General election
-
‘ఎన్నికల’ పెండింగ్ బిల్లులకు రూ.286.36 కోట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల నిర్వహణ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు జిల్లాల వారీగా రూ.286.36 కోట్లు అదనపు నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులకే అదనపు నిధులను చెల్లించాలని, ఇతర శాఖల పనులకు ఈ నిధులను వ్యయం చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఏ పద్దు కింద ఎన్ని నిధులను విడుదల చేసింది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఖర్చు వివరాలను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
బాలినేని అడిగిందొకటి..ఈసీ చేస్తోందొకటి..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు నాయకులను, ఓటర్లను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల అవకతవకలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను పరిశీలించాలని కోరుతూ ఈసీ నిర్దేశించిన రూ.5,66,400 రుసుము చెల్లించారు. నగరంలోని 12 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఓట్లను, వీవీ ప్యాట్లలోని సింబల్ స్లిప్లతో సరిచూడాలని ఫిర్యాదులో కోరారు. పరిశీలనకు 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. దీంతో ఈసీ ఈవీఎంల చెకింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే బాలినేని కోరిన విధంగా కాకుండా పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను డిలీట్ చేసి, కేవలం ఈవీఎంల పనితీరును మాత్రమే చెక్ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలు కొత్తగా వచ్చినపుడు ఫస్ట్లెవల్ చెకింగ్, కమిషన్ చెకింగ్ చివరికి పోలింగ్ రోజు కూడా అన్నీ పార్టీల ఏజెంట్ల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహిస్తారని మరళా ఇప్పుడు మాక్పోలింగ్ నిర్వహించడం అర్థం లేదన్నారు. పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్లతో సరిచేస్తే సందేహాలు నివృత్తి అవుతాయని ఆయన అన్నారు. అయితే కలెక్టర్ ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు ఈవీఎంల చెకింగ్ మాత్రమే చేస్తామని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. ఇలాగైతే న్యాయం జరగదని భావించిన బాలినేని హైకోర్టును ఆశ్రయించారు. ఒక వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే జిల్లా అధికారులు మాక్ పోలింగ్కు ఏర్పాటు చేశారు. సోమవారం ఒంగోలులో ఈవీఎంలు భద్రపరిచిన గోదాము వద్దకు అధికారులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు హాజరయ్యారు. మాక్పోలింగ్ ప్రక్రియను బహిష్కరిస్తున్నామని బాలినేని తరఫున హాజరైన వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మాక్పోలింగ్ను నిలిపివేస్తున్నట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.సుప్రీం తీర్పు ఏం చెబుతోందంటే...ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏదైనా అనుమానాలు వస్తే ఈవీఎంల్లో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్ల్లో ఉన్న స్లిప్లతో సరిపోల్చాలని ఎన్నికల్లో పోటీ చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈసీని కోరవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పు ప్రకారం నియోజకవర్గంలో 5 శాతం ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ఎన్నికల సంఘం అధికారులు గాలికొదిలేశారు. అభ్యర్థి కోరిన పోలింగ్ బూతుల్లో వినియోగించిన ఈవీఎం ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈవీఎంల అవకతవకలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకవేళ పోలింగ్ రోజు వినియోగించిన ఈవీఎంల్లోని ఓట్లను తొలగించి మాక్పోలింగ్ నిర్వహించి ఉంటే కోర్టు ఈవీఎంల వెరిఫికేషన్ చేయాలని ఉత్తర్వులు ఇస్తే అధికారులు ఏం చేసి ఉండేవారో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాక్పోలింగ్ ప్రక్రియ ఎవరి మెప్పు కోసం నిర్వహిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాక్పోలింగ్ కాకుండా ఈవీఎంల్లోని ఓట్లను వీవీప్యాట్లతో సరిచూడాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించిన కేసు బుధవారానికి వాయిదా పడింది. ఈ విషయంపై అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయిస్తానని బాలినేని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం, అధికారులు పోలింగ్ రోజు ఓట్లను తొలగించి మాక్ పోలింగ్ నిర్వహిస్తామనడంపై బాలినేని మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఓట్లను తొలగిస్తే నిజాలు నిగ్గు తేలేది ఎలా..?ఎన్నికల సంఘం, అధికారులు ఈవీఎంల్లో అవకతవకలు ఉన్నాయని వచ్చిన అనుమానాలు నివృత్తి చేయాల్సింది పోయి కంటి తుడుపు చర్యలు తీసుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలను పరిశీలించాల్సిందిపోయి ఈసీ వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ రోజు ఓట్లను ఈవీఎంల్లో తొలగిస్తామని, ఎన్నికల సంఘం ఎస్ఓపీ మేరకు కేవలం డమ్మీ బ్యాలెట్తో యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా చెక్ చేస్తామనడంలో అర్థంలేదని రాజకీయపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏ తప్పులు జరగకుంటే పోలైన రోజు ఈవీఎం ఓట్లను, వీవీ ప్యాట్లోని స్లిప్లతో పరిశీలించవచ్చు కదా అని నిలదీస్తున్నారు. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు మరింత బలం చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బాధ్యత లేని ‘బోగస్’ గెలుపు!
కష్టపడి సంపాదించిన వాడికే డబ్బు విలువ తెలుస్తుందంటారు. విలువ తెలుసు కనుక దానిపట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దొంగ సొత్తుకూ, అక్రమ సంపాదనకూ ఈ సూత్రం వర్తించదు. డబ్బు సంపాదనే కాదు, విజయ సాధన కూడా ఇంతే. అది ఎన్నికల విజయమైనా మరే రకమైన విజయమైనా సరే. పోరాడి గెలిచిన వాడికి తనకు దక్కిన విజయం పట్ల గౌరవం ఉంటుంది. విజయ హేతువుల పట్ల వినమ్రత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. అన్ని రంగాల్లోనూ దొడ్డిదారి విజయాలు కూడా ఉంటాయి. ఎన్నికల్లో కూడా ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఇటువంటి దొడ్డిదారి విజయాల వికటాట్టహాసం మనకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పును ‘దొంగిలించడమ’నే సరికొత్త సాంకేతిక ప్రక్రియ రంగప్రవేశం చేసింది. ఈ పరిణామం పట్ల మనదేశంలోని మేధావుల్లో, ప్రజాస్వామ్య వాదుల్లో, అభ్యుదయ శక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి ఆందోళనే మహారాష్ట్రలోని కొంతమందిని ఒక దగ్గరకు చేర్చింది. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్డీ) అనే వేదిక తయారైంది.వీఎఫ్డీ అనే వేదికపైకి కొందరు వ్యక్తులతోపాటు కొన్ని సంస్థలు కూడా చేరుకున్నాయి. దేశంలో జరిగిన మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వేదిక కూడా మినహాయింపు కాదు. కానీ వీఎఫ్డీ మాత్రం ఆశ్చర్యంలోనే మునకేసి ఉండకుండా ఒక ముందడుగు వేసింది. ఎన్నికల ప్రక్రియను ఆసాంతం అధ్యయనం చేసి ఒక 225 పేజీల నివేదికను ఈమధ్యనే ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన పలు అంశాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మన ప్రజాస్వామ్య ప్రక్రియ పవిత్రతను సహేతుకంగా శంకిస్తున్నాయి.ఈవీఎమ్ల పనితీరుపైనా, పారదర్శకతపైనా అనుమానాలు, అభ్యంతరాలు పాతవే. వీడీఎఫ్ కేవలం సందేహాలకు మాత్రమే పరిమితం కాకుండా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా జరిగిన అవకతవకలను ఎత్తిచూపింది. ఎన్నికల ప్రక్రియకు ముందు ఎన్నికల సంఘంలో జరిగిన అసాధారణ మార్పులను ఎండగట్టింది. ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికల సంఘం అవలంభించిన ఏకపక్ష ధోరణిని నిర్ధారించింది. ఫలితాల ప్రకటనలోని అసమంజసత్వాన్ని వెలికి తీసింది.సాధారణంగా పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు లేదా ఎనినిమిది గంటలకల్లా పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించడం రివాజు. ఎక్కడైనా కొన్ని బూత్లలో పోలింగ్ ఆలస్యంగా జరిగితే అవి కూడా కలుపుకొని రాత్రి ఆలస్యంగా గానీ, అరుదుగా మరుసటిరోజు గానీ తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటిస్తూ వస్తున్నది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం గతంలో ఎన్నడూ కూడా ఒక శాతాన్ని మించిన అనుభవాలు లేవు. ఈసారి మాత్రం ఏడు దశల పోలింగ్లోనూ అసాధారణ పెరుగుదల నమోదైంది. కనిష్ఠంగా 3.2 శాతం నుంచి గరిష్ఠంగా 6.32 శాతం వరకు పెరుగుదల ఈ ఏడు దశల్లో కనిపించింది.గరిష్ఠంగా నాలుగో దశ పోలింగ్లో 6.32 శాతం పెరుగుదల నమోదైంది. ఈ దశలోనే పోలింగ్ జరుపుకున్న ఆంధ్రప్రదేశ్లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం పెరుగుదల కనిపించడంపై వీఎఫ్డీ విస్మయం వ్యక్తం చేసింది. మన చెవుల్లో పెద్దపెద్ద తామర పువ్వులుంటే తప్ప ఈసీ చేసిన ఈ దారుణమైన ఓటింగ్ పెంపును నమ్మడం కష్టం. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత, తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడం మరింత విభ్రాంతిని కలిగించే విషయం. ఇంత అసాధారణ స్థాయిలో పోలింగ్ శాతాల పెరుగుదలపై వచ్చిన సందేహాలకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వలేదనే సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.ఈవీఎమ్ల ట్యాంపరింగ్ జరిగితేనో, లేక పోలింగ్ జరిగిన ఈవీఎమ్ల బదులు కౌంటింగ్లో కొత్త మిషన్లు వచ్చి చేరితేనో తప్ప ఈ అసాధారణ పెరుగుదల సాధ్యంకాదని వీఎఫ్డీ అభిప్రాయపడింది. కనుక ఈ పెరిగిన ఓట్లను బోగస్ ఓట్లుగా అది పరిగణించింది. ఈవీఎమ్లలో ఏదో ఇంద్రజాలం జరిగిందనడానికి మరో దృష్టాంతాన్ని కూడా వీఎఫ్డీ నిర్ధారించింది. తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకూ, కౌంట్ చేసిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి. కొన్నిచోట్ల కౌంట్ చేసిన ఓట్లు పెరిగాయి. మరికొన్ని చోట్ల తగ్గాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 3,500 నుంచి 6,500 వరకు ఓట్లు కౌంటింగ్ సమయానికల్లా తగ్గిపోయాయి. ఇటువంటి నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 174 ఉన్నాయని వీఎఫ్డీ తెలియజేసింది.వీఎఫ్డీ సంస్థ బోగస్గా పరిగణించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో ఎన్డీఏ గెలిచిన సీట్లను వాస్తవానికి ప్రతిపక్షాలు గెలవాల్సిన సీట్లుగా వర్గీకరించారు. రాష్ట్రాలవారీగా పెరిగిన బోగస్ ఓట్ల మొత్తాన్ని ఆ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాలకు సమానంగా విభజించిన అనంతరం ఆ సంఖ్య కంటే తక్కువ తేడాతో ఓడిపోయిన సమీప ప్రత్యర్థిని అసలైన విజేతగా వీఎఫ్డీ లెక్కకట్టింది. ఈ లెక్కన 79 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవాల్సింది.వీఎఫ్డీ గణిత సమీకరణం ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచిలుకు ఓట్లను బోగస్గా ఆ సంస్థ పరిగణించింది. ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య సమంగా పంచితే ఇరవై ఎనిమిదవేలవుతుంది. అంతకంటే తక్కువ తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77. గెలిచిన 11 వీటికి జత చేస్తే మొత్తం 88. అంటే సింపుల్ మెజారిటీ.వీఎఫ్డీ సంస్థ ఆషామాషీగా బోగస్ ఓట్ల సంఖ్యను నిర్ధారించలేదు. అనుమానించడానికి హేతుబద్ధమైన అనేక ఉదంతాలను అది ఉదహరించింది. షెడ్యూల్ ప్రకటనకు కొద్దిరోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించింది. షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు కమిషనర్లుగా ఇద్దరు అధికారులు చేరారు. వీరిలో ఒక అధికారి పూర్వాశ్రమంలో అమిత్షా దగ్గర అధికారిగా పని చేశారనీ, మరొక అధికారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి వద్ద పనిచేశారని ఆ సంస్థ వెల్లడించింది.పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ ఏజెంట్లకు ఇవ్వాల్సిన 17–సి ఫామ్లను ఎంతమంది ఏజెంట్లకు ఇచ్చారో తెలపగలరా అని ఆ సంస్థ సవాల్ చేసింది. ఈవీఎమ్ల వారీగా ఫామ్ 17–సీ లలో నమోదు చేసిన ఓటింగ్ వివరాలు కౌంటింగ్లో లెక్కించిన ఓట్లతో సరిపోల్చడానికి ఒక స్వతంత్ర అధ్యయనం జరగవలసిన అవసరం ఉన్నదని వీఎఫ్డీ అభిప్రాయపడింది.ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు ఈ బోగస్ ఓట్ల బాగోతం ఒక భాగం మాత్రమే. తొలి అంకం వేరే ఉన్నది. కూటమి నేతలు – యెల్లో మీడియా సంయుక్తంగా సాగించిన విష ప్రచారం, కూటమి ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఈ భాగం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఏపీలో కూటమి చేసింది దుష్ప్రచారమేనని మొన్నటి యూనియన్ బడ్జెట్తో తేలిపోయింది. ఏపీలో ప్రారంభించిన ఈ సంస్కరణ దేశమంతటా జరగాలని కేంద్రం కోరుతున్నది. అందుకోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, రాష్ట్రం దివాళా తీసిందని, శ్రీలంకలా మారిందని రాసిన రాతలకూ, కూసిన కూతలకూ అంతే లేదు. మొన్న యూనియన్ బడ్జెట్కు ముందురోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జగన్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కొనియాడటంతో యెల్లో కూటమి ముఖాన కళ్లాపి చల్లినట్టయింది. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో 10 లక్షల కోట్లని గవర్నర్ చేత చెప్పించారు. ఈ కుప్పిగంతులనూ, శ్వేతపత్రాల తప్పుడు తంతులనూ చీల్చి చెండాడుతూ వైసీపీ అధ్యక్షుడు ప్రెస్మీట్ పెడితే సమాధానం చెప్పడానికి ఇప్పటిదాకా ఏ యెల్లో మేధావీ ముందుకు రాకపోవడం గమనార్హం.ఇసుక మీద నసిగిన వాగుడెంత?... రాజేసిన రాద్ధాంతమెంత? అప్పుడే మరిచిపోతామా? ఇసుక ధరలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువయ్యాయని ఊరూవాడా గగ్గోలు పెడుతున్నది. ఈ పబ్లిక్ టాక్ను అడ్రస్ చేయడానికి ఒక్క సర్కారీ సిపాయి కూడా ఇంతవరకు సాహసించలేదు. లిక్కర్ పాలసీ మీద వెళ్లగక్కిన ప్రచారం సంగతి సరేసరి. ఇప్పటివరకైతే అదే పాలసీ కొనసాగుతున్నది. దీన్నే కొనసాగిస్తారో, లేదంటే బెత్తెడు దూరానికో బెల్టు షాపు సుగంధాలు వెదజల్లిన తమ పాతకాలపు పాత పాలసీకి వెళ్తారో వేచి చూడాలి.విషప్రచారాల ప్రస్తావనలోకి వెళ్తే దానికి అంతూదరీ ఉండదు. ఇక మోసపూరిత హామీల సంగతి మరో మహేంద్రజాల అధ్యాయం. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్ పేరుతో ఒక షట్సూత్ర వాగ్దాన మాలను ఓటర్ల మెడలో వేశారు. యువకులందరికీ నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడికెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయలిస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యనున్న ప్రతి మహిళకు నెలకు 1500 అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణమని నమ్మబలికారు.ఇప్పటివరకు ఇందులో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియదు. ఇది షట్సూత్ర హామీ కాదు షడయంత్ర ప్రయోగమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. సాక్షాత్తూ శాసనసభలోనే స్వయంగా ముఖ్యమంత్రే ‘సూపర్ సిక్స్’ తూచ్ అని ప్రకటించారు. పైగా ఇది సాధ్యంకాదనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని కూడా ఎమ్మెల్యేలను కోరారు. విష ప్రచారంతో, తప్పుడు హామీలతో ఓట్లడగడం కూడా ఓట్లను దొంగిలించడం కిందే లెక్క. వంచన కిందే లెక్క. రెండు రకాలుగా చోరీ చేసిన ఓట్లతోనే గద్దెనెక్కారు కనుక వారికి ప్రజల పట్ల బాధ్యత లేదనే విషయాన్ని వారే నిరూపించుకుంటున్నారు.బాధ్యతల నుంచి తప్పుకోవడానికీ, హామీల అమలుకోసం జనం వీధుల్లోకి రాకుండా ఉండటానికే రెడ్బుక్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. శాసనసభలో విపక్ష నేతపై సభానాయకుడు వాడుతున్న భాష, వేస్తున్న నిందలు చాలా దిగజారిన స్థాయిలో ఉంటున్నాయి. హామీలు అమలుచేయపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు’ అనే తెలుగు నానుడిని ఆయన గుర్తు చేసుకుంటే మేలు.చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామగారు ఎన్టీ రామారావు ఆయన గురించి ఏమన్నారో గుర్తు చేసుకుందామా? ‘‘చంద్రబాబు దుర్మార్గుడు... మేకవన్నె పులి, గాడ్సేనే మించినవాడు, అభినవ ఔరంగజేబు, అతడో మిడత. మూర్తీభవించిన పదవీకాంక్షాపరుడు, ప్రజాస్వామ్య హంతకుడు, కుట్రకు కొలువైనవాడు, గూడుపుఠాణీకే గురువు, మోసానికి మూలస్తంభం, గుండెల్లో చిచ్చుపెట్టినవాడు, గొడ్డుకన్నా హీనం, చీమల పుట్టలో పాములా చేరినవాడు... తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను.’’ ఇవన్నీ ఎన్టీఆర్ డైలాగులే. ఆన్ రికార్డ్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Britain general elections: బ్రిటన్లో ప్రశాంతంగా ఎన్నికలు
లండన్: పధ్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు యూకే పౌరులు చరమగీతం పాడనున్నారన్న విశ్లేషణల నడుమ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పర్వం గురువారం ప్రశాంతంగా పూర్తయింది. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, వలసల కట్టడిలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్న భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెల్సిందే. ఉదయాన్నే భార్య అక్షతామూర్తితో కలిసి సునాక్ నార్త్ఆలెర్టన్ సిటీ దగ్గర్లోని కిర్బీ సిగ్స్టన్ గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ‘మార్పు’ నినాదంతో ఎన్నికల్లో ఫేవరెట్గా నిలిచిన విపక్ష లేబర్ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ సైతం భార్య విక్టోరియాతో కలిసి ఉత్తర లండన్లోని క్యామ్డెన్ విల్లింగ్హామ్ హాల్ పోలింగ్కేంద్రంలో హుషారుగా ఓటేశారు. బ్రిటిష్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడుగంటలకే 40,000 పోలింగ్బూత్లలో పోలింగ్ మొదలైంది. బ్రిటన్లో 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 10 గంటలదాకా అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల దాకా పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ అయిన ‘హౌజ్ ఆఫ్ కామన్స్’లో ఉన్న మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ చేపట్టారు. సాధారణ మెజారిటీ సాధించాలంటే 326 సీట్లు గెలవాలి. ప్రధానమైన కన్జర్వేటివ్, లేబర్ పార్టీలతోపాటు లిబరల్ డెమొక్రాట్స్, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్డీఎల్పీ, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ, సిన్ ఫియెన్, ప్లెయిడ్ సిమ్రూ, ది యాంటీ ఇమిగ్రేషన్ రిఫామ్ పార్టీలతోపాటు స్వతంత్రులు బరిలో దిగారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్పోల్స్ వెలువడే అవకాశముంది. కన్జర్వటివ్ పార్టీ కేవలం 53–150 సీట్లు సాధిస్తుందని, లేబర్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఇప్పటికే ఓపీనియన్స్ పోల్స్ వెల్లడయ్యాయి. -
బ్రిటన్లో నేడే పార్లమెంట్ ఎన్నికలు... 650 స్థానాలకు జరుగనున్న పోలింగ్.. బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
UK general elections: ముందస్తు ఓటమే?!
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు బ్రిటన్లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు. లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్ తదితరులున్నారు.ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్.. లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK general election 2024: స్టార్మర్... సరికొత్త ఆశాకిరణం
కెయిర్ రాడ్నీ స్టార్మర్. ఈ 61 ఏళ్ల లేబర్ పార్టీ నాయకుని పేరు ఇప్పుడు బ్రిటన్లో మార్మోగుతోంది. ఆర్థిక ఇక్కట్లు మొదలుకుని నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఆయనలో తమ నూతన నాయకున్ని చూసుకుంటున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. జూలై 4న జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీని ఆయన ఘనవిజయం దిశగా నడిపించడం, ప్రధాని పీఠమెక్కడం ఖాయమని ఘోషిస్తున్నాయి. అదే జరిగితే 14 ఏళ్ల అనంతరం లేబర్ పార్టీని గెలుపు బాట పట్టించిన నేతగా స్టార్మర్ నిలవనున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్నిరుపేద నేపథ్యం..దేశంలోనే పేరుమోసిన లాయర్. ఐదేళ్ల పాటు బ్రిటన్ చీఫ్ ప్రాసిక్యూటర్. ఆ హోదాలో రాజవంశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన అత్యున్నత పౌర పురస్కారమైన సర్. ఇదంతా 61 ఏళ్ల స్టార్మర్ నేపథ్యం. దాంతో ఆయన సంపన్నుల ప్రతినిధి అంటూ కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. వీటన్నింటికీ తన నేపథ్యమే సమాధానమని సింపుల్గా బదులిస్తారు స్టార్మర్. కలవారి కుటుంబంలో పుట్టి, మల్టీ బిలియనీర్ కూతురిని పెళ్లాడిన తన ప్రత్యరి్థ, ప్రధాని రిషి సునాక్దే సిసలైన సంపన్న నేపథ్యమంటూ చురకలు వేస్తుంటారు. స్టార్మర్ 1963లో లండన్ శివార్లలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తండ్రి పనిముట్లు తయారు చేసే కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానం కావడంతో నిత్యం డబ్బు కటకట మధ్యే పెరిగారాయన. తన నిరుపేద నేపథ్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్మర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ‘‘ద్రవ్యోల్బణమంటే ఏమిటో, కుటుంబాలను అది ఎంతగా కుంగదీస్తుందో నాకు చిన్నప్పుడే అనుభవం. ధరల పెరుగుదల ఎంత దుర్భరమో కన్జర్వేటివ్ పార్టీ నేతలందరి కంటే నాకంటే ఎక్కువగా తెలుసు. పోస్ట్మ్యాన్ వస్తున్నాడంటే చాలు, ఏ బిల్లు తెచి్చస్తాడో, అది కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఇంటిల్లిపాదీ బెదిరిపోయేవాళ్లం. ఫోన్ బిల్లు కట్టలేక నెలల తరబడి దాన్ని వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలెన్నో’’ అంటూ చేస్తున్న ఆయన ప్రసంగాలకు విశేష స్పందన వస్తోంది. తన కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే కావడం విశేషం. లీడ్స్ వర్సిటీ, ఆక్స్ఫర్డ్లో లా చేశారు. పేదరికమే తనలో కసి నింపి చదువుల్లో టాపర్గా నిలిచేందుకు సాయపడిందంటారు. 50 ఏళ్ల తర్వాత రాజకీయ అరంగేట్రం 50 ఏళ్లు దాటాక స్టార్మర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండు వరుస ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జెరెమీ కోర్బిన్ విఫలం కావడంతో 2020లో లేబర్ పార్టీ పగ్గాలతో పాటు విపక్ష నేత బాధ్యతలు కూడా చేపట్టారు. వస్తూనే పారీ్టలో అంతర్గతంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బాధ్యతాయుతంగా, మేనేజర్ తరహాలో, కాస్త డల్గా కనిపించే వ్యవహార శైలి స్టార్మర్ సొంతం. ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్న బ్రిటన్కు ఇప్పుడు కావాల్సిన సరిగ్గా అలాంటి నాయకుడేనన్నది పరిశీలకుల అభిప్రాయం. చరిష్మా ఉన్న నేత కంటే నమ్మకం కలిగించగల నాయకుడినే బ్రిటన్వాసులు కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టే నాలుగేళ్లుగా విపక్ష నేతగా తన పనితీరుతోనూ, కీలక విధానాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతోనూ ప్రజలను స్టార్మర్ బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, హౌజింగ్ సంక్షోభం వంటి పెను సమస్యల పరిష్కారంలో భారత మూలాలున్న తొలి ప్రధాని రిషి సునాక్ విఫలమయ్యారన్న అభిప్రాయం దేశమంతటా బాగా విని్పస్తోంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర పడటం ఖాయమన్న విశ్లేషణలే విని్పస్తున్నాయి. అందుకే కొద్ది రోజులుగా వెలువడుతున్న ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ ఘనవిజయం ఖాయమని చెబుతున్నాయి. విజయమే లక్ష్యంగా... కన్జర్వేటివ్ పార్టీ పాలనపై దేశమంతటా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను స్టార్మర్ ముందుగానే పసిగట్టారు. అందుకే ఘనవిజయమే లక్ష్యంగా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బ్రెగ్జిట్ తప్పుడు నిర్ణయమంటూనే తాను అధికారంలోకి వస్తే దాన్ని సమీక్షించబోనని చెబుతున్నారు. ఇది ఆయన సిద్ధాంతరాహిత్యానికి నిదర్శనమన్న కన్జర్వేటివ్ నేతల విమర్శలను తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. తాను కేవలం మెజారిటీ ప్రజల ఆకాంక్షలను అంగీకరిస్తున్నానంటూ దీటుగా బదులిస్తున్నారు. ‘‘నేను కారి్మక కుటుంబం నుంచి వచ్చాను. జీవితమంతా పోరాడుతూనే వస్తున్నా. ఇప్పుడు దేశ ప్రజల స్థితిగతులను మెరుగు పరిచి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు మరింతగా పోరాడతా’’ అంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘పార్టీ కంటే దేశమే ముందు’ నినాదంతో దూసుకుపోతున్న స్టార్మర్లో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తమ ప్రధానిని చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 18 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు 1997లో తెర దించిన టోనీ బ్లెయిర్ ఫీటును ఈసారి ఆయన పునరావృతం చేస్తారన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.కొసమెరుపు లేబర్ పార్టీ తొలి నాయకుడు కెయిర్ హార్డీ మీద అభిమానంతో స్టార్మర్కు తల్లిదండ్రులు ఆయన పేరే పెట్టుకున్నారు. ఇప్పుడదే లేబర్ పారీ్టకి ఆయన నాయకునిగా ఎదగడం విశేషం!ప్రస్తుత బలాబలాలుబ్రిటన్ పార్లమెంట్ లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు జూలై 4న ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ మార్కు 326.పార్టీ స్థానాలుకన్జర్వేటివ్ 344లేబర్ 205ఎస్ ఎన్ పీ 43లిబరల్ డెమొక్రాట్స్ 15ఇతరులు 43 -
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
మందలింపు మాటలు
పెంచి, పోషించిన పెద్దవాళ్ళకు పిల్లలను మందలించే హక్కు ఎప్పుడూ ఉంటుంది. రెక్కలొచ్చిన పిల్లలు పెద్దల మాట వింటారా, లేదా అన్నది మాత్రం వేరే విషయం. గడచిన పదేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సైద్ధాంతిక తల్లివేరు లాంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రభుత్వ పెద్దలపై తాజాగా చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు ఆ పోలికే గుర్తుకువస్తోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సాగిన భీకర విద్వేష ప్రచారాన్ని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ సోమవారం ఘాటుగా విమర్శించారు. మత ప్రాతిపదికన సమాజంలో చీలికలు తీసుకువచ్చేలా మాట్లాడడాన్ని తప్పుపడుతూ అధికార, ప్రతిపక్షాలు రెంటికీ తలంటి పోశారు. ఎన్నికలనేవి పోటీయే తప్ప యుద్ధం కాదంటూ హితవు పలికారు. అలాగే, కల్లోలిత రాష్ట్రం మణిపుర్లోని పరిస్థితిని ప్రస్తావిస్తూ, ప్రాధాన్యతా అంశంగా ఆ సమస్యను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు. గత వారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆరెస్సెస్ ఛీఫ్ తొలిసారిగా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇవే కావడం గమనార్హం. అదే సమయంలో ఆరెస్సెస్ అనుబంధ పత్రిక ‘ఆర్గనైజర్’ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎన్నికల ఫలితాలలో బోర్లాపడ్డందున బీజేపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరగాలని రాయడం విశేషం. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. భాగవత్ నేరుగా మోదీ పేరు ప్రస్తావించకున్నా, ఆ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో అర్థం చేసుకోవచ్చు. అలాగే, క్షేత్రస్థాయిలోని జనం మాట వినకుండా, గాలి బుడగలో ఆనందంగా గడిపేయడమే బీజేపీ స్వయంగా మెజారిటీ సాధించలేని దుఃస్థితికి కారణమంటూ ‘ఆర్గనైజర్’ వ్యాసంలో ఆరెస్సెస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద పేర్కొన్నారు. జనంలో రాకుండా, సోషల్ మీడియాలో పోస్టులు పంచుకుంటూ, సమస్తం మోదీ పేరుతో జరిగిపోతుందని భావించారన్న ఆయన చురకలు బీజేపీకి పెద్దగా రుచించని ఘాటైన మాటలే! నిజానికి, తాజా ఎన్నికల్లో విజయానంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, తమ పార్టీ ఆరెస్సెస్ను మించి ఎదిగిందనీ, వ్యవహారాలు నడపడానికి దానిపై ఇక ఎంత మాత్రమూ ఆధారపడి లేమనీ అనడం ఆశ్చర్యకరం. బహుశా దానికి పరోక్షంగా ప్రతిస్పందనే భాగవత్ మాటలు, ‘ఆర్గనైజర్’లో వ్యాసమూ అయినా కావచ్చు. మోదీ సైతం ఒకప్పుడు ఆరెస్సెస్ ప్రచారకుడిగా ప్రజాజీవితం ప్రారంభించిన వారే. ఆ భావజాలంతో ఎదిగినవారే. ఆయన ఎదుగుదలలో, సైద్ధాంతిక అజెండాలో, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ పైన దేశ ప్రధానిగా ఆయన ముందుకు నడవడంలో ఆ మాతృసంస్థ పాత్రను విస్మరించలేం. రాజకీయ పార్టీ బీజేపీ అయినా, దానికి పునాది స్థాయిలో పట్టు నిలిపి, గుట్టుమట్లు తెలిపినది ఆరెస్సెస్ అనేదీ జగమెరిగిన సత్యమే. ఇప్పుడు పునాదిని మరిచి, పై మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. భాగవత్ చేసిన మణిపుర్ ప్రస్తావన కూడా సరైన సమయానికే వచ్చింది. ఎన్నికల కోసం దేశమంతటా కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగిన ప్రధాని సందర్శించనిది మణిపురే. ఏడాది గడిచినా చల్లారని మంటలతో ఆ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులానే ఉంది. గత వారం జిరిబామ్లో జరిగిన హింసాకాండ, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాన్వాయ్పై తాజాగా జరిగిన దాడి అందుకు నిదర్శనాలు. పరస్పరం నమ్మకం కోల్పోయిన మెజారిటీ మెయితీలు, మైనారిటీ కుకీల మధ్య ఘర్షణను నివారించడానికి భారీ ఎత్తున భద్రతా బలగాలను దింపడం తప్ప, అసలైన రాజకీయ పరిష్కారం కోసం బీజేపీ ప్రయత్నించలేదన్నది నిష్ఠురసత్యం. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, తానే సమస్యగా మారినప్పటికీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను ఆ పార్టీ కదపనే లేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అఖండ విజయం సాధించి పెట్టిన బీరేన్ను స్థానికంగా పార్టీ పట్టు నిలిపే నేతగా అది భావిస్తూ ఉండివుండవచ్చు. కానీ, రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’కు ఇంఫాల్ నుంచి అనుమతి నిరాకరణ సహా రాష్ట్రంలో మారని పరిస్థితుల వల్ల మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్సభా స్థానాలనూ కాంగ్రెస్కే కోల్పోవాల్సి వచ్చింది. అందుకే, ఇది బీజేపీ చెవి ఒగ్గి వినాల్సిన పాఠం. ఇక, ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే, భవిష్యత్తులో దేశాన్ని నడపడమెలా అన్న భాగవత్ ప్రశ్న సహేతుకమైనదే. కచ్చితంగా అన్ని పక్షాలూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సినదే. కానీ, కొంతకాలంగా అదుపులేని మాటలు అనేకం అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆరెస్సెస్ సంఘ్సేవక్లను పక్కనబెట్టి బీజేపీ సొంత కార్యకర్తలతో ఎన్నికల పోరు సాగించిన తర్వాత... అదీ పార్టీకి సొంత మెజారిటీ రానప్పుడే ఈపాటి వివేకం మేల్కొనడమే ఒకింత విడ్డూరం. బీజేపీ, ఆరెస్సెస్ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఇది ఊతం. అయితే, గతంలో 1998, 2004ల్లో వాజ్పేయ్ ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడూ అనేక విధానాలపై రెంటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నమాట మర్చిపోలేం. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచిచెడులను గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలి మెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకున్నా, మాతృసంస్థ ఆలస్యంగానైనా మేల్కొని సుద్దులు చెప్పడమే తటస్థులకు కాస్తంత ఊరట. గత పదేళ్ళలో మోదీ మేనియాలో నోరు విప్పే వీలు లేకుండాపోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే ఉండవచ్చు. కానీ గాయం మానాలంటే... మందు చేదుగా, ఘాటుగా ఉందని అనడం సరికాదేమో! -
సోషల్ మీడియా దన్నుగా...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. 18వ లోక్ సభకు జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని చరిత్ర సృష్టించారు. సుదీర్ఘంగా 81 రోజులు సాగిన ఈ ఎన్నికల ప్రక్రియ, కేంద్రంలో మళ్లీ కమల వికాసమా లేక హస్త ప్రభంజనమా అనే ఉత్కంఠకు తెర లేపింది. భారత ప్రజల చైతన్యస్ఫూర్తి ఈ ఎన్నికల్లో మరోసారి రుజువయ్యింది.‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో మూడోసారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావాలనుకున్న ఎన్డీఏ కూటమికి ఈ ఎన్నికల్లో వారు ఊహించిన ఫలితాలు రాలేదు. గత పదేండ్ల కాలంలో మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాలు ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం తగ్గేలా చేశాయి. కుల మతాలనూ, అయోధ్య రాముణ్ణీ ఎన్నికల్లో వాడుకొని లబ్ధి పొందాలని భావించినా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరలేదు.ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమం నడపడంలో కొంత వరకు సఫలం అయిందని చెప్పవచ్చు. ‘మోదీ 3.0 మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారు’ అనే అంశం ప్రజల్లోకి బాగా వెళ్ళి, బీజేపీ ఓటు బ్యాంక్కు గండి కొట్టింది. ఓటర్లు ప్రతిపక్షానికి కావలసినంత బలాన్ని ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.ఈ సారి ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం... ముఖ్యంగా యూట్యూబర్లు ధ్రువ్ రాఠీ, రవీష్ కుమార్ వంటి వారు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. కేవలం ధ్రువ్ వీడియోలను 69 కోట్ల మంది ప్రజలు వీక్షించారంటే వారి ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.ఉత్తర భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరీ ఈ వీడియోలను ప్రజలు వీక్షించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పాలకులు నిర్ణయాలు తీసుకుని, ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, కార్మిక– కర్షక సంక్షేమానికి పాటుపడుతూ, మహిళా సాధికారత సాధిస్తూ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కృషి చేస్తారని ఆశిద్దాం. – పాకాల శంకర్ గౌడ్, ఉపాధ్యాయుడు -
జనరల్ ఎన్నికల ఫలితాలు 2024
-
Telangana: కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.కౌంటింగ్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది. -
ప్రారంభమైన ఆఖరి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్
-
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పారీ్టలన్నీ హోరాహోరీగా తలపడుతున్నా ఓటర్లలో మాత్రం అంత ఆసక్తి కనబడటం లేదు. మండుటెండలు ఇతరత్రా కారణాలు ఎన్నున్నా దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఓటింగ్ తగ్గుముఖం పట్టడం పార్టీలు, అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏడు విడతల సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఏప్రిల్ 19 నుంచి మే 25 దాకా ఆరు విడతలు పూర్తయ్యాయి. తొలి ఐదు విడతలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కచి్చతమైన ఓటింగ్ గణాంకాలను విడుదల చేసిన నేపథ్యంలో ఓటింగ్ ట్రెండ్లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి...ఓటర్లు పెరిగినా ఓట్లు తగ్గాయి తొలి ఐదు విడతల పోలింగ్లో దేశవ్యాప్తంగా 428 లోక్సభ స్థానాల పరిధిలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఆ స్థానాల్లో 50.7 కోట్ల ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. గత ఎన్నికల్లో తొలి ఐదు విడతల్లో 426 స్థానాల్లో ఏకంగా 70.1 కోట్ల మంది ఓటేయడం విశేషం. అప్పుడు 68 శాతం ఓటింగ్ నమోదైతే ఈసారి 66.4 శాతానికి పరిమితమైంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో దేశంలో మొత్తం ఓటర్లు 89.6 కోట్లుండగా ఈసారి 96.8 కోట్లకు పెరిగారు. 7.2 కోట్ల మంది కొత్త ఓటర్లు జతైనా ఓటింగ్ మాత్రం పడిపోవడం గమనార్హం. ఈసారి తొలి విడత నుంచే ఓటింగ్లో తగ్గుదల ధోరణి కొనసాగుతోంది. చివరి రెండు విడతల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటే మొత్తం ఓటింగ్ గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నమోదైన 67.4 శాతానికి చాలాదూరంలో నిలిచిపోయేలా కనిపిస్తోంది. (ప్రాథమిక డేటా ప్రకారం ఆరో విడతలో 63.36 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇది 64.73 శాతం). 20 రాష్ట్రాలు, యూటీల్లో డౌన్... ఐదు విడతల పోలింగ్ను పరిశీలిస్తే ఏకంగా 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ తగ్గింది. నాగాలాండ్లో పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపుల నేపథ్యంలో ఓటింగ్ బాగా తగ్గింది. గత ఎన్నికల్లో 82.9 శాతం నమోదు కాగా ఈసారి ఏకంగా 57.7 శాతానికి పడిపోయింది. మిజోరం, కేరళల్లో పోలింగ్ 6 శాతం మేర తగ్గింది. మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ల్లో 4 శాతం పైగా తగ్గింది. షాదోల్, రేవా, ఖజురహో, సిద్ధి (మధ్యప్రదేశ్), పథనంతిట్ట (కేరళ), మథుర (యూపీ) లోక్సభ స్థానాల్లోనైతే 10 శాతానికి పైగా పడిపోయింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్లో 2019తో పోలిస్తే 6.76 శాతం తగ్గింది! కశీ్మర్లో పోటెత్తారు... దేశవ్యాప్తంగా ట్రెండ్కు భిన్నంగా కొన్ని రాష్ట్రాలు, నియోజకవర్గాల్లో ఓటర్లు పోటెత్తారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, మేఘాలయ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్నాటకల్లో ఓటింగ్ బాగా పెరిగింది. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో గత ఎన్నికల కంటే ఏకంగా 24 శాతం అధిక ఓటింగ్ నమోదైంది. మేఘాలయలోని షిల్లాంగ్లో 8.31 శాతం పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం ఆరో విడతలో 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 61.11 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు, ఢిల్లీలో ఒకట్రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఈ విడతలో కూడా బెంగాల్లోనే అత్యధికంగా 79.40 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో 63.76 శాతం, ఒడిశాలో 69.32, హరియాణాలో 60.06, ఢిల్లీలో 57.67, బిహార్లో 55.24, యూపీలో 54.03 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్–రాజౌరీ లోక్సభ స్థానంలో 54.15 శాతం పోలింగ్ జరగడం విశేషం. అక్కడ గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యధికం. దీంతో జమ్మూ కశీ్మర్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడి 5 లోక్సభ స్థానాల్లో కలిసి 58 శాతం పోలింగ్ నమోదైంది. ఇది గత 40 ఏళ్లలో అత్యధికమని ఈసీ పేర్కొంది. అక్కడి బారాముల్లా (59 శాతం), శ్రీనగర్ (34.4 శాతం) స్థానాల్లోనూ ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 6 లోక్సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. శనివారంతో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 486 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఓటేసిన ప్రముఖులు రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. దాంతో ప్రముఖులంతా ఓటింగ్కు తరలివచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్సింగ్ పురి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వద్రా దంపతులు, హరియాణా సీఎం నయాబ్సింగ్ సైనీ తదితరులు ఓటు వేశారు. ప్రియాంక కూతురు మిరాయా తొలిసారి ఓటేశారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ఆప్కు ఓటేయగా... ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దంపతులు కాంగ్రెస్కు ఓటేయడం విశేషం. సోనియా, రాహుల్ ఓటేసిన న్యూఢిల్లీ లోక్సభ స్థానంలో ఆప్, కేజ్రీవాల్కు ఓటున్న చోట చాందినీచౌక్ స్థానంలో కాంగ్రెస్ బరిలో ఉండటమే ఇందుకు కారణం. ఢిల్లీలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తుండటం తెలిసిందే.బెంగాల్లో బీజేపీ అభ్యరి్థపై దాడి! బెంగాల్లోని ఝార్గ్రాంలో తృణమూల్ కార్యకర్తలు తన కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడు ఆరోపించారు. తనతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు తెలిపారు. బీజేపీ ఖుర్దా అసెంబ్లీ అభ్యర్థి, చిలికా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ తన అనుచరులతో పాటు ఓ పోలింగ్ బూత్లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టారు. పోలింగ్ అధికారిని తీవ్రంగా గాయపరిచారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. -
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్లను కరణ్థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్థాపర్పై విరుచుకుపడ్డారు. బిహార్లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే. -
Lok Sabha Election 2024: ప్రాంతీయ సవాల్!
ఫైనాన్షియల్, కార్పొరేట్ హబ్గా దేశ ఆర్థిక ముఖచిత్రంలో కీలకమైన హరియాణాలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఇక్కడి మొత్తం 10 లోక్సభ స్థానాలకూ ఆరో విడతలో భాగంగా శనివారం పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన బీజేపీకి వాటిని నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కాంగ్రెస్, ఆప్లతో కూడిన ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ 9 చోట్ల, ఆప్ ఒక్క స్థానంలో బరిలో ఉన్నాయి. ప్రాంతీయ పారీ్టలు కూడా గట్టిగా సవాలు విసురుతున్నాయి. హరియాణాలోని కీలక స్థానాలపై ఫోకస్...కురుక్షేత్ర.. నువ్వా నేనా! మోదీ వేవ్లో 2014లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. 2019లో రాష్ట్ర బీజేపీ చీఫ్ నాయబ్ సింగ్ సైనీ భారీ మెజారిటీతో నెగ్గారు. ఆయన సీఎం కావడంతో ఈసారి పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కు బీజేపీ టికెటిచి్చంది. ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ గుప్తాకు విద్యా, వ్యాపారవేత్తగా మంచి పేరుంది. ఐఎన్ఎల్డీ ప్రధాన కార్యదర్శి అభయ్ సింగ్ చౌతాలా తొలిసారి లోక్సభ బరిలో దిగారు. రైతు అందోళనల సెగ బీజేపీకి గట్టిగా తగులుతోంది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీఏ కూటమి వీడి సొంతంగా పోటీ చేస్తుండటం కూడా కమలనాథులకు ప్రతికూలాంశమే. ఆ పార్టీ నుంచి పలరామ్ సైనీ బరిలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.హిసార్... ప్రాంతీయ పారీ్టల అడ్డా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న ప్రాంతీయ పారీ్టల మధ్య చేతులు మారుతూ వస్తున్న కీలక నియోజకవర్గమిది. అయితే మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజం భజన్లాల్ పెట్టిన హరియాణా జనహిత్ కాంగ్రెస్ను ఆయన కుమారుడు కుల్దీప్ తిరిగి కాంగ్రెస్లోనే విలీనం చేశారు. దేవీలాల్ ముని మనవడు దుష్యంత్ చౌతాలా ఐఎన్ఎల్డీ తరఫున తొలిసారి 26 ఏళ్లకే ఎంపీ అయ్యారు! ఆ పారీ్టతో విభేదాలతో జేజేపీ ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి జేజేపీ నుంచి దుష్యంత్ తల్లి నైనా సింగ్ చౌతాలా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుష్యంత్ కుంటుంబానికే చెందిన దేవీలాల్ తనయుడు రంజిత్ సింగ్ చౌతాలా బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి జై ప్రకాశ్, ఐఎన్ఎల్డీ నుంచి సునైనా చౌతాలా పోటీ చేస్తున్నారు. ఫరీదాబాద్.. బీజేపీ హ్యాట్రిక్ గురి ఈ పారిశ్రామిక హబ్లో గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. సిట్టింగ్ ఎంపీ కృష్ణ పాల్ గుజ్జర్ హ్యాట్రిక్పై గురిపెట్టారు. కాంగ్రెస్ నుంచి మహేంద్ర ప్రతాప్ సింగ్, జేజేపీ నుంచి నళిన్ హుడా పోటీ పడుతున్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 బీజేపీ గుప్పిట్లోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.రోహ్తక్... కాంగ్రెస్ జైత్రయాత్రకు బ్రేక్ మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం పూర్తిగా కాంగ్రెస్ అడ్డా. ఆ పార్టీ జైత్రయాత్రకు 2019లో బీజేపీ బ్రేక్ వేసింది. ఆ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి దీపీందర్ సింగ్ హుడా మళ్లీ తలపడుతున్నారు. ఈ జాట్ ప్రాబల్య స్థానంలో 70 శాతం ఓటర్లు గ్రామీణులే. 20 శాతం మేర ఎస్సీలుంటారు. దీని పరిధిలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 8 కాంగ్రెస్ చేతిలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.అంబాలా... దళితులే కీలకం ఒకప్పటి ఈ కాంగ్రెస్ కంచుకోటలోనూ కమలనాథులు పాగా వేశారు. 2014, 2019ల్లో బీజేపీ నుంచి గెలిచిన రతన్ లాల్ కటారియా మరణించడంతో ఈసారి ఆయన భార్య బాంటో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ములానా సిట్టింగ్ ఎమ్మెల్యే వరుణ్ చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ 25 శాతం దళితులు, 20 శాతం వెనుకబడిన వర్గాలున్నాయి. పంజాబీ, సిక్కు, రాజ్పుత్, జాట్, బ్రాహ్మణ ఓటర్లూ కీలకమే. దళితుల్లో రవిదాసీయాలు 5 లక్షల మేర ఉంటారు.సిర్సా... కాంగ్రెస్ వర్సెస్ మాజీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ సునితా దుగ్గల్ను కాదని అశోక్ తన్వర్కు టికెటిచ్చింది. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవలే బీజేపీలోకి జంప్ చేయడం విశేషం! కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ కుమారి సెల్జా బరిలో ఉన్నారు. ఆమె 1991లో తొలిసారి ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. జేజేపీ, ఐఎన్ఎల్డీలకు కూడా ఇక్కడ గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది. -
Lok Sabha Election 2024: ఆరో విడతకు ముగిసిన ప్రచారం
న్యూఢిల్లీ: సార్వత్రిక సమరంలో ఆరో విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో ప్రచారం గురువారంతో ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు యూటీల్లోని 58 స్థానాలకు పోలింగ్ శనివారం జరగనుంది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హరియాణాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్ జరగనుంది. బరిలో ముఖ్య నేతలు బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్(హరియాణాలోని కర్నాల్), ధర్మేంద్ర ప్రధాన్(ఒడిశాలోని సంబల్పూర్), అభిజిత్ గంగోపాధ్యాయ్(పశి్చమబెంగాల్లోని తామ్లుక్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), రావు ఇందర్జిత్ సింగ్( గురుగ్రామ్), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్)తోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పోటీ పడుతున్నారు. -
Lok Sabha Election 2024: ఐదో విడతలో 62.2% పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడతలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. అత్యధికంగా పశి్చమబెంగాల్లో 78.48%, అత్యల్పంగా బిహార్లో 56.76% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది. మే 20న 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరగడం తెలిసిందే. అయిదో విడతలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించింది. మహిళలు 63 శాతం, పురుషులు 61.48 శాతం, థర్డ్ జెండర్ 21.96 శాతం మంది ఓటేశారని ఈసీ పేర్కొంది. -
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది... మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. రాజస్తాన్లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ! -
అందరి కన్నూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే..
సాక్షి, అమరావతి : గతవారం రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఈ ఓట్లలో అత్యధికం చెల్లని ఓట్లుగా మిగిలిపోవడంతో ఈసారీ అలాంటి పరిస్థితి ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఎంతమేర ఉంటుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ రూపంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో ఏకంగా 56,545 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే.. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 19.17 శాతం (దాదాపు ఐదో వంతు) ఓట్లు చెల్లనవిగా మిగిలిపోయాయి. ఇప్పుడు జరిగిన ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించిన వివరాల ప్రకారం 4,44,218 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ, గత ఐదేళ్ల కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ఇలా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లో అత్యధికులు బీఎల్వోలుగానో లేదంటే ఇతర రూపంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. దీంతో 2019 ఎన్నికలంటే దాదాపు 50 శాతం అధిక సంఖ్యలో ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పెరుగుదల కనిపించింది. అయితే, ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనాను కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అందజేసిన వినతిపత్రాలతో ఈసారీ అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లని పరిస్థితే ఉంటుందా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నిబంధనల ప్రకారం బ్యాలెట్ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా ఆ ఓటును చెల్లని ఓటుగా కాకుండా లెక్కింపులోకి తీసుకోవాలంటూ ఆయా పార్టీలు తమ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశాయి. దీంతో నమోదైన 4.44 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకంతో ఎన్ని నమోదయ్యాయి.. ఎన్నింటిపై సంతకంలేకుండా ఉన్నాయనే దానిపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. -
దేశవ్యాప్తంగా నాలుగో దశ పోలింగ్ పూర్తి
-
పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
నల్లజర్ల/మండపేట/ఆవులవారిపాలెం(క్రోసూరు): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్లలో సిబ్బంది తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై అవగాహనలేని ఓటర్లకు సహకారం అందించేందుకు వెళ్లి ఓటర్లు చెప్పినవారికి కాకుండా తమకు నచ్చినవారికి ఓట్లు వేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం సుభద్రపాలెంలోని 127వ నంబర్ పోలింగ్ బూత్లో దివ్యాంగురాలు బిరుదుగడ్డ నందెమ్మ ఓటు వేసేందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్ సహాయం కోరారు. తాను చెప్పిన పార్టీకి ఓటు వేయకుండా అంగన్వాడీ టీచర్ సైకిల్, కమలం గుర్తులకు ఓటు వేసినట్లు నందెమ్మ గుర్తించి, బయటకు వచ్చి అధికారులకు తెలియజేశారు. అంగన్వాడీ టీచర్పై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేసి ఆమెను విధులు నిర్వర్తించకుండా బయట కూర్చోబెట్టారు. ఇదేవిధంగా తెలికిచెర్ల గ్రామంలోని 166వ నంబర్ పోలింగ్ బూత్లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న జానకి కూడా పలువురికి సహాయంగా వెళ్లి సైకిల్, కమలం గుర్తులకు ఓట్లు వేశారు. ఈ బూత్లో పదిలం సరోజ, గోపిశెట్టి సూర్యకుమారి, తుమ్మల భాగ్యవతి తదితరులు ఓటు వేయడానికి పీవో సహాయం కోరారు. వారు చెప్పినట్లు కాకుండా ఆమె టీడీపీకి, బీజేపీకి ఓట్లు వేసినట్లు ఆ ఓటర్లతోపాటు ఏజెంట్లు గమనించారు. ఈ విషయాన్ని వారు బయటకు వచ్చి స్థానికులకు వివరించడంతో పీవో జానకిని నిలదీశారు. దీంతో తప్పయిపోయిందని ఒప్పుకున్న ఆమె... నాయకులను పక్కకు పిలిచి ‘పోయిన ఓట్లు భర్తీ చేసే విధంగా మీకు ఓట్లు వేయిస్తా’ అని నమ్మబలికారు. వారు ఒప్పుకోకపోవడంతో ప్లేటు ఫిరాయించి తనను ఒత్తిడి చేయడం వల్లే ఆవిధంగా ఒప్పుకున్నానని చెప్పారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఆమె స్థానంలో సెక్టోరియల్ అధికారి వై.సత్యనారాయణను అక్కడ పీవో విధులకు నియమించారు. పీవో జానకిని పోలీసులు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఉదయం నుంచి పీవో జానకి ఇదేవిధంగా వ్యవహరించారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రిసైడింగ్ అధికారిపై కలెక్టర్కు వృద్ధుడు ఫిర్యాదు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని రావులపేట రావులచెరువు గట్టు వద్ద తొమ్మిదో నంబర్ సచివాలయంలో ఉన్న పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ అధికారిపై ఓ వృద్ధుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ బూత్లో ఓటు వేసేందుకు గోకరకొండ సత్యనారాయణ(70) తన మనవడి సాయంతో వెళ్లారు. ప్రిసైడింగ్ అధికారి పీఎన్వీవీ సత్తిబాబు జోక్యం చేసుకుని సత్యనాయణ మనవడిని బయటకు పంపించారు. అనంతరం సత్యనారాయణ వేలితోనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై సత్తిబాబు నొక్కించారు. తాను ఫ్యాన్ గుర్తుకు వేయమంటే సైకిల్కు ఎందుకు మీట నొక్కించారని సత్యనారాయణ ప్రశ్నించగా, ఆయన్ను బలవంతంగా బయటకు పంపివేశారు. ఈ విషయాన్ని ఆయన తన కుమారుడు గోకరకొండ ప్రసాద్కు తెలియజేయగా, రిటర్నింగ్ అధికారి ఎల్లారావుకు, జాయింట్ కలెక్టర్కు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.ఫ్యానుకు ఓటు వేయాలని చెబితే సైకిల్కు వేసిన ఓపీఓపల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెం పోలింగ్ బూత్లో వృద్ధుడు చిన్న అల్లీసా తన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని వోపీవో వెంకటరమణను కోరగా, ఆమె సైకిల్ గుర్తుపై వేశారు. వీవీ ప్యాట్లో సైకిల్ గుర్తు చూసిన వృద్ధుడు తీవ్ర ఆగ్రహానికి గురై వోపీవోపై తిరగబడ్డాడు. దాదాపుగా కర్రతో కొట్టేంత పనిచేశాడు. వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఆమె చేసిన తప్పిదాన్ని సరిచేయాలని కొద్దిసేపు ఆందోళన చేశారు. ఆర్వోకు, ఏఆర్వోలకు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం స్పందించలేదు. -
Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్ స్వల్ప ఘర్షణ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సోమవారం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 67.70 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిరీ్ణత పోలింగ్ సమయంలోపు పోలింగ్ కేంద్రాల వద్ద వరసల్లో నిల్చున్న ఓటర్లను పోలింగ్కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని ఈసీ పేర్కొంది. పశి్చమబెంగాల్లో అత్యధికంగా 78.37 శాతం పోలింగ్ నమోదైంది. ‘‘శ్రీనగర్ నియోజకవర్గంలో 37.98 శాతం పోలింగ్ రికార్డయింది. ఆరి్టకల్ 370 రద్దుతర్వాత కశీ్మర్ లోయలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి. శ్రీనగర్లో 36 శాతం స్థాయిలో పోలింగ్ నమోదవడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి’’ అని ఈసీ ప్రకటించింది. ఈసారి లోక్సభ ఎన్నికలు ఏడుదశల్లో జరుగుతుండగా తొలి దశలో 66.14, రెండో దశలో 66.71, మూడో దశలో 65.68% పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో 96 స్థానాలతో కలిపి ఇప్పటిదాకా 543 స్థానాలకుగాను 23 రాష్ట్రాలు,యూటీల్లో 379 స్థానాలకు పోలింగ్ ముగిసింది. వీటితోపాటు అరుణాచల్ ప్ర దేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 2019 ఎన్నికల్లో నాలుగో దశలో 71 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 65.51% పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో ఘర్షణలు పశి్చమబెంగాల్లోని 8 నియోజకవర్గాల పరిధిలోని కొన్ని చోట్ల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఘర్షణలకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఈవీఎంల మొరాయింపు, పోలింగ్ ఏజెంట్ల అడ్డగింత తదితరాలకు సంబంధించి దాదాపు 1,700 ఫిర్యాదులు ఈసీకి అందాయి. ఓటర్లను మభ్యపెట్టారని, ఏజెంట్లపై దాడులు చేశారని టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ పరస్పరం వందలాది ఫిర్యాదులు చేశాయి. బర్ధమాన్లో బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్పై రాళ్ల దాడి ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారని ఒడిశాలో ఇద్దరు పోలింగ్ అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. ఒడిశాలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. జార్ఖండ్లో మారుమూల గ్రామాల ప్రజలు ఓట్లేయకుండా మావోయిస్టులు రోడ్లపై చెట్లు నరికి పడేయగా భద్రతాసిబ్బంది సమయానికి అన్నీ తొలగించారు. ఐదో దశ మే 20, ఆరో దశ మే 25, ఏడో దశ జూన్ ఒకటోతేదీన జరగనుంది. అన్నింటి ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపడతారు. -
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ మళ్లీ గెలిస్తే.. తదుపరి ప్రధాని అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే నరేంద్ర మోదీ.. అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మార్చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో సీనియర్ నేతల రాజకీయ జీవితానికి ముగింపు పలికిన మోదీ ‘ఒక దేశం, ఒకే నాయకుడు’ పేరిట ప్రమాదకరమైన మిషన్ను ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులను మోదీ ప్రభుత్వం కచి్చతంగా జైలుకు పంపిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి నియంతృత్వ పాలన తీసుకురావాలన్నదే ప్రధాని లక్ష్యమని చెప్పారు. బీజేపీలోని తన ప్రత్యర్థులను రాజకీయంగా అంతం చేయాలని మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నిపుణులతో, ప్రజలతో మాట్లాడానని, ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవడం ఖాయమని పేర్కొ న్నారు. కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ‘ఆప్’ చేరుతుందని, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇంకా ఏం చెప్పారంటే.. ఎందుకు రాజీనామా చేయలేదంటే... ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు. నాపై కేసు నమోదైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఢిల్లీలో భారీ మెజారీ్టతో మేము గెలిచాం. అందుకే మాపై కక్షగట్టారు. తప్పుడు కేసులో ఇరికించి, నన్ను బలవంతంగా పదవి నుంచి దింపేయడానికి కుట్ర జరిగింది. కుట్రను ఛేదించి, బీజేపీపై పోరాటం కొనసాగించడానికే పదవికి రాజీనామా చేయొద్దని నిర్ణయించుకున్నా. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ప్రజాస్వామ్యాన్ని ఖైదు చేస్తే పరిపాలన ఆగదు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన నడిపిస్తే బాగుండేది. దొంగలు, దోపిడీదారులకు బీజేపీ అడ్డాగా మారింది. అవినీతిపై పోరాటం ఎలా చేయాలో ప్రధాని మోదీ నిజంగా నేర్చుకోవాలనుకుంటే నన్ను చూసి నేర్చుకోవాలి. అవినీతిపరులను మేము జైలుకు పంపించాం. ఈ విషయంలో మా మంత్రులనూ వదిలిపెట్టలేదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. హనుమాన్ ఆలయంలో పూజలు అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారు. హనుమాన్జీ ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అమిత్ షా కోసం ఓట్లడుగుతున్న మోదీ ‘‘ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని బీజేపీ నేతలు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధనను మోదీ తీసుకొచ్చారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్ వంటి నేతలను పక్కనపెట్టారు. శివరాజ్సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియా, మనోహర్లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ వంటి నాయకుల రాజకీయ జీవితానికి మోదీ ముగింపు పలికారు. ఇక తర్వాతి వంతు యోగి ఆదిత్యనాథ్దే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలల్లోనే యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి తెరపడుతుంది. ఉత్తరప్రదేశ్లో మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తారు. యోగిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. వచ్చే ఏడాది మోదీ కూడా పదవి నుంచి తప్పుకుంటారు. అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారు. మోదీ ఇప్పుడు అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్నారు. మోదీ ఇచి్చన గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా? ఒక దేశంలో ఒకే నాయకుడు ఉండాలన్నదే మోదీ విధానం. ఇదే నియంతృత్వం. నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం నా ఒక్కడితో సాధ్యం కాదు. అందుకు 140 మంది కోట్ల ప్రజల మద్దతు, ఆశీర్వాదం కావాలి’’ -
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
కేరళలో కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబు ఎం జాకబ్ ‘ట్వంటీ 20’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఫేజ్2 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎర్నాకుళం(కొచ్చిన్), చలకుడి ఎంపీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థను కలిగి ఉన్న ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనడంపట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి.లాభదాయక కంపెనీ కలిగి రాజకీయ పార్టీలు స్థాపించకూడదనే నియమాలు ఎక్కడా లేవు. కానీ ఒకవేళ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిస్తే నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ కంపెనీలకు లాభాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటేనే ఇబ్బంది అని విశ్లేషకులు చెబుతున్నారు. లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో కార్పొరేట్లపై పక్కా నిబంధనలు అమలు చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ కంపెనీలు రాయితీలు, కొన్ని ఇతర వెసులుబాట్లు కోరుకుంటాయి. ప్రభుత్వం కొన్ని నియమాల్లో సడలింపు ఇవ్వాలనుకుంటాయి.2022లో పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ట్వంటీ 20 పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇటీవల ఆ పొత్తుకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీ చీఫ్ జాకబ్ గతంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సుమారు రూ.25 కోట్ల విలువైన ఎలక్టోరల్బాండ్లను కొనుగోలు చేశారు. అయితే ఈ అంశంపై ఆయన వివరణ ఇస్తూ..తమను బలవంతంగా ఎన్నికల బాండ్లు కొనేలా కొందరు ప్రేరేపించినట్లు చెప్పారు. అయితే పార్టీలకు విరాళాలు ఇచ్చినా వారినుంచి ఎలాంటి ప్రయోజనం పొందలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్క ఓటు విలువ ఎంతంటే..రాజకీయ ప్రచార సమయంలో జాకబ్ కేరళ సీఎం పినరయి విజయన్ పనితీరును తీవ్రంగా విమర్శించారు. కేరళలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం లేదని ఆరోపించారు. గతంలో కైటెక్స్ ఫ్యాక్టరీ కేరళలో నిర్మించాలని ప్రతిపాదించారు. తరువాత దాన్ని తెలంగాణలో ప్రారంభించబోతున్నట్లు అప్పటి భారాస ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కొచ్చిన్లోని కిజకంబాలంలో కైటెక్స్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది. -
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
ఓటింగ్ డే అంటే చాలామంది ఓటర్లు అది సెలవు రోజుగా భావిస్తుంటారు. మరికొందరు తమ ఒక్క ఓటుతో ఏముందిలే మారిపోయేది అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటు విలువ ఎంతో చరిత్రలో నమోదైన కొన్ని ఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఓటుహక్కు కలిగిన పౌరులందరూ పోలింగ్లో తప్పక పాల్గొనాలి. ఈమేరకు ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లు సంపాదిస్తున్నవారు, వ్యాపార దిగ్గజాలు సైతం రేపటి ప్రజాస్వామ్యంలో తమవంతు పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఓటు వేస్తూ అందరూ ఓటు వేయాలని కోరుతున్నారు. మన చేతిలోని బ్రహ్మాస్త్రంతో నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగం ఎన్నికల ద్వారా అందిరికీ కల్పించింది. దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రముఖులు వేడుకుంటున్నారు.ముఖేశ్ అంబానీ కుటుంబంముఖేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరు.రిలయన్స్ ఇండస్ట్రీస్ సంపద విలువ: సుమారు రూ.18.9 లక్షల కోట్లు.2019 సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్గా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాపిటల్: రూ.3.5లక్షల కోట్లు.గౌతమ్ అదానీ ఎంటర్ప్రైజ్ బిజినెస్తోపాలు పోర్ట్ మేనేజ్మెంట్, ఎలక్ట్రిక్ పవర్, మైనింగ్, పునరుత్పాదక ఇందనం, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.2019 లోక్సభ ఎన్నికల్లో కుటుంబ సమేతంగా అహ్మదాబాద్లో ఓటు వేశారు.ఆనంద్ మహీంద్రామహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్రా సారథ్యం వహిస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండడం ఈయన ప్రత్యేకత. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనంద్ మహీంద్రా ముంబయిలో తన ఓటు వేశారు.అనిల్ అంబానీరిలయన్స్ ఏడీఏజీ గ్రూప్ ఛైర్మన్గా అనిల్ అంబానీ వ్యవహరిస్తున్నారు. ముంబయిలోని కఫ్ పరేడ్లోని జిడి సోమాని స్కూల్లో 17వ లోక్సభ ఎన్నికల్లో తన ఓటు వినియోగించుకున్నారు.నరేష్ గోయల్జెట్ ఎయిర్వేస్ ఎయిర్లైన్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత 2019లో ముంబయిలో ఓటువేశారు.శక్తికాంత దాస్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్ పనిచేస్తున్న శక్తికాంత దాస్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు వేశారు.ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునే వారు చరిత్రలో తెలుసుకోవాల్సినవి..1649లో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్-1 భవితవ్యంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే..1714లో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం అధిష్ఠించారు.1776లో ఒక్క ఓటు తేడాతోనే అమెరికా జర్మనీ భాషను కాదని ఇంగ్లిష్ అధికారిక భాష అయింది.1850లో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది1868లో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటుతో పదవీచ్యులతయ్యారు. 1923లో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు.1999 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతోనే కేంద్రంలో వాజ్పేయీ ప్రభుత్వం పడిపోయింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్లు వీరే..2004 ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంతెమరహళ్లిలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ధ్రువనారాయణ గెలిచారు.2008లో రాజస్థాన్లో ఒక్క ఓటు తేడాతో ఓటమిపాలైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సీపీ జోసీనాథ్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
4th Phase Election: ఏపీ, తెలంగాణలో అభ్యర్థుల సంఖ్య..
సాక్షి, ఢిల్లీ: నాలుగో విడతలో లోక్సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరుగనుంది. ఇక, నాలుగో విడతలో పది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగునున్నాయి. లోక్సభ ఎన్నికల బరిలో 1717 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పది రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది.ఇక, పదో విడతలోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, లోక్సభ ఎన్నికల బరిలో ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 454 మంది పోటీలో నిలిచారు. అలాగే, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 525 మంది పోటీలో ఉన్నారు. మే 13న తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది.ఇక, నాలుగో విడతలో మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇలా.. బీహార్లో ఐదు పార్లమెంట్ స్థానాలకు 55 మంది పోటీజమ్మూ కాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి బరిలో 24 మందిజార్ఖండ్లో నాలుగు పార్లమెంట్ స్థానాలకు 45 మంది పోటీమధ్యప్రదేశ్లో ఎనిమిది పార్లమెంటు స్థానాలకు 74 మంది పోటీమహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు జరగనున్న బరిలో 209 మందిఒడిశాలో నాలుగు పార్లమెంట్ స్థానాలకు బరిలో 37 మందిఉత్తరప్రదేశ్లో 13 స్థానాలకు బరిలో 130 మందివెస్ట్ బెంగాల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు 75 మంది. -
First general elections: ఒక్క స్థానం.. ఇద్దరు ఎంపీలు!
ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరు ఎంపీలుంటారా? ఇద్దరేం ఖర్మ... ముగ్గురు కూడా ఉన్నారు! ఎప్పుడు? ఎలా?మన దేశంలో రాజకీయాలు చాలా క్లిష్టంగా ఉ న్నాయని ఇప్పుడనుకుంటున్నాం. కానీ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన ఎన్నికల సమయంలో మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. సాధారణంగా ఒక్క నియోజకవర్గానికి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తారు. ఎన్నికలు జరిగేదే ఆ ప్రతినిధిని ఎన్నుకోవడానికి. కానీ తొలి రెండు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పలు నియోజకవర్గాలకు ఇద్దరేసి ఎంపీల ను ఎన్నుకున్నారు. 1961లో రద్దయ్యే దాకా ఇది కొనసాగింది. కొన్ని నియోజకవర్గాలకైతే ముగ్గురు ఎంపీలూ ఉన్నారు! దళితులు, గిరిజన సమూహాల వంటి అణగారిన వర్గాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ ఏర్పాటు కలి్పంచారు.తొలి ఎన్నికల్లో...మొట్టమొదటి ఎన్నికల సమయంలో లోక్సభలో 400 స్థానాలున్నాయి. వీటిలో 314 స్థానాలకు ఒక్క ఎంపీ ఉండగా, 86 నియోజకవర్గాలకు ఒక జనరల్, మరొక షెడ్యూల్ కులాల ప్రతినిధి చొప్పున ఇద్దరేసి ఎంపీలు ఎన్నికయ్యారు. ఇలా ఇద్దరు ఎంపీలున్న నియోజకవర్గాలు యూపీలో 17, నాటి మద్రాసు రాష్ట్రంలో 13, బిహార్లో 11, బాంబేలో 8 ఉన్నాయి. పశి్చమబెంగాల్లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికయితే ఏకంగా ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు!1957లో...సీట్ల పునరి్వభజన అనంతరం 1957 సార్వత్రి క ఎన్నికల్లో 494 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీల స్థానాలు 57కు తగ్గాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రద్రేశ్లో 18, ఆంధ్రప్రదేశ్లో 8, బిహార్లో 8, పశి్చమబెంగాల్లో 8, బాంబేలో 8, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సార్వత్రిక ఎన్నికల్లో నేడే రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు..ఇంకా ఇతర అప్డేట్స్
-
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం
-
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం
-
అలెర్ట్ : యూకే వీసా నిబంధనలు కఠినతరం.. తక్షణమే అమల్లోకి
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే పలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. ఇంతకంటే సులభమైన మార్గం లేదా? అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు. -
ఎన్నికల పర్వం.. మీ అభ్యర్థి గురించి తెలుసా.. డబ్బు పంచితే..
దేశంఅంతటా సార్వత్రిక ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పర్వం మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే చాలామందికి వారి నియోజకవర్గంలోని అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. అందులో అభ్యర్థుల పూర్తి వివరాలు పొందుపరిచారు. దాంతో ఓటర్లు పార్టీ అభ్యర్థులకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకునే వీలుందని ఈసీ చెప్పింది. దాంతోపాటు చివరి నిమిషంలో గెలుపే లక్ష్యంగా పోటీదారులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా చాలాచోట్ల డబ్బు పంచే అవకాశం ఉంది. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఈసీ మరో యాప్ను ప్రారంభించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నో యువర్ క్యాండిడేట్(కేవైసీ) యాప్ మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్ క్యాండిడేట్’ (కేవైసీ) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్నూ పరిచయం చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలు రెండింటి మీదా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థుల నేర చరిత్రతో పాటు ఆర్థిక స్థితిగతులనూ తెలుసుకోవచ్చు. ఇది ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుందని కమిషన్ తెలిపింది. అభ్యర్థుల పేరుతో సెర్చ్ చేసి, సమాచారాన్ని పొందొచ్చు. నేరాలకు పాల్పడి ఉన్నట్టయితే అవి ఎలాంటివో కూడా ఇందులో కనిపిస్తాయి. ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’ సి-విజిల్ యాప్ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచటం వంటి వాటికి పాల్పడుతుంటే దీని సాయం తీసుకోవచ్చు. దీని ద్వారా ఫొటో తీసి లేదా వీడియోను రికార్డు చేసి ఈ యాప్లో అప్లోడ్ చేస్తే చాలు. యాప్లోని జీఐఎస్ మ్యాప్స్ ఫీచర్ దానంతటదే లొకేషన్ను గుర్తిస్తుంది. ఫిర్యాదు జిల్లా కంట్రోల్ రూమ్కు, అక్కడి నుంచి ఫీల్డ్ యూనిట్ అధికారులకు చేరుతుంది. లొకేషన్ ఆధారంగా సంఘటన జరిగిన చోటును గుర్తిస్తారు. కంప్లెయింట్ను ధ్రువీకరించి ఎన్నికల సంఘానికి చెందిన నేషనల్ గ్రీవెన్స్ పోర్టల్కు పంపిస్తారు. ఫిర్యాదు చేసినవారికి దాని స్థితిగతులను 100 నిమిషాల్లో తెలియజేస్తారు. ఇదీ చదవండి.. ఆంధ్రప్రదేశ్ ఎంపీ అభ్యర్థుల జాబితా: జిల్లాల వారి లిస్ట్ (ఫోటోలు) -
బరిలో తండ్రీకూతుళ్లు
కొరాపుట్: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తండ్రీ, కూతురు ఒకే పార్టీ తరుపున బరిలో దిగనున్నారు. నబరంగ్పూర్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున భుజబల్ మజ్జి, ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని డాబుగాం అసెంబ్లీ స్థానంలో ఆయన కుమార్తె డాక్టర్ లిఫికా మజ్జిలు పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి భుజబల్ 2000 సంవత్సరంలో కాంగ్రెస్ టిక్కెట్పై డాబుగాంలో పోటీచేసి గెలిచారు. అనంతరం 2004లో అదే స్థానంలో భుజబల్ ఓడిపోయారు. మరలా 2009లో గెలిపొంది, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రెండేళ్ల క్రితం జరిగిన మూడంచెల పంచాయతీ ఎన్నికల్లో డాక్టర్ చదువు పూర్తి చేసిన తన కుమార్తె లిఫికాను పోటీకి నిలిపారు. కాంగ్రెస్ పార్టీ తరుపున జిల్లావ్యాప్తంగా ఒక్క లిఫికా మాత్రమే గెలిపొందారు. ఈ ఏడాది ప్రారంభంలో భుజబల్ నబరంగ్పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు. తండ్రీ కూతుళ్ల గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. -
పెట్రోల్, డీజిల్పై రూ.2 తగ్గింపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలా.. స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది. -
నో వయెలెన్స్.. నో రీపోలింగ్
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయెలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని.. అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్ మీనా ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం సూచించిన ఈ రెండు మంత్రాల అమల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, బూత్ క్యాప్చరింగ్కు ఎటువంటి అవకాశం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేసుకోవాలని సూచించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమైన ఆదేశాలు, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనలు, 50% పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన, రోజూ వారీ పంపాల్సిన నివేదికలు తదితర అంశాలను జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లకు ఆయన వివరించారు. గుర్తింపు కార్డుల జారీని వేగిరపర్చండి ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని మీనా ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే బటా్వడా చేయాలని, ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్గా పంపిణీ చేయడానికి వీలు లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. పెండింగ్ ఫారాలను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫారాల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు పర్చాలని ఆదేశించారు. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్టు వార్తా పత్రికల్లో కథనాలతో పాటు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిన సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) ఎస్బీ బాగ్చీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుతోపాటు ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి అమలుచేయనున్న బందోబస్తు కార్యాచరణ ప్రణాళికను ఆయన వివరించారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతోపాటు అదనపు సీఈవో ఎంఎన్ హరేందిర ప్రసాద్, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఏడు విడతల్లో పోలింగ్.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్!
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. మార్చి 12, 13న జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. #WATCH | Chennai : Chief Election Commissioner of India along with his team begins review of poll preparedness for Lok Sabha elections in Tamil Nadu pic.twitter.com/fVwaVx99te — ANI (@ANI) February 23, 2024 ఎన్నికల సంఘం.. అన్ని డివిజన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏర్పాటు చేయనుంది. ఇక, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. -
ఇంకా వుంది!
ఎక్కడైనా ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాక రాజకీయంగా సుస్థిరత నెలకొంటుందని ఆశించడం సహజం. పాకిస్తాన్లో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. దాయాది దేశంలోని ఇటీవలి 12వ జనరల్ ఎలక్షన్ ఓటింగ్ సరళి, తాజా ఫలితాలు చూస్తే... ఎన్నికలు ముగిశాయి కానీ, అసలు కథ ఇంకా మిగిలే ఉందని అర్థమవుతోంది. చిత్రమేమిటంటే, సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం లేకపోయినా పాక్ మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్లు ఇరువురూ ఎన్నికల్లో తమదే విజయమని ప్రకటించుకోవడం! ఇక, 2018 ఎన్నికల్లో ఇమ్రాన్కు అనుకూలంగా వ్యవహరించిన సైన్యం జనరల్ ఆసిమ్ మునీర్ సారథ్యంలో ఈసారి సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణం దిశగా పావులు కదుపుతోంది. పోలింగ్కు ముందూ, తర్వాత నిస్సిగ్గుగా రిగ్గింగ్కు పాల్పడి ఎన్నికలను ప్రహస నంగా మార్చిన ఆర్మీ ఇప్పటికీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకొని, ‘హైబ్రిడ్’ నమూనా ప్రభుత్వాన్ని నడపాలని చూస్తోంది. కౌంటింగ్లో రిగ్గింగ్ సాగకుంటే, జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ ఇమ్రాన్కే వచ్చి ఉండేదని అభిప్రాయం. ఇప్పుడు రెండోస్థానంలో నిలిచిన నవాజ్ షరీఫ్ గద్దెనెక్కినా, కొత్త సర్కార్ సైతం సైన్యం చేతిలో కీలుబొమ్మగానే కొనసాగనుంది. ఎన్నికల్లో ఓటర్లు ఇమ్రాన్ వైపు మొగ్గారన్నది సుస్పష్టం. కానీ ఒకపక్క రకరకాల కేసుల్లో శిక్షలు పడి, కారాగారంలో ఉన్న ఇమ్రాన్ రాజకీయ పదవిని అధిష్ఠించడంపై నిషేధం ఎదుర్కొంటున్నారు. పైగా, ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ)కు ఎన్నికల చిహ్నమైన క్రికెట్ బ్యాట్ సైతం ఈసారి దూరమైంది. దాంతో ఆ పార్టీ తరఫున అభ్యర్థులందరూ స్వతంత్రులుగానే గెలిచారు. కాబట్టి ఏదో ఒక రిజిస్టర్డ్ పార్టీతో జతకడితే తప్ప... సాంకేతికంగా చూసినా, చట్టపరంగా చూసినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఏ ఇతర పార్టీతోనూ కలిసేందుకు పీటీఐ ఇష్టపడక పోవడం పెద్ద ఇబ్బంది. మరోపక్క ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం వివిధ పార్టీల మధ్య చర్చోపచర్చలు సాగుతున్నాయి. పీటీఐ పక్షాన గెలిచిన వారిలో కొందరు ఇప్పటికే గోడ దూకుతున్నట్టు వార్త. వేరొకపక్క ఎన్నికల్లో రిగ్గింగ్, కౌంటింగ్ ప్రక్రియలో తప్పులు సహా పలు అక్రమాలు జరిగాయంటూ పలువురు కోర్టుకెక్కుతున్నారు. వెరసి, జాతీయ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాయన్న మాటే కానీ... పాకిస్తాన్లో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు, చివరకు వాటి పర్యవసానాలు ఏమైనప్పటికీ... ఒకరకంగా ఈ ఎన్నికల్లో అసలైన విజేతలు సాధారణ పాకిస్తానీ ప్రజలు. సర్వశక్తిమంతమైన సైన్యం ఆ దేశంలో ప్రజా స్వామ్యం వేళ్ళూనుకోకుండా చేయడంలో పేరుమోసింది గనక ఎన్నికలు తూతూమంత్రమనీ, ప్రధాని ఎవరు కావాలన్నది మిలటరీ ముందే నిర్ణయించేసిందనే భావన నెలకొంది. అందుకు తగ్గట్టే, గతంలో సైన్యంతో సత్సంబంధాలు లేకపోవడంతో 1999లో పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ సరిగ్గా ఎన్నికల వేళకు ప్రవాసం నుంచి పాక్కు తరలివచ్చారు. వస్తూనే ఆయనపై ఆరోపణలన్నీ గాలికి పోయాయి. అలాగే ఒకప్పుడు సైన్యం సాయంతో గద్దెనెక్కి, ప్రస్తుతం దాని కరుణాకటాక్షాలకు దూరమైన ఇమ్రాన్, ఆయన పార్టీ అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చింది. పాక్లో అధికార వ్యవస్థకు పర్యాయపదంగా మారిన సైన్యం ఎన్నికల్ని రిగ్ చేయాలని చూసింది. ఇన్నింటి మధ్య కూడా ప్రజలు ధైర్యంగా ఓటేశారు. ప్రజాస్వామ్య ఆకాంక్ష పట్ల ఆశలు రేకెత్తించారు. ఇమ్రాన్ను పోటీకి దూరంగా ఉంచి, ఆ పార్టీని గద్దెనెక్కకుండా చేయాలన్న ఆర్మీ వ్యూహాలను ప్రజలు తిరస్కరించారు. తెర వెనుక నుంచి ఆడించేది ఆర్మీయే అని అంతర్జాతీయంగా అందరూ అనుకున్నా సామాన్యులకు నిన్న మొన్నటి వరకు ఆర్మీ పట్ల గౌరవం ఉండేది. కానీ, ప్రస్తుతం సైనిక జోక్యం పట్ల ప్రజలు సుముఖంగా లేరని తాజా ఎన్నికల ఫలితాలు తొలిసారిగా నిరూపించాయి. జాతీయ అసెంబ్లీలో నేరుగా ఎన్నికలు జరిగే 266 స్థానాల్లో ఎక్కువ సీట్లను ఇమ్రాన్ పార్టీ సమర్థించిన స్వతంత్రులే గెలిచారు. అతిపెద్ద పక్షంగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో నవాజ్ షరీఫ్ ‘పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ – నవాజ్’ (పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో ‘పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ’ (పీపీపీ) నిలిచాయి. హంగ్ పార్లమెంట్ ఏర్పడినా ప్రజాతీర్పు ఇమ్రాన్ వైపుందనేది స్పష్టం. దాన్ని తోసిపుచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి కట్టాలని చర్చలు చేస్తున్నారు. పీటీఐ సైతం తమ సమర్థనతో గెలిచినవారంతా పార్లమెంట్లో కలసి కట్టు కూటమిగా నిలిచేందుకు ఏం చేయాలా అని చూస్తోంది. ఏమైనా, ఇప్పటికే పలు సంక్షోభాల్లో కూరుకుపోయిన పొరుగుదేశం దీర్ఘకాలిక రాజకీయ అనిశ్చితిలో కొనసాగడం వాంఛనీయం కాదు. రాగల రోజుల్లో సైన్యం పర్యవేక్షణలో పీఎంఎల్, పీపీపీల మధ్య కొత్త కూటమి ఏర్పాటుకై బేర సారాలు తప్పవు. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికైన ఆ సర్కారైనా ఎంత స్థిరంగా ఉంటుందో ఊహించలేం. పాకిస్తానీ పెద్దలు ఇకనైనా ప్రజల భావావేశాలను గ్రహించాలి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంది! ‘గులామీ న మంజూర్’ (బానిసత్వాన్ని సమర్థించబోము) అని వినిపిస్తున్న నినాదాల్నీ, మంగళవారం నుంచి పీటీఐ చేపట్టదలచిన నిరసనల్నీ కొట్టేయలేం. ‘ప్రజాస్వామ్య విక్రయానికి విపణి సిద్ధమైం’దన్న విమర్శల్ని నిజం చేస్తే అంత కన్నా ఘోరం లేదు. పేరుకు మిగిలిన ప్రజాస్వామ్యం, ఎన్నికల తర్వాత సైతం అనిశ్చితి నెలకొనడం... పాకిస్తాన్ ప్రజల పాలిట శాపం. సరిహద్దు సమస్యలు, మరోమారు తలెత్తిన మతపరమైన హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికరంగ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతానికి పాక్ కథ సశేషమే! -
Pakistan Elections 2024: సంకీర్ణం దిశగానే పాక్...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం తెలిసిందే. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) 75 సీట్లతో ఏకైక అతిపెద్ద పారీ్టగా నిలిచింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీకి 54, ముత్తాహిదా ఖ్వామి మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం–పీ)కి 17, ఇతరులకు 12 సీట్లొచ్చాయి. 101 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లో నవాజ్ ముందంజలో ఉన్నారు.ఇతర పార్టీలతో చర్చల బాధ్యతను సోదరుడు షహబాజ్ షరీఫ్కు అప్పగించారు. ఆయన ఆదివారం ఎంక్యూఎం–పీతో ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం కలిసి పని చేయాలని అంగీకారానికి వచి్చనట్లు సమాచారం. నవాజ్ షరీఫ్ పార్టీతోనే తమకు పొత్తు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని ఎంక్యూఎం–పీ నాయకుడు హైదర్ రిజ్వీ చెప్పారు. పీపీపీ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో కూడా షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ ప్రధానమంత్రి పదవిని తన కుమారుడు బిలావల్ భుట్టోకే కట్టబెట్టాలని జర్దారీ షరత్ విధించారు. అందుకు పీఎంఎల్–ఎన్ అంగీకరించడం లేదు. పాకిస్తాన్లో పారీ్టల మధ్య పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవాజ్ షరీఫ్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కూడా మద్దతు పలుకుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 266 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అభ్యర్థి మరణంతో ఒక చోట పోలింగ్ వాయిదా పడింది. రిగ్గింగ్ ఆరోపణలతో కొన్ని స్థానాల్లో తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 133 సీట్లు అవసరం. సత్తా చాటిన ఇమ్రాన్ మద్దతుదారులు అవినీతి ఆరోపణలతో జైలుపాలైనా పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. ఆయన పార్టీ అధికారికంగా పోటీలో లేదు. దాంతో ఆయన మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేశారు. వారికి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కూడా కేటాయించలేదు. అయినా జాతీయ అసెంబ్లీలో ఏకంగా 101 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. ఈ ఫలితాలు తమకు నైతిక విజయమంటూ ఇమ్రాన్ జైలునుంచే ప్రకటన విడుదల చేశారు. -
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు.. అప్డేట్స్
Updates ► ఎన్నికల నేపథ్యంలో పాక్లో నేడు మొబైల్ సేవలను నిలిపివేశారు. భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. Pakistan's Interior Ministry temporarily suspends mobile services across the country in light of the deteriorating security situation, reports local media Parliamentary general elections are underway in Pakistan. — ANI (@ANI) February 8, 2024 ► ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లు గుమిగూడారు. #WATCH | Voters arrive at a polling booth in Islamabad, as parliamentary general elections get underway in Pakistan. (Source: Reuters) pic.twitter.com/twAWVomysU — ANI (@ANI) February 8, 2024 ► పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. #WATCH | Parliamentary general elections get underway in Pakistan. (Video Source: Reuters) pic.twitter.com/BeSNFGKR4r — ANI (@ANI) February 8, 2024 పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. Pakistan Election Day: Polarization, violence, and dire challenges ahead Read @ANI Story | https://t.co/58OXNzvgJt #PakistanElection #Pakistan pic.twitter.com/LgDvQkxuVe — ANI Digital (@ani_digital) February 8, 2024 నవాజ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. #WATCH | Delhi: On the unrest in Pakistan ahead of the country's upcoming Parliamentary Elections, Defence Expert Qamar Agha says, "The result of these elections is pre-decided, right from who will be the Prime Minister to how many seats will each party win. If you see there are… pic.twitter.com/kBku35WXQ4 — ANI (@ANI) February 8, 2024 బుధవారమే బలూచిస్తాన్ ప్రావిన్స్న్స్లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. -
పాక్ ఎన్నికల బరిలో...ఆమె అంతంతే
పాకిస్తాన్లో సాధారణ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమవుతోంది. గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పాక్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సైన్యం దన్నున్న పార్టీ యే గెలవడం ఆనవాయితీ. ఆ లెక్కన ఈసారి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్)దే విజయం ఖాయమంటున్నారు. మరో మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సైన్యం ఆగ్రహానికి గురై జైలుపాలవడంతో ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కకావికలైపోయింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీ కూడా పెద్దగా పోటీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఎప్పట్లాగే ఈ ఎన్నికల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం అంతంతే ఉంది... – సాక్షి, నేషనల్ డెస్క్ పాకిస్తాన్ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 17 వేల మంది పై చిలుకు అభ్యర్థుల్లో మహిళలు ఎందరో తెలుసా? కేవలం 839 మంది! అంటే 4.7 శాతం. సాంప్రదాయికంగా పాక్లో మహిళలకు రాజకీయాల్లో అంతగా ప్రోత్సాహం దక్కదు. దాంతో ఎన్నికల్లో కూడా వారి ప్రాతినిధ్యమూ అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. పరిస్థితిని మార్చేందుకు మహిళలకు కనీసం 5 శాతం టికెట్లివ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పనిసరి చేసింది. అయినా వారికి ఆ మాత్రం టికెట్లిచ్చేందుకు కూడా ప్రధాన పార్టీ లకు మనసు రావడం లేదు. ఈసారి మహిళలకు ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ ఇచ్చిన 53 టికెట్లే అత్యధికం! అయితే వారిలోనూ జాతీయ అసెంబ్లీకి పోటీ పడుతున్నది కేవలం 28 మందే. మిగతా 25 మంది ప్రావిన్సుల స్థానాల్లో పోటీకి పరిమితమయ్యారు. ఇక మహిళలకు పీపీపీ 4.5 శాతం, పీఎంఎల్ (ఎన్) కేవలం 4.2 శాతం టికెట్లతో సరిపెట్టాయి. పీపీపీ నుంచి 35 మంది, పీఎంఎల్ నుంచి 28 మంది మహిళలే బరిలో ఉన్నారు. వారిలోనూ చాలామంది పోటీ ప్రావిన్సు స్థానాలకే పరిమితం! కాకపోతే పాక్ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ మహిళ బరిలోకి దిగుతుండటం ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలవనుంది. అలాగే ఓ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, తాలిబన్ల చేతిలో భర్తను కోల్పోయిన మరో మహిళా నేత బరిలో ఉన్నారు.... సవీరా.. తొలి హిందూ అభ్యర్థి 25 ఏళ్ల సవీరా ప్రకాశ్ పాకిస్తాన్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. ఖైబర్ ఫక్తూన్ఖ్వా ప్రావిన్సులో బునెర్ జిల్లాలోని పీకే–25 నియోజకవర్గం నుంచి పీపీపీ టికెట్పై బరిలో దిగిన ఆమె ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసిన సవీరాది ఆసక్తికరమైన నేపథ్యం. ఆమె తండ్రి ఓం ప్రకాశ్ సిక్కు కాగా తల్లి క్రిస్టియన్. వారిద్దరి అంగీకారంతో సవీరా మాత్రం హిందూ మతావలంబిగా మారారు. తద్వారా పాక్ వంటి ముస్లిం మెజారిటీ దేశంలో మత సహనానికి, సామరస్యానికి ప్రతీకగా నిలిచారామె. భారత మూలాలున్న ఓం ప్రకాశ్ ఉచిత వైద్యంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా పేరు పొందారు. ఎన్నడూ ఎన్నికల బరిలో దిగకపోయినా 30 ఏళ్లుగా పీపీపీ కార్యకర్తగా ఉంటూ వస్తున్నారు. చెడు చేయాలని ఏ మతమూ చెప్పదంటూ సవీరా చేస్తున్న ప్రచారానికి ముస్లింల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. మత, లింగ వివక్షను నిర్మూలించడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు. ‘‘పాక్లో ప్రజా జీవితంలో మహిళ పట్ల వివక్ష బాగా ఉంది. మా జిల్లానే తీసుకుంటే చదువుకున్న మహిళల సంఖ్య కేవలం 29 శాతం. దేశవ్యాప్తంగా కూడా మహిళల్లో అక్షరాస్యత 46 శాతమే. దీన్ని మార్చేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా’’ అని చెబుతున్నారు. మహిళా రిజర్వు స్థానం నుంచి కాకుండా జనరల్ సీటు నుంచి ఆమె బరిలో దిగడం మరో విశేషం. ఓటర్లను ‘ఇన్ఫ్లుయెన్స్’ చేస్తుందా...? లాహోర్లోని ఎన్ఏ–122 స్థానంలో పీఎంఎల్ (ఎన్) అభ్యర్థి ఖవాజా సాద్ రఫీక్, పీటీఐకి చెందిన లతీఫ్ ఖోసా హోరాహోరీ తలపడుతున్నారు. వారిద్దరినీ ఢీకొంటున్న ఓ యూట్యూబ్ సంచలనం ఇప్పుడు దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమే జెబా వకార్. వృత్తిరీత్యా గైనకాలజిస్టు అయిన ఆమె జమాత్ ఇ ఇస్లామీ అనే మతపరమైన పార్టీ సభ్యురాలు. ఆ పార్టీ తరఫునే బరిలో దిగారు. యూట్యూబ్లో ఆమెకు 17,500 మందికి పైగా ఫాలోయర్లున్నారు. ఖురాన్, హదీత్లపై రోజూ ప్రసంగాలు అప్లోడ్ చేస్తుంటారు. విద్యాధికులైన యువతులకు ఖురాన్ పాఠాలు చెప్పే సంస్థను కూడా భర్తతో కలిసి నడుపుతున్నారు. ‘‘నన్ను గెలిపిస్తే మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తా. వారిపై వేధింపులకు తెర దించేలా కఠిన చట్టాల కోసం కృషి చేస్తా’’ అని చెబుతున్నారు. భర్త బాటన... ఇక పెషావర్ నుంచి బరిలో దిగుతున్న సమర్ హరూన్ బిలౌర్ది మరో గాథ. గత ఎన్నికల వేళ ఆమె భర్త హరూన్ను ప్రచారం సందర్భంగా పాక్ తాలిబన్లు కిరాతకంగా కాల్చి చంపారు. దాంతో ఆయన స్థానంలో సమర్ బరిలో దిగాల్సి వచ్చింది. అవామీ వర్కర్స్ పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో నెగ్గి పెషావర్ నుంచి తొలి మహిళా ప్రొవిన్షియల్ ఎంపీగా రికార్డు సృష్టించారామె. దాంతో దేశ రాజకీయాల్లో ఆమె పేరు అందర్లోనూ నానింది. ఈసారి కూడా ఆమె మళ్లీ బరిలో దిగుతున్నారు. అఫ్గాన్ సరిహద్దులకు సమీపంలో ఉండే పష్తూన్ ప్రాబల్య నగరమైన పెషావర్లో, పరిసర ప్రాంతాల్లో మహిళలపై అణచివేత మరింత అధికం. మహిళలపై తీవ్ర అణచివేతలకు పేరుమోసిన తాలిబన్ల ప్రభావం మరింత ఎక్కువ. దాంతో సమర్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. గత ఎన్నికలప్పుడు మతోన్మాద మూకల బెదిరింపుల నేపథ్యంలో బిక్కుబిక్కుమంటూనే ప్రచారం చేశారు. ఈ ఐదేళ్లలో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయంటారు సమర్. నిత్యం ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలను వింటూ, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండటం ఆమెకు బాగా పేరు తెచ్చింది. -
TS: బీజేపీ నేతలపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తి !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై సంఘ్ పరివార్(ఆర్ఎస్ఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితిపై పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సంఘ్ పరివార్ నేతలకు వివరించారు. ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలవాలంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు గెలవాలనే దానిపై ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలకు బీజేపీ నాయకులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో ఈసారి పదికిపైగా స్థానాలు గెలిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని బీజేపీ నేతలు చెప్పారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లోనూ బీజేపీ ఎంపీలు గెలిచే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతల తీరు, వ్యవహారంపై సంఘ్ పరివార్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ నేతల మధ్య విభేదాలపై పరివార్ నేతలు గట్టిగానే అడిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న మంచి వాతావరణాన్ని ఎన్నికల సమయానికి చెడగొట్టుకున్నారని మొట్టికాయలు వేశారు. ఇప్పటికైనా సమన్వయంతో పనిచేయాలని బీజేపీ నేతలకు ఆర్ఎస్ఎస్ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ముందే ప్రకటించాలని సూచించారు. నోటిఫికేషన్కు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు సమాధానమిచ్చారు. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ నుంచి సంఘ్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శులు ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ నుంచి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఇదీ.. చదవండి.. కేసీఆర్ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్ -
పైకి పొత్తులు కడుపులో కత్తులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికల్లో వైరి పార్టీలు పోటీ పడడం, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం సహజం. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పొత్తులు పెట్టుకున్న పార్టీలు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నాయి. టీడీపీ–జనసేన పరిస్థితి అలాగే ఉంది. అధికారం కోసం జత కట్టిన ఈ పార్టీ లు సీట్ల పంపకాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపేందుకు తెగ ప్రయతిస్తున్నాయి. జనసేన జిల్లాలో మూడు నియోజకవర్గాలపై కన్నేసింది. టీడీపీకి అది మింగుడు పడడం లేదు. పొత్తులో భాగంగా జిల్లాలోని ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను జనసేన అడుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో జనసేన వేలు పెట్టింది. ఈ నియోజకవర్గాల్లో తమకు పట్టు ఉందని, పొత్తులో భాగంగా వాటిని తమకు కేటాయించాలని కోరింది. క్షేత్రస్థాయిలో ఎవరికెంత పట్టు ఉందో జనాలకు తెలిసినప్పటికీ టీడీపీకి తమ మద్దతు కావాలంటే వీటిని తమకు ఇవ్వాల్సిందే అన్న ధోరణిలో జనసేన వెళ్తోంది. మండపేట, అరకు నియోజకవర్గాలకు టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన దగ్గరి నుంచి జనసేన వైఖరి మారింది. పొత్తు లేకపోతే టీడీపీ బలహీనమని, పొత్తులో ఉంటే కనీస సీట్లు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయంతో జనసేన గత కొన్ని రోజులుగా స్వరం పెంచింది. అడిగినవి ఇవ్వకపోతే టీడీపీకే నష్టమన్న ధోరణిలో మొండిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను డిమాండ్ చేస్తోంది. ఎచ్చెర్ల – పాతపట్నంలలో ఇలా.. ఎచ్చెర్లలో టీడీపీ విభేదాలు అందరికీ తెలిసిందే. ఒకవైపు కళా వెంకటరావు, మరోవైపు కలిశెట్టి అప్పలనాయుడు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుని సీటు కోసం పైరవీలు చేస్తున్నారు. వీరిలో ఎవరికిచ్చినా మిగతా వారు సహకరించే పరిస్థితి లేదు. అవసరమైతే టిక్కెట్ దక్కని వారు ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితి అక్కడుంది. దీన్ని బూచిగా చూపించి జనసేన ఆ సీటును తమకివ్వాలని అడుగుతోంది. నియోజకవర్గంలో తమకు పట్టు ఉందని పట్టుబడుతోంది. పాతపట్నం నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నాయకుడు మామిడి గోవిందరావు నియోజకవర్గంలో నువ్వానేనా..అనే రీతిలో ఉంటున్నారు. వీరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నాయో నియోజక వర్గ ప్రజలందరికీ తెలిసిందే. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. టిక్కెట్ దక్కని నాయకుడు తిరుగుబావుటా ఎగురవేయనున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీన్ని అడ్వాంటేజ్గా జనసేన తీసుకుంటోంది. టీడీపీలో ఎవరికిచ్చినా ఓడిపోతారని, ఆ సీటు తమకిస్తే తప్పకుండా గెలుస్తామని జనసేన కోరుతోంది. పలాసలో ఇలా.. పలాసలో ప్రస్తుత టీడీపీ ప్రధాన ఆశావహులు గౌతు శిరీషపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అటు ప్రజల్లోనే కాదు పార్టీ కేడర్లోనూ అసంతృప్తి ఉంది. ఆమె అయితే కష్టమనే అభిప్రాయానికి దాదాపు పార్టీ శ్రేణులు వచ్చేశాయి. ఆమె తీరు వారికి నచ్చడం లేదు. ఆమెకు పోటీగా ఇద్దరు ముగ్గురు నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన ఓ వైద్యుడు టీడీపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారు. ఒక పర్యాయం చర్చలు కూడా జరిగాయి. ఇలా ఎవరికి వారు లోపాయికారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఎన్నికల్లో కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. దీంతో జనసేన కన్నేసింది. టీడీపీ నాయకులపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఆ సీటు తమకివ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ద్విముఖ వ్యూహంలో జనసేన.. టీడీపీ గ్రూపులు, నాయకుల మధ్య విభేదాలను క్యాష్ చేసుకోవాలని జనసేన చూస్తోంది. అందులో భాగంగానే ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాలను అడుగుతోంది. అలాగని, ఆ సీట్లు వారికిస్తే ఇప్పుడున్న జనసేన నాయకులను పోటీలో దింపుతుందా అంటే డౌటే. పొత్తులో ఒప్పందం కుదిరితే ఆ సీట్లలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్లనో తటస్థులనో రంగంలోకి దించాలని చూస్తోంది. ఆ మేరకు ఇప్పటికే సంప్రదింపులు చేస్తోంది. ఆ మూడు సీట్లు వస్తాయనుకుంటే టీడీపీలో తమకు అనుకూలంగా ఉన్న ఒకరిని తమ పారీ్టలోకి తీసుకుని వారి చేత పోటీ చేయించాలన్నది ఒక ఆప్షనైతే, వైద్యులు, వ్యాపారులు, రిటైర్డు ఉద్యోగులను బరిలోకి దించాలన్నది మరో ఆప్షన్. పలాసలో పోటీ చేయించడానికి శ్రీకాకుళానికి చెందిన ఓ వైద్యుడితో సంప్రదింపులు చేస్తోంది. పాతపట్నంలో బరిలో దించడానికి మరో వ్యాపారితో మంతనాలు జరుపుతోంది. ఎచ్చెర్లలో కూడా అదే తరహాలో ఇప్పుడున్న నాయకులను కాకుండా కొత్త వారి కోసం అన్వేషణ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న జనసేన నాయకులకు అంత సీన్ లేదన్న అభిప్రాయంతో రెండు ఆప్షన్లు పెట్టుకుని ముందుకెళ్తోంది. జనసేన అనుకున్నట్టు జరిగితే ఎన్నాళ్లగానో టీడీపీ కోసం పనిచేస్తున్న నాయకుల ఆశలపై నీళ్లు జల్లినట్టే. -
ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ
సాక్షి, అమరావతి: రానున్న సాధారణ ఎన్నికల సక్రమ నిర్వహణకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న వివిధ విభాగాల అధికారుల ఖాళీల భర్తీతోపాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) ముఖేష్కుమార్ మీనాతో సీఎస్ జవహర్రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్తవారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు జవహర్రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు.. ఇక రానున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందితో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎస్ జవహర్రెడ్డి సమీక్షించారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా రాష్ట్ర అధికారులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించాలని.. దీనిపై ఒడిశా సీఎస్తో తాను మాట్లాడతానన్నారు. అలాగే, ఎన్నికలు అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించాల్సిన ప్రక్రియని.. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత బాధ్యతాయుతంగా పనిచేయాల్సి ఉంటుందని.. ఆ దిశగా సంబంధిత శాఖలన్నీ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటన.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల సన్నాహక ఏర్పాట్లపై సమీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 9న రాష్ట్రానికి రానుందని తెలిపారు. 10న విజయవాడలో సీఎస్, డీజీపీ, సీఈఓ సహా ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్ అండ్ బీ, అటవీ, విద్యా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలున్నాయని.. వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దృష్టికి తీసుకొచ్చి వీటిపై జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేయాల్సి ఉందని సీఎస్కు చెప్పారు. అలాగే, వివిధ పోలింగ్ కేంద్రాల్లో విభిన్న ప్రతిభావంతులకు ఏర్పాటుచేయాల్సిన సౌకర్యాలపైనా ఆదేశాలివ్వాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని డిప్యుటేషన్పై నియమించాల్సి ఉందని సీఈఓ చెప్పగా.. వెంటనే తగిన ప్రతిపాదనలు పంపాలని సీఎస్ జవహర్రెడ్డి కోరారు. ఇంకా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గిరిజాశంకర్, అదనపు పీసీసీఎఫ్ విజిలెన్స్ గోపీనాథ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్, రవాణా శాఖ కమిషనర్ మణీష్కుమార్ ఎస్ఎల్బీసీ కన్వీనర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఆదే విధంగా.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బి. రాజశేఖర్, రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కె.భాస్కర్, సీడీఎంఏ కోటేశ్వరరావు తదితరులు వర్చువల్గా పాల్గొన్నారు. చెక్పోస్టులో నిఘా మరింత ముమ్మరం.. రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎం. రవిప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులున్నాయని, వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు, మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో 76 పోలీసు చెక్పోస్టులు, 14 అటవీ చెక్ పోస్టులున్నాయని వీటన్నింటి ద్వారా నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్లు ముఖేష్కుమార్ చెప్పారు. -
Bharat Nyay Yatra: రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సుదీర్ఘయాత్రకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నూతన జవసత్వాలు అందించే దిశగా రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర జరుగనుందని కాంగ్రెస్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. వచ్చే ఏడాది జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభం కానున్న ఈ యాత్ర 67 రోజుల పాటు కొనసాగి, మార్చి 20వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగుస్తుంది. దేశ ప్రజలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని అందించడమే ధ్యేయంగా రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంఫాల్లో జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం షెడ్యూల్ ఖరారు చేసింది. రెండో విడత యాత్ర చేపట్టాలని రాహుల్ గాం«దీని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 21న ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. చాలావరకు బస్సు యాత్ర.. అవసరమైన చోట పాదయాత్ర రాహుల్ గాంధీ తన తొలి విడత భారత్ జోడో యాత్రను 2022 సెపె్టంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించారు. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేశారు. ఈ ఏడాది జనవరి 30న జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో యాత్ర ముగిసింది. మొదటి యాత్రకు కొంత భిన్నంగా చాలావరకు బస్సు ద్వారా భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నప్పటికీ, అవసరమైన చోట పాదయాత్ర సైతం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల మీదుగా మొత్తం 6,200 కిలోమీటర్ల మేర సాగనుంది. మణిపూర్లో ప్రారంభమై నాగాలాండ్, అస్సాం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కొనసాగి మహారాష్ట్రలో ముగియనుంది. భారత్ జోడోయాత్ర 136 రోజులపాటు 3,970 కిలోమీటర్లు జరిగింది. భారత్ న్యాయ యాత్ర 67 రోజుల్లోనే 6,200 కిలోమీటర్లు సాగనుంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలు మాన్పాలన్నదే ఆకాంక్ష ఇటీవల నెలల తరబడి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందన్న సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్ పెద్దల ఉద్దేశమని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజల గాయాలను మాన్పాలన్నదే తమ ఆకాంక్ష అని కాంగ్రెస్ అగ్రనేత కె.సి.వేణుగోపాల్ వివరించారు. యాత్ర సందర్భంగా 12 బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. 100కుపైగా స్ట్రీట్–కార్నర్ సమావేశాలు ఉంటాయి. 13 ప్రెస్ కాన్ఫరెన్స్లు సైతం నిర్వహిస్తారు. మహిళలు, యువతతోపాటు అణగారిన వర్గాల ప్రజలతో ముఖాముఖి భేటీ అవుతారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న మహారాష్ట్రలోని నాగపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జైరామ్ రమేశ్ తెలిపారు. ఈ సభకు హమ్ తయ్యార్ హూ(మేము సిద్ధంగా ఉన్నాం) అని నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. -
పాక్ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ
పెషావర్: ముస్లింల ఆధిపత్యముండే పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరగబోయే దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలిసారిగా ఒక హిందూ మహిళ పోటీకి నిలబడింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని పీకే–25 పార్లమెంట్ స్థానం నుంచి సవీరా పర్కాశ్ అనే మహిళ పోటీచేస్తున్నారు. హిందువు అయిన సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) తరఫున బునేర్ జిల్లాలో ఆమె నామినేషన్ దాఖలుచేశారు. -
స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారులు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, అండర్ సెక్రటరీ సంజయ్కుమార్తోపాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్ పోలీస్ నోడల్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ తదితరులు హాజరయ్యారు. ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, పటిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షితులైన మానవవనరులు, మెటీరియల్ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని, ఈఎస్ఎంఎస్, సువిధ, ఈఎన్కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్ టర్నవుట్, కౌంటింగ్ ఓట్స్ యాప్లపై అధికారులు, సిబ్బందికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్నారు. జిల్లాస్థాయిలోనూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్ఎస్ఆర్–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారదర్శకంగా ఎస్ఎస్ఆర్–2024: సీఈవో రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఎస్ఆర్–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు. మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్ఎస్ఆర్–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
CWC meet: ఎన్నికలకు సిద్ధంకండి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించి, కాంగ్రెస్ను గెలుపు తీరాలకు చేర్చడమే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. తెలంగాణ మినహా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ నైతిక స్థైర్యం వీడకుండా ముందుకుసాగాలని పిలుపునిచి్చంది. కూటమి పక్షాలను కలుపుకుంటూ, విజయ లక్ష్యంతో నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించారు. సార్వత్రిక ఎన్నికలు, కూటమి పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాం«దీ, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ నుంచి హాజరు కావాల్సిసిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ అసెంబ్లీ సమావేశాల కారణంగా రాలేదు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మానంలోని అంశాలను తర్వాత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘‘ పార్లమెంటు నుంచి 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని సీడబ్ల్యూసీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు ధీటుగా విపక్షాల ‘ఇండియా’ కూటమిని పటిష్టవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ‘‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న కారణంగా ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ప్రధాని చెప్పే విషయాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉంది’ అని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ‘‘దేశంలో సామాజిక ధ్రువీకరణ తీవ్రమవుతోంది. ఎన్నికల్లో లాభం పొందేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’’ అని మండిపడింది. భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘4 రాష్ట్రాల ఫలితాలపై ప్రాథమిక విశ్లేషణ చేసి ఓటమి కారణాలను గుర్తించాం. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నా ఓట్ల శాతం సానుకూలంగా ఉంది. శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికలను మలుపు తిప్పగలమన్న ఆశ పెరిగిందిం’అని చెప్పారు. -
21న సీడబ్ల్యూసీ కీలక భేటీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలుచేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) డిసెంబర్ 21వ తేదీన సమావేశం కానుంది. డిసెంబర్ 19వ తేదీన విపక్షాల ‘ఇండియా’ కూటమి భేటీ పూర్తయిన రెండు రోజులకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ జరగనుంది. వివిధ రాష్ట్రాల్లో కూటమి పారీ్టలతో సీట్లు పంపకం, ఎన్నికల ప్రచార వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో ఓటమిపై సమీక్ష జరగొచ్చు. నిరుద్యోగం, పెరిగిన ధరలను ప్రధాన విమర్శనా్రస్తాలుగా తీసుకుని పశి్చమ–ఈశాన్య భారతాల మధ్య రాహుల్గాంధీ మరోమారు పాదయాత్ర చేసే అంశాన్నీ చర్చించే వీలుంది. 19న ఇండియా ‘కీలక’ భేటీ ‘ఇండియా’ కూటమి విపక్ష పార్టీలు ఢిల్లీలో ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం సమావేశం కానున్నాయి. సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యాచరణ, సీట్ల పంపకం జరిగిన చోట్ల ఉమ్మడిగా ప్రచార ర్యాలీలు చేపట్టడం వంటి సవాళ్లు నేతలకు స్వాగతం పలకనున్నాయి. వీటిపై సమావేశంలో ఒక స్పష్టత వచ్చే వీలుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘‘నేను కాదు, మనం’’ అనే కొత్త నినాదంలో జనంలోకి వెళ్లాలని విపక్షాల కూటమి నిర్ణయించిన సంగతి తెల్సిందే. -
లోక్సభ ఎన్నికలకు త్వరలో అభ్యర్థుల ప్రకటన!
న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ కార్యాచరణను వేగవంతం చేశాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తమతమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆచీతూచీ పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాల అన్వేషణపై ఇప్పటికే దృష్టి సారించింది. 160 మంది అభ్యర్థల ప్రకటన ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే బీజేపీ యాక్షన్ ప్లాన్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే అభర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. మొదటి విడతలో 160 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు సమాచారం. అయితే 60 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నామని భావిస్తున్న బీజేపీ.. చాలా కాలంగా ఆ స్థానాలపై ఫోకస్ చేసింది. చదవండి: ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు ఈ జాబితాలోనే తెలంగాణ కూడా? ఇక ఈ మొదటి జాబితాలోనే తెలంగాణాలోని 12 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు డిసెంబర్ లేదా జనవరిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ ముందస్తు అభ్యర్ధుల ప్రకటన కసరత్తు ఆసక్తి రేపుతోంది. బీజేపీ చరిత్రలో తొలిసారి! అయితే షెడ్యూల్ రాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవల మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. కానీ లోక్సభకు షెడ్యూల్ కన్నా ముందు అభ్యర్ధులను ప్రకటించండం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. దీని ద్వారా అభ్యర్ధుల విజయవకాశాలు మెరుగవుతాయని కాషాయదళం అంచానా వేస్తోంది. తెలంగాణలో కమలం కసరత్తు మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న తరుణంలో టికెట్ల జాబితాపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. కోర్ కమిటీ భేటీ తర్వాత అధిష్టానానికి అభ్యర్థుల జాబితా అందజేయనుంది. సెప్టెంబర్ మొదటవారంలో మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. - 25 మందితో తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. -
సమర సన్నాహాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీ సొంత గూటిలో సర్దుబాట్లతో సమరానికి సన్నద్ధమవుతున్నట్టుంది. పది నెలల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదివారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు చూస్తే అదే అనిపిస్తుంది. నిరుడు జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే ఆచితూచి వ్యవహరిస్తూ, ఇన్నాళ్ళకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ)ని పునర్వ్యవస్థీకరించారు. సరికొత్త సీడబ్ల్యూసీపై గాంధీ కుటుంబ ముద్ర సుస్పష్టం. అయితే, ఒకపక్క విశ్వాసపాత్రులైన పాత కాపుల్ని కదిలించకుండానే, మరోపక్క కొత్త వారికీ, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారికీ, వివిధ సామాజిక వర్గాలకూ స్థానం కల్పించారు. ఇలా పార్టీలో నవనవోత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించడం స్వాగతనీయం. సోనియా కుటుంబానికి వీరవిధేయుడైనప్పటికీ, కేవలం డూడూబసవన్నలా ఖర్గే ఉండిపోలేదు. కొత్త కార్యవర్గంలో గాంధీ శిబిరం వారితో పాటు తన సొంత శిబిరం వారికీ చోటిచ్చారు. వివిధ సామాజిక వర్గాలకు చోటిస్తూ సమ తూకం సాధించడంతో ఈ కొత్త కార్యవర్గం రానున్న ఎన్నికల టీమ్ అని అర్థమవుతోంది. సోనియా అధ్యక్ష కాలంలోని 2020 సెప్టెంబర్ తర్వాత సీడబ్ల్యూసీ ప్రక్షాళన మళ్ళీ జరగడం ఇప్పుడే! అనేక విడతల చర్చల తర్వాత కొత్త కమిటీ కొలువు తీరింది. 39 మంది శాశ్వత సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది రాష్ట్ర ఇన్–ఛార్జ్లు, నలుగురు సంస్థాగత ఇన్–ఛార్జ్లు, మరో 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు – ఇలా మొత్తం 84 మంది సభ్యులతో మునుపెన్నడూ లేనంతటి అతి పెద్ద సీడబ్ల్యూసీ ఇది. పాత, కొత్తల మేలు కలయికగా ఏర్పాటైన వర్కింగ్ కమిటీలో ప్రజా స్వామ్య స్ఫూర్తిని పెంచడం హర్షణీయం. రాజస్థాన్లో సొంత పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి, ఉప ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న సచిన్ పైలట్కు కార్యవర్గంలో స్థానమివ్వడం, అలాగే నిరుడు పార్టీ అంతర్గత ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి ఖర్గేతో పోటీపడిన శశి థరూర్కు సైతం చోటివ్వడం ఆశ్చర్యకరమే. అలాగే, పార్టీకి సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించిన జి–23 బృందంలోని అసమ్మతి నేతల్లో భాగమైన ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్లను సైతం కొత్త సభ్యులుగా తీసుకోవడం గమనార్హం. ఇది అవసరమైన రాజకీయ చాణక్యమే. విభిన్న స్వరాలు వినిపించేవారిని సైతం విధాన నిర్ణయాలు తీసుకొనే వేదికలో భాగస్వాముల్ని చేయడం అంతర్గత ప్రజాస్వామ్యానికి సూచిక. 138 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ఒక పార్టీ సమకాలీన చైతన్యశీల ప్రస్థానానికీ, పురోగతికీ దీర్ఘకాలంలో అది కీలకం కూడా! ముఖ్యంగా ఈ ఏడాది చివరి కల్లా మిజోరమ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలున్న వేళ ఆ ప్రాంతాలకూ ప్రాముఖ్యం, ప్రాతినిధ్యం ఇస్తూ ఈ పునర్వ్యవస్థీకరణ సాగడం గమనార్హం. ఎన్నికలున్న రాజస్థాన్లో అసమ్మతి నేత సచిన్ పైలట్కూ, అలాగే ఛత్తీస్గఢ్లో బలమైన ఫ్యాక్షన్ నాయకుడూ, ఓబీసీ అయిన మంత్రి తామ్రధ్వజ్ సాహూకూ పార్టీ అత్యున్నత వేదికలో చోటివ్వడం తక్షణ ప్రయోజ నాలకు తప్పక పనికొస్తుంది. అలా చూస్తే, ఆలస్యమైనా ఖర్గే ఆలోచించి పావులు కదిపారనుకోవాలి. గత కమిటీలో ఒక్క ఓబీసీయే ఉంటే, ఈసారి ఆరుగురికి స్థానం దక్కడం, 9 మంది ఎస్సీలకూ, ఒక గిరిజన నేతకూ సీటివ్వడం... ఉదయ్పూర్ డిక్లరేషన్కూ, సామాజిక న్యాయానికీ కట్టుబడి ఉన్నామనే భావన కలిగించడానికీ కాంగ్రెస్కు ఉపకరిస్తుంది. అయితే, 15 మంది స్త్రీలకు స్థానం కల్పించినా, మహిళా సాధికారత మంత్రం పఠిస్తున్న పార్టీ ఈ సంఖ్యను మరింత పెంచుకోవడం అవసరం. నిజానికి, సీడబ్ల్యూసీలో 50 ఏళ్ళ లోపు వారు 50 శాతమైనా ఉండాలన్నది లక్ష్యమని కాంగ్రెస్ కొంతకాలంగా చెబుతోంది. గత ఏడాది మేలో ఉదయ్పూర్లో జరిగిన చింతన్ శిబిర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాయ్పూర్లో సాగిన పార్టీ ప్లీనరీలో ఆ మేరకు సంకల్పం కూడా చెప్పుకుంది. తాజా పునర్వ్యవస్థీకరణ ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. అయితే, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనతే లాంటి యువ నాయకత్వాన్ని సైతం ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నంగా భావించవచ్చు. సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యుల సంఖ్యను 23 నుంచి 35కు పెంచుతామని రాయ్పూర్ ప్లీనరీలో చెప్పిన పెద్దలు ఆ అవధిని మరింత పెంచి, 39 మంది శాశ్వత సభ్యులను తీసుకోవడమూ అనేక రాజకీయ అనివార్యతలకు అద్దం పడుతోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరపకుండా, ఖర్గేయే నామినేట్ చేస్తారని నిర్ణయించిన పార్టీ ఇప్పటికి ఈ ఘట్టాన్ని పూర్తి చేసింది. వెరసి, కొత్త కార్యవర్గం కూర్పు కొంత సృజనాత్మక ధోరణిలో, మరికొంత రాజీ మార్గంలో పయనించిందని చెప్పక తప్పదు. శశిథరూర్ పేర్కొన్నట్టు, సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలే ఏ పార్టీకైనా జీవనాడి. వారితో నిండిన పార్టీలు, కార్యవర్గాలే ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో ముందడుగు వేయగలవు. సీడబ్ల్యూసీ కూర్పులో ఆ సంగతి ఖర్గే బాగానే గ్రహించారు. కానీ, సవాళ్ళు ముగిసిపోలేదు. అద్వానీ తర్వాత స్వతంత్ర భారతావనిలో ఏకకాలంలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, లోక్సభ, రాజ్యసభల్లో ప్రతి పక్ష నేతగా ఉన్న 81 ఏళ్ళ ఖర్గే ఎన్నికల బరిలోనూ కాంగ్రెస్ను తీరానికి చేర్చాలి. ఆ మధ్య దాకా నీరసించిన పార్టీ నిరుడు హిమాచల్లో, ఈ ఏడాది కర్ణాటకలో దక్కిన విజయాలతో తెరిపిన పడింది. ఆ విజయ పరంపరను కొనసాగించాలంటే అభ్యర్థుల ఎంపిక, ప్రచారవ్యూహాలు,‘ఇండియా’ కూటమిలో ఇతర ప్రతిపక్షాలతో సంప్రతింపులు – ఇలా ఖర్గే చేతి నిండా పని ఉంది. సోనియా కుటుంబంతో సమన్వయం చేసుకుంటూనే ఆ పనిని ఆయన ఎంత సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి. ఒక్కమాటలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది! -
మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. ఓటు లేకపోతే తక్షణం నమోదు చేయించుకోండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 21 వరకు అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. ఓటర్ల జాబితాను పరిశీలించి సవరణలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోలతో కలిసి ఓటర్ల పరిశీలనలో పాల్గొంటాయి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 22 నుంచి రాజకీయ పార్టీల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30కి పూర్తి చేసి అక్టోబరు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. శనివారం, ఆదివారం అయిన అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణకు బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. డిసెంబరు 26 కల్లా క్లెయిమ్లు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వీటి నమోదుపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర జనాభా ప్రకారం 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు కనీసం 12 లక్షలు ఉండాలి. కానీ 3.50 లక్షల ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. 2024 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో వీరి నమోదుపైనా దృష్టి సారిస్తున్నారు. వీరు ఫారం 6ను వినియోగించి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. చనిపోయిన వారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఫారం 7ను వినియోగించుకోవాలి. చిరునామా, నియోజకవర్గం మార్చుకోవడానికి ఫారం 8 ఇవ్వాలి. ప్రవాసాంధ్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారం 6 ఏను ఇవ్వాలి. పరిశీలనకు తీసుకొనే అంశాలు ♦ ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉంటే వారి అభీష్టం మేరకు ఒక చోట ఉంచి మిగిలిన ఓట్లను తొలగిస్తారు. ♦ నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తిస్తారు. ♦ డోర్ నంబర్లు లేకుండా ఉన్నా, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లను పరిశీలిస్తారు. ♦ ఇంటి నంబరు లేనివి, ఒకే ఇంటి నంబరు, వీధి పేరుపై వందలాది ఓట్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తారు. ♦ దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఒక్క ప్రాంతంలోనే ఉంచుతారు ♦ ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ సిఫారసు చేస్తారు. దొంగ ఓట్ల దొంగ బాబే! 2019 ఎన్నికల్లో గెలవడానికి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని హామీలేదు. అయినా నమ్మకం కుదరక ఇష్టానుసారంగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒకే ఇంట్లో 40–50 మొదలు.. ఏకంగా 600–700 ఓట్ల వరకు గంపగుత్తగా ఓట్లు ఉన్నట్లు సృష్టించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం ముందు తట్టుకోలేక తల వంచారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటి లీలలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే ఉలిక్కిపడుతున్నారు. గంపగుత్తగా ఉన్న దొంగ ఓట్లను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. విచారించగా ఆ దొంగ ఓట్లన్నీ నాటి బాబు పాలనలో రికార్డుల్లోకి ఎక్కినవేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ప్రజల్లో ఇంకా చులకనవుతానని భావించి ఎల్లో మీడియాను రంగంలోకి దింపారు. తను చేసిన తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై వేసి.. తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. రోజుకో రీతిన తప్పుడు కథనాలు వండి వార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారు. ఇది కూడా బెడిసి కొడుతోంది. బాబు తీరు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుంది. -
టైమ్స్ నౌ సర్వే.. దేశవ్యాప్తంగా బీజేపీ జోరే..
వచ్చే ఏడాదిలో లోక్సభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు గెలిచి అధికారం చేపట్టిన బీజేపీ.. మూడోసారి కూడా కేంద్రలో పాగా వేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మళ్లీ ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే అంచనా వేసింది. బీజేపీకి సొంతంగా 285 నుంచి 325 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. #JanGanKaMann: आज लोकसभा चुनाव हुए तो किसको कितनी सीटें? #BJP+ 285-325#INC 111-149#TMC 20-22#YSRCP 24-25#BJD 12-14#BRS 9-11 #AAP 4-7#SP 4-8 अन्य 18-38@ETG_Research @PadmajaJoshi #Survey #Elections pic.twitter.com/pqCKhSTGbK — Times Now Navbharat (@TNNavbharat) July 1, 2023 టైమ్స్ నౌ సర్వే ప్రకారం ► బీజేపీ.. 285-325 ►కాంగ్రెస్.. 111-149 ►తృణమూల్ కాంగ్రెస్.. 20-22 ►వైఎస్సార్సీపీ.. 24-25 ►బీజేడీ.. 12-14 ►బీఆర్ఎస్ 9-11 ►ఆమ్ ఆద్మా పార్టీ.. 4-7 ►సమాజ్వాదీ పార్టీ.. 4-8 ►ఇతరులు.. 18-38 మొత్తం 543 స్థానాలున్న లోక్సభలో అధికారంలోకి రావాలంటే కనీసం 272 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. గత రెండు పర్యాయాలు 2014లో, 2019లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ నేతృత్వంలో మరిన్ని పార్టీలను మిత్ర పక్షాలుగా చేర్చుకుంది. ఇక ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉంది. 9 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా.. మోదీ సర్కారుకు ఇప్పటికీ ధృడంగానే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది టైమ్స్ నౌ నవభారత్ సర్వే సారాంశం. ఇక కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్కు కావాల్సినన్ని సీట్లను గెలిపించలేకపోతున్నారని సర్వే చెబుతోంది. కర్ణాటకలో గెలిచినా.. రాహుల్ ప్రభావం దేశవ్యాప్తంగా ఇంకా రాలేదని తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్కు 111 నుంచి 149 సీట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక లోక్సభ సీట్లు దక్కించుకునే పార్టీగా YSRCP అవతరించే అవకాశం ఉందని సర్వే తెలిపింది. జాతీయ పార్టీల తర్వాత ఏకంగా 24 నుంచి 25 స్థానాలను YSRCP గెలుచుకుంటుందని అంచనా వేసింది. బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ 20 నుంచి 22కు పరిమితం అవుతారని తెలిపింది. ఢిల్లీ, పంజాబ్ల్లో అధికారంలో ఉన్న ఆమ్ అద్మీకి 4 నుంచి 7 రావడం కష్టంగా ఉంది. -
23న విపక్ష పార్టీల భేటీ.. కేసీఆర్కు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే కార్యాచరణ సిధ్దం చేసేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష అగ్రనేతల సమావేశం ఈ నెల 23న పాట్నాలో జరుగనుంది. ఈ నెల 12నే విపక్ష నేతల సమావేశం జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోవడంతో ఈ భేటీని 23న నిర్వహించనున్నట్లు జేడీయూ అధ్యక్షుడు లాలన్ సింగ్ ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ–ఎంఎల్ జాతీయ కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యలు హాజరు కానున్నారు. కాగా ఈ భేటీకి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు జేడీయూ నేతలు ఆహ్వానం పంపలేదు. గత ఏడాది ఆగస్టులో బిహార్లో నితీశ్కుమార్తో భేటీ నిర్వహించిన కేసీఆర్, బీజేపీ ముక్త్ భారత్ౖMðకలిసి పోరాడతామని ప్రకటించారు. అయితే అనంతరం వివిధ కారణాలతో రెండు పార్టీల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. తాజా భేటీకి ఆహ్వానం పంపలేదు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి కార్యాచరణ తీసుకునే అంశంపై చర్చించనున్నారు. హాజరవుతున్నా: శరద్ పవార్ బిహార్ సీఎం నితీశ్కుమార్ బుధవారం తనకు ఫోన్ చేసి ఆహ్వానించారని, విపక్షాల భేటీకి తాను హాజరవుతానని ఎన్సీపీ అధినేత శరద్పవార్ గురువారం తెలిపారు. పలు జాతీయ అంశాలపై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని, అది విపక్షాల బాధ్యతని పవార్ అన్నారు. -
సార్వత్రిక ఎన్నికపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
-
ప్రజాతీర్పుకు పట్టం కట్టాలి!
అణిచివేత ఎక్కువైనప్పుడు ఆగ్రహం వస్తుంది. ఎన్నికలు జరిగినప్పుడు మార్పును కోరుతూ ప్రజా సందేశాన్ని మోసుకొస్తుంది. ఆదివారం థాయిలాండ్లో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళి అందుకు తాజా ఉదాహరణ. సైన్యం కనుసన్నల్లో నడుస్తున్న, మరోమాటలో సైన్యమే తొమ్మిదేళ్ళుగా నడుపుతున్న ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా బయటపడింది. మార్పు కోరుతూ థాయిలాండ్ ఓటర్లు తీర్పునిచ్చారు. అలా 2020లో విద్యార్థుల నేతృత్వంలో సాగిన ప్రజాస్వామ్య అను కూల భారీ నిరసన ఉద్యమాల తర్వాత జరిగిన తొలి జనరల్ ఎలక్షన్ ఫలితం అపూర్వం. దేశ రాజకీయాల్లో మిలటరీ, రాయల్టీ ప్రాబల్యాన్ని సామాన్యులు నిరసించడం అక్కడి ప్రజాస్వామ్యవాద శక్తులకు సంతోషకరమే. ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ పాలకులందరికీ గుణపాఠమే. 6.5 కోట్ల జనాభా గల థాయిలాండ్లో 5.2 కోట్ల మందికి ఓటు హక్కుంది. రానున్న నాలుగేళ్ళ కాలానికి 500 స్థానాల ప్రజా ప్రతినిధుల సభకు సభ్యులను ఎన్నుకొనేందుకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. సుమారు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఛాయిస్ ఏమిటో చెప్పేశారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలైన ఫ్యూథాయ్, మూవ్ ఫార్వర్డ్ పార్టీలు రెండూ అధికార పార్టీని మట్టి కరిపించాయి. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల శిబిరాలు విజయం సాధిస్తాయని ముందస్తు ప్రజాభిప్రాయ సేకరణల నుంచి ఊహిస్తున్నదే. కానీ, ఈ స్థాయి విజయం అనూహ్యం, అద్భుతమే. పట్టణప్రాంతాల్లో పట్టున్న, ప్రగతిశీల ‘మూవ్ ఫార్వర్డ్’ 151 స్థానాలతో అగ్రపీఠిన నిలుస్తుందని అంచనా. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పదవీచ్యుత ప్రధానమంత్రి తక్షిణ్ శినవాత్ర తరఫున జనాకర్షక రాజకీయ పక్షమైన ‘ఫ్యూథాయ్’కి 141 స్థానాలు రావచ్చని లెక్క. అయితే, అధికార శక్తులు ఈ ఫలితాలను అంగీకరించి, ఈ సంస్కరణవాద పార్టీలు ప్రభుత్వం ఏర్పరిచేలా గద్దెను అప్పగిస్తాయా అన్నదే ప్రశ్న. గత∙రెండు దశాబ్దాల్లో స్వేచ్ఛగా ఎన్నికలైన ప్రతిసారీ తక్షిణ్ నేతృత్వంలోని పార్టీలు గెలుస్తూ వచ్చాయి. సైన్యం మాత్రం కోర్టు జోక్యంతోనో, తిరుగుబాట్లతోనో వారిని పదే పదే అధికారానికి దూరం పెడుతూ వచ్చింది. నిండా 36 ఏళ్ళ తక్షిణ్ కుమార్తె ఇంగ్లక్ ఇప్పుడు ‘ఫ్యూథాయ్’ పార్టీని నడుపుతున్నారు. అయితే, వారసత్వ రాజకీయాలతో విసిగిన లక్షలాది తొలి యువ ఓటర్లు ‘మూవ్ ఫార్వర్డ్’ వైపు మొగ్గడంతో, ఆ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతున్నాయి. విదేశాల్లో చదివి, వ్యాపార నిమిత్తం తిరిగొచ్చి, సైనికపాలన, రాజరికానికి వ్యతిరేకంగా సాగిన ప్రజాస్వామ్య పోరులో పాల్గొన్న 42 ఏళ్ళ పిటా లిమ్జాయోన్రత్కు ఎన్నికల్లో జనం జై కొట్టారు. ఈ నేతలిద్దరూ సైన్యానికి ఎదురొడ్డిన ధనిక వ్యాపార కుటుంబాల వారే కావడం గమనార్హం. ఇక, చిన్నాచితకా ప్రతిపక్షాలు సైతం ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం విశేషమే. ఈ ప్రజాస్వామ్య అనుకూల పార్టీలన్నీ కలసి సంకీర్ణ సర్కార్గా పనిచేసేందుకు సుముఖంగా ఉన్నాయట. అలా అన్నీ ఒక తాటిపైకొస్తే సైనిక పాలన, రాచరికపు అపరిమిత అధికారాలకు చరమగీతం పాడాలన్న జనం కోరిక నెరవేరుతుంది. కానీ, పార్టీలు అనుకున్నంత మాత్రాన జరగాలని లేదు. 2019 ఎన్నికల్లో నేటి ‘మూవ్ ఫార్వర్డ్’ పార్టీ ముందస్తు రూపం ‘ఫ్యూచర్ ఫార్వర్డ్’ మూడోస్థానంలో నిలిచింది. తీరా పార్టీ సారథిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించారు. పార్టీ రద్దయింది. ఇప్పుడు ప్రధాని కావాలని ఆశిస్తున్న ‘మూవ్ ఫార్వర్డ్’ నేత పిటాకు సైతం ఎన్నికైన ఎంపీల మద్దతుతో పాటు సైన్యం నియమించిన సెనేటర్ల మద్దతు అవసరం. ఎన్నికల్లో గెలిచినా సరే ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు అవసరం కావడమే థాయ్ లోని విచిత్రం. ఇదంతా ఎన్నికల్లో గెలిచిన పార్టీల అధికారాన్ని సైతం తటస్థీకరించేలా, సెనేట్ను నియమిస్తూ 2017లో రాజ్యాంగాన్ని సైన్యం తిరగరాసిన ఫలితం. 2014లో జనరల్ ప్రయూత్ చాన్ – ఓచా అప్పటి పౌరప్రభుత్వాన్ని పడదోసి, సైన్యం, రాయలిస్ట్ పార్టీలు, రాచరికపు అండతో తనను తాను ప్రధానిగా నియమించుకున్నారు. న్యాయవ్యవస్థ సహా అన్నిటినీ విధేయులతో నింపేశారు. ఇటు నిరుపేద థాయ్లను ఆకర్షించే ఫ్యూథాయ్ పార్టీ అన్నా... అటు నిర్బంధ సైనిక శిక్షణ, రాజు – రాణులను పల్లెత్తు మాటన్నా 15 ఏళ్ళ దాకా జైల్లోకి నెట్టే కఠినమైన ‘లెస్–మాజెస్టీ’ చట్టాలకు చరమగీతం పాడతానంటున్న మూవ్ ఫార్వడ్ పార్టీ అన్నా... సహజంగానే సైన్యానికి గిట్టదు. కానీ, రాచరిక అనుకూల చట్టాలను మారుస్తానంటున్న పార్టీకి నవతరం థాయ్ ప్రజలు జేజేలు పలకడం ఈ ఆగ్నేయాసియా దేశంలో ప్రజాస్వామ్య మార్పు పవనాలకు సూచన. ఇది గ్రహించి సంప్రదాయ శక్తులు పట్టు సడలిస్తాయా? జనం ఎన్నుకున్న 500 సభ్యుల ప్రతినిధుల సభతో పాటు పాలక సైనిక వర్గమే నియమించిన 250 మంది సభ్యుల సెనేట్కూ ప్రధాని ఎంపికలో ఓటు ఉండడమే విషాదం. అంటే ఎన్నికల్లో పెల్లుబికిన ప్రజాస్వామ్య వెల్లువను సైతం సైన్యం పరోక్షంగా తొక్కేసే ముప్పుంది. ఇన్నేళ్ళుగా దేశాన్ని తమ కబంధ హస్తాల్లో ఉంచుకున్న సైనిక జనరల్స్ తాజా ప్రజా తీర్పును గౌరవించాలి. అధికారాన్ని గెలిచిన పార్టీలకు అప్పగించి, సైనిక విధులకు పరిమితం కావాలి. ఆ పని చేయక, ప్రజాకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అది థాయిలాండ్కే మంచిది కాదు. పొరుగునే మయన్మార్లో 2020 నవంబర్ ఎన్నికల్లో ఆంగ్సాన్ సూక్యీ అఖండ విజయం సాధించినా, మూడునెలల్లో సైన్యం అధికారం హస్తగతం చేసుకొని, ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసింది. ఇప్పుడు అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఆ దేశంలా థాయ్లాండ్ తయారు కాకుండా ప్రపంచ దేశాలూ జాగరూకత వహించాలి. అప్పుడే థాయ్ ప్రజలు గెలిచినట్టు, అక్కడ ప్రజాస్వామ్యం నిలిచినట్టు! -
Karnataka election results 2023: హస్తానికి బూస్టర్ డోసు
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. ఇక నాలుగు రాష్ట్రాలపై గురి లోక్సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్తాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. -
టీడీపీలో నైరాశ్యం 'బాబు మౌన రాగం'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో అభ్యర్థులనే ఎంపిక చేసుకోలేని దయనీయ స్థితిలో ఉన్న చంద్రబాబు.. ‘అసలు సినిమా ముందుంది’ అంటూ డాంబికాలు పలకడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును చూసి.. ఇది ట్రైలర్ మాత్రమేనని చెబుతున్న చంద్రబాబు, సార్వత్రిక ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉందా.. అన్న వైఎస్సార్సీపీ సవాల్పై మాత్రం ఇప్పటిదాకా స్పందించనే లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేక.. ఏం చేస్తారో కూడా చెప్పలేక సతమతమవుతున్న 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వృద్ధ జంబూకం.. పార్టీ శ్రేణులు పూర్తిగా కకావికలం కాకూడదని సరికొత్త డ్రామాకు తెర తీసింది. అందరం కలిసి సీఎం జగన్ను ఓడిద్దాం.. రండంటూ పొత్తులపై ప్రాణాలు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. నిజంగా అసలు సినిమా ముందున్నది చంద్రబాబుకే. ఎందుకంటే.. ఒక్కో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 34 నుంచి 38 శాసనసభ స్థానాలు ఉంటాయి. వాటి పరిధిలో సుమారు 80 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఇందులో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల ద్వారా 87 శాతం కుటుంబాలకు చెందిన ఓటర్లకు ప్రయోజనం చేకూరింది. సంవత్సర ఆదాయం పట్టణాల్లో రూ.12 వేలు.. గ్రామాల్లో రూ.10 వేలలోపు ఉంటే ఆ కుటుంబాలను దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నట్లుగా గుర్తిస్తారు. ఆ కుటుంబాలకే సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్లు సుమారు 2.50 లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉంటారు. ఇందులో 80 శాతం ఓటర్లు సంక్షేమ పథకాల పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. అలాంటి ఓటర్ల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో.. అదీ వామపక్షాలు, పీడీఎఫ్, యూనియన్లతో ఒప్పందం చేసుకుని గట్టెక్కడం అన్నది బలం కానే కాదని, వాపు అని అందరికంటే చంద్రబాబుకే బాగా తెలుసు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కాని మహిళలు, మిగతా వారంతా రేపటి సార్విత్రిక ఎన్నికల్లో తమకు మేలు చేస్తున్న ప్రభుత్వం కోసం ఏకమైతే టీడీపీ స్థానం ఎక్కడుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిజంగా 50కి పైగా నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులే లేరు. మొత్తం 175 స్థానాల్లో టీడీపీకి రెండో స్థానం కూడా సందేహమేనని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ఈ విషయంపై ప్రజల్లో ఎక్కువ చర్చ జరిగితే టీడీపీ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని పక్కదోవ పట్టిస్తూ సరికొత్త రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇందుకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. రూ.2 లక్షల కోట్లతో ఇంటింటికీ లబ్ధి ► రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలను దక్కించుకుని వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంక్షేమ పథకాలు.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. ► అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కూడా పూర్తవ్వక ముందే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో ఏకంగా రూ.రెండు లక్షల కోట్లు జమ చేశారు. దేశ చరిత్రలో ఇదో రికార్డుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాలు, 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లి సుపరిపాలన అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. ఇది ప్రజల్లో వైఎస్సార్సీపీకి నానాటికీ ఆదరణ పెరగడానికి దోహదం చేస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ► అందువల్లే 2019 ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, నగర పాలక ఎన్నికలు.. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రికార్డు విజయాలతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తే.. వరుస ఓటములతో టీడీపీ శ్రేణులు జవసత్వాల కోల్పోయాయి. వైఎస్సార్సీపీ ప్రయోగాత్మకంగా పోటీ ► పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా వామపక్షాలు, పీడీఎఫ్, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు పోటీ చేసేవి. వాటికి ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చేవి. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచే వామపక్షాలు, పీడీఎఫ్, బీజేపీ, యూనియన్లు క్రియాశీలకంగా పని చేస్తాయి. కొన్ని దశాబ్దాలుగా తమ ప్రభావం ఉన్న వర్గాలనే ఎంచుకుని ఓటర్లుగా చేర్పిస్తున్నాయి. ► అయితే ఇటీవల జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వైఎస్సార్సీపీ పోటీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయపతాక ఎగురవేసింది. మూడు పట్టభద్రుల స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో ఎక్కడా గెలవలేదు. కేవలం పీడీఎఫ్, సీపీఐ తదితర పక్షాలతో ఓట్ల బదిలీ ఒప్పందం కుదిరిన మేరకు.. ఆ వర్గాలు వేసిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కింది. ► పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను అన్ని వర్గాల ప్రజల అభిప్రాయంగా భావించడానికి ఏమాత్రం వీల్లేదని, ఒకవేళ అలా భావిస్తే తనను తాను మోసం చేసుకోవడమేనన్నది చంద్రబాబుకు కూడా తెలుసని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపడానికే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ట్రైలర్ మాత్రమేనంటూ చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. ► బాబుకు ఎల్లో మీడియా వంత పాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సోమవారం సీఎం జగన్.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారంటూ వక్రభాష్యం చెబుతోంది. కొద్ది నెలలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోందనే నిజాన్ని దాస్తోంది. -
టికెట్టా.. వద్దే వద్దు! ఇంటర్నల్ సర్వేలతో బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు
రాష్ట్రంలో ఎన్నికలకు మరో 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితిలో ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సన్నద్ధమవుతూ బిజిబిజీగా ఉండాలి. టీడీపీలో ఎక్కడా ఆ వాతావరణం కన్పించడం లేదు. చాలా నియోజకవర్గాల్లో నేతలు పోటీకి విముఖత చూపుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి కూడా టీడీపీకి అధికారం దక్కదని ఆయా ప్రాంతాల్లో వారు చేయించిన సర్వేల్లో స్పష్టం కావడమే ఇందుకు కారణం. రాయలసీమలో పార్టీ కంటే వర్గాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. గెలిచినా, ఓడిపోయినా తమ వర్గాన్ని కాపాడుకునేందుకు ఏదో ఒక పార్టీ నుంచి బరిలో నిలవాలనుకుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదంటే టీడీపీ పరిస్థితి ఎంత తీసికట్టుగా మారిందో స్పష్టమవుతోంది. అందుకే చాలా మంది నేతలు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఏదారీ లేని వారు.. అంటే ఎక్కడా గెలవలేమనుకునే వారు మాత్రమే.. అన్ని ఖర్చులు పార్టీ భరిస్తేనే పోటీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబుకు అల్టిమేటం జారీచేస్తున్నారు. సాక్షి, ఏపీ నెట్వర్క్: గ్రేటర్ రాయలసీమలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కోడుమూరు, నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో 2019లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పీఆర్ అండ్ ఆర్డీ మాజీ కమిషనర్ రామాంజనేయులు, జయరాజ్ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పత్తా లేరు. అక్కడి నుంచి ఈసారి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా టీడీపీకి దొరకలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బొల్లినేని రామారావు 2019లో ఓడిపోయారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ‘ఎటూ గెలవలేం.. పైగా టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదు.. ఇలాంటప్పుడు ఎంత ఖర్చు చేసినా ఏం లాభం?’ అని పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి, ఎన్ఆర్ఐ కాకర్ల సురేశ్లను బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. కందుకూరులో 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పోతుల రామారావు పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావును ఇన్చార్జ్గా నియమించారు. పోతుల రామారావు కూడా రియల్టరే. మధ్యలో నాగేశ్వరరావు హ్యాండిస్తే మరో రియల్టర్ రాజేశ్కు టికెట్ ఇవ్వాలని ఆప్షన్గా పెట్టుకున్నారు. మచ్చుకు ఈ మూడు ఉదాహరణలు పరిశీలిస్తే ‘గ్రేటర్ రాయలసీమ’లో టీడీపీ పరిస్థితి ఏంటో, ఆ పార్టీ నేతల మనుసులో ఎలాంటి భావన ఉందో స్పష్టమవుతోంది. ప్రత్యామ్నాయం వైపు పార్టీ శ్రేణులు గ్రేటర్ రాయలసీమలో 74 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 67 మంది వైఎస్సార్సీపీ, ఏడుగురు మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఏడుగురిలో నలుగురు ప్రకాశం జిల్లాలో, మిగిలిన ఐదు ఉమ్మడి జిల్లాల్లో ముగ్గురు (కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్) గెలిచారు. ప్రకాశం జిల్లాలోని నలుగురిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆ పార్టీని వీడారు. ఎన్నికల తర్వాత సింహభాగం నియోజకవర్గాల్లో ఇప్పటికీ టీడీపీ నేతలు ప్రజలకు కన్పించడం లేదు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో అత్యధికులు ప్రత్యామ్నాయాలు చూసుకున్నారు. ఎక్కువ మంది సీఎం వైఎస్ జగన్ పథకాలు నచ్చి వైఎస్సార్సీపీలో చేరారు. మేమేం చేసేది..? ‘రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు?’ అని ఓ మాజీ ఎమ్మెల్యేను ఆయన ముఖ్య అనుచరుడు ప్రశ్నిస్తే.. ‘ఇటీవల రోజుకు 10 మంది చొప్పున పది రోజులపాటు 100 మందితో ఫోన్లో, ప్రత్యక్షంగా మాట్లాడాను. వారిలో 94 మంది జగన్ ప్రభుత్వం వల్ల తమకు మేలు జరిగిందని చెప్పారు. ఇంత కచ్చితంగా వారు ఆ మాట చెప్పినప్పుడు వారంతా నా వెంటే నడుస్తారన్న గ్యారంటీ ఏముంది? ఏం చూసుకుని ఎన్నికల్లో పోటీ చేయాలి? పరిస్థితి ఇలా ఉంటే మేమేం చేసేది?’ అని ఎదురు ప్రశ్న వేశారట. ప్రజల నాడి ఇలా ఉన్నందుకే టీడీపీ నేతలు పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారు. ఇన్చార్జ్ల కోసం వెంపర్లాట ► నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు పోటీ అంటేనే జంకుతున్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కృష్ణయ్య వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు. కావలిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. సర్వేపల్లిలో మూడు పర్యాయాలు ఓడిపోయిన సోమిరెడ్డి మళ్లీ ఓటమి తప్పదని.. నెల్లూరు రూరల్ ఆశిస్తున్నారు. ► తిరుపతి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఖర్చులు పార్టీ భరించాలని కండీషన్ పెట్టింది. చంద్రగిరిలో ఇందు శేఖర్ను కాదని పులివర్తి నానికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే చంద్రగిరిలో చెవిరెడ్డిని ఎదుర్కోవడం అంత సులువు కాదని నాని చిత్తూరు టికెట్ ఆశిస్తున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి ఖర్చు భరించలేనంటున్నారు. ► పుంగూరులో పోటీ చేసేందుకు అభ్యర్థే లేరు. ఖర్చు పార్టీ చూసుకుంటే పోటీ చేస్తానని చల్లా రామచంద్రారెడ్డి తేల్చి చెప్పాడు. పూతలపట్టులో అభ్యర్థే దొరకని పరిస్థితి. ఖర్చు పార్టీ భరించాలని వెంకటగిరిలో కురగొండల రామకృష్ణ తేల్చి చెప్పారు. నగరిలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్ కూడా ఇదే విషయం చెప్పాడు. దీంతో సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్ అశోక్రాజ్కు టికెట్ ఇవ్వాలన్న యోచనలో టీడీపీ ఉంది. ► ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో ఎన్నికల ఖర్చులు పూర్తిగా భరిస్తేనే పోటీ చేస్తానని ఇన్చార్జ్ ఈరన్న చెబుతున్నారు. పెనుకొండలో పార్థసారథి, రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు, గుంతకల్లులో జితేంద్రగౌడ్తో పాటు చాలా చోట్ల నాయకుల మాట ఇదే! దీంతో బీజేపీ నేత సూరికి ధర్మవరం టికెట్ ఇస్తే.. మరో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు భరించాలని చెప్పినట్లు సమాచారం. పార్టీ గెలిచే అవకాశాలు లేనందున ఇంత ఖర్చు చేయాలా? వద్దా? అనే ఆలోచనలో సూరి ఉన్నారు. ► ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి ఎప్పుడూ గడ్డుకాలమే. ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, కడప, జమ్మలమడుగుతో పాటు చాలా నియోజకవర్గాల్లోని అభ్యర్థులు అన్ని ఖర్చులు పార్టీ భరిస్తేనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఆర్థికంగా లబ్ధి పొంది, తర్వాత బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేశ్ను తిరిగి రప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా ఈ పరిస్థితిలో చాలా నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ఇన్చార్జ్లను నియమించేందుకు బాబు తల పట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా వార్ వన్సైడే! ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో గత 20 ఏళ్లలో టీడీపీ నేతలు అత్యధికంగా గెలిచిన అసెంబ్లీ సీట్లు కేవలం నాలుగే. 2004లో 3, 2009లో 4, 2014లో 3, 2019లో సున్నా. ఈ గణాంకాలు చూస్తే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో పోటీ చేసేందుకు అభ్యర్థులు జంకుతున్నారు. కర్నూలు అసెంబ్లీ ఇన్చార్జ్గా టీజీ భరత్ ఉన్నారు. ఇతని తండ్రి టీజీ వెంకటేశ్ బీజేపీ నేత. ఒకే ఇంట్లో ఉంటూ, రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న వీరు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. దీంతో భరత్కు టికెట్ ఇచ్చినా ఓడిపోతారని తెలిసి, మైనార్టీ కోటాలో అహ్మదుల్లాఖాన్కు టికెట్ ఇవ్వాలని భావించారు. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఖాన్, ఆ తర్వాత సర్వేలు చేయించుకుని టీడీపీ తరఫున బరిలో నిలిస్తే ఓటమి తప్పదని తేలడంతో పార్టీలో చేరకుండా మొహం చాటేశారు. డోన్ అభ్యర్థిగా కేఈ కుటుంబాన్ని కాదని ధర్మవరం సుబ్బారెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. అయితే కేఈ ప్రభాకర్ మాత్రం డోన్లో తమ కుటుంబం పోటీలో ఉంటుందని, అన్ని రకాలుగా తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మరవొద్దని నేరుగా చంద్రబాబును ఉద్దేశించి స్పష్టం చేశారు. అంటే తమకు టికెట్ ఇవ్వకపోతే మరో పార్టీలోనో, స్వతంత్ర అభ్యర్థిగానో బరిలోకి దిగి.. టీడీపీని ఓడిస్తామనే భావన స్పష్టమవుతోంది. ఆదోనిలో మీనాక్షి నాయుడు పోటీకి అయిష్టంగా ఉన్నారు. దీంతో బీసీ వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ, రియల్టర్ కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ కేసులు, ఇతర వ్యవహారాల్లో తరచూ వివాదాల్లో ఉన్నారు. అక్కడ ఆమె ఏ లెక్కనా గెలిచే పరిస్థితే లేనందున, భూమా కిషోర్రెడ్డికి టికెట్ ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. నంద్యాలలో అఖిలకు, ఆమె సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. చివరకు గత నెల భూమా జయంతిని కూడా వేర్వేరుగా జరిపారు. మూడేళ్లు.. ముగ్గురు ఇన్చార్జ్లు ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ ఇన్చార్జిగా 2019 ఎన్నికల వరకు శిద్ధా రాఘవరావు ఉన్నారు. ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల సమయంలో దర్శి ఇన్చార్జిగా వచ్చిన కదిరి బాబూరావు.. 2019లో పోటీ చేసి ఓడిపోయాక వైఎస్సార్సీపీలో చేరారు. ఆ తర్వాత ఇన్చార్జిగా వచ్చిన పమిడి రమేశ్బాబు కూడా గతేడాది జూలైలో ‘సైకిల్’ దిగేశాడు. దీంతో ఇక్కడ ఎవరిని ఇన్చార్జ్గా నియమించాలో తెలియని పరిస్థితి. కనిగిరి టీడీపీ ఇన్చార్జ్ ఉగ్రనరసింహారెడ్డిని అక్కడి నేతలు పోకానాయుడు, హుస్సేర్యాదవ్, గంగరాజు, మాల్యాద్రి వ్యతిరేకిస్తున్నారు. మార్కాపురంలో టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి ఉన్నారు. ఇక్కడ కీలక నేతలుగా ఉన్న డీవీ కృష్ణారెడ్డి, షేక్షావలి, మక్బుల్బాషా, బీఎల్పీ యాదవ్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పొదిలికి చెందిన శ్రావణి వెంకటేశ్వర్లు, జి.భాస్కర్ పార్టీకి దూరంగా ఉన్నారు. -
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పోటీయే లేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అసలు పోటీయే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని మాత్రమే ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. గత ఎన్నికల్లో ఈ అవకాశాన్ని ఏ పార్టీకి వారు ఇవ్వలేదని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు వచ్చిందని అమిత్షా పేర్కొన్నారు. అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలంతా ప్రధాని మోదీకే మరోసారి పట్టం గడతారని దీమా వ్యక్తం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర, నాగలాండ్, మేఘాలయలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారం చేయకపోవడంపై అమిత్ షా సెటైర్లు వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఏంటో తేలిపోతుందన్నారు. ఒకప్పుడు ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉండేదని గుర్తు చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: పుల్వామా అమర వీరులకు ప్రధాని మోదీ నివాళులు.. -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
బీజేపీ అడ్డాలో పోటీకి నితీశ్ సై.. అఖిలేశ్ యాదవ్ మద్దతు!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్. అయితే ఆ పార్టీ వర్గాల్లో మాత్రం ఓ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో నితీశ్ కుమార్ స్వయంగా ఉత్తర్ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఫూల్పుర్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రతిపక్షనేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.. నితీశ్ కుమార్కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూపీలో ఎక్కడి నుంచి పోటీ చేసినా నితీశ్కు సమాజ్వాదీ పార్టీ మద్దతునిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. నితీశ్ ఫూల్పుర్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగాలని జేడీయూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ కూడా ఈ విషయంపై ఇప్పటికే హింట్ ఇచ్చారు. నితీశ్ కుమార్ 2024 లోకసభ ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ చేయవచ్చన్నారు. ఫూల్పుర్తో పాటు అంబేడ్కర్ నగర్, మిర్జాపూర్ లోక్సభ స్థానాల నుంచి కూడా ఆయనకు ఆఫర్ ఉన్నట్లు చెప్పారు. అయితే నితీశ్ పోటీ చేసే విషయంపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. 80 స్థానాలు.. ఉత్తర్ప్రదేశ్లో మొత్తం 80 ఎంపీ స్థానాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రాష్ట్రమే ఎంతో కీలకం. యూపీలో ప్రస్తుతం బీజేపీకి 65 మంది ఎంపీలున్నారు. అందుకే ఇక్కడ ఆ పార్టీని దెబ్బతీసేందుకు నితీశ్ వ్యూహా రచన చేస్తున్నట్లు సమాచారం. అఖిలేశ్ యాదవ్తో పాటు ఇతర ప్రతిపక్షాలను కలుపుకుని ఇక్కడి నుంచి పోటీ చేస్తే బీజేపీకి 15-20 స్థానాలకే పరిమితం చేయవచ్చని లలన్ సింగ్ చెబుతున్నారు. అలబాహాద్లోని ఫూల్పుర్ నియోజకవర్గం ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. మోదీని ఓడించాలని కృతనిశ్చయంతో ఉన్న నితీశ్.. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో ఎక్కువ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మోదీని సవాల్ చేయడం అంత సులభం కాదని అంటున్నారు. చదవండి: బీజేపీ హర్ట్ అయింది -
80 లక్షల ఓట్లు.. 78 స్థానాల్లో గెలుపు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.. రికార్డులు సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో 41 లక్షల మంది పార్టీ సభ్యులుగా చేరారు. 42 వేల మంది క్రియాశీల సభ్యులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాకు 80 లక్షల ఓట్లు వస్తాయి. 78 స్థానాల్లో విజయం సాధిస్తాం.టీఆర్ఎస్ను ఓడించే సత్తా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..’అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బుడగలాంటిదని, ఆ పార్టీకి డబుల్ డిజిట్ రాదని, సింగిల్ డిజిట్కే పరిమితమని చెప్పారు, తెలంగాణ సమాజం బీజేపీని ఎప్పటికీ అంగీకరించదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఖరారు కోసం ప్రియాంకాగాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రానికి వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్ర ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు, ప్రియాంకా గాంధీ రంగ ప్రవేశం, రాష్ట్ర కాంగ్రెస్లో తన పాత్ర గురించి విపులంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. బీజేపీకి భవిష్యత్తు లేదు బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు క్యూ కడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. బీజేపీలోకి వెళుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీలో నిరర్ధక ఆస్తుల్లాంటి వారు. వారు వెళ్లినంత మాత్రాన నష్టమేమీ లేదు. బీజేపీ అంటేనే అల్లర్లు సృష్టించడం... బీజేపీ అంటేనే అస్థిరత అనే భావనలో తెలంగాణ ప్రజలున్నారు. ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తే లేదు. మేమొస్తే కొంగొత్త తెలంగాణ.. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారు. బంగారు తెలంగాణలో బంగారం కేసీఆర్ కుటుంబానికి వెళితే తెలంగాణ మాత్రమే ప్రజలకు మిగిలింది. రాష్ట్రంలో మేం అధికారంలోకి వస్తే కొంగొత్త తెలంగాణను ఏర్పాటు చేస్తాం. యువకులు, రైతులు, మహిళలకు అవసరమైన సురక్షిత ప్రగతిశీల తెలంగాణ కోసం కృషి చేస్తాం. మునుగోడులో విజయం మాదే.. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ప్రజల కోసం బీజేపీలోకి వెళ్లలేదు. కాంట్రాక్టుల కోసం వెళ్లారు. అక్కడ పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యనే జరుగుతుంది. టీఆర్ఎస్తో పాటు రాజగోపాల్రెడ్డిపై కూడా అక్కడ వ్యతిరేకత ఉంది. కుటుంబంలో కలహాలు కామన్ కాంగ్రెస్ పార్టీ అంటే ఓ కుటుంబం లాంటిది. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు, కలహాలు సర్వసాధారణం. అయినా ఎవరో ఒకరిద్దరు మాట్లాడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదు. అలా మాట్లాడిన వారు కూడా మా కుటుంబ సభ్యులే. అందులో వాస్తవం లేదు.. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని అధిష్టానం సులువుగా నిర్ణయించలేదు. అన్ని విధాలా సంప్రదింపులు, చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంది. నేను ఆయనకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానని అనడంలో వాస్తవం లేదు. కొందరికి కొన్ని లక్ష్యాలుంటాయి. వారు వారి లక్ష్యాల కోసం అనేకం మాట్లాడుతుంటారు. వాటితో నాకు సంబంధం లేదు. ధోని కెప్టెన్గా ఉన్న భారత క్రికెట్ టీంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ కూడా సభ్యులుగా కొనసాగిన విషయాన్ని అందరూ గ్రహించాలి. మోదీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని అప్పుడే పార్టీ నుంచి పంపించేద్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. వెంకట్రెడ్డితో నాకు ఎలాంటి విభేదాల్లేవు. హైదరాబాద్లోని ఆయన ఇంట్లో ఇద్దరం కలిసి బిర్యానీ కూడా తిన్నాం. అద్దంకి దయాకర్నే కాదు, పార్టీ నుంచి ఎవరినీ సస్పెండ్ చేసే ఆలోచన లేదు. అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్కు మధ్య వారధిని.. పార్టీ అధిష్టానానికి, రాష్ట్రంలోని సీనియర్లకు మధ్య నేను అడ్డుగోడగా నిలబడ్డానన్న దాంట్లోనూ వాస్తవం లేదు. నేను అధిష్టానానికి, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు మధ్య వారధిని. నేను హోమియో డాక్టర్ను కాను. సర్జరీ చేయడానికి వచ్చిన సర్జన్ను. నేను స్టార్ హోటల్లో ఉండే ఇన్చార్జిని కాను. సెకండ్ క్లాస్లో ప్రయాణించి 24 గంటలు కార్యకర్తలకు అందుబాటులో ఉండే సోనియాగాంధీ ప్రతినిధిని. నేను తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలో, తెలంగాణ ఇన్చార్జిగా ఉండాలో సోనియాగాంధీ నిర్ణయిస్తారు. ఆమె ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తా. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే.. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలంగాణను చాలా కీలకంగా భావిస్తోంది. అందుకే రాహుల్ ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టారు. వచ్చే నెలలో 14 రోజుల పాటు దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. తాజాగా ప్రియాంకాగాంధీ కూడా రంగంలోకి వచ్చారు. ఆమె కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: ఎంపీ కేశినేని నాని
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో తాను పార్టీ తరఫున పోటీచేయబోనని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు స్పష్టంచేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం చంద్రబాబును కలిసినప్పుడు తన బదులు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మరొకరిని చూసుకోవాలని ఆయన చెప్పినట్లు సమాచారం. తన కుమార్తె కూడా పోటీచేయబోదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటికే తన కుమార్తె టాటా ట్రస్ట్కు వెళ్లిపోయిందని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేయకపోయినా పార్టీలోనే కొనసాగుతానని నాని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో మాత్రం చురుగ్గానే ఉంటానని ఆయన చంద్రబాబుకి వివరించినట్లు తెలిసింది. కానీ, ఈ విషయాన్ని కేశినేని నాని ధృవీకరించలేదు. ఆయన అనుచరులు మాత్రం పోటీచేయననే విషయాన్ని నాని చంద్రబాబుకు చెప్పినట్లు చెబుతున్నారు. చంద్రబాబు అవమానాలవల్లే.. కొద్దికాలంగా నాని పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు విజయవాడలో పర్యటించినా తనకు సంబంధంలేనట్లు వ్యవహరించారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో చంద్రబాబు తనను అవమానించినట్లు నాని భావిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, మరో నేత నాగుల్ మీరా గత కార్పొరేషన్ ఎన్నికల్లో తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా చంద్రబాబు వాళ్లనే సమర్థించడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. తన కుమార్తె మేయర్ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో అప్పట్లో వెనక్కి తగ్గినా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని కొందరు నాయకులనే చంద్రబాబు నమ్మి తనను అవమానించినట్లు భావిస్తున్నారు. పార్టీ నియామకాల్లోను తనను పట్టించుకోకుండా చిన్నాచితకా నాయకుల మాటలే వింటున్నారని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పాలని కేశినేని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు తెలిసింది. -
2024కు రెడీ అవుతున్న బీజేపీ
న్యూఢిల్లీ: మూడేళ్లలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటినుంచే సన్నాహాలు ఆరంభించింది. ఇందులో భాగంగా కేబినెట్ మంత్రులతో దాదాపు 19 రాష్ట్రాల్లో ఎక్కడికక్కడా యాత్రలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. కేబినెట్లోని 43 మంత్రులు ఆగస్టు 16 నుంచి ఆరంభించాలని భావిస్తున్నారని మీడియా వర్గాల సమాచారం. మంత్రులు తమ తమ నియోజకవర్గాలకు సుమారు 300– 400 కిలోమీటర్ల దూరం నుంచి ఆరంభించి 3,4 లోక్సభ నియోజకవర్గాల గుండా తమ సొంత జిల్లాలకు యాత్ర చేపడతారు. మొత్తం 15000 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. తెలంగాణ, ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళ నాడు, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటకల్లో యాత్రలు సాగనున్నాయి. -
సింగపూర్లో అధికార పార్టీదే గెలుపు
సింగపూర్: సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఇదే పార్టీ 1965 నుంచి అధికారంలో కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 93 పార్లమెంటరీ సీట్లకు గాను 83 సీట్లు సాధించింది. 61.2 శాతం ఓట్లు కొల్లగొట్టింది. ప్రతిపక్ష వర్కర్క్ పార్టీ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. అయితే, 2015 నాటి ఎన్నికలతో పోలిస్తే పీపుల్స్ యాక్షన్ పార్టీ బలం తగ్గిపోవడం గమనార్హం. అప్పట్లో 70 శాతం ఓట్లతో 89 సీట్లు సాధంచిన ఆ పార్టీ ఇప్పుడు 83 సీట్లతో సరిపెట్టుకుంది. ఇది తమకు ఫీల్గుడ్ ఎన్నిక కాదని ప్రధాని లీ సీన్ లూంగ్ అన్నారు. -
బోరిస్ జాన్సన్ ఘన విజయం
బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బోరిస్ జాన్సన్ భారీ విజయాన్ని సాధించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ మొత్తం 650 స్థానాల్లో 340 స్థానాల్లో విజయాన్ని చేజిక్కించుకుంది. పోల్ సర్వే అంచనాలను తారుమారు చేస్తూ పార్టీ ఘన విజయాన్ని దక్కించుకుంది. జాన్సన్, కార్బిన్ మధ్య హోరాహోరీ పోటీలో చివరకు బోరిస్ ఈ విజయాన్నందుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష లేబర్పార్టీ 208 స్థానాలకు పరిమితమైందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడి కావాల్సి వుంది. 1987లో మార్గరెట్ థాచర్ సాధించిన విజయం తరువాత ఇదే అతిపెద్ద విజయమని అక్కడి రాజకీయ పండితులు భావిస్తున్నారు. అలాగే లేబర్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 1935 తరువాత అతి దారుణమైన పరాజయమన్నారు. దీంతో లేబర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ ప్రకటించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాను నాయకత్వం వహించనని పేర్కొన్నారు. అలాగే లిబరల్ డెమొక్రాట్ నేత జో స్విన్సన్ ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు అభినందనలు తెలిపారు. భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టనున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సత్సంబంధాలకోసం కలిసి పనిచేయాలని మోదీ ఆకాక్షించారు. మరోవైపు బోరిస్ ఘన విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా గురువారం నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. నాలుగేళ్ల వ్యవధిలో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికలు జరగడం ఇది మూడవసారి. ప్రతిపక్ష లేబర్ పార్టీ అభ్యర్థి జెరిమి కార్బిన్ Many congratulations to PM @BorisJohnson for his return with a thumping majority. I wish him the best and look forward to working together for closer India-UK ties. pic.twitter.com/D95Z7XXRml — Narendra Modi (@narendramodi) December 13, 2019 -
కెనడా పీఠంపై మళ్లీ ట్రూడో!
ఒటావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అతికష్టం మీద పదవిని నిలుపుకునే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ మొత్తం 338 ఎలక్టోరల్ డి్రస్టిక్ట్స్కుగానూ 157 డిస్ట్రిక్ట్స్లో విజయం సాధించగా, ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ 121 డి్రస్టిక్ట్స్లో గెలిచింది. దాంతో ఇతరుల మద్దతుతో లిబరల్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా, ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఇండియన్ కెనడియన్ అయిన జగీ్మత్ సింగ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఆయన నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పారీ్ట(ఎన్డీపీ) 24 సీట్లు గెలుచుకుని ‘కింగ్ మేకర్’గా అవతరించింది. అయితే, 2015 నాటి ఎన్నికల కన్నా ఈ సారి ఆ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య తగ్గింది. ఆ ఎన్నికల్లో ఎన్డీపీ 44 సీట్లు గెల్చుకుంది. బ్లాక్ క్యూబెకాయిస్ 32, గ్రీన్ పార్టీ 3 సీట్లు గెలుపొందాయి. బ్లాక్ క్యూబెకాయిస్, గ్రీన్ పార్టీ ట్రూడో ప్రభుత్వంలో చేరబోమని ఇప్పటికే సంకేతాలు ఇచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రూడోకు మరో 13 మంది సభ్యుల మద్దతు అవసరం. పార్లమెంట్లో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, కెనడియన్ల హక్కుల కోసం పోరాడుతామని ఈ ఎన్నికల ఫలితాల అనంతరం జగీ్మత్ సింగ్ వ్యాఖ్యానించారు. కెనడాలోని ఒక రాజకీయ పారీ్టకి నేతృత్వం వహిస్తున్న తొలి శ్వేతజాతీయేతర నేత 40 ఏళ్ల జగీ్మత్ సింగ్నే కావడం విశేషం. ఈ ఎన్నికల ప్రచారంలో ఎన్డీపీ తరఫున ప్రధాని అభ్యరి్థగా నిలిచిన జగీ్మత్ సింగ్ గతంలో క్రిమినల్ డిఫెన్స్ లాయర్గా పనిచేశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం ట్రూడో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. కెనడా ప్రజలు ప్రగతిశీల అజెండాకు ఓటేశారని ఫలితాల అనంతరం ట్రూడో వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్న ట్రూడో ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వ్యతిరేకతను చవిచూడాల్సి వచి్చంది. ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్తో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్యూబెక్, అల్బెర్టా తదితర ప్రావిన్స్ల్లో ఆయన నేతృత్వంలోని లిబరల్ పార్టీ భారీగా దెబ్బ తిన్నది. ట్రూడో ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని కన్సర్వేటివ్ పార్టీ నేత షీర్ వ్యాఖ్యానించారు. మరోసారి ఎన్నికలు వస్తే తమదే విజయమన్నారు. 2.74 కోట్ల ఓటర్లును కెనడాలో ఈ ఎన్నికల్లో 65% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 97 మంది మహిళలు గెలిచారు. మోదీ శుభాకాంక్షలు: కెనడా ఎన్నికల్లో విజయం సాధించిన జస్టిన్ ట్రూడోకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య, బహుళత్వ విలువల విషయంలో భారత్, కెనడాలు ఒకటేనన్న మోదీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ట్రూడోతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మంగళవారం ట్వీట్ చేశారు. -
మొట్టమొదటి ఎన్నికల్లోనూ ‘కుట్ర’
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ఎన్నికలంటే పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలే కాదు. కుట్రలు కుతంత్రాలు కూడా ఉంటాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951, అక్టోబర్ 25 నుంచి 1952, ఫిబ్రవరి 21 వరకు జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలకు కూడా ఈ కుట్రలు, కుతంత్రాలు తప్పలేదు. నాడు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు, ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంటే శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రచారం చేసేందుకు నాటి మహారాష్ట్రలోని ‘సౌరాష్ట్ర’ రాజులు, వారి గిరాసిదార్లు కుట్రలు పన్నారు. గిరాసిదార్లుగా నాడు రాజుల తముళ్లే ఉండేవారు. భారత రాబిన్ హుడ్గా, సిసిలీ బందిపోటు సాల్వతోర్ గిలియాగా పేరుపొందిన భూపత్ సింగ్ అలియాస్ భూపత్ మక్వానా (మక్వానా అంటే రాజ్పుత్లలో ఓ తెగ) అనే బందిపోటుతో సౌరాష్ట్ర రాజులు చేతులు కలిపారు. అతనికి అవసరమైన తుపాకులను, మందుగుండు సామాగ్రిని సరఫరా చేశారు. అండగా చిల్లర దొంగలను కూడా అతనికి సాయంగా అప్పగించారు. సౌరాష్ట్ర ప్రాంతంలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలతో బీభత్సం సృష్టించాల్సిందిగా కోరారు. అప్పటి వరకు భూస్వాములను, ధనవంతులను, ముఖ్యంగా దుకాణాదారులను దోచుకోవడం, కిడ్నాప్లకు పాల్పడడం, దొరికిన సొమ్ము, సరకులో కొంత భాగాన్ని ముఠా కోసం ఉంచుకొని మిగతా కొంత భాగాన్ని పేదలకు, బడుగు వర్గాలకు పంచడానికి పరిమితమైన భూపత్ సింగ్, ఆ తర్వాత హత్యలు చేయడం కూడా మొదలుపెట్టాడు. ఆయన కాకుండా ఆయన ముఠాలో చిల్లర దొంగల పేరిట చేరిన రాజ సైనికులే ఎక్కువగా హత్యలు చేశారన్న ప్రచారం ఉంది. భూపతి సింగ్ ముఠా అప్పట్లో దాదాపు 70 హత్యలు చేసిందట. మహిళలను గౌరవంగా చూసేవాడన్న మంచి పేరు కూడా భూపత్కు ఉంది. తమ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చి ఈ దారుణాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న ప్రచారం నాటి రాజులు విస్తృతంగా చేయించారు. బందిపోటు భూపత్ వెనక రాజుల హస్తం ఉందన్న విశయం తెల్సి నాటి భారత ప్రభుత్వం బ్రిటీష్ కాలం నాటి ‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ కింద పలువురు రాజులను, గిరాసీదార్లను అరెస్ట్ చేసింది. సజీవంగా లేదా శవంగా భూపత్ సింగ్ను పట్టించినవారికి 50 వేల రూపాయల నగదు బహుమానాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నాడు ఎంత దుష్ప్రచారం చేసినా సౌరాష్ట్రలోని మొత్తం ఆరు పార్లమెంటరీ సీట్లను, 60 అసెంబ్లీ సీట్లకుగాను 55 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. (జునాగఢ్, కతియావర్లు కూడా నాడు సౌరాష్ట్రలోనే ఉండేవి. 1956లో వాటిని ‘బాంబే ప్రెసిడెన్సీ’లో విలీనం చేయగా, 1960లో సౌరాష్ట్ర గుజరాత్లో కలిసింది) 1952, మే నెలలో తొలి లోక్సభ ఏర్పడింది. రాజులు, బందిపోట్ల అరాచకాలను దృష్టిలో పెట్టుకొని తొలి లోక్సభ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్’ కాలపరిమితిని మరి కొంతకాలం పొడిగించింది. 1956లో గిరాసిదార్ల వ్యవస్థను రద్దు చేసింది. బందిపోటు భూపత్ ఛాయాచిత్రం భూపత్ సింగ్ ఏమయ్యాడు ? నాటి సౌరాష్ట్ర రాజధాని రాజ్కోట్కు పట్టపగలు దర్జాగా వచ్చిపోతూ విలాస జీవితం అనుభవిస్తున్న భూపత్ సింగ్. తనపై ప్రభుత్వం 50 వేల రూపాయల రివార్డును ప్రకటించగానే జనంలో నుంచి అదృశ్యమయ్యరు. అతని ముఖ్య అనుచరుడు దెవాయత్ జాడను పాద ముద్రల నిపుణుల ద్వారా కనుగొన్న భారత సైనికులు దెవాయత్ను చంపారు. దాంతో భూపత్ సౌరాష్ట్ర విడిచి పారిపోయాడు. 1952, జూన్లో పాకిస్థాన్లోని కరాచి నగరంలో అతను ఆయుధాలతో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. అతన్ని అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం ఎంత పెద్ద దౌత్య యుద్ధం చేసినా పాక్ పాలకులు వినిపించుకోలేదు. పాక్ నిర్బంధం నుంచి విడుదలైన భూపత్ కరాచీలోనే మారు పేరుతో పాల వ్యాపారం చేసుకుంటూ సామాన్య జీవితం గడిపాడన్న ప్రచారమూ ఉంది. ఎప్పుడు, ఎక్కడ చనిపోయాడో భారత్కు తెలియరాలేదు. భూపత్పై తెలుగు సినిమా ఎన్టీరామారావు, అంజలీ దేవి నటించిన ‘డాకు భూపత్’ సినిమా 1960లో వచ్చింది. అందులో భూపత్ సింగ్ జీవితం తాలూకు కొన్ని ఛాయలు మాత్రమే కనిపిస్తాయి. (గమనిక: ‘ది న్యూ యార్కర్ (1952, మే)’ పత్రికలో సంతా రామారావు, ‘ది న్యూయార్క్ టైమ్స్కు రాబర్ట్ థంబుల్ రాసిన వ్యాసాలు, నాటి ‘ది గార్డియన్’ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా ఈ వార్తా కథనం) -
నేడు లేదా సోమవారం ఎన్నికల షెడ్యూల్
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు శనివారం లేదా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉందని, ఆ ఆర్డినెన్స్ శనివారం ఉదయం జారీ అయిన పక్షంలో అదే రోజు సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని, ఆర్డినెన్స్ జారీ కాని పక్షంలో సోమవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించ వచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బహుశా ఏప్రిల్ 15న రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ ఉంటుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ ఏర్పాట్లను పూర్తి చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను మార్చి 5వ తేదీనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే తెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీన పోలింగ్ జరగ్గా ఆంధ్రప్రదేశ్లో మే 7వ తేదీన పోలింగ్ జరిగింది. అయితే ఈ సారి తొలి దశలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వీలైనంత త్వరగా రావాలని అధికార యంత్రాంగమంతా ఎదురు చూస్తోంది. ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబు అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధమైన పనులను చేయించడమేనని పేర్కొంటున్నారు. -
బూత్ లెవల్ .. అంతా హడల్!
జిల్లాలో బీఎల్వోల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకపక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు .. మరో వైపు అధికారుల ఆదేశాలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వేధింపుల పర్వం ఎక్కువవుతోంది. సమావేశాలు.. విచారణల పేరుతో ఆర్థికంగానూ చితికిపోవాల్సి వస్తోంది. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఛీదరింపులు.. అధికారుల చివాట్లతో మరింత ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాక్షి,పలమనేరు(చిత్తూరు) : రాబోవు సార్వత్రిక ఎన్నికల కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో బూత్లెవల్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సంఘానికి సంబంధించిన పనులు చేయాలనే గౌరవంతో విధులు నిర్వహిస్తున్న వీరికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈదఫా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. వారిమాట విని ఏదేనీ తప్పుచేస్తే ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు అధికారుల ఆదేశాలను పాటిస్తూ విధులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి. ఈమధ్య భారీగా వస్తున్న ఫామ్–7 క్లయిమ్ల విచారణ వీరికి తలనొప్పిగా మారింది. క్షేత్రస్థాయిలో బీల్వోలే అత్యంతకీలకం ఎన్నికల నిర్వహణలో బీఎల్వోలే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఓటర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి 6–క్లయిమ్ల స్వీకరణ, వీటిపై విచారణ, ప్రస్తుతం 7–క్లయిమ్ల స్వీకరణ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, వీటికి సంబంధించిన చెక్లిస్ట్, ఫామ్–13, 14 నోటీసుల జారీ వీటిపై విచారణలు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలను గుర్తించడం, బూత్లెవల్లో సౌకర్యాలు, మార్పులు తదితరాలపై సమాచారాన్ని ఉన్నతాధికారుకు ఇస్తూ వారి ఆదేశాలను పాటించాలి. ఇందుకోసం అంగన్వాడీ వర్కర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులను ఎంపిక చేశారు. వీరు వారిశాఖలతో పనిలేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా బూత్లెవెల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తారు. అధికారపార్టీ ఒత్తిళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా ఈదఫా ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు వీరిని తమదారిలోకి తెచ్చుకుంటున్నారు. తాము చెప్పినట్టు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. నయానా, భయానా కాకుంటే పలు రకాల ప్రలోభాలకు గురిచేసి కొందరిని ఇప్పటికే వారి దారికి తెచ్చుకున్నట్టు సమాచారం. గ్రామాల్లో అయితే అక్కడి అధికార పార్టీ నేతలు, సాధికార మిత్రలు వీరి వెంటే ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. చిన్నస్థాయి ఉద్యోగులు కాబట్టి స్థానిక నేతల మాటలు వినకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయోనని కొందరు వారు చెప్పినట్టే చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పచ్చ నేతల నుంచి తనకు ఇలాంటి ఒత్తిళ్లున్నాయని వారు అధికారులకు చెప్పుకున్నా లాభం లేకుండా ఉంది. ఎందుకంటే అధికారులు సైతం నాయకుల మాట వినేవాళ్లే ఎక్కువగా ఉన్నారనేది నిజం. ఈ విధుల్లోకి ఎందుకొచ్చామా..? అని బయటకు చెప్పుకోలేక బీఎల్వోలు లోలోన మదనపడేవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో బీఎల్వోలు విచారణలో తప్పని తిప్పలు అర్హులైన ఓటర్లను సైతం కొందరు ఫామ్ –7 ద్వారా తొలగింపునకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అభ్యంతరాలు జిల్లాలో వేలల్లోనే ఉండడంతో వీటిని మళ్లీ విచారించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో వీరు అవరసమైన ధ్రువపత్రాలను అడిగితే ఓటర్లు ఎన్నిసార్లు విచారిస్తారంటూ బీఎల్వోలను ప్రశ్నిస్తున్నారు. వారిని ఒప్పించి నేర్పుగా పనులు చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు టార్గెట్లపేరిట అధికారుల నుంచి ఆదేశాలు తప్పడం లేదు. వీరు మానసికంగా వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కష్టం ఎక్కువ.. ఫలితం తక్కువ ఇంత కష్టపడినా బీఎల్వోలకు మూడు నెలలకు ఎన్నికల సంఘం నుంచి అందే గౌరవ వేతనం మూడు వేలు మాత్రమే. దీనికోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ విధుల కారణంగా బీపీలు, షుగర్ లాంటి జబ్బులు వస్తున్నాయని వాపోతున్నారు. జిల్లా అధికారులు వీరికి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది. -
రిపబ్లిక్ టీవీ సర్వే: లోకసభ ఎన్నికల్లో కారు జోరు..
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించనుందని రిపబ్లిక్-సీ ఓటర్ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 17 లోక్సభ స్థానాలకుగాను టీఆర్ఎస్ 16 స్థానాలు, ఎంఐఎం ఒక్క స్థానం సాధిస్తాయని సర్వే స్పష్టం చేసింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ కూడా లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ 16 స్థానాలు సాధిస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా తెలంగాణలో తమ ఖాతాను తెరవవని సర్వే పేర్కొంది. ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే.. టీఆర్ఎస్ 42.4 శాతం, కాంగ్రెస్ 29 శాతం, బీజేపీ 12.7 శాతం, ఎంఐఎం 7.7 శాతం, ఇతరులు 8.2 శాతం ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. గతేడాది అక్టోబర్లో సర్వే వివరాలు వెల్లడించిన సీ-ఓటర్ సంస్థ.. టీఆర్ఎస్ 9 స్థానాల్లో, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందుతాయని తెలిపింది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన అనంతరం పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. -
లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం
-
లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనుందని రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ సంస్థలు జరిపిన ఓ సర్వేలో స్పష్టమైంది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరిట జరిగిన ఈ సర్వే ఫలితాలు గురువారం రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పదని ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 25 లోక్సభ స్థానాలకుగాను వైఎస్సార్సీపీకి 19 సీట్లు, టీడీపీకి కేవలం ఆరు సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. అటు జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని తెలిపింది. ఇక ఓట్ల శాతం పరంగా చూసినా వైఎస్సార్సీపీదే పైచేయిగా కనిపించింది. వైఎస్సార్సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు పడతాయని సర్వే వెల్లడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా ఏపీలో టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి రెండు సీట్లు రావడం తెలిసిందే. అప్పుడు వైఎస్సార్సీపీ ఏపీలో 8 చోట్ల గెలుపొందింది. కాగా, గతంలో సీ ఓటర్ సంస్థ వెల్లడించిన సర్వేలో సైతం వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్ అమిత్ షా దిశానిర్దేశం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు తలపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో యువత, పేదల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను దేశం నలుచెరుగులా తీసుకువెళ్లాలని పార్టీ యంత్రాంగానికి అమిత్ షా సూచించారు. అభివృద్ధి, సంక్షేమానికి పాలక బీజేపీ పాటుపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతోందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గతంలో బీజేపీ ఉనికి లేని రాష్ట్రాల్లోనూ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న మహాకూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. గతంలో ఒకరినొకరు చూసుకునేందుకూ ఇష్టపడని పార్టీలు ఇప్పుడు ఒక్కటవుతున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ చేస్తున్న మంచి పనులను సహించలేని పార్టీలు ఆయనను ఓడించేందుకే సిద్ధాంతాలు పక్కనపెట్టి ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. మోదీ ఓటమే వారి ఏకైక అజెండాగా మారిందని దుయ్యబట్టారు. -
పంచాయతీ ‘కోడ్’ పల్లెలకే..
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రవర్తనానియమావళిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కానుంది. ఇది పట్టణ ప్రాంతాలకు వర్తించదు. ఈ మేరకు ప్రవర్తనానియమావళిని సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మునిసిపాలిటీలకుగానీ, గ్రామపంచాయతీలకు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్రం అంతటా ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లో ఉంటుంది. తాజాగా చేపట్టిన సవరణల ప్రకారం మునిసిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలకు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే సంబంధిత పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి రానుంది. సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు అర్హులే.. ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్, సెక్రటరీ హోదా కలిగిన అధికారులు మినహా మిగిలిన ఉద్యోగులందరూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఈ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వవాటాల మొత్తంతో నిమిత్తం లేకుండా ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్కుమార్ ఆదివారం వివరణ ఇచ్చారు. రైతులకు రూ.5 భోజనానికి అనుమతి నో.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు రూ.5 కు భోజనం అందించడంతోపాటు మార్కెట్కు వచ్చేవారికి వైద్యసేవలందించేందుకు వైద్యుడి నియామకం, మందుల కొనుగోలుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. కార్యక్రమాలకు అనుమతి కోరుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి లేఖ రాయగా, పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఈ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని ఎన్నికల సంఘం బదులిచ్చింది. -
అయిదు రాష్ట్రాల ఎన్నికలు
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 12తో మొదలై డిసెంబర్ 7 వరకూ వివిధ దశల్లో ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలూ జరుగుతాయి. డిసెంబర్ 11న వెలువడబోయే ఈ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత మరో ఆరునెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయి గనుక వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఓటర్ల మనోగతం తెలిస్తే గెలిచిన పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికలకు రెట్టించిన సమరోత్సాహంతో ఉరుకుతాయి. ఓడిన పక్షాలు భయసందేహాలతో అతి జాగ్రత్తగా అడుగులేయక తప్పదు. ఈసారి ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ సుదీర్ఘమైనది కావడం వల్ల మొదటగా ఎన్నికలు జరిగే ఛత్తీస్గఢ్ ఫలితాల కోసం నెలరోజులపాటు వేచిచూడక తప్పదు. ఈ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లలో బీజేపీ ప్రభుత్వాలుండగా తెలంగా ణలో టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల తీర్పు మాటేమోగానీ ఏబీపీ–సీ ఓటర్ కలిసి, సీ ఫోర్ విడిగా నిర్వ హించిన సర్వేలు కాంగ్రెస్కు సంతోషం కలిగించాయి. రాజస్తాన్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పిన ఏబీపీ– సీ ఓటర్ సర్వే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఆ పార్టీకి అనుకూలత ఉన్నదని చెబుతోంది. మధ్యప్రదేశ్లో రెండు పార్టీల మధ్యా 2 శాతం లోపు ఓట్ల తేడా ఉంది. కాంగ్రెస్కు 42.2 శాతంమంది, బీజేపీకి 41.5 శాతంమంది మద్దతు తెలుపుతున్నారని ఆ సర్వే లెక్కేసింది. ఛత్తీస్ గఢ్లో ఈ తేడా మరింత స్వల్పంగా ఉంది. కాంగ్రెస్కు 38.9, బీజేపీకి 38.2 చొప్పున మద్దతున్నట్టు తేల్చింది. మున్ముందు ఏర్పడే పరిణామాలనుబట్టి ఈ ఓట్ల శాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నదని వివరించింది. చిత్రమేమంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లు ప్రస్తుత సీఎంలవైపే మొగ్గుచూపుతున్నారు. రాజస్తాన్లో కాంగ్రెస్ బీజేపీ కంటే చాలా ముందంజలో ఉంది. అక్కడ కాంగ్రెస్కు 49.9 శాతంమంది మద్దతు పలుకుతుండగా, బీజేపీపై 34.3 శాతంమంది మాత్రమే సుముఖత చూపారని తెలిపింది. గత పాతికేళ్లుగా రాజస్తాన్లో ఏ పార్టీ వరసగా రెండుసార్లు అధి కారం నిలబెట్టుకున్న దాఖలా లేదు. అయితే రాజకీయంగా ఈ రాష్ట్రాలన్నిటా కాంగ్రెస్ కష్టాలు ఎదుర్కొంటున్నది. బీజేపీకన్నా ముందంజలో ఉన్న రాజస్తాన్లో తమ సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్ చెప్పే పరిస్థితి లేదు. అలా ప్రకటిస్తే వెనువెంటనే పార్టీలో అలకలు, వివాదాలు మొదలవుతాయి. అదంతా చివరకు ఎటు దారితీస్తుందో తెలియదు. అందుకే కాంగ్రెస్ దాని జోలికి పోలేదు. అలాగే ఈ మూడు రాష్ట్రాల్లోనూ సమష్టిగా పోరాడతాయనుకున్న కాంగ్రెస్, బీఎస్పీ, సమాజ్వాదీలు వేరు కుంపట్లు పెట్టాయి. మూడుచోట్లా దళిత ఓటర్ల ప్రాబల్యం ఉన్నది గనుక బీఎస్పీతో కలిసి పోటీ చేస్తే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ లెక్కేసినా సీట్ల లెక్కల్లో తేడాలొచ్చాయి. సమాజ్వాదీతోనూ ఆ విషయంలోనే తగాదా ఏర్పడింది. ఆ రెండు పార్టీలూ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాయి. విపక్షాల నన్నిటినీ కలుపుకొని వెళ్తామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తామని ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చెబుతున్నదంతా తాజా పరిణామాలతో కుప్పకూలింది. మొన్న మే నెలలో కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలో జేడీ(ఎస్)–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీజేపీని వ్యతి రేకించే 12 పార్టీల అధినేతలు హడావుడి చేశారు. కలిసికట్టుగా ఉండి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని చెప్పారు. కానీ అంతవరకూ పోకుండానే బోర్లా పడ్డారు. తమకు బాగా బలం ఉన్నదనుకున్న చోట ఇతరులను లక్ష్య పెట్టకపోవడం, బలహీనంగా ఉన్నామనుకున్నచోట సాధ్య మైనంత ఎక్కువ రాబట్టుకోవడానికి ప్రయత్నించటం కాంగ్రెస్కు అలవాటే. యూపీలో ఏణ్ణర్ధం క్రితం జరిగిన ఎన్నికల్లో సమాజ్వాదీతో కాంగ్రెస్ చాకచక్యంగా బేరమాడి ఏకంగా 105 స్థానాలు తీసుకుంది. వాటిలో కేవలం ఏడంటే ఏడు మాత్రమే గెలుచుకుంది. తమకు యూపీ, బీహార్లలో పొత్తు కుదిరితే చాలని... మిగిలినచోట్ల ఇతరుల అవసరం లేకుండానే నెగ్గుకురాగలమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ చెప్పిన మాట ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతుంది. కాంగ్రెస్ తీరు ఇలా ఉన్నదని తెలిశాక ఆ రెండు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ఇతర పార్టీలు మున్ముందు ఇదే తర్కాన్ని దానిపై ప్రయోగించవా? ఐక్యత ముఖ్యమని, సమష్టిగా కదలాలని నిర్ణయించుకున్నప్పుడు ఇచ్చిపు చ్చుకునే ధోరణి ప్రదర్శించాలి. అవసరమైతే కొన్ని కోల్పోవడానికి సిద్ధపడాలి. సిబల్ వంటివారి మాటలు గమనిస్తే కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదని అనుకోవాలి. ఇక మిగిలిన నాలుగు రాష్ట్రాలకన్నా ముందే ఎన్నికలు జరుగుతాయని అంచనాలున్న తెలం గాణలో ఓటర్ల జాబితా వివాదం కారణంగా ఆ రాష్ట్రాలతోపాటే ఎన్నికలు ప్రకటించవలసివచ్చింది. ఈమధ్యకాలంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా అవకతవలపై ఫిర్యాదులు పెరిగాయి. బోగస్ ఓటర్లు వచ్చి చేరడం, నిజమైన ఓటర్ల పేర్లు గల్లంతుకావడం రివాజుగా మారింది. ఇది ఆందో ళనకరం. అవకతవకలు బయటపడినప్పుడు ఓటర్ల జాబితా రూపకల్పనలో పాలుపంచుకునేవారిని బాధ్యుల్ని చేయడంతోసహా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా నిబంధనలు రూపొందిస్తే తప్ప ఇవి తగ్గవు. తెలంగాణలో గత నెల 6నే పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసి ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉన్న టీఆర్ఎస్కు ఎన్నికలు ఆలస్యం కావడం ఇబ్బందే. అయితే పొత్తుకు దిగిన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ల మధ్య సీట్ల పంపకాలు అంత సులభమేమీ కాదు. ఎలాగోలా కుదిరినా దాదాపు ఈ పార్టీలన్నిటిలోనూ తలెత్తే అసంతృప్తిని చల్లార్చడమూ కష్టమే. ఇక ఓట్ల బదిలీ సమస్య ఎటూ ఉంటుంది. పార్టీలు వైఖరి మార్చుకున్నంత సులభంగా ఆ పార్టీల ఓటర్లు మనసు మార్చుకుంటారా అన్నది అనుమానమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు డ్రెస్ రిహార్సల్ అనదగ్గ ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలపైనా సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. -
కొత్త ఎత్తిపోతలకు నో..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం రద్దయి... ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుండటంతో కొత్త పథకాలను చేపట్టే అవకాశం లేకుండా పోయింది. సాధారణ ఎన్నికల అనంతరమే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం చేయాల్సి ఉండటంతో నీటిపారుదల శాఖ పరిధిలో ఉన్న పెండింగ్ ప్రతిపాదనలన్నీ ఇక ఫైళ్లకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వ రద్దు సూచనలతో హడావుడిగా ఆరు ఎత్తిపోతల పథకాలు కేబినెట్ ఆమోదానికి పంపినా, కేబినెట్ భేటీ కేవలం ప్రభుత్వ రద్దు నిర్ణయం వరకే పరిమితం కావడంతో వీటిపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. నిజానికి ప్రభుత్వ రద్దు నిర్ణయం ఏ క్షణంలో అయినా వెలువడుతుందన్న నేపథ్యంలో రెండ్రోజుల కిందటే మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిపారుదల శాఖపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను ప్రభుత్వ అనుమతికై పంపారు. ఇందులో నల్లగొండ జిల్లా నుంచి నాలుగు ఎత్తిపోతల పథకాలు, కామారెడ్డి జిల్లా నుంచి మరో రెండు ఎత్తిపోతల పథకాలకు మొత్తంగా రూ.700 కోట్ల పనులకు అనుమతి కోరారు. వీటిపై ప్రభుత్వ రద్దుకు ముందు భేటీ అయిన కేబినెట్ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక కాళేశ్వరంలో భాగంగా నిర్మించతలపెట్టిన సంగారెడ్డి కెనాల్ పనులకు రూ.1,326 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ కాళేశ్వరం నిర్మాణంలోని ప్రాజెక్టు అయినందున దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెప్పాయి. ఈ జీవోకు అనుగుణంగా టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కల్వకుర్తి పరిధిలో 47 రిజర్వాయర్ల నిర్మాణంపై ఎవరు నిర్ణయం తీసుకోవాలన్న దానిపై సందిగ్ధం ఉంది. ప్రాజెక్టు పాతదే అయినా, 47 రిజర్వాయర్లు పూర్తిగా కొత్త ప్రతిపాదనలు కావడం, నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4వేల కోట్లకు పైగా ఉండటంతో దీనిపై ఎలా వ్యవహరిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇక కొన్ని ప్రాజెక్టుల పరిధిలో సవరించిన వ్యయ అంచ నాలను ఆమోదించాల్సి ఉంది. ఆపద్ధర్మ ప్రభుత్వం లో ఏ మేరకు సవరించిన అంచనాలను ఆమోదించే అవకాశం ఉందీ, అధికారుల స్థాయిలో ఏ మేరకు చేస్తారన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది. నాలుగు ఎత్తిపోతలకు అనుమతులు కేబినెట్ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా నాలుగు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వరంగల్ జిల్లా పరకాల మండల పరిధిలో ముస్తాల్యపల్లి ఎత్తిపోతలకు రూ.8.22 కోట్లు, ఇదే మండల పరిధిలో వెంకటేశ్వరపల్లి ఎత్తిపోతలకు రూ.7.96 కోట్లు, ఖమ్మం జిల్లా రాపల్లి ఎత్తిపోతలకు రూ.12.87 కోట్లు, జగిత్యాల జిల్లా రాయికల్ మండల పరిధిలో బోరన్నపల్లి ఎత్తిపోతలకు రూ.1.32 కోట్లతో అనుమతులిచ్చారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని భట్పల్లిలో కొత్తచెరువు నిర్మాణానికి రూ.2.94కోట్లతో అనుమతులు ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిడ్మానేరు నిర్వాసితులకు ఆర్థిక సాయం గత కేబినెట్ నిర్ణయం తీసుకున్న మేరకు మిడ్మానేరు రిజర్వాయర్ పరిధిలోని సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల మన్వాడ నిర్వాసితులకు ఆర్థిక సహాయానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 608 ప్రభావిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.4.25 లక్షల చొప్పున సాయం చేసేలా ఉత్తర్వులిచ్చారు. -
20.33 లక్షల ఓటర్లు తగ్గారు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (టీఎస్సీఈవో) ఈ మేరకు రాష్ట్రంలోని ఓటర్ల ముసాయిదా జాబితాను వెల్లడించారు. టీఎస్సీఈవో రజత్కుమార్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.61 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.32 కోట్ల మంది పురుషులు, 1.28 కోట్ల మంది మహిళలు, 2,439 మంది థర్డ్ జెండర్ కేటగిరి వారు ఉన్నారు. ముసాయిదా జాబితాపై సెప్టెంబర్ 1 నుంచి అభ్యంతరాలను, ప్రతిపాదనలను స్వీకరించనున్నట్లు సీఈవో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలను, ప్రతిపాదనలను పరిశీలించి ఈ ఏడాది నవంబర్ 30లోపు పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు గుర్తింపు కార్డు పొందాలని కోరారు. -
50 మంది నేతలకు రెండు పెళ్లిళ్లు..!
ఇస్లామాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాకిస్తాన్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న దాదాపు 50 మందికి పైగా నేతలకు రెండు పెళ్లిళ్లు అయ్యాయనేది దాని సారాంశం. ఈ మేరకు ఆ దేశానికి చెందిన దున్యా న్యూస్ ఓ కథనాన్ని ప్రచురించింది. వారి వారి నామినేషన్ పత్రాల్లో ఈ మేరకు నేతలు సంతకాలు కూడా చేశారని పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ సదరు నేతలకు రెండో పెళ్లైందని తెలియని స్థానిక మీడియా అవాక్కైంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హమ్జా షెహబాజ్, నేషనల్ అసెంబ్లీలోని మాజీ ప్రతిపక్ష నేత సయీద్ ఖుర్షీద్ షా, ఎమ్క్యూఎమ్ చీఫ్ ఫరూక్ సత్తార్, మాజీ రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీక్ సహా పలువురు ప్రముఖులకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఓటర్ల ముందు పారదర్శకంగా వ్యవహించేందుకే వీరంతా తమ వ్యక్తిగత జీవితంలోని అజ్ఞాత అంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. పీఎమ్ఎల్ఎన్ నేత, మాజీ రైల్వే మంత్రి ఖవాజా సాద్ రఫీక్ తన రహస్యాలను సోషల్ మీడియాలో వెల్లడించిన తొలినేతగా నిలిచారు. నామినేషన్ పత్రాల్లో రెండో పెళ్లి గురించి ప్రస్తావించిన తర్వాత ఆయన బయటి ప్రపంచానికి ఈ విషయం తెలియజేశారు. -
పాకిస్తాన్ ఎన్నికలు: హిందూ ఓటర్లే అధికం
ఇస్లామాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు పాకిస్తాన్ సిద్ధమైంది. జూలై 25న ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ అధ్యక్షుడు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్తాన్లో ముస్లిమేతర ఓటర్ల సంఖ్య గతం కంటే దాదాపు 30 శాతం పెరిగిందని ఒక నివేదిక పేర్కొంది. 2013 ఎన్నికలప్పుడు 27 లక్షలుగా ఉన్న ముస్లిమేతర ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 36 లక్షలకు చేరుకుంది. ముస్లిమేతర మైనారిటీ ఓటర్లలో హిందు ఓటర్ల సంఖ్యనే అధికం. 2013 ఎన్నికల సమయంలో 14 లక్షలుగా ఉన్న హిందు ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 17 లక్షలకు చేరింది. హిందువుల తర్వాత అత్యధిక మైనారిటీ ఓటర్లుగా క్రైస్తవులు ఉన్నారు. వారి సంఖ్య 16 లక్షలు. 2013తో పోల్చుకుంటే హిందువులకంటే, క్రైస్తవుల ఓటర్ల సంఖ్య పెరుగుదల శాతం ఎక్కువ. అలాగే పార్శి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ నెల 31తో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణ కోసం దేశాధ్యక్షుడి అనుమతి తప్పనిసరి కావడంతో అంతకుముందు పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆ దేశ అధ్యక్షుడికి లేఖ రాసింది. దీనికి ఆమోదముద్ర పడటంతో జూలై 25, 27 మధ్య ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ఎంపీగా పోటీచేసే ఆలోచన లేదు: భట్టి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాబోయే సాధారణ ఎన్నికల్లో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని, ఎంపీగా లోక్సభ స్థానానికి పోటీచేసే ఆలోచన లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజల అవసరాలు తీర్చేందుకు తాను శాసనసభకే పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల 470 గ్రామీణ నీటి (ఆర్డబ్ల్యూఎస్) పథకాలు పడకేశాయని ఆరోపించారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండగా ఇప్పటివరకు ఆ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చే నాథుడే కరువయ్యాడని అన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడిపై జిల్లా మంత్రి, కలెక్టర్ సమీక్షించి నీటి ఎద్దడి లేకుండా చూడాల్సి ఉన్నప్పటికీ వారు అదేమీ పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఆర్డబ్ల్యూఎస్లోని సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ కింద జిల్లాలో పని చేస్తున్న 340 మందికి 9 నెలలుగా జీతాలు రావట్లేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం అధిష్టానం పరిధిలో ఉంటుందని, త్వరలోనే అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని తెలిపారు. -
175 స్థానాల్లో పోటీ: పవన్
సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు జనసేన సర్వసన్నద్ధంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య కార్యకర్తలతో మంగళవారం హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలకు పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసేందుకు ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా దేవ్ పనిచేస్తారని పవన్ చెబుతూ ఆయన్ను పార్టీ నేతలకు పరిచయం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కూడా దేవ్ సేవల్ని పార్టీ వినియోగించుకుంటుందన్నారు. తాను గతంలో ఏర్పాటు చేసిన కామన్మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీపీఎఫ్)లోని 1,200 మంది కార్యకర్తలతోపాటు దేవ్ టీంలో 350 మంది ఎన్నికలకోసం పనిచేస్తారన్నారు. ‘‘గత ఎన్నికల్లోనే 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నా. అప్పటి పరిస్థితుల్లో ఎన్డీయేకు సహకరించాం. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేముందు క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపై అవగాహన అవసరమన్నది నా ఉద్దేశం. అవేవీ లేకుండా పోటీ చేసి గెలిస్తే, ఎప్పటికీ నేర్చుకొనే అవకాశముండదు’’అని పవన్ చెప్పారు. జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తానెప్పుడూ చెప్పలేదన్నారు. కులాలమధ్య ఐక్యత అన్నదే జనసేన తొలి సిద్ధాంతమన్నారు. ‘‘జనసేన ఏ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదు. కులం అనే భావనే ఉంటే గత ఎన్నికల్లో టీడీపీకి ఎలా సహకరిస్తాం? కులాలకు అతీతంగా ఆలోచన చేద్దాం’’అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రాథమిక వ్యూహాన్ని ఆగస్టు రెండోవారంలో వెల్లడిస్తానన్నారు. -
ప్రజాక్షేత్రంలోకి... ఎన్ఆర్ఐలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కొత్తతరం నాయకులు రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో పరోక్ష సహకారాన్ని అందించిన ప్రవాస తెలంగాణవాదులు రాజకీయ కురుక్షేత్రంలో అడుగుపెట్ట బోతున్నారు. సమకాలీన రాజకీయాలకు దీటుగా తమ సత్తాను చాటేందుకు ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించబోతున్నారు. ఇప్పటికిప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తామనే విషయాన్ని బాహాటంగా ప్రకటించకున్నా చాలావరకు అధికార టీఆర్ఎస్ వైపునకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా పాతుకుపోయిన నియోజకవర్గాలనే లక్ష్యంగా చేసుకుని ఎన్ఆర్ఐలు పోటీలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నా రు. అదే క్రమంలో మరికొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుని పోటీకి అనుకూలంగా ఉన్న స్థానాలను ఎంపిక చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో అంతర్గత సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఒకవేళ ఏ పార్టీనుంచి ఆదరణ లభించక...స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే...ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపి, పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షింవచ్చని భావిస్తున్నారు. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు విదేశాల్లో స్థిరపడిన తాజా, మాజీ ఎమ్మెల్యేల వారసులు, బడా వ్యాపారవేత్తలు ఈ జాబితాలో ఉన్నారు. పెద్ద తలలే...టార్గెట్... అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పెద్ద తలకాయలనే ఎన్ఆర్ఐలు లక్ష్యంగా చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, ఆయన సతీమణి పద్మావతి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడ నియోజకవర్గాలతోపాటు, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎన్ఆర్లు అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటితోపాటు మిర్యాలగూడ, ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన దేవరకొండనుంచి కూడా పోటీలో నిలబడేందుకు ఎన్ఆర్ఐలు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ జాబితాలో...సంకినేని తరుణ్, దొంతరి శ్రీధర్, జలగం సుధీర్, గడ్డంపల్లి రవీందర్రెడ్డి, శాన సైదిరెడ్డి, సక్రునాయక్ , పోరెడ్డి శ్రవంత్ ఇలా పలువురు ప్రవాస తెలంగాణవాదులు ఉన్నారు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఒకసారి ఎన్నికలు వస్తే ప్రధానమైన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవాలని పలువురు ప్రవాస తెలంగాణవాదులు వ్యూహారచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పోటీచేసి ఓడిపోయిన ప్రవాస తెలంగాణ వాదులు కూడా ఇక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ఎన్నికలు ఉపయోగపడుతాయని ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో ఉమ్మడి జిల్లాలో పోటీ చేసిన ఎన్ఆర్ఐల భవితవ్యాన్ని కూడా ఆరా తీస్తున్నారు. పార్టీ..లేదా స్వతంత్ర అభ్యర్థిగా.. వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐ కాంగ్రెస్ టికెట్ కోసం, కోదాడ ప్రాంతా నికి చెందిన ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ లేదా స్వతంత్ర అభ్యర్థిగా, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఎన్ఆర్ఐ బీజేపీ నుంచి, నాగార్జుసాగర్ టికెట్ ఆశిస్తున్న వ్యక్తి టీఆర్ఎస్ నుంచి, మిన్నెసోటలో ఉండి దేవరకొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకుంటున్న మరో ఎన్ఆర్ఐ..ఇలా చాలా మంది తమతమ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జలసాధన సమితి తరఫున గతంలో అనేక మందిని పోటీలో నిలిపి ఫ్లోరోసిస్ దుస్థితిని దేశవ్యాప్తం చేసినట్టు, అదే స్థాయిలో తమ తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకో వాలని భావిస్తున్నట్టు కోదాడ ప్రాంత ప్రవాస తె లంగాణ వాది జలగం సుధీర్ అభిప్రాయపడ్డారు. -
కరెంట్ బిల్లుల్లో ‘సబ్సిడీ’ లెక్కలు!
సాక్షి, హైదరాబాద్: గృహ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సబ్సిడీల వివరాలను ఇకపై కరెంటు బిల్లుల్లో పొందు పరచనున్నారు. వినియోగించిన విద్యుత్, ప్రభుత్వ సబ్సిడీ పోగా చెల్లించాల్సిన చార్జీల వివరాలను మాత్రమే ఇప్పటివరకు బిల్లుల్లో పేర్కొనేవారు. సబ్సిడీ మినహాయించిన తర్వాత ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై చెల్లించాల్సిన విద్యుత్ టారీఫ్ పట్టికను బిల్లుల వెనక ముద్రించేవారు. దీంతో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి గృహ వినియోగదారులకు పెద్దగా అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వినియోగించిన విద్యుత్, విద్యుత్ సరఫరాకు జరిగిన వాస్తవ ఖర్చు, అందులో రాష్ట్ర ప్రభుత్వం భరించే రాయితీలు, రాయితీలు పోగా వినియోగదారులు చెల్లించాల్సిన చార్జీల వివరాలను బిల్లుల్లో పొందుపరుస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో 2018–19లో అమలు చేయాల్సిన కొత్త విద్యుత్ టారిఫ్ను ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (టీఎస్ఈఆర్సీ) తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సబ్సిడీ వివరాలను బిల్లుల్లో పొందుపరచాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో వరుసగా రెండేళ్లపాటు చార్జీలు పెంచకపోవడం, సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ప్రభుత్వానికి ప్రచారం కల్పించేందుకు ఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రూ.4,984 కోట్ల సబ్సిడీ.. వ్యవసాయానికి ఉచితంగా, గృహ వినియోగదారులకు తక్కువ చార్జీలతో విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు ఏటా సబ్సిడీలు మంజూరు చేస్తోంది. 2018–19లో రూ.4,984.3 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈఆర్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యయం (కాస్ట్ ఆఫ్ సప్లై) సగటున యూనిట్కు రూ.6.04 అవుతోంది. నెలకు 200 యూనిట్ల లోపు వినియోగించే పేద, మధ్య తరగతి గృహ వినియోగదారులకు ప్రభుత్వ సబ్సిడీతో అంతకంటే తక్కువ ధరకు విద్యుత్ అందుతోంది. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే తొలి 50 యూనిట్లకు రూ.1.45 చొప్పున, 51–100 లోపు యూనిట్లకు రూ.2.60 చొప్పున మాత్రమే చార్జీలు వసూలు చేస్తున్నారు. వినియోగం 100–200 యూనిట్ల మధ్య ఉంటే తొలి 100 యూనిట్లకు రూ.3.30, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున చార్జీలు వర్తింపజేస్తున్నారు. 200 యూనిట్లకు మించితే? అయితే విద్యుత్ సరఫరా 200 యూనిట్లు దాటితే ఎలాంటి సబ్సిడీలు వర్తించకపోగా, వాస్తవ విద్యుత్ సరఫరా వ్యయం కన్నా అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నారు. వినియోగం 200 యూనిట్లకు మించితే తొలి 200 యూనిట్లకు రూ.5, ఆపై 201–300 యూనిట్లకు రూ.7.2, 301–400 యూనిట్లకు రూ.8.5, 401–800 యూనిట్లకు రూ.9 చొప్పున చార్జీలు మోత మోగిస్తున్నారు. వినియోగం 800కు మించిన తర్వాతి యూనిట్లకు 9.5 చొప్పున చార్జీలు వడ్డిస్తున్నారు. ఈ వినియోగదారులకు జారీ చేసే బిల్లుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈఆర్సీ స్పష్టత ఇవ్వలేదు. -
ఈ ఏడాది చివరిలో ఎన్నికలు: ఉత్తమ్
చింతలపాలెం/మఠంపల్లి: రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపారు. బీమా ప్రీమియం కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. అన్నిపంటలకు మద్దతుధర వచ్చేలా కృషి చేస్తామన్నారు. పత్తికి రూ.4,300 నుంచి రూ.6 వేలు, మిర్చి, పసుపు పంటలకు రూ.10 వేలు చెల్లిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 శాతం కమీషన్ల కోసమే కక్కుర్తిపడి మిషన్ కాకతీయ, భగీరథ ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటూ బంగారు కుటుం బంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇక టీఆర్ఎస్ పతనం ఖాయమని పేర్కొన్నారు. -
3,500 మందితో గులాబీ దండు!
సార్వత్రిక ఎన్నికల కోసం అధికార పార్టీ వ్యూహం - ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను జనంలోకి తీసుకెళ్లేలా శిక్షణ - త్వరలో పార్టీ నియోజకవర్గ కమిటీలు.. ఒక్కోదానిలో 22 మంది! - ఇతర సంస్థాగత కమిటీల నియామకం కూడా.. సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల గడువే ఉండడంతో అధికార టీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదే సమయంలో నియోజక వర్గాల్లో రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా కనీసం 3,500 మంది నేతలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సమయం దగ్గరపడుతుండడంతో.. రెండేళ్ల కింద నాగార్జునసాగర్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వివిధ అంశాల్లో నిపుణులతో తరగతులు నిర్వహించారు. రాజకీయ అంశా లపై స్వయంగా సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం శిక్షణ ఉంటుందని ప్రకటిం చినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఎన్నిక లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లా ల్సిన అవసరాన్ని గుర్తించిన కేసీఆర్.. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. సంస్థాగత నియామకాల తర్వాత.. టీఆర్ఎస్ మూడేళ్లుగా ప్రధాన కమిటీలు లేకుండానే కొనసాగుతోంది. గ్రామ, మండల కమిటీలు మినహా ఏ కమిటీలూ లేవు. అయితే రెండు నెలల కింద 16వ ప్లీనరీ సమయంలో అన్ని పార్టీ కమిటీలను భర్తీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనిపై ఇరవై రోజులుగా ఆయన కసరత్తు చేపట్టారని తెలుస్తోంది. మరోవైపు తొలిసారిగా టీఆర్ఎస్లో నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయను న్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్చార్జుల సారథ్యంలో కమిటీలు ఉంటాయి. స్థానిక ఎంపీ సభ్యుడిగా ఉంటారు. ఇక కమిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మరో 20 మందిని నియమించనున్నారని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సగటున ఐదు మండలాలు ఉంటాయనుకుంటే.. ఒక్కో మండలం నుంచి కనీసం నలుగురికి సభ్యులుగా అవకాశం దక్కనుంది. ఇక నియోజకవర్గ కమిటీలతోపాటు రాష్ట్ర కమిటీ, పోలిట్ బ్యూరోలను కూడా ఈ నెలాఖరుకు నియమించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కమిటీల నియామకం పూర్తయ్యాక అన్ని కమిటీలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో కలిపి మొత్తంగా 3,500 మందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రతిపక్షం బలాబలాలపై ఆరా ఒకసారి శిక్షణ పూర్తయితే నాయకులు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి కూడా వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తారన్న ఆలోచనలో పార్టీ ఉంది. దాంతోపాటు కమిటీల ద్వారా నియోజకవర్గాల్లో తమ పార్టీ, ఎమ్మెల్యేల పరిస్థితి, బలహీనతలపై సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల పరిస్థితి, బలాబలాలను అంచనా వేయడం కూడా సాధ్యమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
నేటి నుంచి నామినేషన్లు
► 5న తుది జాబితా ►19న పోలింగ్ ► 22న కౌంటింగ్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం ఈనెల 26వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తమిళనాడులో మూడు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి వచ్చేనెల 19వ తేదీ పోలింగ్ జరుగనుంది. ఈ ఏడాది మేలో జరిగిన తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాలకుగానూ 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి స్థానాల్లో ఓటర్లను మభ్యపెట్టేలా నగదు, చీరలు, పంచెలు, మద్యం బాటిళ్లు సరఫరా జరిగినట్లు ఆరోపణలు రావడంతోపాటు పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అలాగే, మధురై జిల్లా తిరుప్పరగున్రం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే టికెట్పై పోటీచేసిన శీనివేల్ గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఆరునెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మూడు నియోజకవర్గాల్లో నవంబర్ 19వ తేదీన పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ పోటీకి దిగుతున్నా ఇంకా అభ్యర్థుల పేర్లను వెల్లడించలేదు. ఉప ఎన్నికల్లో భాగంగా ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ 26వ తేదీన ఆరంభం కానుంది. అరవకురిచ్చి నియోజకవర్గ ఎన్నికల అధికారిగా కరూరు జిల్లా సంయుక్త కలెక్టర్ సైబుద్దీన్ నియమితులుకాగా, అరవకురిచ్చి తాలూకా కార్యాలయంలో తాత్కాలిక ఎన్నికల కార్యాలయాన్ని తెరిచారు. తంజావూరు ఎన్నికల అధికారిగా ఇన్నాచ్చిముత్తు నియమితులయ్యారు. ఈ మూడు నియోజకవర్గాల్లో ఈనెల 26వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. శని, ఆదివారాల్లో సెలవు. నవంబరు 3వ తేదీ నామినేషన్ల పరిశీలన, 5వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణ, అదే రోజు ఉప ఎన్నికల రంగంలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 19వ తేదీన పోలింగ్, 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పుదుచ్చేరిలో ఒక స్థానం: కాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కోసం నెల్లితోప్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుండగా, 26వ తేదీ నుంచే నామినేషన్లను స్వీకరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణస్వామి, అన్నాడీఎంకే అభ్యర్థిగా ఓంశక్తిశేఖర్ ప్రధాన అభ్యర్థులుగా తలపడుతున్నారు. -
జన్మతః అమెరికా పౌరుడై ఉండాలి..
అమెరికా అధ్యక్ష పదవికి ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు 58వ అధ్యక్ష ఎన్నికలు. నవంబర్ నెలలో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు (ఈ ఏడాది నవంబర్ 8వ తేదీ) ఎన్నికలు నిర్వహిస్తారు. 1845 నుంచీ ఇలాగే జరుగుతోంది. వీటితో పాటు సమాఖ్య (కేంద్ర), రాష్ట్ర, స్థానిక ఎన్నికలు కూడా జరుగుతాయి. వీటిని సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి ఆ దేశంలోనే జన్మించిన పౌరులే అర్హులు. వయసు 35 ఏళ్లు నిండాలి. కనీసం పద్నాలుగేళ్ల పాటు అమెరికాలో నివసించి ఉండాలి. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తికి మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడే అర్హత ఉండదు. -
పార్టీ మారను.. కొడంగల్ వీడను
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కొడంగల్ : వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో క లిపి మహాకూటమి ఏర్పాటు చే సి ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్రెడ్డి అన్నా రు. గురువారం రాత్రి విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడు తూ పలు విషయాలు వెల్లడిం చారు. టీడీపీ మారుతానని తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పార్టీ మారేది లేదు.. కొడంగల్ను వీడేది లేదన్నారు. తనపై నమ్మకం ఉంచి రెండుసార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. 2019లో కొడంగల్ నుంచి మూడోసారి పోటీచేసి హాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తరఫున రాష్ట్ర ఏర్పాటులో పాల్గొన్న ఉద్యమకారులకు, యువతకు టికెట్లు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి టికెట్ ఇవ్వాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తనపై రాజకీయంగా దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నారని, నిత్యం తనను తాను కాపాడుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో అభివృద్ధి మాట తెలియని ఈ ప్రాంతంలో తా ను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే రోడ్డు విస్తరణతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అధికారం తన చేతికి వస్తే ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. -
మొదలైన వెంకటగిరి రాజకీయం!
► గంగాప్రసాద్ మేనల్లుడు నానాజీ అరంగేట్రం ► రాపూరుపై ఆనం కన్ను ► పెంచలకోనలో నానాజీ అభినందనసభ ► ఆనం కార్యకర్తల పరిచయ కార్యక్రమాలు ► బలనిరూపణ వేదికలేనా? వెంకటగిరి : సార్వత్రిక ఎన్నికలు మూడేళ్లు ఉండగానే వెంకటగిరి రాజకీయ చిత్రం మారుతోంది. 2019లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి రాపూరు నియోజకవర్గం ఏర్పాైటైనా, లేకపోయినా వెంకటగిరి నియోజకవర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తెరవెనుక వ్యూహాలు పన్నుతున్నారు బడా నేతలు. సీఎం చంద్రబాబునాయుడుకు సన్నిహితుడైన సూళ్లూరుపేటకు చెందిన గంగాప్రసాద్ తన మేనల్లుడు తానంకి నానాజీకి పెంచలకోన ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి ఇప్పించి అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఈనెల 20న అభినందన సభ నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రులను ఆహ్వానించాలనుకున్నారు. అయితే 20న సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం కావడంతొ మంత్రులు విజయవాడ తరలనుండటంతో కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాపూరు కేంద్రంగా ఈనెల 27న కార్యకర్తల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో రాపూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపోందడంతొ ఈ ప్రాంతంలో గట్టి పట్టున్న నేతలతొ నేటికీ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతొ ఆపార్టీ కేడర్తో సత్సంబంధాలు నెరపేందుకు వ్యూహ ంసిద్ధం చేస్తున్నారు. అసమ్మతి నాయకుల ఆసక్తి: పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పనిచేసిన సీనియర్ నాయకులు, ఇతర పార్టీల నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులకు ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణకు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కీలకనేత గంగాప్రసాద్ వర్గం వెంకటగిరి రాజకీయాల్లోకి అడుగుపెడుతుండడం అసమ్మతినేతల చూపు ఆనం, నానాజీలపై పడింది. వారం క్రితం డక్కిలిలొ జరిగిన ఓ కార్యక్రమంలొ లింగసముద్రం సింగిల్విండో అధ్యక్షుడు వేముల రాజమోహన్నాయుడు ఎమ్మెల్యే రామకృష్ణ సమక్షంలొ టీడీపీలో చేరారు. ముందు నుంచి ఆనం వర్గం నేతగా ముద్రపడ్డారు. రాపూరుకు చెందిన కీలకనేత చెన్ను బాలకృష్ణారెడ్డి ఆనంకు సన్నిహితుడు కావడంతొ మరో అధికార కేంద్రం ఏర్పాటు కానుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తానంకి నానాజీ కి టీడీపీ ప్రధానకార్యదర్శి నారాలోకేష్తొ సన్నిహిత సంబంధాలు ఉండడంతొ ఆయన నియోజకవర్గంలో కీలకనేతగా మారబోతున్నారు. ఈ పరిణామాలు ఊపిరి పోసుకుంటే ఎమ్మెల్యే కురగొండ్ల రామకృష్ణకు భవిష్యత్తులో కష్టకాలం తప్పదని పలువురు చర్చించుకుంటున్నారు. స్థానికేతరులకు కలిసొచ్చిన వెంకటగిరి వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన స్థానికులు ఎమ్మెల్యేగిరితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ఎన్నికైన స్థానికేతరులు మాత్రం మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు అందుకున్న చరిత్ర వెంకటగిరి సోంతం. పాదిలేటి వెంకటస్వామిరెడ్డి, కమతం షణ్ముగం, అల్లం కష్ణయ్య, ఒరేపల్లి వెంకటసుబ్బయ్య, సాయికష్ణయాచేంద్ర, వివిఆర్కే యాచేంద్ర, కురుగొండ్ల రామకష్ణలు ఎమ్మెల్యేలుగా గెలిచినా అంతకుమించి ఎదగలేదు. స్థానికేతరులైన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి 1978లో ఇక్కడి నుండి ఎన్నికై తొలిసారి పంచదార శాఖ మంత్రిగా అడుగుపెట్టారు. 1983లో ఎన్నికయిన నల్లపరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పంచాయతీరాజ్ చాంబర్ ఛైర్మన్, 1989లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాకే నేదురుమల్లి జనార్ధన్రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. నేదురుమల్లి రాజ్యలక్ష్మి సైతం 2004లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక రాష్ట్రమంత్రిగా పనిచేశారు. -
ప్రజాస్వామ్యమే ఎజెండా
సెంట్రల్ డెస్క్ : ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా మయన్మార్ పైనే. ఆదివారం జరిగే సార్వత్రిక ఎన్నికలతో అక్కడి ప్రజాస్వామ్యం భవిష్యత్తు తేలనుంది. మిలటరీ సహకారంతో నడిచే.. అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ), విపక్ష ఎన్ఎల్డీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. బౌద్ధులు మెజారిటీగా ఉండే మయన్మార్లో మైనారిటీలపై దాడులు, అంతర్జాతీయ హక్కుల సంఘాల ఆందోళన నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత తొలిసారి పారదర్శకంగా జరుగుతున్న ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. 1990లో చివరి సారిగా.. జరిగిన పారదర్శక ఎన్నికల్లో సూచీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) భారీ మెజారిటీతో గెలిచినా.. మిలటరీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించేందుకు నిరాకరించటంతో పాటు సూచీని గృహనిర్బంధంలో పెట్టింది. ప్రజాస్వామ్యం అమలుకు అంతర్జాతీయ ఒత్తిళ్లు.. సూచీ గృహ నిర్బంధం నుంచి విముక్తి నేపథ్యంలో.. ఈ ఎన్నికలు స్థానిక ప్రభుత్వానికి కూడా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ప్రెసిడెంట్ ఎవరవుతారు? మయన్మార్ జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర పార్లమెంట్లలో ఉండే 1,142 సీట్లకోసం 93 పార్టీలనుంచి 6వేలకు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. జాతీయ పార్లమెంటులోని 600 సీట్లలో 25 శాతం మిలటరీ ప్రతినిధులవే. ఎన్ని పార్టీలున్నా.. యూఎస్డీపీ, ఎన్ఎల్డీ మధ్యే తీవ్రమైన పోటీ ఉంది. మయన్మార్లో అధ్యక్షుడే రాజ్యాంగ అధినేత. అయితే దేశ రాజ్యాంగం ప్రకారం.. భార్య లేదా భర్త విదేశీయులైనా లేదా సంతానానికి మయన్మార్ పౌరసత్వం లేకపోయినా.. ఆ వ్యక్తి అధ్యక్ష పదవిని అధిరోహించేందుకు అర్హత ఉండదు. ఈ నిబంధన ప్రకారం ఎన్ఎల్డీకి విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నా.. సూచీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం లేదు. ఎందుకంటే సూచీ.. ఓ బ్రిటిష్ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆమె ఇద్దరు పిల్లలూ బ్రిటన్ పాస్పోర్టులు కలిగి ఉన్నారు. అయితే.. అధ్యక్ష స్థానంలో ఎవరినైనా కూర్చోబెట్టి.. మొత్తం పాలన తానే చూస్తానని సూచీ చెబుతున్నారు. సూచీని అధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే.. సభలో కనీస మెజారిటీతోపాటు మిలటరీ పాలకుల్లో కనీసం ఒకరైనా రాజ్యాంగంలోని సదరు నిబంధనల మార్పుకు ఆమోదం తెలపాలి. దీంతో రాజ్యాంగంలో మార్పు సాధ్యమా అనేది ప్రశ్నార్థకమే. పరిస్థితి ఏమైనా మారుతుందా..? ఎన్నికల్లో ఎవరు గెలిచినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్ఎల్డీ పగ్గాలు చేపట్టినా.. పాలనలో అధికార యూఎస్డీపీ, మిలటరీ ప్రభావం ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం.. వ్యవస్థ, రాజకీయాలు మారినా మారకపోయినా.. తమ జీవితాల్లో మాత్రం మార్పు రావాల్సిందే నంటున్నారు. -
ప్రధానిగా చర్చిల్ గెలుపు
ఆ నేడు 26 అక్టోబర్, 1951 ఈ రోజున జరిగిన సాధారణ ఎన్నికలలో బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఎన్నికయ్యారు. 77ఏళ్ల చర్చిల్ బ్రిటిష్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండవ సారి కాగా, ఆ పదవికి ఎన్నికయిన వయోవృద్ధులలో రెండవ స్థానంలో నిలిచి మరో రికార్డు సృష్టించారు. కన్సర్వేటివ్ పార్టీ గెలుపు తథ్యమని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడో ప్రకటించినప్పటికీ, మెజారిటీ మాత్రం ఊహించినంత రాలేదు. ధరల పెరుగుదల, భారీగా పెరిగిన గృహనిర్మాణ వ్యయం వంటి కారణాలతో చర్చిల్ కేవలం 17 సీట్ల స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కాననిపించారు. ప్రత్యర్థి పార్టీ అయిన లేబర్ పార్టీ చర్చిల్ను యుద్ధపిపాసిగా అభివర్ణించినప్పటికీ, తాను గెలిస్తే సుస్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చర్చిల్ చేసిన ఎన్నికల వాగ్దానమే ఆయన గెలుపునకు ప్రధాన కారణాలలో ఒకటని విమర్శకులంటారు. ఆ తర్వాత చర్చిల్ అనారోగ్య కారణాలతో 1955లో తన పదవికి రాజీనామా చేశారు. 1964లో తన 91వ ఏట కన్నుమూశారు. -
నీ గెలుపు నావల్లే... రుణం తీర్చుకో!!
నా వల్లే నీ గెలుపు సాధ్యమైంది అందుకు పెట్టిన ఖర్చు వెనక్కు ఇచ్చేయ్ అని తెగ సతాయిస్తున్నార ట పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను అదే జిల్లాకు చెందిన ఎంపీ ఒకరు. కారణాలేమైనప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన ఓ పెద్దాయన ఈసారి గెలిచేశారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆయన దాదాపు ఆస్తులు అమ్మకానికి కూడా పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు చేతిలో పైసలు లేవు. నా ఆస్తులు తీసుకుని మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి అని బతిమిలాడుకున్న సదరు ఎంపీ అభ్యర్ధి ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఓ ఎమ్మెల్యే గారిని ప్రతి రోజూ డబ్బుల కోసం సతాయిస్తున్నారట. నా పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ఉన్న మీరు ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లలో ఖర్చు చేశాను. ఆ డబ్బును నాకు వెంటనే ఇచ్చేయండి లేదంటే అవి ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు అని భయపెడుతూ ఇంకో అడుగు ముందుకేసిన ఆయన వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఎలా వస్తుందో చూస్తా అని హెచ్చరిస్తున్నారట. ఎన్నికల ముందు వరకూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్ధులు ఫోన్లు చేస్తే కనీసం స్పందించని ఎంపీ గారు ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇలా బెదిరింపులకు దిగుతున్నారేంటబ్బా అని టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారట. -
మళ్లీ కామెరానే బ్రిటిష్ ప్రధాని
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీగా సాగిన పోరులో కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరోసారి ప్రధాని పీఠాన్నిఅధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీ ఇప్పటికి 326 సీట్లను గెల్చుకుంటే, ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ 230 సీట్లు సాధించింది. 643 స్థానాల్లో ఫలితాలను వెల్లడించారు. మరో 7 సీట్లకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉండగానే కన్సర్వేటివ్స్ విజయం ఖాయమైపోయింది. సాధారణ మెజారిటీకి కావల్సిన 326 మ్యాజిక్ మార్కును సాధించారు. ఎగ్జిట్ పోల్స్కు అంచనాలకు కొంచెం అటూ ఇటుగా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు డేవిడ్ కామెరాన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకోసం ఆయన బ్రిటిష్ రాణిని అనుమతి కోరారు. స్కాటిష్ నేషనల్ పార్టీ సంచలన విజయాలను నమోదు చేసింది. 56 సీట్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఒక విధంగా వీరి ఫలితం ప్రధాన ప్రతిపక్షాన్ని బాగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. మొత్తం కాగా మొత్తం 650 స్థానాలకు ఇప్పటివరకు ఫలితాలు ఇలా ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 326 లేబర్ పార్టీ 230 స్కాటిష్ నేషనల్ పార్టీ 56 లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 8 డియూపి 8 ఇతరులు 15 రాణి ఎలిజబెత్ అధికారిక ప్రకటన అనంతరం ఈ నెల 27న కొత్త పార్లమెంటు కొలువుదీరనుంది. కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీ, ప్రతిపక్షం లేబర్ పార్టీ 239 స్థానాలు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. విపక్షనేత రాజీనామా బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష నేత ఎడ్ మిలిబాండ్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఇక ఓటమిని అంగీకరించక తప్పలేదు. మోదీ అభినందనలు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ను అభినందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆయనకు అభినందనలు తెలిపారు. 'ఫిర్ ఏక్ బార్.. కామెరాన్ సర్కార్' (మరోసారి కామెరాన్ ప్రభుత్వమే) అంటూ తన ఎన్నికల సమయం నాటి నినాదాన్ని గుర్తుచేశారు. అప్పట్లో 'అబ్ కీ బార్ మోదీ సర్కార్' అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. Congratulations @David_Cameron. As you rightly pointed out- its "Phir Ek Baar, Cameron Sarkar!" My best wishes. pic.twitter.com/xf5tJfW0SE — Narendra Modi (@narendramodi) May 8, 2015 -
అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు
లండన్: బ్రిటన్ అధికారపీఠం కోసం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ గట్టిగా ఉంది. నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తన స్థానాలను నిలబెట్టుకుంటోంది. ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. అధికార పార్టీ 218 సీట్లను గెల్చుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం 200 సీట్లు సాధించింది. అయితే తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఫలితాలపై కామెరాన్ ట్విట్ చేశారు. 'ఒకే జాతి.. ఒకే రాజ్యం...మరోసారి దేశప్రధానిగా ఎన్నికయితే.. ప్రజలకు సేవచేసే అవకాశం దొరకడం నా అదృష్టం' అంటూ ఆయన ట్విట్ చేశారు. ముందుంది మంచి కాలం అన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత, లేబర్ పార్టీ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎడ్ మిలిబాండ్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత నిక్క్లెగ్, యునైటెడ్ కింగ్డమ్ ఇండిపెండెన్స్ పార్టీ నికెల్ ఫరాగ్, స్కాటిష్ నేషనల్ పార్టీ అధిపతి నికోలా స్టర్జన్ తదితరులు విజయాన్ని సాధించినవారిలో ఉన్నారు. ఆరు లక్షలకు పైగా భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో నిర్ణాయశ శక్తిగా మిగలడం విశేషం. ఫలితాలను రాణి ఎలిజబెత్ అధికారికంగా ప్రకటించిన అనంతరం ఈ నెల 27న ఆమె ప్రసంగంతో కొత్త పార్లమెంటు కొలువుదీరనుందని సమాచారం. -
ఆసక్తికరంగా బ్రిటన్ ఎన్నికల ఫలితాలు
లండన్: నువ్వా.. నేనా అన్నట్లుగా జరిగిన బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు నమోదయ్యాయి. తరువాత క్రమంగా కన్సర్వేటివ్ పుంజుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ 200, లేబర్ పార్టీ188, ఎస్ఎన్పీ 55 స్థానాలను గెలుచుకున్నాయి. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు స్కాటిష్ నేషనల్ పార్టీ 55 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా 20ఏళ్ల ఎస్ఎన్పీ అభ్యర్థి మైరి బ్లాక్ అనే విద్యార్థి విజయాన్ని సాధించారు. పార్లమెంటుకు ఎన్నికైన అతి చిన్న వయస్కురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా మొత్తం 650 స్థానాలకు, 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది. -
బ్రిటన్ ప్రధానిగా మళ్లీ కామెరాన్?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాని డేవిడ్ కామెరాన్ మరో సారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంటారా ? అంటే అవుననే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. వచ్చే ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బ్రిటన్ పార్లమెంట్లోని మొత్తం 650 స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వాటిలో 316 స్థానాలు కన్జర్వేటివ్ పార్టీనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ మాత్రం 239 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందే అని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్పై డేవిడ్ కామెరాన్ ప్రభుత్వంలోని మంత్రి మైఖల్ గోవ్ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పింది అక్షరాల నిజం అని అన్నారు. -
బ్రిటన్లో మొదలైన పోలింగ్
లండన్ : బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మొదలైంది. 5కోట్ల మంది ప్రజలు సుమారు 50 వేల పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలతో పాటు 9వేల కౌన్సిల్ సీట్లకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కోప్లాండ్, టోర్బే, బెడ్ఫోర్డ్ లీసెస్టర్ తదితర నగరాల మేయర్ల భవితవ్యం కూడా ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. ఈ అర్థరాత్రివరకు ఫలితాలపై ఒక అంచనా రావచ్చని తెలుస్తోంది. -
తమ్ముడూ సెలైంట్!
క్యాడర్ లేని టీటీడీపీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం కష్టమే.. ఇప్పుడే ప్రజా ఉద్యమాలొద్దు మూడేళ్ల తర్వాతే ప్రజల్లోకెళ్లండి జిల్లా నాయకులకు చంద్రబాబు సూచన అప్పుడైనా ప్రజలు నమ్ముతారా? ఆలోచనలోపడ్డ పార్టీ శ్రేణులు సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఉనికి కోల్పోయిన టీడీపీ మూడేళ్ల తర్వాతే ప్రజల ముందుకు రావాలని నిర్ణయించింది. ముందుగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని భావించినా.. క్యాడర్ లేక.. ప్రజల స హకారం లేక కార్యక్రమాలన్నీ విఫలమై పార్టీ పరువుపోతుందని అధిష్టానం భావించింది. ఇప్పుడే ప్రజల్లోకి వెళ్లొద్దని టీడీపీ భావిస్తోంది. ముందుగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు క్యాడర్ను బలోపేతం చేసుకుని.. ఆ తర్వాతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఆ పార్టీ అధినేత చం ద్రబాబు నాయుడు ఇటీవల జిల్లా నాయకులకు సూచించి నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల ‘సైకిల్’ ఎక్కిన బో డ జనార్దన్ ముందుగా క్యాడర్ను బలోపేతం చేసుకునే పని లో పడ్డారు. కానీ.. క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు లేకపోవడంతో వారిని ఎలా ప్రసన్నం చేసుకోవా లో తెలియక ‘దేశం’ నేతలు మార్గాలు అన్వేషిస్తున్నారు. సా ర్వత్రిక ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండాపోయిన టీడీపీ నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఇప్పటికే ఇత ర పార్టీలకు వలస వెళ్లిపోయారు. దీంతో పార్టీ క్యాడర్ పూర్తి గా బలహీనపడింది. మిగిలిన పార్టీ శ్రేణులూ ప్రజల్లో వెళ్లేం దుకు సాహసించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా ఆ పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్నివ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. మరో నాలుగేళ్ల వరకు ఎన్నికలు లే నందునా.. మూడేళ్లలో పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసి ఎన్నికల ముందు మళ్లీ ప్రజల్లో వెళ్లాలని నిర్ణయించింది. నమ్మకం కలిగించేదెలా..? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న.. రా ష్ట్ర ఏర్పాటు తర్వాతా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీ రు, విద్యుత్ వాటాను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రజల్లో విశ్వాసం ఎలా కలిగించాలి..? పార్టీని ఎ లా బలోపేతం చేయాలో తెలియక జిల్లా నాయకత్వం ఆలోచనలో పడింది. బాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని గమనించి.. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని ఘోరంగా ఓడించిన ప్రజలు.. ఇకపై కూడా బాబును నమ్మొద్దని నిర్ణయించుకున్నారు. ఇదే క్రమంలో గత నెలలో టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదులో ‘ప్రమాద బీమా’, ‘ఆరోగ్య బీమా’ ఆఫర్లు ప్రకటించినా ఎవరూ విశ్వసించలేదు. దీంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘోరంగా విఫలమైంది. అధిష్టానం ఊహిస్తున్నట్లుగా క్యాడ ర్ కొద్దోగొప్పో బలోపేతమైనా ఆ సమయంలో పార్టీ చేపట్టే ఆందోళనలో ప్రజలు భాగస్వాములవుతారో లేరోనని ఇప్పట్నుంచే ఆ పార్టీ నాయకులకు ఆందోళన పట్టుకుంది. -
సాధారణ నేరాలు తగ్గినా..
ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయి మహిళలు, ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాలు కూడా పెరిగాయి వార్షిక నివేదికలో డీజీపీ అనురాగ్శర్మ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ ఏడాది సవ్యంగా ఉన్నాయని, నేరాలు తగ్గుముఖం పట్టాయని, అయితే ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయని డీజీపీ అనురాగ్శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, కొత్త ప్రణాళికల అమలుపై ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను విలేకరులకు అందజేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర పోలీసుల ప్రతిష్టను అంతర్జాతీయస్థాయికి పెంచుతామన్నారు. సార్వత్రిక ఎన్నికల బందోబస్తు విజయవంతంగా నిర్వహించామని, ఒక్క రీపోలింగ్ ఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. ఈ ఏడాది నవంబర్నాటికి రాష్ట్రంలో 93,392 నేరాలు నమోదు కాగా, గత ఏడాది 93,780 నమోదయ్యాయన్నారు. ఆర్థికనేరాలు గత ఏడాది కంటే ఈ సంవత్సరం 6.47 శాతం పెరిగాయని, సైబర్ నేరాలు కూడా గత ఏడాది కంటే వంద శాతం పెరిగాయన్నారు. గత ఏడాది రూ.139.19 కోట్ల రూపాయల ఆస్తి చోరుల పాలు కాగా, ఈ ఏడాది రూ.141.17 కోట్ల రూపాయల ఆస్తి చోరుల పాలైందన్నారు. అత్యాచారాలు 14.34 శాతం పెరిగాయన్నారు. ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాల నిరోధకచట్టం కింద కేసులు ఈ ఏడాది 57.86 శాతం పెరిగాయన్నారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టామన్నారు. ఈ ఏడాది 370 ట్రాఫికింగ్ కేసులు నమోదు కాగా 528 మంది బాధితులను రక్షించామన్నారు. మావోయిస్టుల చేతుల్లో ఈ ఏడాది నలుగురు హత్యకు గురయ్యారని, ఒక నక్సలైట్ ఎదురుకాల్పుల్లో మరణించారని అన్నారు. ఏడు ఎన్కౌంటర్లు జరుగగా, 68 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 18 మంది అరెస్టయ్యారని పేర్కొన్నారు. ఐఎస్ఐ కార్యకలాపాలపై డేగ కన్ను.. రాష్ట్రంలో ఐఎస్ఐ దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై డేగ కన్నేశామని డీజీపీ వివరిం చారు. సిమికి చెందిన షాముదస్సిర్, షోయబ్ అహ్మద్ఖాన్లను అక్టోబర్ 22న సికింద్రాబాద్లో అరెస్టు చేశామన్నారు. అలాగే నలుగురు సిటీ విద్యార్థులు ఐఎస్ఐఎస్ భావజాలానికి లోనై దేశ సరిహద్దులు దాటుతుండగా వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. 24 అంతస్తుల భవనం... రూ.20 కోట్లతో బంజారాహిల్స్లో 24 అంతస్తుల అత్యంత ఆధునిక పోలీసు కమిషనరేట్ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళా భద్రత కమిటీ చేసిన సిఫార్సుల మేరకు వన్స్టాప్ క్రైసిస్ సెంటర్లను ఏర్పాటుచేయడం, మహిళల కోసం ప్రత్యేకించి 181 నంబరుతో కంట్రోల్రూంను ఏర్పాటు చేశామన్నారు. మహిళల ఫిర్యాదుల కోసం అన్ని పోలీసు స్టేషన్లలో డెస్క్ను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్లో షీ టీమ్ను ఏర్పాటు చేసి పోకిరీల భరతం పడుతున్నామని అన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణను చేపట్టడం జరిగిందన్నారు. శిక్షల రేటును పెంచడానికి కోర్టు మానిటరింగ్ సిస్టమ్ను చేపడుతున్నామని తెలిపారు. సోషల్మీడియాను ఆధారంగా చేసుకుని ప్రజలకు మరింతగా సేవలు అందించాలని, పీపుల్స్ ఫ్రెండ్లీ వ్యవస్థగా పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కొత్త రిక్రూట్మెంట్ పాలసీని అమలు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సీనియర్ అధికారులు మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్, సత్యనారాయణ్, చారుసిన్హా, శివధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం
- ఒక్క శాతం కేసులు రుజువైనా 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై వేటు - సుపరిపాలన వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్ప రెడ్డి సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఒక్క శాతం కేసులు రుజువైనా సుమారు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని సుపరిపాలన వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్పరెడ్డి పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నమోదైన 9,867 కేసుల్లో ఒక్క కేసూ విచారణ పూర్తికాలేదన్నారు. ఎన్నికల కేసుల దర్యాప్తు విషయంలో పోలీసు శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం ఉదాసీనతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వేదిక ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి రిటైర్డు ఐఎఫ్ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డితో కలిసి జస్టిస్ రెడ్డప్పరెడ్డి గురువారం తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం రూ.36 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని 1,916 కేసులను నమోదు చేశారన్నారు. బంగారు ఆభరణాలు, ఇతర వస్తువుల పంపిణీ ఆరోపణలపై 398 కేసులు, మద్యం పంపిణీ ఆరోపణలపై 4,974 కేసులు పెట్టారని తెలిపారు. ఆ తర్వాత కేసుల దర్యాప్తును పోలీసు శాఖ విస్మరించిందన్నారు. ఎన్నికల్లో పట్టుబడిన నగదును పోలీసులు ఆదాయ పన్నుల శాఖకు అప్పగించి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ గాలం
సమకాలీనం సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలే మారుతున్నట్టు కనిపిస్తోంది. చట్టసభల్లో విపక్షం గొంతు వినిపించకూడదు, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే శక్తులు బయట కనిపించకూడదు అనే ధోరణిని పాలకపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరం. అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు తెలుగునాట తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మూడిటిదీ అటు ఇటుగా ఇదే వైఖరి. ‘‘మనం దేశంలో అతి పెద్ద పార్టీ కావాలి!’’ అని అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడంలో తప్పు లేదు. ‘‘మనం మాత్రమే మిగలాలి’’ అనే వైఖరిని ప్రదర్శించడం మింగుడుపడేది కాదు. చిన్న చిన్న కంపెనీల్ని విలీనం చేసుకుంటూ బహుళజాతి సంస్థలు బలపడే తరహాలోనే నేడు భారత రాజకీయాల్లో నూతన విధ్వంస సంస్కృతి పెచ్చరిల్లు తోంది. శరవేగంగా రాజకీయాల కార్పొరేటీకరణ జరుగుతోంది. ఇదివరలో రాజకీయ పక్షాలు తాము ప్రజలకు దగ్గరై బలపడాలనీ, ఇతర రాజకీయ పార్టీలు ప్రజల మద్దతు కోల్పోయి బలహీనపడాలని కోరుకునేవి. ఇప్పుడు ఆ వైఖరి పూర్తిగా మారుతోంది. కొన్ని రాజకీయ పక్షాల్లో, ఇతర రాజకీయ పార్టీల పొడ గిట్టని అసహనం పెరిగిపోతోంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఉనికే ఉండకూడ దన్న ఏకపక్ష ధోరణితో అవి పార్టీలకు పార్టీలనే సమూలంగా నిర్మూలించే అనై తిక, అభ్యంతరకర చర్యలకు దిగుతున్నాయి. రాజకీయ స్పర్థలు ఎన్నికల వరకు ఉండటం, పిదప కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ ఎన్నికలవరకు ఎవరి పనుల్లో వారుండటం సహజంగా జరిగేది. కానీ, ఇటీవల ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలే మారుతున్నట్టు కనిపి స్తోంది. చట్టసభల్లో విపక్షం గొంతు వినిపించకూడదు, ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించే శక్తులు బయట కనిపించనే కూడదు అనే ధోరణిని పాలకపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారుతోంది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, తెలుగునాట.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మూడూ పాలక పక్షాలుగా కొంచెం అటుఇటుగా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. చట్టాలు, సంప్రదాయాలు, కనీస విలువలకు తిలోదకాలిచ్చి ప్రత్యర్థి పార్టీల వారిని తమ పార్టీల్లోకి లాక్కుంటూ అవి అనుసరిస్తున్న విధానాలు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. ఒక రకంగా ఈ మూడు పాలకపక్షాలు తమ నూతన విధ్వంస సంస్కృతి విస్తరణకు తెలుగునేలను ప్రయోగశాలగా వాడుకుంటున్నట్టు స్పష్టమౌతోంది. ఒకవంక ప్రత్యర్థి రాజకీయ పార్టీల నిర్మూలన, మరో వంక బాగా పలుకుబడి, అర్థ-అంగ బలమున్న కార్పొరేట్ శక్తుల్ని కీలక పదవుల్లోకి తెస్తూ అతివేగంగా రాజకీయాల్ని కార్పొరేటీకరణ చేస్తున్న తీరూ కలసి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా పార్టీ జెండా మోసిన కార్యకర్తల ప్రాధాన్యత క్రమంగా తగ్గు తోంది. పెట్టుబడిదారులకు, వ్యవహారకర్తలకు, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్నారు. ఈ నయా రాజకీయ సంస్కృతిలో కుల సమీకరణలు, సామాజిక అమరికలు కూడా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. విలువలు, విధానాల కన్నా ఎత్తులు-ఎత్తుగడలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలి. ఒకసారి గెలిచామంటే ఎదురులేని విధంగా స్థిరపడాలి. మళ్లీ ఎన్నికల నాటికి ‘ఏ పరిస్థితుల్నయినా’ ఎదుర్కోగల బలాన్ని, బలగాన్ని, ఇతర వన రుల్ని, సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. పనిలో పనిగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను వీలయినంతగా బలహీనపర్చడం, అవకాశముంటే పూర్తిగా మట్టుపె ట్టడం అన్న పంథాను బహిరంగంగానే కొన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇద్దరు మోదీలను చూశాం ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ను పక్కన కూర్చోబెట్టుకుని, తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి... తెలివైన సర్దుబాట్లు, వ్యూహాత్మక ఎత్తుగడలతో తలప డిన నరేంద్రమోదీని చూశాం. ఎన్నికల తర్వాత, బీజేపీని, ఆ పార్టీ నేతృత్వం లోని ఎన్డీఏ కూటమిని ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయ తీరాలు దాటించిన నవ్య నరేంద్ర మోదీని చూశాం. ఇద్దరు మోదీల మధ్య ఎంత వ్యత్యాసముందో, అంతగానూ దేశ రాజకీయాల స్వరూప, స్వభావాలు నేడు మార్పులకు గురవు తున్నాయి. సరిగ్గా ఆరేడు మాసాల క్రితం.. ప్రాంతీయ రాజకీయశక్తులు ప్రధాన జాతీయ పార్టీలకే వెన్నులో చలిపుట్టించే స్థితి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారు మారైంది. ఎన్డీఏ, ముఖ్యంగా దాని పెద్దన్న బీజేపీ దెబ్బకు దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు కుదేలయ్యాయి. కాంగ్రెస్ ఖంగు తింది. 543 లోక్సభ స్థానా ల్లో కాంగ్రెస్ తనకు తానుగా 44 స్థానాలు తెచ్చుకోగా, దాని నేతృత్వంలోని యూపీఏ 58 స్థానాలకు పరిమితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంకీర్ణ ధర్మాల వ్యాకరణాన్నే మార్చేసిన రాజకీయ వాతావరణం పురుడు పోసుకుంది. ఇప్పుడు దాన్ని పెంచి పెద్దచేసే బాధ్యత బీజేపీ అధినాయకత్వం భుజాలకెత్తుకుంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిన జేడీ(యు), ఎస్పీ, ఆర్జేడీ, ఐఎన్ఎల్డి వంటి రాజకీయ శక్తులన్నీ ‘జనతా పరివార్’గా కూటమి కట్టి పునరేకీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలూ బలంగా ఉంటే తప్ప ప్రాంతీయ పార్టీల కథ ముగిసినట్టు కాదని సంకేతాలిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలపడ్డ క్రమంలోనే కాంగ్రెస్ బలహీన పడ్డ తీరు రాజకీయ శూన్యతకు ప్రతీకనీ, అది ప్రాంతీయ శక్తుల విస్తరణకు అనుకూలించే అంశమనీ వారి వాదన. కానీ, ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ, బీజేపీ నూతన అధ్యక్షుడు అమిత్ షాల జోడీ విజృంభిస్తున్న తీరు మాత్రం ప్రాంతీయ శక్తులది మేకపోతు గాంభీర్యమేనా? అన్న అనుమానాల్ని రేకెత్తిస్తోంది. నిన్నటి హర్యానా, మహా రాష్ట్ర ఎన్నికల ఫలితాలు, రేపటి ఎన్నికలకు సమాయత్తమౌతున్న జమ్మూ- కాశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పన్నుతున్న వ్యూహాలు ఈ అనుమా నాల్ని బలోపేతం చేస్తున్నాయి. ప్రాంతీయశక్తుల్ని కొల్లగొట్టయినా బీజేపీని అప్ర తిహత శక్తిగా మలచాలన్న వారి యుక్తులు అడుగడుగునా స్పష్టమౌతున్నాయి. మరిన్ని కుయుక్తుల బాటలో... ఎన్నికల ముందు మాయావతి, ములాయంసింగ్, లాలూప్రసాద్, మమతా బెనర్జీ, శరద్పవార్, కరుణానిధి, జయలలిత, నవీన్ పట్నాయక్, నితీష్కు మార్... ఇలా ఎవరికి వారే బలమైన శక్తులుగా కనిపించారు. వారి ప్రభావం బలంగా ఉండి రెండు ప్రధాన జాతీయ పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్కు వణుకు పుట్టించాయి. బీజేపీ తనదైన శైలిలో ప్రచార వ్యూహాలు, పొత్తుల ఎత్తు లతో, ఆరెస్సెస్ వంటి శక్తుల ఎత్తుగడలతో కొంత ధీమాగానే సాగింది. అయితే, సొంతంగా 282 స్థానాలు గెలిచిన బీజేపీ మొత్తం 543 లోక్సభ స్థానాలకుగాను ఎన్టీఏకు 336 స్థానాలు గెలిపించి పెట్టడం రాజకీయ పక్షాల్లో కొంత విస్మయాన్ని కలిగించింది. కానీ, అది మోదీలో కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది. మెలమెల్లగా పార్టీని ‘అఖండ బీజేపీ’గా మలచి, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దాన్ని అప్రతిహత శక్తిని చేయాలన్న వ్యూహానికి అది ఊపిరి పోసింది. అమిత్షా అందుకు తోడయ్యాడు. ‘‘మనం దేశంలోనే అతిపెద్ద పార్టీ కావాలి’’ అని అమిత్ షా పార్టీశ్రేణులకు పిలుపునివ్వడంలో ఏ తప్పూ లేదు. కానీ, కాలక్రమేణా మనం మాత్రమే మిగలాలి అన్న ధోరణిని ప్రదర్శించడం ప్రత్యర్థి పక్షాలు జీర్ణించుకోలే కపోతున్నాయి. సంకీర్ణ భాగస్వాముల అలకలు, ప్రాంతీయ శక్తుల ప్రాబల్యా లకు మొన్నటి ఎన్నికలకు ముందు ఎంతగానో జడిసిన బీజేపీ... తద్విరుద్ధంగా ఎన్నికల తదుపరి శివసేన పట్ల అనుసరించిన వైఖరే అందుకు నిదర్శనం. పాతికేళ్ల మిత్రపక్షాన్ని మహా ఎన్నికల్లో దూరం పెట్టి, కడకు ఫలితాల్లో చుక్కలు చూపించింది. బెట్టు చేస్తే రేపు, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్కూ ఇదే గతి తప్పదేమో! అంతేగాక సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో బహుమతి లభించిం దన్న ధీమాతో అది కశ్మీర్, బీహార్లలో కూడా కొత్త ఎత్తుగడలకుపోతోంది. ఇదొక పార్శ్వం మాత్రమే! అసలు ఎత్తుగడ అస్సాంలో కనిపిస్తోంది. 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరవచ్చన్న బీజేపీ శాసనసభా పక్షనేత మాటలకు అక్కడి తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుపా నులో అరటాకులా అల్లల్లాడుతోంది. మూడింట రెండొంతుల మందిని చేర్చు కుంటే పార్టీ మార్పిళ్ల చట్టం వర్తించదని, ‘విలీనం’ కిందకు వస్తుందని అటు పావులు కదుపుతున్నారు. 126 సభ్యుల సభలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం 78. ఇప్పటికే 31 మంది కాంగ్రెస్ సభ్యులు వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఇలాంటి అనైతిక పార్టీ మార్పిళ్ల గురించి, కార్పొరేట్ శక్తులకు పరుస్తున్న ఎర్ర తివాచీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తెలంగాణ అసెంబ్లీలో ఏకపక్షంగా తెలుగుదేశం సభ్యుల్ని వారం పాటు సస్పెండ్ చేస్తే గట్టిగా గొంతెత్తే విపక్షం లేదు. తమ నాయకుల్ని పాలకపక్షం చట్ట వ్యతిరేకంగా లాక్కుంటోందని అరిచి గీపెట్టి, కడకు కాంగ్రెస్ కూడా సస్పెన్షన్కు గురి కావాల్సి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరీ అన్యాయం. బ్యాలెట్ పెట్టెల్లో తడి ఆరకముందే పార్టీ ఫిరాయించి, అవతలి పక్షం కండువాలు ధరించిన ఎంపీపై ఫిర్యాదు చేసి నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ చర్య లేదు. ఇక అక్కడి కార్పొరేటీకరణ బహిరంగ రహస్యమే! ప్రతి ఎన్నికలప్పుడు, ముందూ, వెనుకా అక్కడి పాలక పక్షానికి ధన వ్యవస్థతో ఊడిగం చేయిస్తున్న కార్పొరేట్ శక్తుల, వ్యక్తుల ప్రాబల్యం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వంలో, పార్టీలో, ఎంపీల్లో, ఎమ్మెల్యేల్లో, ఎమ్మెల్సీల్లో.... అంతటా వారిదే ముఖ్యపాత్ర. పార్టీ సాధారణ కార్యకర్తలు ఎన్నికలప్పుడు పౌరుల్ని ఓటర్లుగా మార్చే సైనికులు మాత్రమే! ప్రజాస్వామ్యం, వేదికల మీద దంచే ఉపన్యాసాలకు పనికొచ్చే ముడిసరుకు మాత్రమే! ఇదీ పరిస్థితి!! ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ -
ఓటర్లు40 లక్షలు
40 లక్షల ఓటర్లు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 40,07,054 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో 39,644,78 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఈనెల 12 వరకు 42వేల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 40 లక్షలు దాటింది. ఇందులో 21,28,972 పురుష, 18,77,606 మహిళాఓటర్లతోపాటు 476 మంది ఇతర ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. ఈ ముసాయిదా జాబితాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల భవనాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చేనెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. 2015 జనవరి 5వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదే నెల 15న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. సంక్షిప్తంగా షెడ్యూలు.. అంశం తేదీలు ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడి నవంబర్ 13 అభ్యంతరాల స్వీకరణ నవంబర్13 - డిసెంబర్ 8 వార్డు సభల్లో ఓటర్ల వివరాలు వెల్లడి నవంబర్ 19, 26 ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నవంబర్ 16,23,30, డిసెంబర్ 7 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 22 తాజా జాబితా తయారీ, కొత్త ఓటర్ల చేర్పు జనవరి 5 ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా జనవరి 15, 2015 -
టీడీపీలో అసమ్మతి సెగలు
అసంతృప్తితో రగులుతున్న సీనియర్లు ‘తూర్పు’లో రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు గుడివాడలో ముదిరిన వర్గపోరు నూజివీడులో కులాలవారీగా జట్టు కట్టిన వైనం సాక్షి ప్రతినిధి, విజయవాడ : అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా నిండకముందే టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. జిల్లాలోని అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలపైనే మాటల తూటాలు పేలుస్తున్నారు. గుడివాడ, నూజివీడు, విజయవాడ తూర్పు నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల నుంచే అసమ్మతి... సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటమి భయంతో ఇతర పార్టీల నాయకులను భారీగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో వారికి టీడీపీ అధినేత చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు. కొందరికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని, మిగిలిన వారికి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని నమ్మించారు. అయితే, ఎన్నికల ముందే కొందరికి చంద్రబాబు టికెట్లు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిగిలిన వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకుండా తాత్సా రం చేస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. మరోవైపు ఒకే నియోజకవర్గంలో కొందరు నాయకులకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. ‘గుడివాడ’లో గందరగోళం గుడివాడ నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గానికి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరైన పిన్నమనేని కూడా గత ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆయనకు ఆప్కాబ్ చైర్మన్ పదవి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని పిన్నమనేని వర్గీయులు మండిపడుతున్నారు. ఇటీవల గుడివాడలో జరిగిన టీడీపీ నందివాడ మండల సమావేశంలో పిన్నమనేని మాట్లాడుతూ తన అనుచరులు, సహచరులకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సామాజిక పింఛన్ల తనిఖీ కమిటీల్లో తాను చెప్పిన వారిని ఒక్కరినీ నియమించలేదని, మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని కూడా తాను సూచించిన వ్యక్తికి ఇవ్వలేదని పిన్నమనేని ఇటీవల మరోసారి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన రావి వెంకటేశ్వరరావు హవా సాగుతుండటంతో పిన్నమనేని వర్గీయులు జీర్జించుకోలేకపోతున్నారు. కనీస ప్రాధాన్యం దక్కని యలమంచిలి రవి! తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి టీడీపీలో కనీస ప్రాధాన్యత కూడా లభించడం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన యలమంచిలి రవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి దేవినేని నెహ్రూ (కాంగ్రెస్), గద్దె రామ్మోహన్ (టీడీపీ)లపై గెలుపొందారు. అప్పట్లో వంగవీటి రాధాకృష్ణ పూర్తిగా మద్దతు ఇవ్వడంతో రవి సునాయాసంగా గెలుపొందారు. అయితే, పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత రవి కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. గత ఏడాది జరిగిన రాష్ట్ర విభజన, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవి మళ్లీ తూర్పు నియోజకవర్గ సీటును ఆశించారు. వివాదరహితుడిగా పేరున్న ఆయనకు సీటు ఇస్తానని చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఎన్నికల ముందు సీన్ రివర్స్ అయ్యింది. తూర్పు టికెట్ను గద్దె రామ్మోహన్కు ఇచ్చారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రవికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన వర్గీయులు అసమ్మతితో రగిలిపోతున్నారు. నూజివీడులో కులాల కుమ్ములాట నూజవీడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కులాల వారీగా జట్టు కట్టి ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన అని ఒక సామాజికవర్గ నేతలు చెబున్నారు. మరో సామాజికవర్గానికి చెందిన టీడీపీ నూజివీడు మండల అధ్యక్షుడు కాప శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు నూతక్కి వేణు కలిసి తమ నియోజకవర్గానికి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇన్చార్జి కాదని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో రెండు సామాజికవర్గాల మధ్య పోరు సాగుతోంది. మరోవైపు ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా ముద్దరబోయినకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. ఇలా జిల్లా అంతటా టీడీపీలో అసమ్మతి నెలకొంది. కొందరికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండగా నిలుస్తున్నారు. మరికొందరికి మంత్రి కొల్లు రవీంద్ర అండగా ఉంటున్నారు. ప్రతి ప్రాంతంలోనూ రెండు వర్గాలు ఆధిపత్యం కోసం కత్తులు దూస్తున్నాయి. కొన్నిసార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం గొడవలకు దిగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. -
పోలీస్..!
సీఐ పోస్టింగ్ల సీన్ చేంజ్ టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లతో బదిలీలకు బ్రేక్! పోస్టింగ్ల రద్దు ఖరారు సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ రీజియన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ల పోస్టింగ్ల కథ తిరగబడింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం జరిగిన 29 మంది సీఐల బదిలీలకు బ్రేక్ పడింది. బదిలీల్లో పోస్టింగ్లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరొద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ నిర్ణయం తీసుకునే వరకు పాత పోస్టింగ్లోనే కొనసాగాలని ఆదేశించారు. సాధారణ ఎన్నికల తర్వాత 29 మంది సీఐలను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. ఆలస్యంగా జరిగిన ఈ బదిలీలు రాజకీయ కారణాలతో ఆగిపోయాయి. తెలంగాణలో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహరచన చేస్తుండగా... అధికార టీఆర్ఎస్ నేతలే దీన్ని నీరుగారుస్తున్నారు. తమకు ఇష్టమైన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన రాజకీయంతో పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారే పరిస్థితి నెలకొంది. వరంగల్ రేంజ్ పరిధిలో 29 మంది సీఐలకు ఇచ్చిన పోస్టింగ్లను 24 గంటల్లోనే రద్దు చేస్తూ ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కొన్ని పోస్టింగ్లు ఇవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఏళ్లుగా లూప్లైన్ సర్వీస్లో మగ్గుతున్న ఇన్స్పెక్టర్లకు తాజా బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తమకు దగ్గరగా ఉంటున్న కొందరు సీఐలకు మంచి స్థానాల్లో పోస్టింగ్లు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు, సీఐలకు మధ్య కొన్ని వ్యవహారాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల ప్రతిపాదనలను పక్కనబెట్టి పోలీసు ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇబ్బందికరంగా భావించారు. వెంటనే ఉన్నత స్థాయిలో రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా పోస్టింగ్లను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే విషయంలో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోంది. లూప్లైన్ సీఐల మొర... ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, సిబ్బంది పోస్టింగ్ విషయంలో నిబంధనలు ఉంటాయి. కొన్నేళ్లు ఫోకల్ స్థానాల్లో విధులు నిర్వర్తించిన వారు మరికొన్నేళ్లు నాన్ ఫోకల్ పోస్టుల్లో విధులు నిర్వర్తించాలి. సివిల్ విభాగంలో సీఐలుగా పని చేసిన వారు అనివార్యంగా కొంతకాలం సీఐడీ, రైల్వే, ట్రాన్స్కో, ఎస్బీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పని చేయాలి. రాజకీయ కారణాలతో ఇది మారిపోతోంది. సివిల్ విభాగంలో సీఐలుగా పనిచేస్తున్న వారు... అధికార పార్టీ నేతల సహకారంతో వరుసగా ఇలాంటి పోస్టుల్లోనే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో తాము సూచించిన వారు లేకపోవడంతో రాజకీయ నాయకులు అసంతృప్తికి లోనయ్యారు. సీఐలకు ఇచ్చిన మాట నెరవేకపోవడంతో రాజకీయ నేతలకు కష్టంగా మారింది. బదిలీ అయిన సీఐలలో 16 మంది ప్రస్తుతం లూప్లైన్ పోస్టింగ్లోనే ఉన్నారు. మరో 13 మంది సీఐలు రాజకీయ నాయకులు ప్రతిపాదించిన వారు ఉన్నారు. లూప్లైన్ వారు దక్కించుకున్న పోస్టింగ్లకు సంబందించి ప్రజాప్రతినిధులు వేరే వారికి గతంలో మాట ఇచ్చారు. బదిలీ ఉత్తర్వులతో ప్రజాప్రతినిధులు ఇబ్బందిగా ఫీలయ్యారు. బదిలీ ఉత్తర్వులు నిలిపివేఆయలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ నేతల తీరు ఇలా ఉంటే... అధికార పార్టీ ప్రజాప్రతినిధికి సోదరుడు అయిన ఒక సీఐ పోస్టింగ్ల విషయంలో ఏకంగా హైదరాబాద్ సచివాలయంలో హంగామా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనుకున్నదే జరిగింది... నిబంధనల ప్రకారం జరిగిన సీఐల బదిలీల నిర్ణయంపై పోలీసు ఉన్నతాధికారుల్లోనూ కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇదే నిజమవుతోంది. వరంగల్ రేంజ్ ఐజీ రవిగుప్తా శుక్రవారం నాలుగు జిల్లాల ఎస్పీలతో మాట్లాడుతూ... కొన్నేళ్లుగా లూప్లైన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లపై సానుభూతితోనే ఈ పోస్టింగ్లు ఇస్తున్నామని, ఆయా స్టేషన్ల పరిధిలో స్ధానిక ప్రజాప్రతినిధులను మేనేజ్ చేయాలని సూచించారు. కొంతమంది ఎస్పీలు సైతం స్థానిక ప్రజాప్రతినిధులకు పోస్టింగ్లపై ఫోన్లో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సీఐల పోస్టింగ్ల కథ మొదటికే వచ్చింది. మమ్మల్ని అణగదొక్కుతున్నారు పోలీసు శాఖలో తమను అణగదొక్కుతున్నారని సీఐ విష్ణుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బదిలీలో దళిత సీఐలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. మరో సీఐ సుబ్బారావు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు. అరగుండు, అరమీసంతో వచ్చిన ఆయన మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడికి చేరుకున్న మీడియా ఇదేంటని ప్రశ్నించగా... తాను ఇంటి సమస్యలతో బాధపడుతున్నానని, ఇలా వచ్చి తమ దేవుడైన అంబేద్కర్కు పూలమాల వేస్తే అన్ని సర్దుకుంటాయని ఒకరు చెప్పడంతో ఇలా చేశానని చెప్పారు. సిఐ పోస్టింగులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
‘దేశం’ ఢీలా
* వలసబాటలో తెలుగు తమ్ముళ్లు * దిక్కుతోచని స్థితిలో తెలుగుదేశం పార్టీ * బస్సుయాత్రకు నో చెప్పిన నేతలు * సార్వత్రిక ఎన్నికల తర్వాత కార్యక్రమాలు జీరో * వీజీ గౌడ్ బాటలో మరికొందరు నేతలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ ఇందూరులో పూర్తిగా చతికిల పడింది. జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీరామారావుకు బ్రహ్మరథం పట్టిన ఇందూరు ప్రజలు.. ఇప్పుడా పార్టీని పట్టించుకునే స్థితిలో లేరు. టీడీపీలో ఎదిగిన ఎందరో నేతలు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చే రుతుండటంతో కేడర్ పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది. 1983 తొలి ఎన్నికలలో 9 స్థానాలకు ఏడుచోట్ల, 1985లో మొత్తం 9 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ఉనికి ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సార్వత్రిక ఎన్నికలతో పూర్తిగా ఢీలా పడిపోయిన టీడీపీకి ఇటీవల ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు వి. గంగాధర్ గౌడ్ రాజీనామా చేసి గులాబీ తీర్థం పుచుకొని చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. అదే బాటలో మరో సీనియర్ ప్రజాప్రతినిధి, నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం కావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశం అవుతోంది. వలస బాటలో తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం రాష్ర్టంలో నెలకొన్న వ్యవసాయ ప్రతికూల పరిస్థితులను విపక్షాలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్, టీడీపీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలి విపక్ష నేత డి.శ్రీనివాస్, షబ్బీర్అలీ తదితరులు జిల్లాలో పర్యటించారు. ‘భరోసా యాత్ర’ పేరిట పంట చేలను సందర్శించి రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో తెలంగాణ టీడీపీ బస్సుయాత్రను నిర్వహించింది. నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు తోడు నిజామాబాద్ జిల్లాలో సైతం ఈ యాత్రను చేపట్టాలని మొదట నిర్ణయించారు. అప్పటకే జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ టీడీపీని వీడేందుకు సిద్ధం కాగా, మిగతా నాయకులు బస్సుయాత్రకు ‘నో’ చెప్పినట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో నేతల వ్యవహారంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 2009 ఎన్నికలలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి గెలిస్తే, 2014 ఎన్నికల నాటికి ఆ పార్టీకి ఇద్దరే మిగి లారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డితో పాటు కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మం త్ సింధే టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న మండవ వెంకటేశ్వర్రావు, ఏలేటి అన్నపూర్ణమ్మ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వీజీ గౌడ్ పార్టీని వదలడం, మరికొందరు అదేబాట పడుతుండటంతో పార్టీలో చివరికి మిగిలేది ఎవరన్న చర్చ కేడర్లో సాగుతోంది. వీజీ గౌడ్ వెనుకనే.. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలలో కోలుకోలేని విధంగా దెబ్బతిన్న టీడీపీ ఆ తర్వాత జిల్లాలో మరిం తగా బలహీనపడింది. బీజేపీతో కూటమి కట్టిన టీడీపీ జి ల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసింది. ఆర్మూరులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్రెడ్డి గెలుపొందగా టీడీపీ అభ్యర్థి రాజారాం యాదవ్కు మూడో స్థానం దక్కింది. బాల్కొండలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. మూడో స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి ఎ.మల్లికార్జు న్ రెడ్డికి 25,216 ఓట్లు మాత్రమే వచ్చాయి. బోధన్లో టీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్రెడ్డి 26,396 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. బాన్సువాడలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్రెడ్డికి 65,868 ఓట్లు వస్తే.. టీడీపీకి చెందిన బద్యానాయక్ 19,692 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. జుక్కల్లో టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్సింధే విజయం సాధించగా.. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఉండగా.. టీడీపీ ఆఖరిస్థానంలో నిలి చింది. పొత్తులో భాగంగా నాలుగు చోట్ల పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు కూడ మూడు, నాలుగు స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను జీర్ణిం చుకోలేని టీడీపీ శ్రేణులు వరుసగా వలసబాట పడుతున్నారు. -
ధీమా కరువు!
రుణ‘మాయ’ ఎఫెక్ట్ పంటల బీమా అర్హత కోల్పోయిన సగానికి పైగా రైతులు వణికిస్తున్న ప్రకృతి విపత్తులు ‘హుదూద్’ గండం తప్పినా అన్నదాతలను వీడని ఆందోళన సాక్షి ప్రతినిధి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నమ్మిన జిల్లాలోని రైతుల పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా మారింది. ఆయన చెప్పినట్లు రుణమాఫీ జరగలేదు. కనీసం బ్యాంకుల నుంచి రైతులు ఖరీఫ్ సాగు కోసం రుణాలను సైతం పొందలేకపోయారు. ఇప్పుడు అష్టకష్టాలు పడి సాగు చేస్తున్న పంటలకు కూడా బీమా భరోసా కరువైంది. హుదూద్ తుపాను నేపథ్యంలో పంటల బీమాకు అర్హత కోల్పోయినవారు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం సాగు కోసం రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేవారు. ఈ మొత్తంలో కొంత నగదును పంటల బీమా కింద జమ చేసేవారు. కానీ, చంద్రబాబు మాటలు నమ్మిన ఎక్కువ మంది రైతులు రుణాలు మాఫీ అవుతాయని భావించి బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. దీంతో వారందరూ ఈ ఏడాది పంటల బీమాకు అర్హత కోల్పోయినట్టే. నిర్ణీత సమయంలో బకాయిలు చెల్లించి తిరిగి రుణాలు తీసుకున్న కొందరికి మాత్రం బ్యాంకులు బీమాపై భరోసా ఇస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం రుణాలు ఇచ్చారనే విషయాన్ని చెప్పేందుకు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ నిరాకరించారు. కానీ, కొన్ని బ్యాంకుల మేనేజర్లు మాత్రం పాత బకాయిలు చెల్లించే వరకు కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేదని, దీంతో బీమా సదుపాయం కూడా ఉండదని స్పష్టంగా చెబుతున్నారు. మరోవైపు రుణమాఫీని దశలవారీగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించడంతో రైతులు మండిపడుతున్నారు. 2,20,120 మందికే అవకాశం.. జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల మంది రైతులకు రూ.3049.39 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.3106.20 కోట్లను అందజేసి లక్ష్యాన్ని అధిగమించారు. పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి పంటల బీమా కోసం 5 శాతం చొప్పున మొత్తం రూ.155.31 కోట్లను బ్యాంకు అధికారులే మినహాయించుకుని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాయి. కానీ, 2014-15 ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ద్వారా రైతులకు రూ.3659.27 కోట్లను రుణాలుగా అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 2,20,120 మంది రైతులకు కేవలం రూ.1,206 కోట్లను మాత్రమే పంట రుణాలుగా ఇచ్చారు. వారికి ఇచ్చిన రుణాల్లో పంటల బీమా కోసం రూ.60.3 కోట్లు మినహాయించి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించారు. దీంతో సగానికిపైగా రైతులు పంటల బీమాను కోల్పోయారు. ప్రస్తుతానికి హుదూత్ తుపాను ముప్పు తప్పినా, నవంబరు వరకు విపత్తులు సంభవించే ప్రమాదం ఉంది. భారీ వర్షాలు కురిసి మంటలు దెబ్బతింటే తమ పరిస్థితి ఏమిటని బీమాకు అర్హత కోల్పోయిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీలకు డబ్బు తెచ్చి సాగు.. ఈ ఏడాది బ్యాంకుల ద్వారా సక్రమంగా రుణాలు అందకపోవడంతో రైతులు గ్రామాల్లోని ధాన్యం వ్యాపారుల వద్ద నూటికి రూ.5 నుంచి 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకుని వ్యవసాయం ప్రారంభించారు. ఈ ఖరీఫ్లో జిల్లాలోని 6.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. సాగునీరు సక్రమంగా రాకపోవడంతో ఆయిల్ ఇంజిన్లను అద్దెకు తెచ్చుకుని గంటకు రూ.250లు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. దీనికి డీజిల్ ఖర్చు అదనం. ఒకవైపు ఖర్చులు రెట్టింపు కావడం, మరోవైపు బీమా భరోసా కూడా లేకపోవడం రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కలవరపెడుతోంది. -
చల్లగా సర్దుకుని..
టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే ధర్మారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ వారం లోపు చేరే అవకాశం పరకాల కేడర్ అంతా ఆయన వెంటే.. జిల్లాలో టీడీపీకి గట్టి దెబ్బ ఇక ఆ పార్టీకి మిగిలింది ఒక్కరే.. సాక్షి ప్రతినిధి, వరంగల్ : సాధారణ ఎన్నికల్లో జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కొంతవరకు పట్టు నిలుపుకున్న టీడీపీకి నాలుగు నెలల్లోనే గట్టి దెబ్బ పడుతోంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వారంలోపే అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, టి.ప్రకాశ్గౌడ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్తో కలిసి ఆయన గురువారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. అనంతరం వీరి తరఫున శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటిం చారు. అక్కడే ఉన్న చల్లా ధర్మారెడ్డి ఈ విషయాన్ని ఖండించ లేదు. దీన్నిబట్టి ధర్మారెడ్డి సైతం తలసానితోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం సాయంత్రం చల్లా ధర్మారెడ్డితో మాట్లాడారు. ఆ తర్వాత కూడా ధర్మారెడ్డి పార్టీ మారబోనని చెప్పలేదు. ఈ మేరకు ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పరకాల నియోజకవర్గంలోని మెజారిటీ టీడీపీ కేడర్ ఆయనతో వెళ్లే పరిస్థితి ఉంది. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన చల్లా ధర్మారెడ్డి అధికార పార్టీలోకి మారుతాడని ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ధర్మారెడ్డి మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. ‘టీడీపీని వీడే ప్రసక్తేలేదు. టీడీపీని వదిలి టీఆర్ఎస్లో చేరుతున్న వారు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయలేని కేసీఆర్... చంద్రబాబును తప్పుబట్టడం సరికాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఒక్క సమస్యను పరిష్కరించలేదు. తెలంగాణ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ గుప్పించిన కేసీఆర్ సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు’ అని హన్మకొండలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. పరకాల నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇదే రకంగా మాట్లాడారు. ఇంతగా మాట్లాడి ఒక్క రోజులోనే టీఆర్ఎస్లో చేరేందుకు సన్నద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక చల్లా ధర్మారెడ్డిది శాయంపేట మండలం ప్రగతి సింగారం. 2008లో టీడీపీలో క్రీయాశీలక పాత్ర వహించారు. 2009లో టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు చేపట్టారు. 2012 జూన్లో పరకాల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో 30 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్దసాని సహోదర్రెడ్డిపై 9,225 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు అధికార పార్టీ వారికి దగ్గరగా ఉండే తత్వం ధర్మారెడ్డిది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. -
వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నేడు
పార్టీ బలోపేతమే లక్ష్యం జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ యలమంచిలి : విశాఖ రూరల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం యలమంచిలి గుర్రప్ప కల్యాణమండపంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడానికి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం యలమంచిలిలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జిల్లా అధ్యక్షునిగా గుడివాడ అమర్నాథ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. గత ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ, మండల, గ్రామ స్థాయిలో పార్టీ కమిటీల ఏర్పాటు, బలోపేతం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఐక్యంగా ఎదుర్కోవడం, వంటి అంశాలు అజెండాగా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. -
కీలు బొమ్మలు
చెప్పుచేతల్లో ఉండేవారికే కీలక కుర్చీలు ఇప్పటికే డ్వామా పీడీ బదిలీ ఆయన స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే భార్య అధికారుల బదిలీలకు టీడీపీ నేతల కసరత్తు విజయవాడ : సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ విధంగా ఆదేశించడంతో దాన్ని ఇక్కడ ‘తమ్ముళ్లు’ పాటిస్తున్నారు. భవిష్యత్తులో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను కీలక కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు తాము చెప్పినట్టు వినే వారినే నియమించేలా పావులు కదుపుతున్నారు. మాట వినని అధికారులకు బదిలీలను బహుమానంగా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం డ్వామా పీడీ అనిల్కుమార్ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్లో బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్గా పనిచేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణిని నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉపాధి’ కోసమేనా..! సార్వత్రిక ఎన్నికల ముందు డ్వామా పీడీగా అనిల్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కోట్లాది రూపాయలతో నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్వామా ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి డ్వామా పీడీ తమకు అనుకూలంగా ఉంటే సులభంగా ‘ఉపాధి’ లభిస్తుందని తమ్ముళ్లు భావించి అనిల్కుమార్ను బలవంతంగా బదిలీ చేయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ సతీమణి మాధవీలతను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోస్టు కోసం కొందరు రాజకీయంగా పైరవీలు చేసినా, మాధవీ లతను నియమించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. నందిగామ ఉపఎన్నిక వల్ల కోడ్ అమల్లో ఉండటంతో ఉత్తర్వులు జారీ చేయలేదని సమాచారం. కోడ్ ముగిసిన వెంటనే ఆమెను నియమిస్తారని సమాచారం. మాధవీలత గతంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణిగా పనిచేశారు. డీపీవో పోస్టుపై కూడా పైరవీలు ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి పోస్టు కోసం కూడా పైరవీలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇన్చార్జి డీపీవోగా డీఆర్డీఏ ఏపీడీ చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. డీపీవో పోస్టు కోసం కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నలుగురు అధికారులు పోటీ పడుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డీఎల్పీవోలు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మరో ఇద్దరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ జిల్లా నేతలు మాత్రం తమకు అనుకూలమైనవారిని ఈ సీటులో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ పీడీ పోస్టుపై బేరసారాలు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు కోసం బేరసారాలు సాగుతున్నాయి. ఖాళీగా ఉన్న ఈ పోస్టు కోసం కూడా నలుగురు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్చార్జి పీడీగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పమణి వ్యవహరిస్తున్నారు. ఈ కుర్చీపై కన్నేసిన కొందరు లక్షలాది రూపాయలు లంచం ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని సమాచారం. మరికొందరు అధి కార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం జిల్లా స్థాయి అధికారులతోపాటు మండల కేంద్రాల్లో పనిచేసే తహశీల్దార్లు, ఎంపీడీవోలు కూడా తమ చెప్పుచేతల్లో ఉండేవారిని నియమించేలా జాబితాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. -
లెక్క.. పక్కా!
- సోనియా ప్రచార వ్యయంపై ఈసీకి నివేదిక - టీఆర్ఆర్ ఫిర్యాదుపై స్పందించిన యంత్రాంగం - హరీశ్వర్ ఆరోపణలు నిరాధారం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రచార వ్యయం జమ విషయంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. గత ఏప్రిల్ 27న చేవెళ్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ పాల్గొన్నారు. అధినేత్రి సభను ప్రతిష్టాత్మంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం భారీగా జనసమీకరణ చేసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చేవెళ్లకు ప్రజలను తరలించేందుకు 700 ఆర్టీసీ బస్సులను అద్దెకు సమకూర్చింది. ఈ క్రమంలోనే సభ విజయవంతానికి రూ. కోటీ 70 వేలను ఖర్చు చేసింది. అయితే, ఈ వ్యయం ఎవరి ఖాతాలో చూపాలనే అంశంపై జిల్లా యంత్రాంగం సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంది. స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనే సభల వ్యయం విషయంలో కొన్ని సడలింపులు ఉన్నప్పటికీ, అదే వేదిక ను అభ్యర్థులు పంచుకుంటే మాత్రం ఖర్చును వారి లెక్కలో చూపాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. ఈ మార్గదర్శకాల అనుగుణంగా చేవెళ్ల సభలో వేదికెక్కిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి సహా ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థుల ఖాతాల్లో (ఒక్కో సభ్యుడికి 14 లక్షల 38 వేల 607 రూపాయలు) సభ నిర్వహణా వ్యయాన్ని చూపారు. సోనియాతో కలిసి తాను వేదికను పంచుకోలేదని, కనీసం కార్యకర్తలకు అభివాదం కూడా చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో అధినేత్రి ప్రచార ఖర్చును తన ఎన్నికల వ్యయంలో చూపడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్కు రామ్మోహన్రెడ్డి లేఖ రాశారు. దీనిపై సమగ్ర నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సీఈసీ చీఫ్ కమిషనర్ వీఎస్ సంపత్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రచార సభకు సంబంధించిన ఫొటోలు, సీడీలు సహా ఆ సభలో సోనియాతో టీఆర్ఆర్ అభివాదం చేస్తున్న చిత్రాలను పొందుపరుస్తూ జాయింట్ కలెక్టర్ 2 ఎంవీ రెడ్డి ఈసీకి నివేదిక పంపారు. వ్యయ పరిశీలకుల సూచనల మేరకు ప్రచార ఖర్చును కాంగ్రెస్ అభ్యర్థుల ఖాతాలో చూపినట్లు ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో స్పష్టం చేశారు. హరీశ్వర్ ఆరోపణలు నిరాధారం ప్రచార వ్యయం నమోదులో అవకతవకలు జరిగాయని రామ్మోహన్రెడ్డి చేతిలో ఓడిపోయిన హరీశ్వర్రెడ్డి(టీఆర్ఎస్) చేసిన ఫిర్యాదుపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై విచారణకు ఆదేశించిన సీఈసీ... నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగానికి లేఖ రాసింది. ఈ క్రమంలోనే హరీశ్వర్రెడ్డి ఆరోపణలు నిరాధారమని, ఈసీ పరిశీలకుల కనుసన్నల్లోనే ప్రచార వ్యయాన్ని రికార్డు చేశామని స్పష్టం చేసింది. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేయలేదని, బిల్లుల ప్రకారం ఖర్చు జమ చేశామని వివరణ ఇచ్చింది. -
కాపులు ధర్మాన్ని గెలిపించారు
మండలి బుద్ధ ప్రసాద్ తిరుచానూరు : తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు, బలిజలు ధర్మాన్ని గెలిపించారని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. తిరుపతి బలిజ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో కాపు ప్రజాప్రతినిధులకు అభినందన సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి 13 జిల్లాల నుంచి పలువురు కాపు కులానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, తిరుపతి బలిజ జేఏసీ నాయకుడు వూకా విజయ్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు ధర్మాన్ని గెలిపించారన్నారు. కర్ణుడు కవచ కుండలాలతో జన్మించాడని, కాపులు నీతినిజాయితీ అనే కవచ కుండలాలతో పుట్టారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కాపులను బీసీ జాబితాలో చేర్చినప్పుడే తమ కులం సంతోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే కాపులను వాడుకున్నాయే తప్ప న్యాయం చేయలేదన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చినంత మాత్రాన ఇప్పుడున్న బీసీలకు రిజర్వేషన్లలో ఎటువంటి అన్యాయం జరగదని వారు స్పష్టం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపు కులస్తుడైన చిరంజీవిని కలిస్తే, ఆయన స్పర్శ తగిలితే చాలు జీవితం ధన్యం అవుతుందనుకున్న కాపులను ఆయన నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవుల నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటికోట రామారావు(ఏలూరు), కే.అప్పలనాయుడు(గజపతినగరం), పి.నారాయణస్వామినాయుడు(నెల్లిమర్ల), మీసాల గీత(విజయనగరం), పి.రమేష్బాబు(ఎలమంచిలి), డీకే.సత్యప్రభ(చిత్తూరు), కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కటారి అనురాధ, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ ఆశాలత, కోలా ఆనంద్ పాల్గొన్నారు. -
టీటీడీ చైర్మన్ పీఠంపై స్థానికుడా.. స్థానికేతరుడా?
ఎన్నికలకు ముందే తనకు హామీ ఇచ్చారంటున్న చదలవాడ పార్టీ కోసం పనిచేసిన తనకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ‘గాలి’ పట్టు తనను టీటీడీ చైర్మన్ చేయాలంటున్న రాయపాటి! రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మంత్రాంగం టీటీడీ పాలక మండలి అధ్యక్ష పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులు చేజిక్కించుకుంటారా? అన్నది హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానంటూ రాతపూర్వకంగా చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే చదలవాడ చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు పార్టీ కోసం పనిచేసిన తనకే ఆ పదవి దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవి ఇస్తానంటేనే టీడీపీలో చేరానని.. తనకే ఇవ్వాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి పట్టుబడుతున్నారు. మరోవైపు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ఆ పదవి కోసం తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ సహా అన్ని దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాంతో టీటీడీ పాలక మండలి ఖాళీ అయ్యింది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి శాసనసభ టీడీపీ టికెట్ కోసం చదలవాడ కృష్ణమూర్తి, ఎం.వెంకటరమణ పోటీపడ్డారు. ఎమ్మెల్యే టికెట్ను వెంకటరమణకు ఇచ్చిన చంద్రబాబు.. టీటీడీ చైర్మన్ పదవిని చదలవాడకు ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు చదలవాడ వర్గీయులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లాకు చెం దిన రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్లో మూడు దశాబ్దాలపాటు పనిచేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్లో ఉన్న కాలంలో టీటీడీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించిన రాయపాటి ఆ పదవిని దక్కించుకోవడం విఫలమయ్యారు. టీడీపీలో చేరే ముందు.. పార్టీ అధికారంలోకివస్తే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని రాయపాటికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీచేసిన రాయపాటి విజయం సాధించారు.. నరేంద్రమోడీ మంత్రివర్గంలో టీడీపీ కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ.. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ వెంటనే చంద్రబాబుతో సమావేశమై టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని పట్టుపట్టారు. ఇప్పుడు టీటీడీ పాలక మండలిని రద్దు చేయడంతో తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రాయపాటి ఓ వైపు.. చదలవాడ మరో వైపు చంద్రబాబుపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 2009 నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ చంద్రబాబుకు గాలి ముద్దుకృష్ణమనాయుడు వెన్నుదన్నుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి పోటీచేసిన గాలి ఓటమి పాలయ్యారు. తాను గెలిచి ఉంటే మంత్రివర్గంలో స్థానం దక్కేదని.. ఓడిపోయిన నేపథ్యంలో తనకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని చంద్రబాబుపై గాలి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వని పక్షంలో ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. మంత్రివర్గంలోకి తీసుకోవాలని గాలి కోరుతున్నారు. ఇక చంద్రబాబు సన్నిహితుడుగా ముద్రపడిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ టీటీడీ చైర్మన్ పదవిపై మక్కువ పెంచుకున్నారు. ఇటీవల 75వ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మురళీమోహన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం చంద్రబాబుపై మురళీమోహన్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవి స్థానికులకు దక్కుతుందా? స్థానికేతరులకు దక్కుతుందా అన్నది తేలాలంటే మరి కొంత కాలం వేచిచూడక తప్పదు మరి! -
రుణ మాఫీ కాదు..నెత్తిన టోపీ!
డ్వాక్రా రుణాల మాఫీలో మాట తప్పిన చంద్రబాబు మొత్తం రుణాలు మాఫీ చేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇప్పుడేమో ఒక్కో సంఘానికి రూ.లక్ష అంటూ షరతు సంఘాలు రూ.1611.03 కోట్ల మేర బ్యాంకులకు బకాయి చంద్రబాబు షరతు వల్ల రూ.310 కోట్లే మాఫీ అవుతాయని అంచనా ఇదో పచ్చిమోసానికి ప్రత్యక్ష సాక్ష్యం..! చంద్రబాబు ‘మార్కు’ మోసానికి నిలువెత్తు నిదర్శనం..! డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేసి, మహిళలను అప్పుల ఊబి నుంచి గట్టెక్కిస్తానంటూ ఎన్నికల్లో ఊరూవాడ చంద్రబాబు ఊదరగొట్టారు. ఆయన మాటలు నమ్మి మహిళలు ఓట్లేసి అధికారాన్ని కట్టబెట్టారు. సీఎంగా గద్దెనెక్కాక చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోమారు బయటపెట్టారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తానంటూ మెలిక పెట్టారు. దీనివల్ల జిల్లాలో రూ.1611.03 కోట్ల డ్వాక్రా రుణాలకుగాను రూ.310 కోట్లకు మించి మాఫీ కావు. ఆ మాఫీ కూడా ఎప్పుడు చేస్తానన్నది స్పష్టం చేయకపోవడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘ఓటు’ దాటాక హామీలను తగలేయడంలో తనను మించిన వాళ్లు లేరని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మరోసారి నిరూపించుకున్నారు. రుణాల మాఫీ కాదు.. ఆడపడుచుల నెత్తిన టోపీ పెట్టారు. ‘డ్వాక్రా మహిళలు కష్టాల్లో ఉన్నారు. ఏ ఒక్కరూ బ్యాంకులకు రుణాలు చెల్లించవద్దు.. నేను సీఎంగా అధికారం చేపట్టగానే మీ రుణాలను మొత్తం మాఫీ చేస్తా’ అంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. అధికారాన్ని చేపట్టిన తర్వాత సోమవారం చంద్రబాబు ఒక్కో డ్వాక్రా సంఘానికి రూ.లక్ష రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తానని ప్రకటించారు. ఆ రూ.లక్ష కూడా మాఫీ చేసేందుకు నిధుల సమీకరణకు ఓ కమిటీ వేస్తానని చెప్పడంపై డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీటిలో 55,602 సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్) పథకం కింద ఒక్కో మహిళా సంఘానికి గరిష్టంగా రూ.ఐదు లక్షల వరకూ రుణాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆర్థిక చేకూర్పు కింద ఒక్కో సంఘం రూ.ఐదు లక్షల చొప్పున 60 శాతం మహిళా సంఘాలు, రూ.4 లక్షల వంతున పది శాతం సంఘాలు, రూ.మూడు లక్షల చొప్పున 12 శాతం సంఘాలు, రూ.రెండు లక్షల చొప్పున ఎనిమిది శాతం సంఘాలు, రూ.లక్ష చొప్పున ఐదు శాతం సంఘాలు, రూ.50 వేల చొప్పున ఐదు శాతం సంఘాలు రుణాలు తీసుకున్నాయి. అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. అక్టోబరు 2, 2012న అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ‘మీకోసం వస్తున్నా’ పేరుతో చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. అక్కడ చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాలను మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు ఇదే హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి మహిళలు టీడీపీకి ఓట్లేసి.. అధికారాన్ని కట్టబెట్టారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే నీరుగార్చేలా వ్యవహరించారు. ఒక్క సంతకంతో డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బీరాలు పలికిన చంద్రబాబు.. ఆ రుణాల మాఫీ విధి విధానాలను రూపొందించడం కోసం కమిటీ ఏర్పాటుచేసేందుకు సంతకం పెట్టారు. దీనిపై కమిటీ నివేదిక ఏమిచ్చిందన్నది చంద్రబాబుకే ఎరుక. కానీ.. చంద్రబాబు తన నిజస్వరూపాన్ని మరోమారు ప్రదర్శించారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తామని సోమవారం ప్రకటించారు. ఆ రుణమాఫీకి అయ్యే నిధుల సమీకరణ కోసం మరో కమిటీ వేస్తామని చెప్పుకొచ్చారు. అంటే.. ఆ రూ.లక్ష కూడా ఎప్పుడు మాఫీ చేస్తారన్నది స్పష్టంగా చెప్పలేదు. పొదుపు మొత్తం నుంచి జమ! ఇదొక పార్శ్వమైతే.. మరొక పార్శ్వం మహిళా సంఘాలు పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచే సభ్యులకు తెలియకుండానే బ్యాంకర్లు కంతుల కింద జమ చేసుకుంటున్నారు. గుర్రంకొండ, వి.కోట, శాంతిపురం, పాలసముద్రం, ఏర్పేడు తదితర మండలాల్లో అధికశాతం బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలను అధికారులు వసూలు చేశారు. చాప కింద నీరులా బ్యాంకర్లు రుణాల వసూళ్లకు దిగడంతో సీఐఎఫ్(సామాజిక పెట్టుబడి) నిధి రూ.196 కోట్ల నుంచి రూ.వంద కోట్లకు తగ్గిపోయింది. సీఐఎఫ్ నిధి నుంచి బ్యాంకర్లు అప్పుగా మినహాయించుకున్న రూ.96 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్న అంశంపై చంద్రబాబు స్పందించకపోవడం కొసమెరుపు. మాఫీ అయ్యేదిరూ.310 కోట్లే.. ఒక్కో సంఘానికి రూ.లక్ష మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తామన్న చంద్రబాబు ప్రకటన మేరకు జిల్లాలో రూ.1611.03 కోట్ల డ్వాక్రా రుణాలకుగానూ రూ.310 కోట్లకు మించి మాఫీ కావని ఇందిరాక్రాంతిపథం(ఐకేపీ) అధికారులే స్పష్టీకరిస్తున్నారు. తక్కిన రుణం ఆ మహిళా సంఘం సభ్యులు చెల్లించాల్సిందే. రూ.లక్షలోపు రుణం తీసుకున్న సంఘాలకు మాత్రమే పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తిస్తుందన్నమాట..! గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టడంతో మహిళలు మండిపడుతున్నారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. బయటపడిన బాబు నైజం చంద్రబాబు ఏనాడు కూడా రైతులు మేలు చేసిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ఎంత రుణం ఉన్నా మాఫీ చేస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. గెలిచాక మాటమార్చి కుటుంబానికి ఒకటిన్నర లక్ష మాత్రమే రుణమాఫీ అని చేతులెత్తేశారు. మిగిలిన అప్పులు ఎవరు తీరుస్తారు. రైతు నోట్లో మట్టి కొట్టారు. అసలే కరువు కోరల్లో ఉన్నాం. పంట రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేయాలి. లేదంటే చంద్రబాబు చరిత్ర హీనుడే. -ఎస్ గంగిరెడ్డి, అంగళ్లు, కురబలకోట మండలం జనం చెవిలో పువ్వు పెట్టాడు సీఎం స్థానంలో ఉన్న వారు ఇలా మాటతప్పడం సరికాదు. రుణాలు మాఫీ చేస్తున్నాం..పండగ చేసుకోవచ్చని కోతలు కోశారు. సీఎం కుర్చీ కోసం రుణమాఫీ డ్రామా ఆడారు. రైతు, డ్వాక్రా రుణ మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని అందరి చెవిలో పువ్వు పెట్టారు. రుణమాఫీ చేస్తానని దగా చేసిన బాబు క్షమాపణలు చెప్పాలి. సీఎంగా వెంటనే తప్పుకోవాలి. లేదంటే అణాపైసలతో సహా రుణమాఫీ చేయాలి. -ఎం నాతాను రెడ్డి, అంగళ్లు, కురబలకోట మండలం సీఎంగా పనికిరాడు డ్యాక్రా మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చని చంద్రబాబు సీఎంగా అనర్హుడు. ఆడోళ్ల ఉసురు తగులుతుం ది. గ్రూపునకు లక్ష మాత్రమే ఎలా మాఫీ చేస్తారు. ఓట్లు వేసిన వారిని నట్టేట ముంచారు. ప్రతి గ్రూపునకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అప్పులున్నాయి. లక్ష చేస్తే ఏమూలకు సరిపోతుంది. చంద్రబాబు నిర్వాకంతో డ్వాక్రా గ్రూపు సభ్యుల ఆశలు నీరుగారాయి. అన్ని డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పారు. చేతకానప్పుడు ఎందుకు హామీ ఇవ్వాలి. - చంద్రకళ , వసంత గ్రూపు లీడర్, కురబలకోట మండలం ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలి ఎన్నికల సమయంలో ఆంక్షలు లేని రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే రైతులను మోసం చేశారు. రెతుకు రుణమాఫీ రూ. 1.50 లక్షలు మాత్రమే చేస్తానని ప్రకటించారు. మొత్తం రుణమాఫీ చేస్తాడని ఆశపడిన రైతులకు మొండిచెయ్యి చూపారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో మొత్తం రుణమాఫీ చేస్తానని ప్రకటించారని తేలిపోయింది. -వెంకటమల్లయ్య, చెరువుకిందపల్లె, పెద్దమండ్యం మండలం మాఫీ పేరుతో మోసం అధికారంలోకి రాగానే మహిళా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేశారు. మాది మాషాఅల్లా స్వయం సహాయక సంఘం. సంఘంలో 9 మంది సభ్యులున్నాం. రుణం రూ. 2.35 లక్షలు తీసుకున్నాం. రుణ బాధ తీరిపోతుందని అనుకుంటే ఇపుడు ప్రతి సంఘానికి కేవలం రూ.లక్ష వరకు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడం మోసమే. -సంతోషి, మాషా అల్లా సంఘం సభ్యురాలు, పెద్దమండ్యం మహిళలే తిరగబడతారు చంద్రబాబు డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలు ఇప్పటి నుంచే కట్టవద్దని ప్రచార సభల్లో చెప్పారు. ఆయన మాటలు నమ్మి మహిళలందరూ ఆశతో ఓట్లు వేశారు. ఇప్పడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తానంటున్నారు. పూర్తిగా మాఫీ చేయకుంటే మహిళలు టీడీపీ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయి. -రాజకుమారి,కార్తికేయపురం, పెనుమూరు మండలం -
కాంగ్రెస్లో కుమ్ములాటలు
నగర కాంగ్రెస్ పదవిపై పోరాటం పీసీసీ అధ్యక్షుడి వద్ద పంచాయితీ విజయవాడ : కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి రోడ్డునపడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న అడపా శివనాగేంద్రం పదవికి ఎసరు పెట్టేందుకు రెండువర్గాలు ప్రయత్నించాయి. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్దన్ నగర కాంగ్రెస్పై కన్నేసి పావులు కదపటం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయమైన ఆంధ్రభవన్లో సోమవారం 13 జిల్లాల స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణు.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని భోజనానికి ఆహ్వానించారు. ఈ విందుకు నగర కాంగ్రెస్ ముఖ్య నేతలను ఆహ్వానించలేదు. నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మల్లాది విష్ణుకు ఇవ్వాలని విందులో పాల్గొన్న రఘువీరారెడ్డిని పలువురు స్థానిక నేతలు కోరారు. ఈ విషయం తెలిసిన వెంటనే అడపా శివనాగేంద్రం మద్దతుదారులు హుటాహుటిన విమానాశ్రయానికి వెళ్లి పీసీసీ చీఫ్కు మల్లాది విష్ణుపై ఫిర్యాదు చేశారు. విష్ణు ఇప్పటికే పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడిగా, పీసీసీ శ్వేతపత్రాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని రఘువీరారెడ్డికి తెలిపారు. విష్ణుకు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కోరారు. విష్ణుపై పలు ఆరోపణలు కూడా చేశారు. వివాదరహితుడిగా అడపాను మార్చవొద్దని కోరారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ వర్గీయులు కూడా కొందరు రఘువీరారెడ్డిని కలిసి నగర కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కడియాల బుచ్చిబాబుకు ఇవ్వాలని కోరారు. గతంలో బుచ్చిబాబు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని రఘువీరారెడ్డికి చెప్పారు. ఎయిర్పోర్టులో మూడువర్గాల నేతలు పీసీసీ నేత సమక్షంలో పంచాయితీ పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమిపై ప్రత్యర్థి గ్రూపుల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు అందరిని సర్దుబాటు చేసే విధంగా మాట్లాడి చల్లగా జారుకున్నారు. -
బాబూ.. ఇంత మోసమా?
ఎమ్మార్పీఎస్ నాయకుల ఆవేదన గుడివాడ అర్బన్ : సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానంటూ మమ్మల్ని నమ్మించి..మా వల్ల లబ్ధిపొంది ముఖ్యమంత్రి అయిన తరువాత మమ్మల్ని మరిచారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిథి లాం దానియేలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక గుడ్మాన్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాదిగల ఓట్లకోసం చంద్రబాబు ఎన్నోసార్లు ‘నేను ముఖ్యమంత్రి అయ్యాక...వర్గీకరణ చేస్తాను’ అంటూ బహిరంగసభల్లో చెప్పారని గుర్తుచేశారు. మాదిగలంతా ఏకతాటిపై నిలబడి ఆయనను ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడు వర్గీకరణ ఊసెత్తడం లేదని మండిపడ్డారు. గొర్రె లాజరస్, కంచర్ల సుధాకర్, వేసిపోగు సుందరయ్య, బలసాని యోహాను, వేల్పుల నాగబాబు పాల్గొన్నారు. కన్వీనర్ల నియమాకం... ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్లకు జిల్లా, నియోజకవర్గాలకు కన్వీనర్లుగా నియమించినట్లు లాం దానియోలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కన్వినర్గా రాచేటి మురళీ, కో-కన్వీనర్గా దిరిశం బాలకోటయ్యను నియమించామన్నారు. నియోజకవర్గు కన్వీనర్లుగా శాలిరాజు(మచిలీపట్నం), కటకాల ప్రసాద్(పెడన), దరిశం శ్రీనివాస్ (అవనిగడ్డ), మన్నేపల్లి ఆదాం (కైకలూరు), వంగవరపు కిరణ్ (గుడివాడ), జువ్వనపూడి సురేంద్రకుమార్ (పామర్రు), పల్లెపాము కుటుంబరావు(నూజివీడు), వీరమళ్ల రాంబాబు(తిరువూరు), కోవెలపల్లి కిషోర్(పెనమాలూరు), బెజవాడ పుల్లయ్య(నందిగామ), మన్నే విజయకుమార్(మైలవరం), పి.ఆదాం(జగ్గయ్యపేట)ను నియమించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్గా కైతేపల్లి దాస్, అరుంధతి మాదిగ మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్గా ముల్లంగి రాణి, కో-కన్వీనర్లుగా జుజ్జువరపు ప్రశాంతి, దేవరపల్లి అరుణను నియమించారు. -
ఐటీడీఏకు శాపం
14 నెలలుగా కానరాని పాలకవర్గ సమావేశం గత ఐదేళ్లలో నాలుగుసార్లే నిర్వహణ కొత్త పాలనలోను జాప్యమేనా? అధికారుల్లో ఏదీ జవాబుదారీతనం పాడేరు: గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలపై 3 నెలలకు ఒకసారి నిర్వహించ వలసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు సక్రమంగా జరగలేదు. ఐదేళ్లపాలనలో నాలుగు సార్లే సమావేశాలు నిర్వహించడం గమనార్హం. చివరిసారిగా 2013 మే 11వ తేదీన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. తరువాత ఇంత వరకు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల జోలికి అధికారులు వెళ్లలేదు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత పాలకవర్గ సమావేశాలు జరుగుతాయని గిరిజనులు ఆశపడినప్పటికి ఫలితం లేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా పాలకవర్గ సమావేశం ఊసెత్తడం లేదు. జిల్లా కలెక్టరు, ఐటీడీఏ పీఓలు పాలకవర్గ సమావేశాన్ని 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. గిరిజనాభివృద్ధికి కీలకమైన పాలకవర్గ సమావేశాన్ని నిర్లక్ష్యం చేయడంతో అభివృద్ధిపై చర్చించే పరిస్థితి ఉండడం లేదు. ఐటీడీఏకు వచ్చే నిధులు వాటిని గిరిజనాభివృద్ధికి ఉపయోగించేందుకు చేపట్టే చర్యలపై సమీక్ష జరపాల్సి ఉంది. గిరిజన ఉప ప్రణాళిక, ఐఏపీ, సమగ్ర కార్యచరణ ప్రణాళిక పథకాల ద్వారా ఐటీడీఏకు వచ్చే నిధులకు పాలకవర్గ సమావేశం లేక జవాబుదారీతనం కూడా లోపిస్తోంది. ఐటీడీఏ ద్వారా చేపట్టే కార్యక్రమాలన్నీ ఇష్టారాజ్యంగానే మారుతున్నాయనే ఆరోపణలు అధికంగా వినిసిస్తున్నాయి. రాష్ట్రం లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికి పాడేరు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, అరకు పార్లమెంట్ సభ్యురాలంతా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి చెందిన వారే. గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించాలని వారంతా కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జోలికి అధికారులు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను మూడు నెలలకు ఒకసారి నిర్వహించి తమ అభివృద్ధికి పాటుపడాలని గిరిజనులు కోరుతున్నారు. -
ఉన్నట్టా? లేనట్టా?
కలెక్టరేట్ : సాధారణ ఎన్నికలకు ముందు తహశీల్దార్ల బదిలీలు సజావుగానే జరిగాయి. జిల్లా నుంచి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఆయా జిల్లాల నుంచి తహశీల్దార్లు మన జిల్లాకు వచ్చారు. ఎన్నికలు పూర్తయి రెండు నెలలు అయింది. వేరే జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన తహశీల్దార్లు వారి సొంత జిల్లాలకు వెళ్లారు. అక్కడ పనిచేసిన మన జిల్లా తహశీల్దార్లు 35 మంది జూన్ 16,17,18 తేదీల్లో జిల్లాకు వచ్చి ఉన్నతాధికారులకు రిపోర్టు చేశారు. అయితే అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు తహశీల్దార్లకు పోస్టింగ్లు ఇవ్వకపోవడంతో అప్పట్లో తహశీల్దార్ల అంశం చర్చనీయాంశమైంది. ఆయా మండలాల్లో తహశీల్దార్లుగా విధులు నిర్వర్తిస్తున్న వేరే జిల్లాలకు చెందిన తహశీల్దార్లు తిరిగి వారి సొంత జిల్లాలకు వెళ్లిపోవడంతో ఆ స్థానాలు ఖాళీగా మారాయి. మండలంలోని డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మండలాల్లో తహశీల్దార్లు లేక సుమారు పదిహేను రోజులవుతుంది. బదిలీపై వెళ్లి వచ్చిన తహశీల్దార్లకు పదిహేను రోజులుగా పోస్టింగ్లు ఇవ్వకపోవడంతో జిల్లాలో తహశీల్దార్లున్నా లేనట్లుగా మారింది. పదిహేను రోజుల పాటు అంతరాయం ఏర్పడింది. తహశీల్దార్లు మంగళవారం కలెక్టర్ జగన్మోహన్ను కలిసి పోస్టింగ్ల విషయమై విన్నవించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు చెప్పారని తహశీల్దార్లు పేర్కొన్నారు. జీతాలపై అనుమానాలు జిల్లాలో ఎన్నికల సందర్భంగా బదిలీ అయినా తహశీల్దార్లు ఇప్పుడు జీతాలు వస్తాయో.. లేదోననే సందిగ్ధంలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన 35 మంది తహశీల్దార్లు జూన్ 16, 17,18వ తేదీల్లో అక్కడ నుంచి రిలీవ్ అయ్యారు. అంటే జూన్ 15వ తేదీ వరకు వారు వెళ్లిన జిల్లాలో తహశీల్దార్లుగా విధులు నిర్వర్తించారన్న మాట. అయితే జూన్ నెల పదిహేను రోజుల వేతనం వారు విధులు నిర్వర్తించిన జిల్లాలో తీసుకునేందుకు అవకాశం ఉంది. జూన్ 16వ తేదీ నుంచి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లు ఖాళీగా ఉన్నారు. వారికి పోస్టింగ్లు ఇవ్వకుండానే జూన్ నెల ముగిసింది. ఈ పదిహేను రోజులు తహశీల్దార్లు విధులు నిర్వర్తించలేదు. ఈ రోజుల వేతనంపై తహశీల్దార్లలో సందిగ్ధం నెలకొంది. పదిహేను రోజుల వేతనం ఇస్తారా? లేదా పోయినట్లేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తహశీల్దార్లు లేక.. మండల కేంద్రాల్లో తహశీల్దార్లు లేక పనులు పెండింగ్లో ఉన్నాయి. మండలాల పరిధిలోని తెల్లరేషన్ కార్డులను పీడీఎస్ డాటాబేస్లో జూలై 3లోగా అప్లోడ్ చేయాలని సంయుక్త కలెక్టర్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. అయితే నేడు, రేపు తహశీల్దార్లు బాధ్యతలు చేపట్టినా అది జరగని పని. దీంతోపాటు ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న భూ పంపిణీకి మండలాల పరిధిలోని ప్రభుత్వ భూములను గుర్తించడం, భూమి లేని నిరుపేదలను గుర్తించి ఉభ్నతాధికారులకు నివేదించాల్సి ఉంది. దీనికి కేవలం వారం రోజుల సమయం మిగిలి ఉంది. ప్రభుత్వ భూముల స్థితిగతులు, జమాబందీ, పట్టాదార్, ఆధార్ అనుసంధానం, పహాణి, సర్కారు భూములు, వన్టైమ్ కన్వర్షన్ వంటి పనులు పూర్తి చేయాలి. తహశీల్దార్లు లేకపోవడంతో ప్రస్తుతం ఈ పనులు జరగడం లేదు. ఇందుకు తోడు అనునిత్యం మండలాల కేంద్రానికి పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు సార్లు లేక వెనుదిరుగుతున్నారు. పైగా మండల స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పూర్తి చేయాల్సిన పనులు ఆగిపోతున్నాయి. -
ఇంకా మునిసిపల్ వాసనలే
జీవీఎంసీ అనకాపల్లి జోనల్లో భర్తీ కాని కీలక పోస్టులు రెగ్యులర్ కమిషనర్ బాధ్యతలతో పాలనలో మార్పు? అనకాపల్లి: గ్రేటర్ విశాఖ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో ఇప్పటికీ మునిసపాలిటీ తరహా పరిస్థితులే కనిపిస్తున్నాయి. జీవీఎంసీలో విలీనమై 11 నెలలు గడుస్తున్నా జోనల్ స్థాయి తరహా కీలకమైన పోస్టులు భర్తీ కాలేదు. గ్రేటర్లో విలీనమయ్యాక నలుగురు కమిషనర్లు మారారు. ఎవరి శైలి వారిదన్న చందంగా పాలన సాగింది. దీనికితోడు విలీనమయ్యాక సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలకు తోడు రాష్ట్ర విభజన పాలనపై ప్రభావం చూపింది. గ్రేటర్ విశాఖ పరిధిని విస్తరించడం ద్వారా మెట్రో తరహా నిధులను రాబట్టుకోవచ్చని అధికార యంత్రాంగం భావించారు.అటువంటి నిధుల ప్రవాహం ఎప్పుడొస్తుందా ? అని అనకాపల్లి వాసులు ఎదురుచూస్తున్నారు. ఇక్కడి జోనల్ కార్యాలయంలో పూర్తిస్థాయి కమిషనర్ లేనంతకాలం దిగువ స్థాయి సిబ్బంది పనితీరును పర్యవేక్షించే నాధుడే లేకుండా పోయాడు. వినతుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు వివిధ శాఖల అధికారులు అందుబాటులోఉండేవారు కాదు. స్థానికంగా సమస్యలు పేరుకుపోయాయి. గ్రేటర్ స్థాయి వచ్చినా మునిసిపల్ చాయలు తొలగకపోవడంతో పాలనా వ్యవస్థ పాత తరహాలోనే కొనసాగుతోందన్న వాదన వ్యక్తమవుతోంది. మరోవైపు విలీనానికి ముందు మునిసిపాలిటీకి పాలకవర్గం లేకపోవడం, తదనంతర కాలంలో ఎన్నికలు లేకపోవడం వంటి పరిణామాలతో అధికారుల్లో జవాబుదారీతనం లోపించింది. తాజాగా గెలుపొం దిన ఎమ్మెల్యే మాత్రం అడపాదడపా సమావేశాలు నిర్వహిస్తూ గ్రేటర్ అధికారులను పరుగెత్తిస్తున్నారు. సుదీర్ఘ లక్ష్యంతో చేపట్టిన సమగ్ర మురుగునీటి అభివృద్ధి పథక పనులు నత్తనడకన సాగుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ గాడిలో పడలేదు. మంచినీటి సరఫరా వ్యవస్థ, వీధిలైట్ల విభాగాల పనితీరు నామమాత్రమే. సులభ్ కాంప్లెక్స్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భర్తీకాని కీలకపోస్టులు... మునిసిపాలిటీ వ్యవస్థలోని ఉద్యోగుల ఫార్మాట్కు గ్రేటర్ విశాఖ జోనల్లోని ఉద్యోగుల ఫార్మాట్కు తేడా ఉంటుంది. విభాగాలలోని ఉద్యోగుల కేడర్, దిగువస్థాయి సిబ్బంది కేటాయింపుల్లో వ్యత్యాసం గోచరిస్తోంది. కానీ అనకాపల్లి జోనల్లో మాత్రం గ్రేటర్ విశాఖ పరిధికి సంబంధించిన మేరకు పోస్టుల భర్తీ ఇంకా పూర్తి కాలేదు. ఉదాహరణకు మునిసిపాలిటీలో మేనేజర్ పోస్టు ఉంటే అది గ్రేటర్ విశాఖ జోనల్కు వచ్చేసరికి సూపరింటెండెంట్గా మారుతుంది. కానీ అనకాపల్లిలో ఇంకా మేనేజర్ స్థాయి పోస్టే కొనసాగుతోంది. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఎఎంవోహెచ్) పోస్టు ఖాళీగానే ఉంది. రెవెన్యూ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టు భర్తీ కావాల్సి ఉంది. ఇంజినీరింగ్ వ్యవస్థలో ఈఈ, డీఈ, ఏఈల పోస్టులు భర్తీ బాగానే ఉంది. ఇక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులలో ఖాళీలుండడంతో కొన్ని శాఖల పనితీరు నత్తనడకే. కొద్దిరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన రెగ్యులర్ కమిషనర్ అనకాపల్లి జోనల్ను పూర్తిగా గాడిలో పెడతారని పురప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
కాంగ్రెస్ సమూల ప్రక్షాళన!
జూలైలో ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ! పార్టీ పదవుల్లో యువతరానికి పెద్దపీట వేసే చాన్స్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సమూల ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు జూలై నెలలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలుస్తోంది. దశాబ్దంపైగా పార్టీ పదవుల్లో కొనసాగుతున్న వారిలో కొందరికి ఉద్వాసన పలకాలని యోచిస్తున్నట్టు, వారి స్థానంలో యువతరం నేతలకు పెద్దపీట వేయనున్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి దారితీసిన కారణాలను అన్వేషించేందుకు ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అనధికారిక కమిటీ తన నివేదికను జూలై 6 తరువాత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమర్పించనున్నట్టు సమాచారం. దీంతో ఆ తరువాతే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశముంది. అన్ని స్థాయిల్లోనూ మార్పులు! ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అత్యంత ఘోర ఓటమిని మూటగట్టుకోవడం, కేవలం 44 స్థానాలకే పరిమితమవడం విదితమే. దీంతో పార్టీ ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని సోనియాగాంధీకి కట్టబెడుతూ కాంగ్రెస్లో అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయం తీసుకోవడమూ తెలిసిందే. సంస్థాగతంగా కొన్ని మార్పులు చేయనంతవరకు మనకు ఎదురయ్యే తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని సోనియాగాంధీ సైతం ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీలో అన్ని స్థాయిల్లో మార్పులకు కసరత్తు చేస్తున్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక రాగానే ఇందుకనుగుణంగా చర్యలు చేపట్టేది ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై కసరత్తు చేస్తున్న ఆంటోనీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, కార్యదర్శులు ఆర్సీ కుంతియా, అవినాశ్ పాండేలతో కూడిన కమిటీ ఇప్పటివరకు ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నేతలతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి ఈ కసరత్తును నెలాఖరులోగా ముగించాల్సి ఉంది. అయితే ఈ కసరత్తు జూలై 6 వరకు పట్టవచ్చని, ఆ తరువాతే నివేదికను సోనియాకు అందజేయవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ‘చింతన్ శిబిర్’ను కూడా నిర్వహించేందుకు ఆస్కారముందని చెప్పాయి. -
బాబు వచ్చె.. జాబు పోయె!.
సీన్ రివర్స్ గృహ నిర్మాణ శాఖలో 158 మందికి ఉద్వాసన! నెలాఖరులోగా ఇంటికి పంపాలని ఆదేశాలు ఆందోళనలో ఉద్యోగులు అనంతపురం : జాబు రావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం చంద్రబాబుతోనే సాధ్యం.. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు తమ్ముళ్లు ఉపన్యాసాలు, గోడ రాతలతో ఊదరగొట్టారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీన్ రివర్స్ అవుతోంది. వివిధ శాఖల్లో తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇంటికి పంపే పనిలో పడ్డారు. ఇప్పటికే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకంలో దాదాపు 850 మంది ఔట్ సోర్సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని నిర్ణయించిన చంద్రబాబు.. తాజాగా గృహ నిర్మాణ శాఖపై దృష్టి సారించారు. ఆ శాఖలో ఔట్ సోర్సింగ్ కింద జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 30 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (ఎఈలు), 99 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, 22 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఏడుగురు కార్యాలయ సిబ్బందిని మొత్తంగా 158 మందిని ఇంటికి పంపటానికి రంగం సిద్ధం చేశారు. జూన్ 30 కల్లా వారిని తొలగించాంటూ గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఖాళీ అయ్యే ఈ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అనే విషయంపై ప్రభుత్వం వద్ద కానీ, అధికారుల వద్ద కానీ స్పష్టత లేదు. ఇంటి నిర్మాణాలు పూర్తవుతాయా? వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు గృహ నిర్మాణ శాఖకు ప్రాధాన్యత లేదు. స్థానిక నియోజకవర్గాలకు కొద్దిపాటి ఇళ్లు మాత్రమే మంజూరు చేసేవారు. కేంద్ర, రాష్ట్రాలు మంజూరు చేసే గృహాలు ఏడాదికి వెయ్యి ఇళ్లకు మించేవి కావు. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రాన్ని పూరిగుడిసెల్లేని రాష్ట్రంగా చూడాలని భావించారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ పథకం కింద మూడు విడతల్లో ప్రతి నియోజకవర్గానికి వేలాది ఇళ్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మూడు విడతల్లో అనంతపురం జిల్లాకు ఇందిరమ్మ పథకం కింద దాదాపు 4,61,471 ఇళ్లు మంజూరు చేశారు. ఒక్కసారిగా గృహ నిర్మాణ శాఖకు ప్రాధాన్యత పెరగడంతో ఉద్యోగులకు పనిభారం కూడా ఎక్కువైంది. ఈ క్రమంలో నామమాత్రంగా ఉన్న శాశ్వత ఉద్యోగులకు తోడు ఔట్సోర్సింగ్ కింద అర్హతలను బట్టి ఉద్యోగులను నియమించారు. రాజశేఖర్రెడ్డి నిర్ణయంతో గూడులేని నిరుపేదలకు సొంత గూడు దొరకడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి దొరికినట్లైంది. ఈ క్రమంలో సిబ్బంది ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించారు. జిల్లాలో మొత్తం 4,61,471 గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,86,107 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక 2,24,335 ఇళ్లు వివిధ దశల్లో ఉండగా, 61,772 ఇంటి నిర్మాణాలు అసలు ప్రారంభమే కాలేదు. ఈ పరిస్థితుల్లో గృహ నిర్మాణ శాఖలో కీలక పాత్ర పోషించే ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించడానికి రంగం సిద్ధం చేయడంతో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ నిర్మాణాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పెరిగిన సిమెంటు ధరలు, సమయానికి రాని బిల్లులతో నిర్మాణాలు పూర్తి చేసుకోలేని లబ్ధిదారులు ఇప్పుడు సిబ్బంది పర్యవేక్షణ తగ్గిపోతే ఇంటి నిర్మాణాలు ఎలా పూర్తి చేసుకుంటారో అర్థం కాని పరిస్థితి. 158 మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపిన పక్షంలో ఆ శాఖలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సిబ్బంది నామమాత్రంగానే ఉన్నారు. వర్క్ఇన్స్పెక్టర్లు 24 మంది, ఏఈలు 31, సీనియర్ అసిస్టెంట్లు నలుగురు, జూనియర్ అసిస్టెంట్లు ముగ్గురు, అసిస్టెంట్ మేనేజర్లు ముగ్గురు, ఒక మేనేజర్ మాత్రమే ఉంటారు. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్న రోజుల్లోనే జిల్లాలో నత్తనడకన సాగిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడు ఏమేరకు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకమే. నెలాఖరుకు ఇంటి దారి పట్టించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలుసుకున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. ఔట్సోర్సింగ్ సిబ్బందిలో టెన్షన్ ఒక్కోశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని చంద్రబాబు నాయుడు తొలగిస్తూ పోతుండడంతో ఇతర శాఖల్లో ఔట్సోర్సింగ్, తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురౌతున్నారు. ఎప్పుడు తమ శాఖపై బాబు కన్నుపడుతుందో.. తమ ఉద్యోగాలకు ఎప్పుడు ఉద్వాసన పలుకుతారో తెలియక వారు టెన్షన్కు గురౌతున్నారు. ఈ విషయమై గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్ను ‘సాక్షి’ వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, పరిశీలిస్తున్నామని తెలిపారు. -
తరలించిన జనాలకూ..లెక్కుంది
నల్లగొండ :సార్వత్రిక ఎన్నికల సభలు, సమావే శాలకు వాహనాల్లో తరలివచ్చిన జనాలకు ఎన్నికల అధికారులు లెక్కగట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఎన్నికల వ్యయ పరిశీలకులు సభలకు వచ్చిన ఒక్కో వ్యక్తికి రెండు వందల రూపాయలను ఖర్చుగా నిర్ణయించారు. ఈ మొత్తా న్ని అభ్యర్థుల ఎన్నికల వ్యయ ఖాతాలో జమ చేయనున్నా రు. వ్యయ పరిశీలకుల బృందాలు బహిరంగ సభలు, సమావేశాలకు వచ్చిన ప్రజలను వివరాలు అడిగి వీడియో ద్వారా రికార్డు చేశారు. ఈ సమయంలో అధికారులు ఆసక్తికర అంశాలను రికార్డు చేశారు. ఉదయం ఒక సభలో కనిపించిన ప్రజలు, సాయంత్రం మరొక సభలో కూడా కనిపించడం విస్మయానికి గురిచేసింది. ఈ విధంగా సభలకు వచ్చిన జనా ల నుంచి వివరాలు అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోవిధం గా సమాధానం ఇచ్చారు. ఒకరు వంద కూలి, బిర్యానీ ప్యాకెట్, మందు సీసా అని చెబితే.. మరొకరు రెండువందల కూలి, బిర్యానీ ప్యాకెట్, మందు సీసా అని సమధానం ఇచ్చా రు. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన వ్యయ పరిశీలకులు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఒక ధర నిర్ణయించారు. ఈ ప్రకారంగా సరాసరి ఒక్కొక్కరికి రెండు వందల రూపాయల ధర నిర్ణయించారు. అయితే ఈ మొత్తం కూడా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల వ్యయ ఖాతాల్లోకి వెళ్తుంది. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయలెక్కలు సమర్పించే అంశం పై అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లతో కలెక్టర్ చిరంజీవులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభలకు వచ్చిన జనాలకు కూడా ధర నిర్ణయించే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఈ విధంగా చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, పార్టీ ల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, రూ.200 చాలా తక్కువని, తమవద్ద పూర్తి ఆధారాలున్నాయని, ప్రజ లు చెప్పిన అంశాలను రికార్డు చేశామని కలెక్టర్ చెప్పారు. అయితే, రూ.200 కాకుండా, పొరుగు జిల్లాలు నిర్ణయించిన ధరను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏజెం ట్లు, అభ్యర్థులు కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆర్ఓలు లేకుండానే సమీక్ష... ఎన్నికల వ్యయ వివరాలకు సంబంధించి అభ్యర్థులు ఇంకా వివరాలు సమర్పించలేదు. 12 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సిన ఈ సమావేశానికి ఏ ఒక్కరూ హాజరుకాలేదు. భువనగిరి ఆర్డీఓ మినహా మిగతా ఆర్డీఓలు హాజరయ్యారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు సమర్పించడంలో ఆర్ఓలది కీలక బాధ్యత. అలాంటి సమావేశంలో వారు లేకుండా కలెక్టర్ సమావేశాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారులకు మెమోలు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇక సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు హాజరుకాగా, మిగతా పార్టీల నుంచి ఏజెంట్లు మాత్రమే వచ్చారు. ముంచుకొస్తున్న గడువు... ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో కఠిన నిబంధనలు అమలు చేసింది. గడువులోగా అభ్యర్థులు లెక్కలు ఇవ్వకుంటే వారిపై చట్టంలో పేర్కొన్న విధంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. అభ్యర్థులు ఈ నెల 15లోగా లెక్కలు సమర్పించాల్సి ఉంది. ఓడిన అభ్యర్థులతో పాటు, గెలిచిన అభ్యర్థులు కూడా లెక్కలు ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగంలోకి దిగనున్న వ్యయ పరిశీలకులు.. ఈ నెల 15 తేదీ నాటికి అభ్యర్థులు సమర్పించిన లెక్కల వివరాలను పునఃపరిశీలించేందుకు రాష్ట్రం నుంచి వ్యయ పరి శీలకులు జిల్లాకు రానున్నారు. 16,17,18 తేదీల్లో పరిశీలకులు జిల్లాలోనే మకాం వేసి అభ్యర్థులు సమర్పించిన లెక్కలు నిబంధనలకు లోబడి ఉన్నాయా..? లేదా? అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తారు. లెక్కలు ఇవ్వని అభ్యర్థులపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. -
రుణం తీర్చుకోవడం ఇలాగేనా!
విజయనగరం వ్యవసాయం : రుణాలు మాఫీ అవుతాయని గంపెడు ఆశతో ఉన్న రైతన్న ఆశలను అడియాసలు చేసే విధంగా చంద్రబాబు వ్యవహరించడం తో వారిలో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతున్నాయి. పంట రుణాలను మాఫీ చేస్తానని, మొదటి సంతకాన్ని రుణ మాఫీ ఫైల్పై పెడతానని చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడంతో రైతులు ఆయనకు అధికారం కట్టబెట్టారు. అయితే ఇప్పుడు బాబు ఆ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీలుయినంత వరకు రుణ మాఫీ భారాన్ని తగ్గించుకోవడం లేదా రుణ మాఫీ చేయకుండా కాలయాపన చేయాలనే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే రుణమాఫీపై చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇందుకు అద్దం పడుతోందని వారు వాపోతున్నారు. అధికారం చేపట్టగానే మాట మార్చడంపై రైతులు మండిపడుతున్నారు. కమిటీ నివేదిక ఇచ్చే లోపే ఖరీఫ్ సీజన్ సగం పూర్తవుతుంది. ఈ లోగా అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి రైతుల వద్ద చిల్లిగవ్వలేదు. ఎందుకంటే గత నాలుగేళ్లూ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. అతివృష్టి, అనావృష్టిలతో కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. పాత రుణం రద్దయి... కొత్తగా రుణాలు ఇస్తే ఖరీఫ్ సాగు చేపట్టాలని రైతులు ఆనందంతో ఎదురు చూశారు. అయితే రుణమాఫీపై ప్రభుత్వం మెలిక పెట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కమిటీ నివేదిక 45 రోజుల తర్వాత వస్తుంది, అప్పటికి ఖరీఫ్ సీజన్ సగం అయిపోతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుకు పెట్టుబడి ఏదీ ...? వ్యవసాయ శాఖ ఇప్పటికే వరి, పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలను 92 వేల క్వింటాళ్ల వరకూ సిద్ధం చేసింది. అయితే విత్తనాలను కొనుగోలు చేయడానికి రైతుల వద్ద చిల్లిగవ్వలేదు. ప్రతీ ఏడాది రైతులు ఖరీఫ్ సీజన్కు ముందు జూన్ నెలలో బ్యాంకులో రుణాలు తీసుకుని పెట్టుబడి పెడతారు. పాత బకాయిలు చెల్లించనిదే బ్యాంకర్లు కొత్త రుణాలు మంజూరు చేయరు. దీంతో ఖరీఫ్ పెట్టుబడిని ఏ విధంగా సమకూర్చుకోవాలన్నదానిపై అన్నదాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పంట రుణాలు రద్దవుతాయని భావించిన బ్యాంకర్లు కూడా కొత్త రుణాల మంజూరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రైవేటు వ్యాపారులే దిక్కు రైతులకు పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయి. అప్పటి చంద్రబాబు పాలనలో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టేవారు. పంటలు కలిసిరాక అప్పట్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఇదే పరిస్థితులు దాపురించేలా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రుణ వివరాలు: గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ల్లో రూ.1,162 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారు. ఇందులో బంగారంపై తీసుకున్న రుణాలు 431 కోట్లు కాగా, పంటరుణాలు రూ. 731 కోట్లు. పంట రుణాలు తీసుకున్న రైతులు 1,82,174మంది, బంగారుపై రుణం తీసుకున్న రైతులు 53,701 మంది. -
లెక్క చెప్పాల్సిందే
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉంది. అయితే ఖర్చు వివరాలందించడంలో అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 196 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా ఇప్పటి వరకు కేవలం 20 మంది అభ్యర్థులు మాత్రమే ఎన్నికల ఖర్చు వివరాలందించారు. మరో 176 మంది అభ్యర్థులు ఇవ్వాల్సి ఉంది. అందుకు తుది గడువు ఈనెల 15గా నిర్ణయించారు. అప్పటికల్లా ఖర్చు వివరాలు అందించకుంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సంబంధిత అభ్యర్థు లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 187 మంది, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు 29 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల ఫలితాలను మే 16న ప్రకటించారు. ఖర్చు వివరాలను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందించాల్సి ఉంది. గడువు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ఖర్చు వివరాలందించడంలో అభ్యర్థులు అనాసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఓటమిని జీర్ణించుకోలేక, మరికొంత మంది ఇవ్వొచ్చులే అన్న నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. వివరాలు అందించకుంటే... =అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసిన నాటి నుంచి ఎన్నికలు జరిగే తేదీ వరకు చేసిన ప్రతి పైసా లెక్క చూపించాల్సిందే. ఇప్పటికే ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఎన్నికల సంఘం కొంతమేర మినహాయింపు ఇచ్చింది. దానికి లోబడి ఖర్చు చేశారా,అంతకంటే ఎక్కువ ఖర్చు చేశారా అన్న వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. = కీలకమైన ఎన్నికల ఖర్చు వివరాలను అభ్యర్థులు అందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తోంది. భవిష్యత్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన వారికి ఒకరకంగా ఇది రాజకీయ సమాధి వంటిదే. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారు భవిష్యత్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి అవకాశం వస్తే దానిని కోల్పోయే ప్రమాదం ఉంది. = ఎన్నికల ఖర్చు వివరాలను అందించని అభ్యర్థులకు సంబంధిత నియోజకవర్గాల రిట ర్నింగ్ అధికారుల నుంచి నోటీసులు పంపించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఖర్చులో తేడాలున్నా ఇబ్బందే.. ఎన్నికల ఖర్చుకు సంబంధించి అభ్యర్థులు అందించిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు తేడా ఉంటే ఇబ్బంది తప్పదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేశారన్నది బహిరంగ రహస్యమే. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవ్వనున్న ఎన్నికల ఖర్చు వివరాల్లో భారీగా చేసిన ఖర్చు వివరాలు కనిపించకుంటే ఎవరైనా కోర్టులో ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాలను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకునే పనిలో తలమునకలై ఉన్నారు. -
11న జగన్ రాక
విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ స్థానాలపై సమీక్ష ప్రజా సమస్యలపై పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 11న నగరానికి వస్తున్నారు. రెండు రోజుల పాటు జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి లోక్సభ పరిధిలోని నియోజక వర్గాల వారీగా సార్వత్రిక ఎన్నికల గెలపోటములపై సమీక్షించనున్నారు. బీచ్రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో జరిగే సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తం రెండు లోక్సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ స్థానాలతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలోని జగ్గం పేట, కాకినాడ అసెంబ్లీ స్థానాలపైనా సమీక్ష జరుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షలో భాగంగా జగన్ పార్టీ నేతలు, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతోపాటు మున్ముందు ప్రజాసమస్యలపై పార్టీ పరంగా పోరాటం చేసేవిధంగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. 12వ తేదీతో సమీక్షలు ముగుస్తాయి. -
అభ్యర్థుల వ్యయ వివరాలను వెబ్లో పెట్టండి
వారు వివరాలిచ్చిన 72 గంటల్లోగా అప్లోడ్ చేయండి అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్సభ) పోటీచేసిన అభ్యర్థుల వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను ఆయా అభ్యర్థులు సమర్పించిన 72 గంటల్లోగా ఈసీ వెబ్సైట్లోకి అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ మేరకు శుక్రవారం అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారు(సీఈఓ)లకు ఆదేశాలు జారీచేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 78వ సెక్షన్ ప్రకారం.. ప్రతి అభ్యర్థీ సంబంధిత నియోజకవర్గ ఫలితాన్ని ప్రకటించిన 30 రోజుల్లోగా తన ఎన్నికల వ్యయాన్ని జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని వారి నుంచి వివరాలు తీసుకున్న 72 గంటల్లోగా సీఈఓ/డీఈఓ వెబ్సైట్లో పొందుపరచాలని ఈసీ ఆదేశించింది. అంతేకాకుండా అభ్యర్థి ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలను ఎవరైనా కోరితే.. ఒక పేపరుకు రూపాయి చొప్పున తీసుకుని వాటిని ఇవ్వాలని సూచించింది. అదే సీడీ లేదా డీవీడీ ద్వారా అయితే రూ.300 చొప్పున తీసుకొని వివరాలను అందజేయాలని పేర్కొంది. -
ఎన్నికల లెక్కలు సమర్పించండి
ఈ నెల 15 వరకు గడువు ఇవ్వని పక్షంలో షాడో రిజిస్టర్ అధారంగా ధరల ఖరారు కలెక్టర్ గంగాధర కిషన్ కలెక్టరేట్, న్యూస్లైన్ : జిల్లాలో గత నెల 30వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఈనెల 15వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు (ఆర్ఓ) అందజేయాలని కలెక్టర్ గంగాధర కిషన్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఆర్ఓలతో కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిఒక్క అభ్యర్థి లెక్కలు సమర్పించాలన్నారు. పెయిడ్ న్యూస్ విషయంలో పూర్తి భాధ్యత అభ్యర్థులదేనని చెప్పారు. ఈ విషయంలో అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు వెంటనే స్పందించాలన్నారు. సకాలంలో లెక్కలు ఇవ్వని పక్షంలో అధికారులు షాడో రిజిస్టర్ అధారంగా ధరలు ఖరారు చేస్తారని స్పష్టం చేశారు. ధరలు అధికంగా లెక్కిస్తున్నారు.. ఎన్నికల ఖర్చుకు సంబంధించి అధికారులు మార్కెట్ ధరల కన్నా రేట్లు అధికంగా వేశారని సమావేశంలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పోటీ చేసిన అభ్యర్థి తిరుణహరిశేషుతోపాటు మరికొందరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల తమకు ప్రత్యక్షంగా నష్టం లేకున్నా... ఆదాయ పన్ను, ఆదాయ వనరులు చూపాల్సిన సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వాస్తవ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఇవ్వనప్పుడు మాత్రమే అధికారులు ధరలు నిర్ణయించి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారని కలెక్టర్ వారికి చెప్పారు. అందుకే నోటీసులకు సమాధానమిచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 9 నుంచి అందుబాటులో ఉండాలి ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఎన్నికల లెక్కలు తీసుకునేందుకు సంబంధిత ఆర్ఓ కార్యాలయంలో సహాయ వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సందేహాలుంటే ఆర్ఓలను సంప్రదించాలన్నారు. రాజకీయ చర్చ అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు ఇచ్చే విషయంలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభంలోనే రాజకీయ చర్చకు దారితీసి ఆసక్తిని రేకెత్తించింది. సమావేశం ప్రారంభం కాగానే ములుగు ఆర్డీఓ మోతీలాల్ ఖర్చులు లెక్కించే విషయంలో అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోతీలాల్ను ఉద్దేశించి మీరెవరు... అంటూ రెడ్యానాయక్ ప్రశ్నించారు. తాను ములుగు ఆర్డీఓ మోతీలాల్ అని ఆయన సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఆర్ ఓలు, ఏఆర్ఓలు అందరూ టీఆర్ఎస్కు గుద్దమని (ఓటేయమని) చెప్పారు... వారుకూడా వేశారంటూ రెడ్యా అన్నారు. ఆర్డీఓ కలుగజేసుకుని ఎమ్మెల్యే గారూ... అలా మాట్లాడొద్దని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇక కలెక్టర్ వచ్చాక కార్యక్రమం ముగుస్తుందనుకున్న సమయంలో ఇదే విషయూన్ని మరో అభ్యర్థి లేవనెత్తారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నట్లు ప్రస్తుత ఎన్నికల్లో అధికారులు టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారని భావిస్తే 2004, 2009లో కాంగ్రెస్కు పనిచేశారని భావించాల్సి ఉంటుందన్నారు. దీంతో కలెక్టర్ కల్పించుకుని రాజకీయ చర్చకు ఇది వేదిక కాదని చర్చకు ముక్తాయింపు ఇచ్చారు. వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. -
సేల్స్ డల్
తగ్గుముఖం పట్టిన పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జోరు తగ్గిన సీమాంధ్ర వాహనాల రాకపోకలు శివారు బంకులపైనే అధిక ప్రభావం సాక్షి,సిటీబ్యూరో: పెట్రోలు, డీజిల్ వినియోగంలో సింహభాగమైన గ్రేటర్లో వీటి అమ్మకాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో దీని ప్రభావం పెద్దగా లేనప్పటికీ శివారు ప్రాంతాల్లో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల తదితర కారణాలతో శివారు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గాయి. గత మూడునెలల నుంచి సగటున 20శాతం వరకు అమ్మకాలు (సేల్స్) పడిపోయినట్లు ఆయిల్ కంపెనీల ప్రతినిధులే ధ్రువీకరిస్తున్నారు. రాష్ట్రంలోనే పెట్రో ఉత్పత్తుల వినియోగంలో సగంవాటా ఉన్న నగరంలో అమ్మకాలు తగ్గడం ప్రభుత్వ ఖాజానాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదీ లెక్క: మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోలు, డీజిల్ బంకులు ఉన్నాయి. డిమాం డ్ను బట్టి సంబంధిత ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతినిత్యం 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధ నం సరఫరావుతుంటోంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. మొత్తం బంకుల ద్వారా ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33 లక్షల డీజిల్ విక్రమవుతుందని అంచనా. నగర ంలోని 40 లక్షల వివిధ రకాల వాహనాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే సుమారు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం ప్రెటోల్,డీజిల్ను వినియోగిస్తుంటాయి. ఆయితే గత మూడునెలలుగా రాజకీయ అనిశ్చితి, ఎన్నికల హడావుడి, వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటవుతుండడం తదితర కారణాలతో సీమాంధ్ర ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలు తగ్గాయని తెలుస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా శివారు ప్రాంతాల్లోని బంకులపై పడింది. ఫలితంగా సుమారు 22 శాతం పెట్రోలు, 18 శాతం డీజిల్ అమ్మకాలు పడిపోయినట్లు ఆయిల్ కంపెనీల మార్కెటింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఖాజానాపై ప్రభావం: మహానగరంలో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గుదల ప్రభావం రాష్ట్ర ఖజానాపై చూపుతోంది. పెట్రోలు అమ్మకంపై 31 శాతం, డీజిల్ అమ్మకంపై 22 శాతం వ్యాట్ రూపంలో డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఖజానాకు కల్పవృక్షమైన వాణిజ్యపన్నులశాఖకు సమకూరే ఆదాయంలో హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల రాబడి అత్యంత కీలకం. మొత్తం రాష్ట్ర రాబడిలో 74శాతం వరకు ఇక్కడనుంచే జమవుతోంది. వాణిజ్యపన్నులశాఖ వసూలు చేసే పన్నుల్లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) ప్రధానమైనది. ప్రస్తుతం నెల కొన్న పరిస్థితులతో పెట్రో ఉత్పత్తుల వినియోగం తగ్గి వ్యాట్ వసూళ్లు కాస్తా తగ్గుముఖం పట్టడంతో శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతియేటా ప్రభుత్వం టార్గెట్లు విధించి ఆదాయాన్ని పెంచాలని కోరుతుంటే..ఇందుకు భిన్నంగా ఆదాయం తగ్గుతోందని అం టున్నారు. -
టీడీపీ ఎత్తుగడ ఫ్లాప్
జీహెచ్ఎంసీ ‘స్టాండింగ్’ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్-ఎంఐఎం కూటమి అన్ని పార్టీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ ఈ పాలకమండలి ఉండేది డిసెంబరు 3 వరకే సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల ప్రభావం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించింది. ఆ ఎన్నికల మాదిరే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అదే తరహాలో పలు ప్రలోభాలు.. ముడుపుల పంపిణీ జరిగినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. క్రాస్ ఓటింగ్పై భారీ నమ్మకంతో ఈసారి ఎలాగైనా స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్, ఎంఐఎం కూటమికి పడి టీడీపీకి నిరాశ మిగిలింది. గెలిచిన వారిలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి కంటే టీడీపీకి రెండు ఓట్లు తక్కువగా వచ్చాయి. మొత్తానికి కాంగ్రెస్- ఎంఐఎం కూటమి ఎప్పటిలాగే విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎనిమిదిమంది, ఎంఐఎం నుంచి పోటీలో నిలిచిన ఏడుగురు గెలిచారు. టీడీపీ, బీజేపీల నుంచి చెరొకరు పోటీ చేయగా ఇద్దరూ ఓటమి పాలయ్యారు. భారీగా క్రాస్ ఓటింగ్ ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఊహించినట్లుగానే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. అన్ని పార్టీల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆయా పార్టీలకు దక్కిన ఓట్లను బట్టి తెలుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు.. తర్వాత పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు.. కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారు. అనంతరం వారు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారినప్పటికీ రికార్డుల్లో అది నమోదు కావడం లేదు. ఆయా పార్టీలు.. నేతలు.. కార్పొరేటర్ల మధ్య అవగాహనతో మాత్రమే పార్టీ మారిన వారిని కొత్తపార్టీ సభ్యులుగా పరిగణిస్తున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, తదితర సమయాల్లోనూ ఇదే అమలవుతోంది. పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి.. అనంతరం ఆయా పార్టీల్లోకి మారిన వారిని సదరు పార్టీ సభ్యులుగానే పరిగణిస్తున్నారు. ఇటీవల పలు పార్టీల నుంచి పలువురు ఇతర పార్టీల్లో చేరారు. అలా టీడీపీ నుంచి ఏడుగురు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇతర పార్టీల్లోనూ ఈ ఫిరాయింపులున్నాయి. రావాల్సిన ఓట్ల కన్నా ఎక్కువగానే.. ఆయా పార్టీల్లోని కార్పొరేటర్ల తాజా గణాంకాల మేరకు కాంగ్రెస్- ఎంఐఎంల కార్పొరేటర్లు తమ కూటమి అభ్యర్థులకు ఓటేసినట్లయితే ఒక్కో అభ్యర్థికి 90 ఓట్లు రావాల్సి ఉంది. కానీ.. ఇతర పార్టీల నుంచి సైతం భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ రెండు పార్టీల అభ్యర్థులకు 103 ఓట్ల నుంచి 123 ఓట్ల వరకు లభించాయి. కూటమిలోని మరో అభ్యర్థికి కేవలం 75 ఓట్లు మాత్రమే లభించాయి. అలాగే టీడీపీ- బీజేపీ పొత్తును పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ అభ్యర్థికి 47 ఓట్లు మాత్రమే లభించాలి. కానీ, 73 ఓట్లు వచ్చాయి. అన్ని పార్టీల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగినప్పటికీ, జీహెచ్ఎంసీలోని ఒప్పందం మేరకు కూటమిలోని కాంగ్రెస్- ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే గెలవడం విశేషం. జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చే డిసెంబర్ 3 వరకే ఉంది. ఈ పాలకమండలిలో ఇదే చివరి స్టాండింగ్ కమిటీ కావడం.. స్టాండింగ్ కమిటీకి 50 లక్షల రూపాయల మేర పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఉండటంతో ఎలాగైనా స్థానం పొందాలనుకున్న టీడీపీ ఆశ అడియాసే అయింది. ఓటు వేయని మాజీ మేయర్ జీహెచ్ఎంసీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 150 మంది కార్పొరేటర్ల నుంచే 15మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై కార్పొరేటర్లుగా రాజీనామా చేశారు. మిగిలిన 148 మంది కార్పొరేటర్లకుగాను 140 మంది శుక్రవారం పోలింగ్లో పాల్గొన్నారు. ఓటు వేయని వారిలో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి (కాంగ్రెస్)తో సహా ఎనిమిదిమంది కార్పొరేటర్లున్నారు. ఓటు వేయని మిగతా వారిలో నిర్మలా పురుషోత్తంరెడ్డి (కాంగ్రెస్), సీహెచ్ శ్రీనివాస్ (టీడీపీ), అమ్జదుల్లాఖాన్(ఎంబీటీ), ఎంఐఎంకు చెందిన మెరాజ్ అహ్మద్, అరుణలు ఉన్నారు. వీరితోపాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన మురళిగౌడ్, ముఠాపద్మలు కూడా ఓటింగ్లో పాల్గొనలేదు. -
పైరవీల జోరు!
సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు, ఎంపీడీఓలు తిరిగొచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను ఇతర జిల్లాలకు పంపడం తెలిసిందే. వీరిని తిరిగి సొంత జిల్లాలకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు 43 మంది తహశీల్దార్లు, 37 మంది ఎంపీడీఓలు జిల్లాకు చేరుకున్నారు. అయితే బదిలీపై వచ్చిన వీరిలో కొందరు సోమవారం నుంచే పోస్టింగ్ల కోసం పైరవీలకు తెరతీశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. నేతల అనుయాయులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు మీ సామాజిక వర్గానికి చెందిన వాడినని.. చెప్పినట్లు నడుచుకుంటానని నమ్మబలుకుతున్నారు. వారి సిఫారసు లేఖలతో జిల్లా ఉన్నతాధికారులను కలిసేందుకు యత్నిస్తున్నారు. దీంతో బదిలీల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా పరిపాలన శూన్యత చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాని పరిస్థితి. మరో ఐదు రోజులు గడిస్తే కానీ పాలకులు కొలువుదీరే అవకాశం లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బదిలీలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్లకు స్థానాల కేటాయింపు పారదర్శకంగా చేపట్టడం ప్రశ్నార్థకమవుతోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున వీరి సిఫార్సులను ఏ మేరకు అధికారులు పాటిస్తారనేది వేచిచూడాలి. ప్రధానంగా తహశీల్దార్ల బదిలీల్లో ప్రతిసారీ రాజకీయ జోక్యం మితిమీరుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల స్వేచ్ఛను నేతలు కాలరాస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పాలన కూడా సక్రమంగా సాగడం లేదనే విమర్శలు తరచూ వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తహశీల్దార్ల బదిలీలు ఎలాంటి కోణాలను ఆవిష్కరిస్తాయోననే చర్చ జరుగుతోంది. కర్నూలుపై మక్కువ కొందరు తహశీల్దార్లకు కర్నూలు డివిజన్ అంటే మక్కువ. అత్యధిక కాలం ఇక్కడ పనిచేసిన అధికారులు ఎన్నికల వేళ జిల్లాను వీడక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాకు చేరిన వీరు తిరిగి పూర్వ స్థానాలను కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆదోని డివిజన్లోనూ పైరవీలకు తెరలేచింది. ఇక్కడ సామాజిక కోణం ఆధారంగా పలువురు తహశీల్దార్లు ఒకే చోట తిష్ట వేశారు. ఇకపోతే ఆదాయ వనరులు.. ఇసుక.. మైనింగ్ తదితరాలను దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు అధికారులు ఆయా ప్రాంతాల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం. -
4 నుంచి రాజమండ్రిలో వైఎస్సార్సీపీ సమీక్షలు
తొలిరోజు అరకు.. పాడేరు 6న మిగిలిన నియోజకవర్గాలు హాజరుకానున్న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు ఈ నెల 4 నుంచి రాజమండ్రి కేంద్రంగా జరగనున్నాయి. అరకు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో భాగంగా 4న రాత్రి 8 గంటలకు విశాఖలోని అరకు అసెంబ్లీ, 8.30 గంటలకు పాడేరు అసెంబ్లీ ఫలితాలపై పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో చర్చించనున్నారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై 6వ తేదీన సమీక్ష జరగనుంది. దీనికి జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హాజరుకానున్నారు. గత ఫలితాలపై సమీక్షలో లోటుపాట్లు తెలుసుకోవడంతోపాటు, భవిష్యత్తులో పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. 6వ తేదీ సమీక్ష వివరాలు అనకాపల్లి పార్లమెంటు పాయకరావుపేట సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల వరకు యలమంచిలి సా.5.30 -6 వరకు నర్సీపట్నం సా.6 -6.30 వరకు అనకాపల్లి సా.6.30-రాత్రి 7.00 పెందుర్తి రా.7 -7.30 వరకు మాడుగుల రా.7.30 - 8 వరకు చోడవరం రా.8- 8.30 వరకు విశాఖ పార్లమెంటు: ఎస్.కోట రా.8.30 -9 వరకు గాజువాక రా.9 -9.30 వరకు విశాఖ తూర్పు రా.9.30 -10 విశాఖ దక్షిణం రా.10 -10.30 విశాఖ ఉత్తరం రా.10.30 -11 విశాఖ పశ్చిమం రా.11 -11.30 భీమిలి రాత్రి 11.30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు -
త్రిసభ్య కమిటీ సమావేశం రేపు
ఎన్నికలపై వైఎస్సార్ సీపీ సమీక్ష నియోజకవర్గాల వారీ సమావేశం మునగపాక, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షకు జూన్ ఒకటిన అనకాపల్లి న్యూకాలనీలోని రోటరీ కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ సమావేశమవుతున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం మునగపాకలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూరల్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నాయకులతో సమీక్ష ఉంటుందన్నారు. దీనికి పార్టీ సీనియన్ నేతలు, విశాఖ జిల్లా త్రిసభ్య కమిటీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, సాయిరాజ్లు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. నియోజకవర్గాల వారీ సమీక్ష అనంతరం నివేదికను జగన్మోహన్రెడ్డికి సమర్పిస్తారన్నారు. ఇందులో భాగంగా ఒకటిన ఉదయం 9గంటలకు అనకాపల్లి , 9.30 గంటలకు చోడవరం, 10 గంటలకు పెందుర్తి, 10.30 గంటలకు యలమంచిలి, 11 గంటలకు పాయకరావుపేట, 11.30 గంటలకు నర్సీపట్నం, 12 గంటలకు మాడుగుల, 12.30 గంటలకు పాడేరు, ఒంటి గంటకు అరకు నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష ఉంటుందన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని ప్రసాద్ కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మళ్ల సంజీవరావు,పీఏసీఎస్ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, పార్టీ నాయకుడు సూరిశెట్టి కన్నారావులు పాల్గొన్నారు. -
తప్పులు సరిదిద్దుకుంటాం
శంకర్పల్లి, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందని పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఆతిథిగృహంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని, అయితే ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని వెంకటస్వామి అన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా ప్రచారం చేసుకోకపోవడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు. సంక్షేమ పథకాల వల్ల ఎంతోమంది లబ్ధి పొందినా... నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందన్నారు. సంక్షేమ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయన్న ధీమాతో ఎన్నికలకు వెళ్తే ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజల తీర్పును తాము శిరసావహిస్తామని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి మంచి గౌరవం ఉందని, కానీ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. పార్టీ పరాజయానికి కారణాలపై అందరం కలిసి చర్చించుకుంటామని, తప్పులను సరిదిద్దుకొని మళ్లీ ప్రజల వద్దకు వెళ్తామని ఆయన అన్నారు. నియోజకవర్గ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ మళ్లీ ఎన్నికలనాటికి కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకొస్తామని వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్రెడ్డి, డీసీసీ సంయుక్త కార్యదర్శి వాసుదేవ్, ఎంపీటీసీ సభ్యులు బద్దం శశిధర్రెడ్డి, నర్సింలు, రావులపల్లి మాజీ సర్పంచ్ రవీందర్, పార్టీ నాయకులు పార్శి బాలకృష్ణ, కొంగళ్ల మల్లేషం, సర్తాజ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకు త్రిసభ్య కమిటీ సభ్యుల రాక
కర్నూలు, న్యూస్లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికలతోపాటు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జయాపజయాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రవీణ్కుమార్రెడ్డి, జగ్గారెడ్డి, విశ్వరూప్లు కర్నూలుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. కర్నూలులోని దేవీ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సవీక్ష సమావేశానికి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో పాటు నందికొట్కూరు నియోజకవర్గం, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. అలాగే సాయంత్రం 4 గంటలకు నంద్యాలలోని పద్మావతినగర్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, డోన్, శ్రీశైలం నియోజకవర్గాలతో పాటు పాణ్యం, గడివేములకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాలని సూచించారు. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ సమీక్ష సమావేశాలకు హాజరు కావాలని కోరారు. అలాగే ఆయా మండల గ్రామ స్థాయి నాయకులు, జిల్లా కేంద్ర కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల కన్వీనర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
ఎన్నికల్లో పోలీసుల పాత్ర భేష్
మిర్యాలగూడ క్రైం, న్యూస్లైన్ :మున్సిపల్, స్థానిక, సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర భేష్ అని ఎస్పీ ప్రభాకర్రావు కితాబి చ్చారు. మండలంలోని నందిపాడు టీఎ న్ఆర్ ఫంక్షన్హాల్లో మిర్యాలగూడ సబ్డివిజన్ పరిధిలోని పోలీసు అధికారు లు, సిబ్బందికి బుధవారం నిర్వహించి న ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో అవాంఛనీ య సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చేపట్టిన భద్రతా చర్యలు అభినందనీయమన్నారు. తీవ్ర పని ఒత్తిడిలో కూడా తమ విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారు లు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సినీ ఆర్టిస్టులు జనార్దన్, వెంకటేశ్వర్లు నిర్వహించిన మ్యాజిక్షో, పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమారాజేశ్వరి, ఓఎస్డీ సుధాకర్రెడ్డి, డివిజనల్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ సుభాష్చంద్రబో స్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సురేష్, సీఐలు సుదర్శన్రెడ్డి, శివశంకర్గౌడ్, ఎస్ఐలు రాహుల్దేవ్, వెంకటేశ్వర్లు, సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ సీపీ సమీక్ష
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సీమాంధ్ర జిల్లాల పరిశీలకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు బుధవారం భేటీ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులపై త్రిసభ్య కమిటీ బృందం ప్రతిజిల్లాలో పర్యటించనుంది. ఈ కమిటీ జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించనుంది. కాగా వచ్చే నెల మొదటి వారం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ సమీక్షలు విడివిడిగా జరుగుతాయి. సమీక్షా సమావేశాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు విడివిడిగా అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప , 30న కృష్ణా, అనంతపురం, 31న కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 1వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో సమీక్షలు జరుగుతాయి. -
ఎన్నికల నిర్వహణ ఖర్చులో అవకతవకలు
సాక్షి, మచిలీపట్నం : గెలుపు కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన ఖర్చు కూడా కోట్లు దాటింది. ఎన్నికల నిధుల వినియోగంలో లోపాలు జరిగాయన్న ఆరోపణలు మాత్రం జిల్లా యంత్రాంగం పరువు తీస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం చేసిన ఖర్చు రూ.18.98 కోట్లు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాకు రెండు విడతలుగా విడుదలైన ఈ నిధులను సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు(ఏఈఆర్వో)లకు నాలుగు దశల్లో కేటాయింపులు జరిపారు. గతంలో ఏ ఎన్నికల్లోనూ లేనివిధంగా ఈసారి ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున నిధుల కేటాయింపులు జరగడం విశేషం. నియోజకవర్గానికి రూ.కోటికి పైగా... జిల్లాలో రెండు లోక్సభ, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు ఇబ్బడి ముబ్బడిగానే నిధులు కేటాయింపులు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ఆదేశాలతో ఎన్నికల బడ్జెట్ను కేటాయించారు. వాటిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ ఏఈఆర్వోలకూ దశల వారీగా కేటాయింపులు జరిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది మార్చి 13న రూ.6,33,44,000, ఏప్రిల్ 18న రూ.12,64,73,600 నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. వీటిని మార్చి 18, ఏప్రిల్ 22 తేదీల్లో జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఏఈఆర్వోలకు కేటాయింపులు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం టీఏ బిల్లులు, కారు అద్దెలు, ఆయిల్, ప్రకటనలు, టెలిఫోన్, పోస్టేజీ, ఆఫీసు ఖర్చులు వంటి బిల్లులను పెట్టారు. ఇలా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.కోటికి పైగా నిధుల కేటాయింపులు జరగడం గమనార్హం. ఎన్నికల ఖర్చుపై ఎన్నో అనుమానాలు.. జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల నిర్వహణ వ్యయంపై అనుమానాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన మొత్తం నిధుల్లో 60 నుంచి 70 శాతం వరకు ఖర్చుచేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం నిధులను రికార్డుల్లో ఖర్చులు చూపించి మిగుల్చుకున్న నిధులను కొన్ని తహశీల్దార్ కార్యాలయాల పరిధిలోని సిబ్బంది పంచుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా అవసరమైన సామగ్రి విజయవాడలోని ఒక స్టోర్స్లో కొనుగోలు చేశారు. మిగిలిన మొత్తాలను పలు నియోజకవర్గాల్లో తలా కొంచెం పంచుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాస్తవంగా చేసిన ఖర్చులు తక్కువే అయినా లెక్కల్లో మాత్రం వాటిని సరిచేసుకుని సంబంధిత అధికారులతో ఆమోద ముద్ర వేయించుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం సంబంధింత అధికారులకు స్థాయిని బట్టి ముడుపులు ముట్టజెబుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత అకౌంటెంట్ ఆడిటర్ జనరల్ (ఏజీ) కార్యాలయం నుంచి వచ్చే ప్రత్యేక సిబ్బంది ఆడిట్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. పెడనలో రోడ్డున పడ్డ నిధుల గొడవలు.. పెడన నియోజకవర్గంలో పలు మండలాల్లో ఎన్నికల నిధుల కైంకర్యంపై వివాదాలు తలెత్తడంతో సిబ్బంది నడుమ గొడవలతో రోడ్డున పడ్డారు. మిగులు నిధులు తమకు వాటా వేయడంలో జరిగిన అన్యాయాన్ని రెవెన్యూ అసోసియేషన్ సమావేశంలో లేవనెత్తుతామని, నిధులు కాజేసిన వారి బండారం బయటపెడతామని దిగువస్థాయి సిబ్బంది ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పెడన నియోజకవర్గానికి కేటాయించిన నిధుల్లో ఖర్చుచేయగా మిగిలిన మొత్తాన్ని కొందరు పంచుకున్నట్టు వివాదాలు రేగాయి. ఈ నియోజకవర్గంలో ఒక మండలంలో మిగిలిన మొత్తం నిధులను ఒక అధికారికి 80 శాతం, ఆయన దిగువస్థాయి అధికారికి 20 శాతం చొప్పున వాటాలు పంచుకోవడంతో వీఆర్వోలు వివాదానికి దిగినట్టు సమాచారం. ఎందుకొచ్చిన గొడవలు అనుకుని మరో రెండు మండలాల్లో మిగిలిన మొత్తాన్ని ఒక్కొక్కరు రూ.5 వేలు చొప్పున పంచుకుని సొమ్ము స్వాహా చేయడంలో సమన్యాయం పాటించారు. పెడనలో ఎన్నికల ఖర్చుతో కొన్న ఏసీని సగం ధరకే ఒక ఉద్యోగికి అమ్మేసినట్టు తెలిసింది. దీనిపై తహశీల్దార్ డీవీఎస్ ఎల్లారావును ‘సాక్షి’ వివరణ కోరగా ఆ ఏసీ ఎన్నికల నిధులతో కొనలేదని చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి తెచ్చి ఇచ్చేశామని తెలిపారు. ఎన్నికల డీటీ మల్లిఖార్జునరావు మాత్రం ఆ ఏసీ ఎన్నికల నిధులతోనే కొన్నట్టు ‘సాక్షి’కి చెప్పారు. వీటన్నింటిపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆరా తీస్తే జరిగిన అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
ఎన్నికల డాక్యుమెంటేషన్ చేయండి
విజయవాడ సిటీ, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విధానాలను డాక్యుమెంటేషన్ చేయాలని రాష్ర్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఎస్పీలతో ఆయన ప్రాంతీయ సమీక్షాసమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, మద్యం, నగదు పట్టివేత కేసులు, ఎన్నికల నివేదిక తదితర విషయాలపై సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా జేసీ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 330 కేసులు నమోదయ్యాయని, రూ 5.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8వేల 900 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 93 కేసులు నమోదు చేశామని వివరించారు. అదనపు సీఈవో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం సీజ్కు సంబంధించి నమోదైన కేసులపై సత్వరం పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎన్నికల తుది నివేదికలను ఎన్నికల సంఘానికి సత్వరమే పంపాలన్నారు. ఈ ఎన్నికలలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ, ముఖ్య సంఘటనలపై అన్ని జిల్లాల్లో డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. పోలింగ్కు ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచిన విధంగానే ఉపయోగించని ఈవీఎంలకు కూడా తగిన భద్రత కల్పించాలన్నారు. పెయిడ్ న్యూస్పై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రామనాయక్, గుంటూరు అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ పి.చంద్రశేఖర్, విజయవాడ నగర డీసీపీలు వి.గీతాదేవి, ఎ.ఎస్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
29 నుంచి ఎన్నికలపై వైఎస్సార్సీపీ సమీక్షలు
13 జిల్లాలకు త్రిసభ్య కమిటీల ఏర్పాటు హైదరాబాద్: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 29 నుంచి నాలుగు రోజులపాటు సమీక్షలు చేపట్టనుంది. సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ సమీక్షలు విడివిడిగా జరుగుతాయి. సమీక్షా సమావేశాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు విడివిడిగా అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులపై ఈ సందర్భంగా లోతైన అధ్యయనం, విశ్లేషణ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప , 30న కృష్ణా, అనంతపురం, 31న కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 1వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో సమీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు వర్తమానం పంపారు. -
ప్రజావాణి ఉన్నా లేనట్టే..
కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రజావాణిలో ముఖ్యమైన అధికారులు అందుబాటులో ఉండకపోవడంపై ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ కారణంగా మార్చి మూడో తేదీనుంచి ప్రజావాణి నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తిరిగి ప్రారంభమైంది. అయితే ప్రజావాణికి పలువురు అధికారులు డుమ్మా కొడుతుండడంతో ప్రజ లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫిర్యాదులూ తక్కువగానే నమోదవుతున్నాయి. సోమవారం జడ్పీ సీఈ ఓ, ఇన్చార్జి ఏజేసీ రాజారాం ఫిర్యాదులు స్వీకరించారు. 64 ఫిర్యాదులే వచ్చాయి. ప్రైవేట్ ఆస్పత్రులను మూసి ఉంచడం వల్ల రోగులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య కు పరిష్కారం చూపాలని అఖిల భార త రైతు కూలీ సంఘం నాయకుడు వి.ప్రభాకర్ ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొందరు డా క్టర్లు డబ్బే సర్వస్వంగా పనిచేస్తూ రోగులను పీడిస్తున్నారని ఆరోపించారు. కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు కమీషన్ల కోసం కక్కుర్తిపడి చిన్న చిన్న వ్యాధుల కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు తీసుకువచ్చి స్కానింగ్, ఇతర పరీక్షల పేరుతో అమాయకులను దోచుకుంటున్నారన్నారు. రోగి చనిపోయారన్న బాధతో వారి కు టుంబ సభ్యులు ఆవేదనకు లోనై దాడి చేస్తే ఆ స్పత్రులను మూసి ఉంచి రోగులందరినీ ఇబ్బం దులకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలన్నారు. -
నైరాశ్యంలో ‘దేశం’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వరుస ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ లో మహానాడు ఉత్సాహాన్ని నింపుతుందా? ఓటమితో కుంగిపోయిన కేడర్లో నైరాశ్యం తొలుగుతుందా? రెండు రోజులపాటు హైదరాబాద్లో నిర్వహించే మహానాడుకు జిల్లా నుంచి నియోజకవర్గానికి 60 మంది చొప్పున 540 మందికి ఆహ్వానం అందింది. మిగిలిన నేతలు, కార్యకర్తల సంగతేంటి? గతం లో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కోటలకు బీటలు బారిన వైనంపై ఏం చర్చిం చనున్నారు? ఓటమితో నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన కార్యకర్తల్లో మహానాడు స్ఫూర్తి నింపుతుందా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోం ది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2014 సంవత్సరం జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సహా.. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నామ రూపాల్లేకుండా పోయింది. దయనీయ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో 27, 28 తేదీలలో హైదరాబాద్లో జరిగే మహానాడుకు జిల్లా నేతలకు ఆహ్వానం రావడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో ఇందూరు ఓటర్ల విలక్షణ తీర్పుకు టీడీపీ చిత్తయ్యింది. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. గత ఎన్నికలలో నగరంలో ఏడు డివిజన్లను కైవసం చేసుకున్న టీడీపీ ఈ సారి బోణి కొట్టలేని స్థితికి దిగజారి పురపోరులో పూర్తిగా ఉనికి కోల్పోయింది. జిల్లాలో పార్టీ కనిపించకుండా పోయింది. పార్టీ బ్యానర్పై పోటీ చేసిన పలువురు ఓటమిని చవిచూడగా.. వ్యక్తిగతంగా ప్రజల్లో పేరున్న నేతలు కౌన్సిలర్లుగా గెలుపొందారు. జిల్లాలో మొత్తం డివిజన్లు, వార్డులు కులుపుకుని 141 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో 35 చోట్ల గెలుపొందింది. ఈ సారి కేవలం రెండు చోట్లే కౌన్సిలర్లుగా విజయం సాధించారు. అర్మూరు, బోధన్లో ఒక్కొక్కరు కౌన్సిలర్లుగా నెగ్గారు. ఆ పార్టీ టికెట్పై పోటీ చేసిన అభ్యర్థులు ఓటమిని ఇప్పటికీ జీర్ణించు కోలేక పోతున్నారు. జిల్లాలో మొత్తం 583 ఎంపీటీసీ స్థానాలలో కేవలం 31కే పరిమితమై బీజేపీ కంటే వెనుకబడింది. జడ్పీటీసీ ఎన్నికల్లో 36 మండలాలలో ఒక్క అభ్యర్థిని కూడా గెలుపించుకోలేకపోయింది. ఓటమిపై ఇటీవలే జిల్లా కేంద్రంలో టీడీపీ సమీక్ష జరిపినా.. కార్యకర్తలు ఇంకా నైరాశ్యం నుంచి బయట పడలేదు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన సమయంలో అందలమెక్కించిన జిల్లా ప్రజలు, ఆ తర్వాత కూడ టీడీపీకి జిల్లాలో బ్రహ్మరథం పట్టారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే ఇప్పుడా పార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. 1985 నాటి తొలి ఎన్నికలలో 9 స్థానాలకు ఏడుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలవగా.. 2014 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ ఒక్క స్థానాన్ని కూడ గెలుచుకోలేక పోయింది. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 9 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ కూటమి చిత్తయి పోయింది. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్లపై ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే, 2014 ఎన్నికల నాటికి ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోగా ఐదు స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ, నాలుగు చోట్ల కూటమిలో భాగంగా బరిలో నిలిచిన బీజేపీలు ఓటమి చెందాయి. మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండేలు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈసారి టీఆర్ఎస్ నుంచి గెలుపొందగా, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను ముందే ఊహించిన మండవ వెంకటేశ్వర్రావు, ఏలేటి అన్నపూర్ణమ్మలు పోటీ నుంచి తప్పుకున్నారు. జిల్లాలో రెండు లోక్సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా.. కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కస్థానం దక్కలేదు. మొత్తంగా మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మట్టికరిచిన నేపథ్యంలో మహానాడు ఏ మేరకు ఓదార్పునిస్తుందన్న చర్చ జరుగుతోంది. -
నేటి నుంచి ప్రజావాణి
మచిలీపట్నం, న్యూస్లైన్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 26వ తేదీ సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి కార్యక్రమానికి విరామం ప్రకటించారు. దీంతో దాదాపు రెండున్నర నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ప్రారంభించనున్నారు. రెండున్నర నెలలుగా ఈ కార్యక్రమం నిలిచిపోయినా ప్రతి సోమవారం కొద్దిపాటి సంఖ్యలో బాధితులు, అర్జీదారులు కలెక్టరేట్కు వస్తూనే ఉన్నారు. దూరప్రాంతం నుంచి వచ్చే వారిని వెనక్కి పంపకుండా సిబ్బంది వారి నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పంపారు. ఈ రెండున్నర నెలల వ్యవధిలో దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉండటంతో ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. ప్రస్తుతం కొనసాగనున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. హైదరాబాదులో ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన కలెక్టర్ రఘునందన్రావు సోమవారం నాటి ప్రజావాణిలో పాల్గొనే అవకాశం లేదు. -
వలంటీర్లకు ప్రశంస పత్రాలు
నిజామాబాద్ క్రైం, న్యూస్లైన్ : జిల్లాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు జిల్లా ఎస్పీ తరుణ్జోషి శుక్రవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, తెలంగాణ యూనివర్సీటీ విద్యార్థులు దాదాపు 2,268 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తమ విధులను అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో నిర్వహించినట్లు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారు విధుల్లో పాల్గొన్నారన్నారు. ప్రత్యేకంగా ఓటర్లను ‘క్యూ’ పద్ధతి పాటించే విధంగా చూసి, ఓటర్ల సందేహాలను నివృత్తిచేసి, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కృషి చేశారన్నారు. దీంతోపాటు పోలింగ్ స్టేషన్లో సంబంధిత పోలీసు సిబ్బందికి సహాయ సహకారాలు అందించడంద్వారా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా రిజర్వు ఇన్స్పెక్టర్ సి.హెచ్.మల్లికార్జున్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జి.దేవిదాసు, బి.ప్రమోద్కుమార్, ఎన్.ఆరున్రెడ్డి ,వి.నర్సారెడ్డి, జి. హన్మాండ్లు, ఎం.సురేష్కుమార్, వై.నారాయణ, కే.రవీందర్రావు, డి.వీరారెడ్డి, డాక్టర్లు ఐ.గంగాధర్, కే.రవీందర్రెడ్డి, విద్యార్థులు ఉన్నారు. -
..మొదలైంది!
సాక్షి, అనంతపురం : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అయితే.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అప్పుడే పెత్తనం చలాయిస్తున్నారు. అధికారులను తమ కనుసన్నల్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు రెండున్నర నెలలుగా సెలవులు కూడా లేకుండా నిర్విరామంగా విధులు నిర్వర్తించి.. మునిసిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగించారు. తీరిక లేకుండా గడిపిన కొందరు అధికారులు ప్రస్తుతం ఉపశమనం పొందేందుకు సెలవులో వెళ్లారు. అయినప్పటికీ వారు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. కారణమేమిటంటే... ఎమ్మెల్యేను కలవడానికి ఇంకా టైం లేదా అంటూ తమ అనుచరులతో మరీ ఫోన్ చేయించి బెదిరిస్తున్నారు. కలవకపోతే మీరిక్కడ పని చేయడం కష్టమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. కొందరు జిల్లా అధికారులైతే తమకు సన్నిహితంగా ఉండే సహచరులకు ఫోన్లు చేసి.. ఎమ్మెల్యేలను కలిసే ఆనవాయితీ ఇక్కడ ఉందా అంటూ ఆరా తీస్తున్నారు. ఇలాంటి విచిత్ర పరిస్థితులను తమ సర్వీసులో ఇంతవరకు చూడలేదంటూ నిట్టూరుస్తున్నారు. మరీ ముఖ్యంగా జిల్లాకు ఏడాది కిందట వచ్చిన అధికారుల్లో ఆందోళన ఎక్కువైంది. పోస్టింగ్ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకొని వస్తే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతామో, లేదోనని ఆందోళన చెందుతున్నారు. అనంతపురం నగరంలో నివాసముంటున్న ఒక ఎమ్మెల్యే అనుచరులు మూడు, నాలుగు రోజులుగా అధికారులకు ఫోన్లు చేస్తూ మరీ బెదిరిస్తున్నారు. ‘ఇప్పటి వరకు ఎమ్మెల్యేను కలవలేదట. ఆయన సీరియస్గా ఉన్నారు. వెంటనే ఇంటికి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు ఆయన దృష్టిలో పడితే కష్టం’ అంటూ హెచ్చరిస్తున్నారు. కొందరు భయపడి ఎవరికంటా పడకుండా రాత్రి వేళల్లో వచ్చి ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకుంటున్నారు. మరికొందరైతే ఇలాంటి పద్ధతికి స్వస్తి చెప్పాలంటూ కలిసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి రెండోసారి కూడా ఫోన్లు వెళుతున్నాయి. ఒకరిద్దరు అధికారులు మాత్రం.. ఇటీవల విజయం సాధించి.. అనంతపురం నగరంలో నివాసమున్న ఎమ్మెల్యేలందరినీ కలిస్తే పనైపోతుందన్న భావనలో ఉన్నారు. రెండు రోజులుగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. ప్రజలు అధికారమిచ్చింది సేవ చేయడానికే గానీ... అధికారులను బెదిరించడానికి కాదని ఓ అధికారి సాక్షి ప్రతినిధి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. అనంతపురం నగర శివారులోని సెంట్రల్ పార్కులో శిల్పారామం కోసం నిర్మాణాలు చేపడుతుండగా... వాటిని అడ్డుకొని ప్రయోజనం పొందేందుకు రెండు రోజుల కిందట అనంతపురం ఎమ్మెల్యే వి.ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో వెళ్లి దౌర్జన్యం చేశారు. అక్కడున్న ఫర్నీచర్ను కూడా ధ్వంసం చేసిన విషయం విదితమే. ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోకపోతే మొత్తం ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించడంతో నిర్వాహకులు.. ప్రభాకర్ చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొందరు సెలవులో వెళ్లేందుకు సైతం సిద్ధపడుతున్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కదిరి, ఉరవకొండ మినహా మిగిలిన 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. వీరి బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక సమయంలో ఎవరూ చూడకుండా వెళ్లి హాజరు వేసుకుని వస్తేసరి అంటూ పలువురు అధికారులు రాజీబాటపట్టారు. -
ప్రజాదరణలేని వారికి అందలమా?
రసాభాసగా పీలేరు టీడీపీ కార్యవర్గ సమావేశం తెలుగు తమ్ముళ్ల మధ్య భగ్గుమన్న విభేదాలు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పార్టీలో చేర్చుకోవడమేమిటి ? టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జికి ఆహ్వానం లేకపోవడంపై మండిపాటు పీలేరు, న్యూస్లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాదరణలేక ఓడిపోయిన పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడం ఏమిటని పీలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో లేకపోయినా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించకుండా కొత్తవారిని తెరపైకి తీసుకురావడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీలేరు నియోజకవర్గానికి పార్టీ తరపున ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మల్లారపు రవిప్రకాష్తో పాటు మరికొందరు ముఖ్యనేతలను పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఒక దశలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. దీంతో సమావేశం రసాభాసగా మారింది. బుధవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నియోజకవర్గ సమావేశం జరిగింది. వేదికపైకి పార్టీనేతలను కారపాకల భాస్కర్నాయుడు ఆహ్వానిస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేతలను ఆహ్వానించకపోవడంపై పలువురు నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహ్వా నం పలుకడాని నీవు ఎవరు? నీ అర్హత ఏమిటని వారు భాస్కర్నాయుడిని నిలదీశారు. దీంతో వివా దం చినికిచినికి పెద్దదైంది. ఇంతలో కోటపల్లె బాబురెడ్డి కలుగజేసుకుని నాయకుల్ని సముదాయించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు శాంతించారు. సమావేశంలో నేతలు రెండు సామాజికవర్గాలుగా విడిపోయి వాగ్వివాదానికి దిగడం చర్చనీయాంశమైంది. తాత్కాలికంగా వివాదం సమసిపోయినా అంతర్గతంగా విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలిసింది. ఇదిలా ఉండగా నియోజకవర్గం పరిధిలోని పీలేరు, కలికిరి, కేవీపల్లె, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లోని కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించి, నియోజకవర్గ స్థాయిలో సమన్వయంతో పని చేయాలని పలువురు నేతలు సమావేశంలో సూచించారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా.... పీలేరునియోజకవర్గలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ అన్నారు. గెలుపోటములు సహజమని ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన ఉద్దేశమన్నారు. అందరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కోటపల్లె బాబురెడ్డి, చింతగింజల శ్రీరామ్, రఘురామిరెడ్డి, దద్దాల హరిప్రసాద్నాయుడు, జనార్ధన్నాయుడు, తిరుపతినాయుడు, వెంకట్రమణారెడ్డి, ఆతికా షఫీ, చిన్నరెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. -
కేరళ గవర్నర్ షీలాపై వేటు!
* 19 మంది గవర్నర్లను మార్చే యోచనలో బీజేపీ * ఆమెపై కామన్వెల్త్ స్కాం కేసు దర్యాప్తు యోచన * రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక, గుజరాత్ గవర్నర్లు, రాష్ట్రపతితో భేటీ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రాగానే.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లను తొలగించి కొత్త గవర్నర్లను నియమించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కేరళ గవర్నర్గా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ను తొలగించాలంటూ బీజేపీ ఢిల్లీ విభాగం పట్టుపడుతోంది. కామన్వెల్త్ క్రీడల స్కాంలో దర్యాప్తు సంస్థలు ఆమెను ప్రశ్నించాలని బీజేపీ కోరుతోంది. మూడు పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా గత ఏడాది నవంబర్ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓడిపోవడం, కేంద్రంలోని యూపీఏ సర్కారు షీలాను కేరళ గవర్నర్గా నియమించడం తెలిసిందే. అలా చేయటం ద్వారా అవినీతి ఆరోపణల్లో ఆమెపై దర్యాప్తు జరిపే అవకాశం లేకుండా రక్షణ కల్పించారని బీజేపీ విమర్శించింది. ఆమెపై దర్యాప్తు చేయించేందుకు కామన్వెల్త్ కేసును పునఃప్రారంభించాలని ఆ పార్టీ భావిస్తోంది. కొత్త గవర్నర్ జనరల్తోనే ఢిల్లీ ఎన్నికలు..! షీలాతో పాటు మరో 18 రాష్ట్రాల గవర్నర్లను కూడా బీజేపీ సర్కారు తొలగించనున్నట్లు చెప్తున్నారు. ఇందులో చాలా మంది కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులే. బీజేపీ సర్కారు తొలగించనున్న గవర్నర్ల జాబితాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ పేరు అందరికన్నా ముందు ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. కర్ణాటక గవర్నర్ హన్స్రాజ్భరద్వాజ్, గుజరాత్ గవర్నర్ కమలాబేనీవాల్లు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను కలిసి.. తమ పదవులకు రాజీనామా చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వారిద్దరూ తమ రాజీనామాలను సమర్పించేందుకు రాష్ట్రపతినీ కలిశారు.