నింజా 400 కవాసకీ నింజా 400 బైక్ మరో ఆరు నెలలో విడుదల కానుంది. 399సీసీ తో రెండు ఇంజిన్లతో రానున్న ఈ బైక్ ధర రూ.5లక్షలు చదవండి: సింగిల్ ఛార్జ్తో 200 కి.మీ దూసుకెళ్లనున్న ఒకాయా 'ఫాస్ట్' ఎలక్ట్రిక్ స్కూటర్..! -
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ల రీకాల్
న్యూఢిల్లీ: బ్రేక్ భాగంలో సమస్యలను పరిష్కరించేందుకు క్లాసిక్ 350 మోడల్కు సంబంధించి 26,300 బైక్లను రీకాల్ చేస్తున్నట్లు మోటర్సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. వీటిల్లో సమస్యలు తలెత్తే అవకాశాలను తమ సాంకేతిక బృందం గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వెనుక బ్రేకు పెడల్పై భారీ స్థాయిలో ఒత్తిడి పడినప్పుడు, అసాధారణంగా బ్రేకింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్య తయారైన సింగిల్ చానెల్, ఏబీఎస్, రియర్ డ్రమ్ బ్రేక్ క్లాసిక్ 350 మోడల్స్కు ఈ సమస్య పరిమితమని వివరించింది. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందు జాగ్రత్త చర్యగా వీటిని వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్దిష్ట కాల వ్యవధిలో తయారైన మోటర్సైకిళ్ల గుర్తింపు నంబరు (వీఐఎన్) ఆధారంగా రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ బృందాలు లేదా స్థానిక డీలర్లు.. వాటి వినియోగదారులను సంప్రదిస్తారని పేర్కొంది. అలాగే ఈ సమస్య గురించి వినియోగదారులు స్వయంగా కంపెనీ వెబ్సైట్ ద్వారా తెలియజేయవచ్చని లేదా స్థానిక వర్క్షాపులను సంప్రదించవచ్చని తెలిపింది.