‘ఎన్నికల’ పెండింగ్‌ బిల్లులకు రూ.286.36 కోట్లు | Rs 286. 36 crore for Election pending bills: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల’ పెండింగ్‌ బిల్లులకు రూ.286.36 కోట్లు

Published Thu, Oct 17 2024 4:03 AM | Last Updated on Thu, Oct 17 2024 4:03 AM

Rs 286. 36 crore for Election pending bills: Andhra Pradesh

ఎన్నికల నిర్వహణకే నిధులు వ్యయం చేయాలి 

ఇతర శాఖల పనులకు ఖర్చు చేయరాదు 

వ్యయం వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలి 

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ 

సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ పెండింగ్‌ బిల్లులు చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.286.36 కోట్లు అదనపు నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన  పెండింగ్‌ బిల్లులకే అదనపు నిధులను చెల్లించాలని, ఇతర శాఖల పనులకు ఈ నిధులను వ్యయం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏ పద్దు కింద ఎన్ని నిధులను విడుదల  చేసింది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఖర్చు వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement