పుష్కరాలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల | Robbery in Bandlaguda | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల

Published Thu, Jul 16 2015 5:44 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Robbery in Bandlaguda

నాగోలు (హైదరాబాద్) : గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు, బైక్ ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడ ఇంద్రప్రస్తావన్ కాలనీ రోడ్ నంబర్-8లో నివాసముండే గోనేందర్ ఈ నెల 14వ తేదీన ఉదయం కుటుంబ సభ్యులతో కలసి రాజమండ్రి పుష్కరాలకు వెళ్లాడు.

కాగా గురువారం ఇంటికి తిరిగి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోని నాలుగు తులాల బంగారం, రూ.30 వేలు, కిలోన్నర వెండి ఆభరణాలు, హోండా బైకు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement