చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు రూ. 116 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ఆప్కో చైర్మన్ ఎమ్. హన్మంతరావు కోరారు.
సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులకు నిరంతరం పని కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లులు రూ. 116 కోట్లు విడుదల చేయాలని తెలంగాణ ఆప్కో చైర్మన్ ఎమ్. హన్మంతరావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం కలిసి పరిస్థితిని వివరించారు. ఆప్కోకు చెల్లింపులు లేకపోవడంతో ఆరునెలలుగా చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించడంలో జాప్యం జరుగుతుందని, ఆ కారణంగా సం ఘాల వాళ్లు నూలు కొనుగోలు చేయలేక, కార్మికులకు కూలీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని వివరించారు.