'విద్యార్థులు లేరని పాఠశాలల మూసివేత సరికాదు' | schools must in tribal areas, says bjplp leader laxman | Sakshi
Sakshi News home page

'విద్యార్థులు లేరని పాఠశాలల మూసివేత సరికాదు'

Published Fri, Nov 14 2014 11:04 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

'విద్యార్థులు లేరని పాఠశాలల మూసివేత సరికాదు' - Sakshi

హైదరాబాద్ : విద్యార్థుల సంఖ్యలేదని పాఠశాలల మూసివేత సరికాదని బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ అన్నారు.  తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాలలో శుక్రవారం ఉపాధ్యాయ క్రమబద్దీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్  మాట్లాడుతూ విద్యార్థులు తక్కువగా ఉన్నారని ఉపాధ్యాయులను మరోచోటికి బదిలీ చేయటం సరికాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్కూల్కు 10మంది విద్యార్థులు రావడం కష్టమే అని, అలాంటి ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేత ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు.

 

పాఠశాల మూసివేత నిర్ణయంతో గిరిజన విద్యార్థులు విద్యకు దూరం అవుతారన్నారు.  తెలంగాణలో నిరక్షరాశ్యత ఎక్కువగా ఉందని, బాలలకు విద్యాహక్కును కల్పించాలన్నారు. ఒక్క హైదరాబాద్లోనే 38 లక్షల బాల కార్మికులు ఉన్నారని ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement