K Laxman
-
‘మోదీ చెప్పినా.. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు’
ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా అభివృద్ధి ఎజెండాతో పేదలకు సంక్షేమ పథకాలతో అవినీతి రహిత ప్రజల పాలన అందిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. విపక్ష పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. ఆ పార్టీలు కులం, మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ.. కొత్త ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. డిలిమిటేషన్ ప్రక్రియ కొనసాగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలకు ఎటువంటి తగ్గింపులు ఉండవని ప్రధాని మోదీ స్వయంగా చెప్పినా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేటీఆర్, వినోద్, స్టాలిన్ పదే పదే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు లక్ష్మణ్. తమిళనాడు పర్యటనలో కేంద్ర మంత్రి అమిత్ షా దక్షిణాది ప్రాంతాల్లో ఒక్కసీటు కూడా తగ్గదని స్పష్టం చేశారని, కానీ లేని ఎజెండాను సృష్టించి ప్రాంతీయ పార్టీలు ప్రజల నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. -
‘సీఎం రేవంత్కు ఆగస్టు సంక్షోభం తప్పదు’
సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి అత్యుత్సాహంతో ఆరు గ్యారంటీల హామీ ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కావటం ఖయమని అన్నారు. -
‘తెలంగాణలో పాగా వేయబోతున్న బీజేపీ’
ఢిల్లీ: బీఆర్ఎస్ నుంచి ప్రముఖ నాయకులు బీజేపీలో చేరుతున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ల పట్ల ప్రజలకు విశ్వాసం సడలి పోయిందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘అన్ని పార్టీల నుంచి వలసలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వం కోసం జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యబోతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్కు దారి ఏర్పడుతుంది. దక్షిణాదిన బీజేపీ పెద్ద ఎత్తున గెలువబోతోంది. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ బిడ్డల కోసం ప్లాన్ చేస్తున్నారు. మోదీ మాత్రమే దేశం కోసం ఆలోచిస్తున్నారు’ అని కె.లక్ష్మణ్ అన్నారు. -
బీజేపీలో చేరిన నాగర్కర్నూల్ ఎంపీ రాములు
ఢిల్లీ, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తుంది. ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడింది. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. .. షెడ్యూల్ వచ్చే లోపు దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీదే గెలుపు. మొత్తం 17 స్థానాలు మేమే గెలుస్తాం. బీజేపీ అన్ని పార్టీల కంటే ప్రచారంలో ముందుగా దూసుకుపోతోంది. ప్రధాని మోదీ కూడా రెండ్రోజులు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ అన్ని లోక్సభ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయం అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు: ఎంపీ కే. లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీయేలో బీఆర్ఎస్ చేరుతామంటే చేర్చుకోమని బీజేపీ రాజ్యసభ ఎంపీ కే. లక్ష్మణ్ అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: అధికారం కోల్పోవడంతో మతిభ్రమించిన మాజీ మంత్రి కేటీఆర్... బీజేపీ, కాంగ్రెస్ ఒకటేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఓటమి కుంగుబాటులో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అహంకారం కారణంగా ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించారే తప్ప, అది కాంగ్రెస్ విజయం కాదన్నారు. ఎన్నికల్లో ఉచితాలు, గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమె త్తారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఆదివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి జనసేనతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేసి పది సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించి, అవినీతి సొమ్మును కక్కించి ప్రజలకు పంచుతామన్న కాంగ్రెస్ నాయకుల గొంతులు మూగబోయాయని విమర్శించారు. అవినీతి ఆరోపణలున్న అధికారుల తోనే కాంగ్రెస్ మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీలు రెండూ తోడుదొంగల వంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతి స్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. -
బీజేపీ అభ్యర్థుల తొలి జాబిత... కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉండే ఛాన్స్
-
టీఆర్ఎస్, బీఆర్ఎస్ మారినంత మాత్రాన ఒరిగేదేమి లేదు: ఎంపీ లక్షణ్
-
అసెంబ్లీ సమావేశాల్లో భజన తప్ప ఏమీలేదు: లక్ష్మణ్
-
‘ఎన్నికల కేలండర్’ రెడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కేలండర్ను బీజేపీ సిద్ధం చేసింది. ‘కేసీఆర్ హటావో.. తెలంగాణ బచావో’నినాదంతో భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ వెల్లడించారు. ప్రజాకోర్టులో కేసీఆర్ సర్కార్ను దోషిగా నిలబెడతామన్నారు. ఇందులో భాగంగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు గ్రామ స్థాయిలో పదివేల వీధి సభలు, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో సభలు, ఫిబ్రవరిలోనే తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో తెలియ జేసేందుకు మేధావులతో సమావేశాలు. ప్రజలను చైతన్య పరిచేందుకు మార్చిలో పది ఉమ్మడి జిల్లాల స్థాయిలో సభలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం పార్టీనేతలు ఎన్.రామచంద్రరావు, డా.ఎస్.మల్లారెడ్డి, ఎన్వీసుభాష్లతో కలసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్లో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ సర్కార్పై కేంద్రమంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్వారా చార్జిషీట్ విడుదలచేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని 119 సీట్లలో సంస్థాగతంగా, రాజకీయంగా కార్యకర్తలను సమాయత్తం చేయడానికి నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే పదినెలల కాలానికి రోడ్మ్యాప్లో భాగంగా ముందుగా మూడునెలల కార్యక్రమాలు ఖరారయ్యాయని చెప్పారు. ‘మిషన్ 90’లో భాగంగా 90 అసెంబ్లీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. తాము ఉన్నది ఉన్నట్లు చెబుతామని, బీఆర్ఎస్ పార్టీ, నేతల మాదిరిగా కట్టుకథలు చెప్పమని లక్ష్మణ్ అన్నారు. కాగా, కేంద్రం ఇచ్చిన నిధుల దారిమళ్లింపుపై చిట్టా విప్పుతామని, వివిధ అంశాలపై బీఆర్ఎస్ నేతల నోళ్లు మూయిస్తామని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై బుక్లెట్లు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. -
కేంద్ర పథకాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పథకాలను తమ పథకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె.లక్ష్మణ్ విమర్శించారు. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా తెలంగాణ సర్కారు తీరుందన్నారు. రాష్ట్రంలోని రైతులకు మోదీ ప్రభుత్వం ద్వారా మేలు జరిగితే ఎక్కడ కేసీఆర్ని మరిచిపోతారోనని భయపడి అనేక పథకాలు అమలు చేయడం లేదని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు కేంద్రం తన వాటా ఇచ్చినా టీఆర్ఎస్ సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో వాటి పనులు జరగడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేసిందని, దీంతో ఎఫ్ఆర్బీఎం కింద తెస్తున్న అప్పులు కూడా వడ్డీలు కట్టేందుకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫసల్ బీమా పథకం తెలంగాణలో అమలు చేయకుండా రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు, నిధుల మళ్లింపు, విద్యుత్ డిస్కం సమస్యలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం వంటి అంశాలను తాను ప్రస్తావించినట్టు ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థను గురుకులాల పేరుతో కేసీఆర్ భ్రష్టు పట్టించడం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు మళ్లించడం, కేంద్ర నిధులు తెలంగాణలో దుర్వినియోగంపై కూడా రాజ్యసభలో మాట్లాడానని లక్ష్మణ్ చెప్పారు. -
‘స్వావలంబన భారత్’ ప్రపంచానికి దిశా నిర్దేశం
ప్రపంచంలో ఏ దేశానికైనా దాని బలమైన నాయకత్వం దేశాన్ని స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తుంది. అలాగే ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అందరికీ ఆదర్శంగా నిలి చేలా చేస్తుంది. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం విశ్వ గురువుగా తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతుందనీ, అది మరెంతో దూరం లేదనీ చెప్పవచ్చు. మోదీ భారత్ ప్రధానమంత్రి అవ్వడం నూతన శకానికి నాంది అయ్యిందని చెప్పవచ్చు. ప్రపంచ దృష్టిని తన వైపు మళ్లించుకునేలా భారత్ పురోగమిస్తోంది. వసు ధైక కుటుంబం అనే భావన ప్రాచీన కాలం నుంచీ భారత్ నమ్ముతోంది. ఈ భూమిపై ఉన్న సకల చరాచర జీవులనూ ఒకే కుటుంబంగా పరిగణిస్తూ అంతర్జాతీయంగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. జీ20 దేశాలకు అధ్యక్షత వహించే స్థాయికి చేరిందంటేనే భారత్కు అంతర్జాతీయ సమాజంలో ఉన్న స్థానం ఏమిటో అర్థమవుతుంది. జీ20 దేశాలకు నాయకత్వం వహించడం ద్వారా 75 శాతం ప్రపంచ జీడీపీకి, 75 శాతం ప్రపంచ వర్తకానికీ, 66 శాతం ప్రపంచ జనాభాకీ ఒక మార్గదర్శిగా భారతదేశం మారిం దనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఈ ఘనత సాధించడానికి గత ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశం వివిధ దేశాలతో సాగించిన అంతర్జాతీయ వ్యవహారాలూ, అంతర్గతంగా దేశ ఆర్థిక స్థిరత్వానికీ ముందుచూపుతో మోదీ తీసుకున్న విధాన నిర్ణయాలూ కారణాలుగా చెప్పుకోవచ్చు. 2012లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం 11వ స్థానంలో ఉండగా 2022 సంవత్సరం నాటికి అది 5వ స్థానానికి ఎగబాకటం వెనుక ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తీసుకున్న నిర్ణయాలే కారణం. ముఖ్యంగా నోట్లను రద్దు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు అడ్డంకిగా మారిన దొంగ నోట్ల చలామణీని అడ్డుకోవడం, బ్లాక్ మనీ నిర్మూలనా చేయగలిగాం. అలాగే వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు చేయడం ద్వారా లెక్కలలోకి రాకుండా ఉన్న అవ్యవస్థీకృత ఆర్థిక కార్యక్రమాలన్నీ స్థూల దేశీయోత్పత్తి గణనలోకి తీసుకురావడం జరిగింది. దీని వల్ల కేంద్ర ఆదాయం గణనీయంగా పెరిగిపోయింది. మేధో వలస లను నివారించి దేశ అభివృద్ధిలో మేధావులయిన యువతను ఉప యోగించుకోవడానికి ‘స్టార్ట్ అప్ ఇండియా’నూ, స్వదేశంలోనే మనకు కావలసిన వస్తూత్మత్తిని సాగించే ‘మేకిన్ ఇండియా’నూ కార్యరూపంలో పెట్టారు మోదీ. తద్వారా ఆర్థిక వ్యవస్థను మును పెన్నడూ లేని విధంగా బలోపేతం చేయడం జరిగింది. నైపుణ్యం ఉండి పెట్టుబడులు పెట్టడానికి మూలధనం లేని వారికి ‘ముద్ర యోజన’ పథకం ద్వారా నిధులను అందుబాటులోకి తేవడం, రాయితీలతో కూడిన మూలధనాన్ని అందించి సన్న, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహించడం జరిగింది. ప్రపంచ దేశాలు ఈరోజు ఇంధన కొరత సమస్యతో ఇబ్బంది పడుతూ ద్రవ్యోల్బణంలోకి జారిపోతున్నాయి. అభివృద్ధి చెందా యని చెప్పుకొంటున్న అమెరికా, యూరప్ దేశాలలో ద్రవ్యో ల్బణం 7 శాతం పైగా నమోదు కాగా... భారతదేశంలో సుమారు 5 శాతం, లేదా మరి కొంత ఎక్కువగా నమోదయి స్థిరంగా కొన సాగుతోంది. ధరల నియంత్రణకు భారతదేశం తీసుకున్న ద్రవ్య, కోశ విధానాలతోపాటూ... రష్యా నుండి చౌకగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. గత 8 ఏళ్లుగా భారతదేశం సగటున 6.5 శాతంతో స్థిరమైన ఆర్థిక వృద్ధితో ముందుకు వెళ్తోంది. ఒకప్పుడు భారతదేశం చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్ నుంచి మహిళలు ఉపయోగించే పిన్నీసులు, ఇతర గృహోపకరణాల దాకా తాను ఉత్పత్తి చేయకుండా దిగుమతులపై ఆధారపడడం జరి గింది. ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం కరిగిపోతూ వచ్చింది. అదే సమయంలో చైనా ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఉత్పత్తులకు భారతదేశం ఒక మార్కెట్గా మారింది. గత ఎనిమిది సంవ త్సరాలుగా పీఎం మోదీ నాయకత్వంలో తీసుకున్న ఆర్థిక సంస్కరణలు వల్ల ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్లో 2022 సంవత్సరానికి భార త్ 62వ స్థానానికి చేరుకుంది. 2012 –13 కాలానికి 192 దేశాలలో భారత్ స్థానం 133 లేదా 132 స్థానంలో ఉండేది. ప్రస్తుత ర్యాంకింగ్ భారతదేశం విదేశీ పెట్టుబడులకు ఎంత అనుకూలమైన వాతావరణం కలిగి ఉందో తెలియ జేస్తోంది. గత 22 ఏళ్లుగా (1999–2021) మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం విలువ 847 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో గత 8 (2014–2021) ఏళ్లలోనే 440 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఇది మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 51 శాతంగా ఉంటుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మౌలిక సదుపాయాలు పెరిగాయి. దేశం ఆర్థిక స్వావలంబన సాధిస్తూ, విదేశీ చెల్లింపుల శేషం లోటును తగ్గించడం జరిగింది. ఇలాంటి తరుణంలో ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక సమస్యలకూ, వివిధ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలనూ తగ్గించడానికీ, ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణకు సరైన మార్గదర్శకత్వాన్ని అందించడానికీ అవకాశం ఉన్న జీ20కి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురుగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ ప్రజలందరం ప్రధాని మోదీకి వెన్నుదన్నుగా ఉంటూ ‘ప్రపం చానికి భారత్, భారత్కు ప్రపంచం’ అన్న నినాదంతో ముందుకు సాగుదాం. డాక్టర్ కె. లక్ష్మణ్ వ్యాసకర్త ఎంపీ, బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ -
విలువల రాజకీయానికి మారుపేరు వాజ్పేయి
సాక్షి, హైదరాబాద్: భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగి న కార్యక్రమంలో వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంట రీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్య వర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి వాజపేయి సిద్ధాంతాలే కారణమన్నారు. ఒక్క ఓటుతో అధికారం కోల్పోతామని తెలిసి కూడా వాజపేయి వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు వాజపేయి పెట్టింది పేరని పేర్కొన్నారు. ప్రధానిగా వాజ్పేయి ఎన్నో సాహాసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని బండి సంజయ్ కొనియాడారు. వాజపేయి జయంతి సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, బండా కార్తీకరెడ్డి, కె.రాములు, భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2023 క్యాలెండర్ని బండి సంజయ్ విడుదల చేశారు. -
‘బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా’
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక, బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. కేసీఆర్కు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవని మండిపడ్డారు. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ పార్టీ అని లక్ష్మణ్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు మళ్లించి పేద ప్రజలను తెలంగాణ ప్రభుత్వం వంచిస్తుందన్నారు. భూసార పరీక్షలకు కేంద్రం ఇచ్చే నిధులును పక్కదారి పట్టించారని ఆరోపించారు లక్ష్మణ్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇవ్వడం లేదన్నారు. -
కవిత తన పాత్ర లేదని నిరూపించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితదేనని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలపై చట్టం తన పని తాను చేస్తుందని, చట్టం ఎవరికి చుట్టం కాదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ... అక్రమాలపై లభించిన ఆధారాలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతూ, నోటీసులిస్తుంటే తెలంగాణ ప్రజల మీద దాడులు అనే విధంగా చిత్రీకరించాలని కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలపైనా, తమపైనా ఏమైనా ఏమైనా అనుమానాలుంటే సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ,ఈడీ, సీబీఐ దాడులకు, నోటీసులకు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని స్కామ్లుగా మారాయని విమర్శించారు. ఏ ప్రభుత్వాన్నీ పడగొట్టలేదు: బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టలేదని...కొన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు వారి పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతోనే అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు. శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు మంత్రి అయ్యారు? సబితా ఇంద్రారెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలో మంత్రిగా ఉన్నారు? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై, ప్రభుత్వం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ విధానాలపై మేధావులు గొంతు విప్పాలని..ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. -
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మర్రి చెన్నారెడ్డి
కవాడిగూడ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. ప్రస్తుతం కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని అన్నారు. కానీ తెలంగాణ సమాజానికి మర్రి చెన్నారెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇందిరాపార్కులోని రాక్గార్డెన్లో ఆయన సమాధికి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి తనయుడు మర్రి శశిధర్రెడ్డి, మర్రిచెన్నారెడ్డి మనుమలు ఆదిత్యరెడ్డి, పురూరవరెడ్డి, కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై నివాళులర్పించారు. -
బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ చెప్పారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం నిర్వహించిన సామాజిక చైతన్యసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని మోదీ పెద్దపీట వేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా గత పాలకుల విధానాల కారణంగా చేతివృత్తులు అంతరించిపోయే పరిస్థితి దాపురించిందని చెప్పారు. బీసీలను లక్ష్యంగా చేసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తర్వాత వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో తమ మిత్రపక్షమైన జనసేనతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి సహకరించిన కేఈ కృష్ణమూర్తిని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పక్కనబెట్టారన్నారు. ఏపీలో బీసీలను అభివృద్ధి చేయడంలో, రాజకీయంగా ముందుంచడంలో బీజేపీ కృషిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వస్తే కార్పొరేషన్లకు రూ.10 వేలకోట్లు, కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. రూ.3 వేల కోట్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్లకే ఇస్తామన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీశ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆరుజిల్లాలకు చెందిన మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెలంగాణ ఐటీ దాడులపై బండి సంజయ్ రియాక్షన్
-
ఐటీ దాడులు కొత్త కాదు.. అది తెలీకపోవడం విడ్డూరం: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ప్రజలను దోచుకొని అడ్డంగా ఆస్తులు సంపాదిస్తే సోదాలు చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిర్యాదులు వస్తే ఆధారాలతో వాటిపై స్పందించి తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ, అధికారులపై ఉంటుందని తెలిపారు. తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చన్నారు. అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీలకనుగుణంగా మలుచుకొని మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని.. ఇది కూడా తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మేము సిద్ధం: లక్ష్మణ్ ఐటీ దాడులు కొత్త కాదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. తప్పు చేయనివాళ్లు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. దీన్ని రాజకీయానికి ముడిపెట్టి డైవర్ట్ చేయడం సరికాదన్నారు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరో నలుగురు పేర్లను అడ్డంగా పెట్టుకొని కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ‘ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అక్రమ సంపాదించిన వారు, పన్ను ఎగవేతదారులపై దాడి చేసి లెక్కలు బయటకు తీయడమే ఐటీ సంస్థల పని అన్నారు. ఏమి తప్పు చేయనివారు ఎందుకు భయపడటం?. ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు వెలుగులోకి వస్తుంటే వాటికి లెక్కలు చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. కానీ రాజకీయ విమర్శలతో తప్పించుకోవాలని చూడటం సరికాదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది’ అని లక్ష్మణ్ చెప్పారు. చదవండి: లిక్కర్ స్కామ్లో ల్యాప్టాప్ నివేదిక కీలకం.. మరో వారం కస్టడీ కోరిన ఈడీ -
సంకుచిత ఆలోచనలకు కేసీఆరే నిదర్శనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీని అభినందించి స్వాగతం పలకాల్సింది పోయి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాజకీయాలతో ముడిపెట్టడం సంకుచిత ఆలోచనలకు అద్దంపడుతోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వస్తున్న మోదీ పర్యటనను టీఆర్ఎస్, వామపక్షాలు అడ్డుకుంటామనడం సరికాదన్నారు. లక్ష్మణ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రూ.9,500 కోట్లతో వివిధ అభివృద్ధికార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా తెలంగాణ సమగ్రాభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టమౌతుందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చుచేసి పునరుద్ధరణ ద్వారా తెలంగాణకే కాకుండా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రైతులకు కూడా ఎరువులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనితోపాటు తెలంగాణలో రూ.వెయ్యికోట్ల వ్యయంతో రైల్వేలైన్, రూ.2,200 కోట్ల వ్యయంతో కొత్త జాతీయరహదారులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భాన్ని అభినందించాల్సింది పోయి రాజకీయాలతో ముడిపెట్టడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో పార్టీలతో సంబంధం లేకుండా అక్కడి ప్రభుత్వాలు మోదీకి స్వాగతం పలుకుతుంటే తెలంగాణలో మాత్రం అడ్డుకోవాలని చూడటం సరైందికాదన్నారు. -
చేనేతలను మోసం చేస్తున్న టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా టీఆర్ఎస్ సర్కార్ చేనేత కార్మికులను మోసం చేస్తోందని, ఉపఎన్నికలో రాజకీయ ప్రయోజనం పొందేందుకే చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ పన్ను విధింపు అంశాన్ని తెరపైకి తెచ్చి వారిని మరోసారి మోసం చేస్తుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తమను అన్నివిధాలుగా మోసం చేస్తున్న టీఆర్ఎస్కు చేనేత కార్మికులు మునుగోడులో తగిన గుణపాఠం నేర్పించాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
గరీబోళ్ల రాజ్యం తెచ్చుకోవాలి
చౌటుప్పల్: బడుగు, బలహీన వర్గాల ప్రజలంతా ఏకమై కేసీఆర్ గడీలు బద్దలుకొట్టి గరీబోళ్ల రాజ్యం సాధించుకోవాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బలహీన వర్గాల హక్కులను కాలరాస్తూ, నిజాంలా వ్యవహరిస్తున్న కేసీఆర్ను గద్దె దించాలన్నారు. ఇందుకోసం ఎంతో మంది ఉద్యమకారులు బీజేపీలోకి వస్తుంటే.. కొంతమంది మాత్రం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేందుకు వెళ్తున్నారని విమర్శించారు. గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గస్థాయి గౌడన్నల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీలను కులాల వారీగా విభజించి ఓట్లు దండుకునేందుకు తండ్రీకొడుకులు వెంపర్లాడుతున్నారని అన్నారు. బీసీ కులాలకు చేసిన మేలు చెప్పలేని స్థితిలో ఉన్న కేసీఆర్, కొత్త కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియంతపాలనపై తిరుగుబాటు చేసి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని సూచించారు. బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బలహీనవర్గాలు అభివృద్ధి చెందితే ప్రశ్నించే స్థాయికి వస్తారన్న ఆలోచనతో కేసీఆర్ ఆయా వర్గాలను అణగ దొక్కుతున్నారని ధ్వజమెత్తారు. మునుగోడులో ఓటమి భయంతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే కులాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలు ఆర్థికంగా ఎదగాలన్నదే తన సంకల్పమన్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తనను బయటకు పంపారని చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లా డుతూ.. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు బద్ద శత్రువు అని అన్నారు. మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఎనిమిదిన్నరేళ్ల పాలనలో నాటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాయా? అని ప్రశ్నించారు. నియంతపాలనను బొంద పెట్టేందుకే తాను రాజీనామా చేశానన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని నాయకులకు ప్రశ్నించే సత్తాలేదని దుయ్యబట్టారు. -
మాజీ మంత్రి టచ్లో ఉన్నారు.. బీజేపీలోకి క్యూ మొదలైంది: ఎంపీ లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మొదలైన పొలిటికల్ హీట్ ఇంకా అదే రేంజ్లో కొనసాగుతోంది. తాజాగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల వేళ రెండు పార్టీల మధ్య రాజకీయా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ నేతలు.. సొంత పార్టీకి ట్విస్ట్ ఇస్తూ మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా అధికార టీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీలను వీడుతున్నారు. అదే సమయంలో కొందరు కీలక నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరుతున్నారు. ఉద్యమ నేత, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూర నర్సయ్య గౌడ్.. గులాబీ పార్టీని వీడి కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ఇక, కోమటిరెడ్ది రాజగోపాల రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్ను వీడి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె. లక్ష్మణ్ చేసిన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, ఎంపీ లక్ష్మణ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయన్నారు. తమతో చాలా మంది నేతలు టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఓ మాజీ మంత్రి కూడా బీజేపీలో చేరనున్నారని అన్నారు. సదరు నేతతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. కరెక్ట్ టైమ్ చూసుకుని బీజేపీలో చేరుతారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగానే మునుగోడు ఉప ఎన్నికలపై స్పందించిన ఆయన.. బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్.. మునుగోడు ప్రజలను ఎంత మభ్యపెట్టినా ప్రయోజనం లేదన్నారు. కేసీఆర్ మోసగాడనే ముద్ర పడిపోయిందని.. ఆయనను ఎవరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్.. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు కుదుర్చుకునే ప్రస్తావనగానీ, ఈ అంశంపై ఎలాంటి చర్చగానీ పార్టీలో జరగలేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో లక్ష్మణ్ చిట్చాట్గా మాట్లాడుతూ.. ఏపీలో జనసేన పార్టీతో పొత్తు ఉంటుందన్నారు. టీడీపీతో కలిసి ఉమ్మడిగా పొత్తు కుదుర్చుకుందామని ఒకవేళ జనసేన ప్రతిపాదిస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు అలాంటి ఆలోచన బీజేపీకి ఏమాత్రం లేదని చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ రద్దు చేస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు రద్దు వరకు ఆయన చేతుల్లో ఉన్నా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రంలో మార్పు తథ్యమని, టీఆర్ఎస్కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమనే భావన ప్రజల్లో ఇప్పటికే ఏర్పడిందని, ముఖ్యంగా ఓబీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేదానిని పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ భారత్ జోడో అంటే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ చోడో అంటున్నారని ఎద్దేవా చేశారు. చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్ల మాటల యుద్ధం -
సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్ది
దామరగిద్ద: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సంఘం, ఇతర సంక్షేమ పథకా లతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని.. రాష్ట్రంలో పరిస్థితి సొమ్ము కేంద్రానిది అయితే.. సోకు టీఆర్ఎస్ది అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ యువమోర్చ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజాగోస– బీజేపీ భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన నారాయ ణపేట జిల్లా దామరగిద్దలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బియ్యంతో కేంద్ర ప్రభుత్వ దేశంలోని 80 కోట్ల మందికి ఆపన్న హస్తం అందిస్తుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ పేర్లు మారుస్తూ తామే అమలు చేస్తున్నట్లు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల, ఫసల్ బీమా యోజన, గ్రామాలకు రహదా రులు, పాఠశాలల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు అందిస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తామే చేపడుతున్నామంటూ గొప్పలు చెప్పు కొంటుందని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆయన విమర్శించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మని డా.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
కేంద్రం సమ్మతితోనే జీవోలు ఇస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆమోదం, అనుమతితోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) అమలవుతున్నాయా అని సీఎం కేసీఆర్ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లపాటు నిద్రమత్తులో జోగిన కేసీఆర్ తాను పెంచే 10 శాతం ఎస్టీల రిజర్వేషన్లను ప్రధాని మోదీ ఆమోదిస్తారా అని మాట్లాడటంలో అర్థమే లేదన్నారు. దేశంలో ఇంతగా ప్రజలను మోసగించి దిగజారిన రాజకీయాలు చేసే సీఎం మరొకరు లేరని మండిపడ్డారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే జీవోతో రిజర్వేషన్లను పెంచుకునే అవకాశమున్నా కేంద్రాన్ని బద్నామ్ చేస్తోందన్నారు. వెంటనే ఈ రిజర్వేషన్ల పెంపుపై జీవో తెచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లలో ఎస్టీ రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల విద్య, ఉద్యోగాల్లో నష్టపోయిన గిరిపుత్రుల సంగతేంటని నిలదీశారు. కుటుంబ ప్రయోజనాల కోసం పాకులాడే రాహుల్, కేసీఆర్ కుటుంబాలు మోదీ లక్ష్యంగా విషప్రచారం సాగిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం, బీజేపీపై విమర్శల్లో రాహుల్ను కేసీఆర్.. రేవంత్రెడ్డిని కేటీఆర్ అనుసరిస్తున్నారన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ తాయిలాలు ప్రకటిస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మునుగోడులో లబ్ధి కోసం గిరిజనబంధు తెచ్చే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. మరో ఉపఎన్నిక వస్తే బీసీ బంధు తెస్తారేమోనని వ్యాఖ్యానించారు. ఏదెలా ఉన్నా టీఆర్ఎస్ దుకాణాన్ని ప్రజలు బంద్ చేయడం ఖాయమన్నారు. -
అది అసత్య ప్రచారం.. బీజేపీ పోటీపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్.. ఆదివారం బీహార్ సీఎం నితీష్ కుమార్తో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్ బీహార్ పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. సీఎం బీహార్ పర్యటనపై స్పందించారు. ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ పర్యటనతో కేసీఆర్ అభాసుపాలయ్యారు. కేసీఆర్ ఉచ్చులో నితీష్ కుమార్ చిక్కుకున్నారు. కేసీఆర్ వ్యాఖ్యల ద్వారా మరోసారి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య బంధం బహిర్గతమైంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులతో ఎమర్జెన్సీ తలపిస్తోంది. తెలంగాణలో ధాన్యం కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని సీఎం కేసీఆర్.. బీహార్ వెళ్లి అక్కడి వారికి చెక్కులు ఇవ్వమేంటి?. కన్న తండ్రికి బువ్వపెట్టని కొడుకు.. మేనమామకు మంగళ హారతి పట్టిన చందంగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇక, టీడీపీతో పొత్తు అనేది ఊహాజనిత, అసత్య ప్రచారం మాత్రమే.. ఏపీలో పవన్తో కలిసి బీజేపీ ముందుకెళ్తోంది. తెలంగాణలో మాత్రం ఒంటిరిగా పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చేసిందా..? ప్రకటన అప్పుడేనా? -
కుటుంబపాలనకు చరమగీతం పాడాలి
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రజలను కోరారు. శుక్రవారం వరంగల్ వెళ్తూ మార్గమధ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులోని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందన్నారు. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడానికే ఈ నెల 21 మునుగోడులో అమిత్షా బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్క సంవత్సరం ఓపిక పడితే రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచి సీఎం కేసీఆర్ చేసిన పాపాలను గోదావరి మాతా వెలుగులోకి తెచ్చిందన్నారు. కాగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్ను ఆ పార్టీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి సన్మానించారు. -
జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: మొఘలాయిల ఆగడాలపై పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ట్యాంక్బండ్పై పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి సందర్భంగా నందనం కృపాకర్ రాసిన ‘మరో ఛత్రపతి – మన తెలుగు దళపతి’పుస్తకాన్ని గురువారం ఆయన బీజేపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొఘలాయిల ఆగడాలు, అకృత్యాలపై పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. సర్దార్ పాపన్న స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నిజాం, మొఘలాయిల తరహా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో మరో పోరాటానికి నాంది పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విజయశాంతి బహిరంగంగా అసంతృప్తి.. తెర వెనుక ఎవరైనా ఉన్నారా?) -
లక్ష్మణ్కు అందలం.. రెండు జాతీయ స్థాయి కమిటీల్లో సముచిత స్థానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణకు చెందిన డాక్టర్ కోవా లక్ష్మణ్కు జాతీయ పార్టీకి సంబంధించిన రెండు అత్యున్నతస్థాయి కమిటీల్లో స్థానం లభించింది. అత్యున్నత నిర్ణాయక కమిటీలైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో కె.లక్ష్మణ్ను సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతూ రాష్ట్ర బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు అన్నివిధాలుగా గుర్తింపునిస్తోంది. దక్షిణాది నుంచి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతో పాటు లక్ష్మణ్ మాత్రమే పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే లక్ష్మణ్ను పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఇటీవల యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన జాతీయ నాయకత్వం తెలంగాణకు, ముఖ్యంగా వెనుకబడినవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడించింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నగర పార్టీ అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, బీజేఎల్పీనేతగా, పార్టీ అధ్యక్షుడిగా, వెనుకబడిన వర్గాలకు చెందిన నేతగా లక్ష్మణ్ తనదైన గుర్తింపు పొందారు. 2017లో ఉపరాష్ట్రపతి అయ్యేదాకా తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉండేవారు. చిత్తశుద్ధితో పని చేసే నేతలను, వారి అనుభవాన్ని పార్టీ ఎంతగా గుర్తిస్తుందో చెప్పేందుకు లక్ష్మణ్ తదితరులకు అవకాశమే తాజా నిదర్శనమని బీజేపీ వర్గాలు తెలిపాయి. ‘‘లక్ష్మణ్, యడియూరప్ప, జతియా పార్టీ కోసం తమ జీవితాలను ధారపోశారు. ఒక్కో ఇటుకా పేర్చి పార్టీ నిర్మాణానికి పాటుపడ్డారు’’అంటూ కొనియాడాయి. సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవమిది ‘‘పార్టీలో సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవమిది. ఏలాంటి రాజకీయ నేపథ్యం లేని నాలాంటి ఓ కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు ఒక్క బీజేపీలో తప్ప మరెక్కడా సాధ్యం కాదు. చాలా సంతోషాన్ని కలిగించింది. నాపై పార్టీ అధినాయకత్వం ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెడతా. ఈ కమిటీల ద్వారా నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తా’’. –డాక్టర్ కె.లక్ష్మణ్ చదవండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే.. -
కొత్త పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ బుధవారం కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలను ప్రకటించింది. 11 మందితో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేయగా.. 15 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని బీజేపీ ప్రకటించింది. ఇక, తెలంగాణ నుంచి కె లక్ష్మణ్కు రెండు కమిటీల్లోనూ అవకాశం దక్కింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ, నడ్డా బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కే లక్ష్మణ్, ఇక్బాల్ లాల్పుర, సుధా యాదవ్, సత్యనారాయణ జాతియా, బీఎల్ సంతోష్లను సభ్యులుగా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డును జేపీ నడ్డా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ముగ్గురు కొత్త నేతలకు చోటు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, ఎంపీ కే లక్షణ్కు అవకాశం లభించింది. ఇక కొత్త పార్లమెంటరీ బోర్డులో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కు స్థానం దక్కలేదు. చదవండి: మోదీగారు.. మహిళలంటే గౌరవం ఉంటే గనుక..!: కేటీఆర్ भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने पार्टी के केंद्रीय संसदीय बोर्ड का गठन किया है। जिसके सदस्य निम्न प्रकार रहेंगे :- pic.twitter.com/pmxGE5fJ7E — BJP (@BJP4India) August 17, 2022 అదే విధంగా 15 మంది సభ్యులతో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని కూడా ప్రకటించారు. ఈ కమిటీలోనూ కె లక్ష్మణ్కు చోటు లభించింది. దీనికి జేపీ నడ్డా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने पार्टी की केंद्रीय चुनाव समिति का गठन किया है। जिसके सदस्य निम्न प्रकार रहेंगे :- pic.twitter.com/jUw5ei8VzE — BJP (@BJP4India) August 17, 2022 -
కేసీఆర్ చర్య ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తెలంగాణ ప్రజలకు నష్టమే తప్ప ఒనగూరేదేమీ ఉండదన్నారు. ఈమేరకు శనివారం లక్ష్మణ్ మీడియా ప్రకటన విడుదల చేశారు. నీతిఆయోగ్ ద్వారా ముఖ్యమంత్రుల గౌరవాన్ని పెంచి టీం ఇండియా స్ఫూర్తిని చాటిన ప్రధాని నరేంద్రమోదీపై రాజకీయ లబ్ధి కోసం అవాకులు చెవాకులు పేలడం కేసీఆర్ కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలు, అర్ధ సత్యాలేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు చేసిన కుట్రగానే భావిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ప్రజాక్షేత్రంలోనే కేసీఆర్ బండారాన్ని బయటపెడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. -
Rajya Sabha: ధరల మంటపై వాగ్యుద్ధం.. టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాడీవేడి చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిత్యావసర ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చ అధికార బీజేపీ, విపక్ష టీఆర్ఎస్ మధ్య మంటలు రాజేసింది. కేంద్రం తీరును టీఆర్ఎస్ తప్పుపడితే రాష్ట్ర ప్రభుత్వ తీరును బీజేపీ ఎండగట్టడంతో మాటలయుద్ధం జరిగింది. ధరల అంశంపై ముందుగా టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి మాట్లాడారు. ‘అమృత్మహోత్సవ్ నిర్వహిస్తున్న ప్రస్తుత సమయంలో దేశ ప్రజలు పేదరికం, ధరల పెరుగుదల అనే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆహార ధరల ద్రవ్యోల్బణ సూచీని గమనిస్తే అది 0.68 శాతం నుంచి 8.38శాతానికి పెరిగింది. వేరుశనగా ధరల పెరుగుదలకు ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతున్నారు. యుధ్దం మొదలవ్వకముందే ధరలు పెరగడం మొదలైంది’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ‘పెట్రో ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం వ్యవసాయ సెస్ పేరుతో లీటర్పై రూ.2.50 వసూలు చేస్తోంది. ఈ సెస్ను ఎక్కడ ఎంత మేర కేటాయించారో చెప్పలేదు. గత ఏడేళ్లలో రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. కానీ సెస్ వసూలు చేస్తున్నారు’ అని విమర్శించారు. ఇదే సమయంలో తెలంగాణ పరిస్థితిని వివరించారు. ‘2014కు ముందు దేశంలోనే తెలంగాణ వెనుకబడిన ప్రాంతం. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ రుణాలపై పరిమితులు విధిస్తోంది. కేంద్రం తీరు తెలంగాణ అభివృధ్ధిపై దుష్ప్రభావం చూపుతోంది’ అని అన్నారు. కాళేశ్వరంపై రూ.80వేల కోట్ల ఖర్చు చేస్తే ఫలితమేదీ: కె.లక్ష్మణ్ అనంతరం మాట్లాడిన కె.లక్ష్మణ్.. సురేశ్రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘కరోనాతో యావత్ ప్రపంచమే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఉంది. టీఆర్ఎస్కు ధరల పెరుగుదలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. పెట్రోల్ ధరలను కేంద్రం రెండుసార్లు తగ్గించింది. అయితే తెలంగాణలో వ్యాట్ పెంచలేదంటూ ప్రభుత్వం బాహాటంగా ప్రకటించుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.35, డీజిల్పై రూ.27 వసూలు చేస్తోంది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రూ.70వేల కోట్లు వసూలు చేసింది. రాష్ట్రంలో ఐదు నెలల్లో భూముల విలువను రెండుసార్లు పెంచారు. స్టాంపు డ్యూటీలను 6 నుంచి 7.50శాతానికి పెంచారు. బస్సు టిక్కెట్లను యాభై శాతం పెంచి ప్రయాణికుల నుంచి ప్రభుత్వం రూ.5,593 కోట్లు వసూలు చేసింది. మిగులు బడ్జెట్ అని చెప్పే రాష్ట్రం ఇప్పుడు రూ.3.50లక్షల కోట్ల అప్పులు చేసింది’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు కొందరు అభ్యంతరం చెప్పారు. లక్ష్మణ్ కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ‘కాళేశ్వరం నిర్మాణ వ్యయాన్ని రూ.30వేల కోట్ల నుంచి రీడిజైన్ పేరిట రూ.1.25లక్షల కోట్లకు పెంచారు. ఇప్పటికే రూ.80వేల కోట్లు ఖర్చు చేసినా రూపాయి ఫలితం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో బీజేపీ ఎంపీలు ‘షేమ్..షేమ్’ అంటూ నినాదాలు చేశారు. -
కేసీఆర్ ఫైటర్ కాదు, చీటర్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: అవినీతి గురించి సీఎం కేసీఆర్ మాట్లాడడం ‘దయ్యాలు వే దాలు వల్లించినట్లు’ ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. సోమవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫైటర్ కాదు, చీటర్ అని, ఆయనకు మంచితనం, మానవత్వం రెండూ లేవని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇస్తే, కేసీఆర్ ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నిక ల్లో గెలుపు ఓటములు సహజమని, దానికే ఎమ్మెల్యేగా లక్ష్మణ్ ఓడారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం ద్వారా కేసీఆర్ ఎంత నిరా శ, నిస్పృహల్లో ఉన్నారో స్పష్టమవుతోందన్నా రు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్ ని యోజకవర్గంలో కేసీఆర్ బొమ్మ పెట్టి ప్రచారం చేస్తే టీఆర్ఎస్కు ఒక కార్పొరేటర్ స్థానమూ రాలేదన్న విషయాన్ని మరవొద్దన్నారు. -
ఇక్కడి పరిస్థితి ఏంటి?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా శనివారం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీమోర్చా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి, ప్రజా సమస్యలు, ప్రభుత్వపరంగా స్పందన తదితర అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా, ఈ సమావేశాలకు చేసిన æఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర నాయకత్వానికి మోదీ అభినందనలు తెలిపినట్లు సమాచారం. కార్యవర్గ సమావేశాల మధ్యలో ఈ భేటీ చోటుచేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్పై మరింత దూకుడుగా వెళ్లాలని, ఇదే వాడి వేడిని కొనసాగించాలని సంజయ్, లక్ష్మణ్లకు అమిత్షా, నడ్డా సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యనేతలను పంపించి క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకోవడం వల్ల లోపాలున్న చోట సరిచేసుకోవడానికి వీలుపడుతుందని నడ్డా చెప్పిట్లు తెలిసింది. -
తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చి చేదోడువాదోడుగా నిలిచేందుకే..
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కుటుంబపాలన పట్ల విసిగి వేసారి ఉన్న తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చి చేదోడువాదోడుగా నిలిచేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గభేటీ, బహిరంగసభను ఇక్కడ నిర్వహిస్తున్నట్టు సమావేశ ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ క్రియాశూన్యత్వంతోపాటు వివిధ అంశాలు, సమస్యలపై చేష్టలుడిగి వ్యవహరించడం, పేరుకే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడటం వంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయశూన్యాన్ని బీజేపీనే పూరిస్తుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఎంతగా కృషి చేసినా శవానికి అలంకరణ చేయడంతప్ప కాంగ్రెస్ పార్టీకి జీవం పోయడం సాధ్యంకాదని అన్నారు. బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను ఆయన వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... కేసీఆర్ కుటుంబ, అవినీతి, అరాచకపాలనపై రాష్ట్ర ప్రజలు విసిగివేసారి ఉన్నారు. దీని నుంచి విముక్తి కల్పించడంతోపాటు మేలైన, నీతివంతమైన పాలనను బీజేపీ మాత్రమే ఇస్తుందని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత రాష్ట్రంలోనే బీజేపీ విస్తరణకు అన్ని అనుకూల పరిస్థితులున్నాయని జాతీయ నాయకత్వం విశ్వసిస్తోంది. అందువల్లే ఈ సమావేశాలకు, మోదీ విజయసంకల్ప సభకు హైదరాబాద్ వేదికైంది. వివిధ జాతీయ అంశాలతోపాటు తెలంగాణపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశాలున్నాయి. 8 ఏళ్ల మోదీ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా ‘మోదీ ఛరిష్మా’తో బీజేపీ గెలుపొందుతోంది. ఇక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు... తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి, వారు పడుతున్న కష్టాలు, సమస్యల పరిష్కారానికి మోదీ బహిరంగ సభ ద్వారా భరోసా కల్పిస్తాం. భవిష్యత్ బీజేపీదేనని ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అగ్రనేతలంతా పాల్గొనే సమావేశాలు, బహిరంగ సభ తోడ్పడతాయి. కాంగ్రెస్, ఎంఐఎంలు టీఆర్ఎస్కు వంత పాడే పార్టీలని, నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీ అనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించబోతున్నాం. దానికి జాతీయ నాయకత్వం అండదండలు ఉన్నాయని విషయాన్ని సభ ద్వారా చాటబోతున్నాం. -
కుటుంబ పాలనపై ప్రజలకు విసుగు: లక్ష్మణ్
సాక్షి, నాగర్కర్నూల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిదేళ్లలో చేసిన అభివృద్ధిపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన ప్రజా సంక్షేమ సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు విసుగు చెందారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిపై చర్చకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి పార్టీ అని వ్యాఖ్యానించారు. -
ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ నేత లక్ష్మణ్ కు బీజేపీ రాజ్యసభ సీటు
-
కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రాల పాలన: లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు కేంద్రం బాసటగా నిలుస్తూ నిధులిస్తుంటే, రాష్ట్రాలు మాత్రం సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రగతి భవన్లో ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజలకు అన్యాయం చేయడంలో తెలంగాణ అగ్రభాగాన ఉందని కేంద్రమంత్రి చెప్పారని లక్ష్మణ్ వెల్లడించారు. -
తెలంగాణలో రాహుల్ సభలు వృథా ప్రయాస
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాహుల్ సభలు వృథా ప్రయాసని.. కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒక గూటి పక్షులేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు చేయని పనుల్ని ఇప్పుడు చేస్తా మంటే నమ్మే వారెవరూ లేరని విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు త్వరలోనే తప్పకుండా కలుస్తాయని జోస్యం చెప్పారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణభవన్లో రాహుల్ తెలం గాణ టూర్పై లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. -
‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యాసలో వచ్చిన వినసొంపైన పాట ‘బుల్లెట్టు బండి’ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్ చేసి భర్తను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పాట జనాల్లో మార్మోగుతోంది. ఏ వేడుక జరిగినా.. ఏ శుభకార్యం జరిగినా ‘బుల్లెట్టు బండి’ పాట లేనిది జరగడం లేదు. అంతగా ట్రెండింగ్ అయిన ఆ పాటను రాసిన రచయిత గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. పాట రాసింది లక్ష్మణ్ అని తెలుసు కానీ.. ఆయన ఎక్కడి వ్యక్తో... ఏం చేస్తుంటాడో తెలుసుకోండి. చదవండి: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ పాటల రచయిత కాటికె లక్ష్మణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామం. వీరిది పేద కుటుంబం. లక్ష్మణ్తో పాటు రామ్ కూడా జన్మించాడు. అంటే వీరిద్దరూ కవల పిల్లలు. వీరిద్దరినీ రామ్లక్ష్మణ్గా పేర్కొంటారు. రామ్ గాయకుడిగా గుర్తింపు పొందగా లక్ష్మణ్ రచయితగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి జానపద పాటల ఆల్బమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. తెలంగాణ యాసలో ఎంతో ఆకట్టుకునేలా రాయడం లక్ష్మణ్ ప్రత్యేకం. సినిమా రంగంపై ఆసక్తితో రామ్ లక్ష్మణ్ హైదరాబాద్కు వచ్చారు. ఉపాధి కోసం ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్ ఇప్పటివరకు దాదాపు 300 వరకు పాటలు రాశాడు. ఆ పాటలను రామ్ పాడాడు. ఆ పాటలు కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి. ‘నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు’ ఆల్బమ్స్తో ఈ సోదరులు ఎంతో గుర్తింపు పొందారు. అచ్చమైన పల్లె భాషలో రాయాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అయితే ఒకరోజు ప్రముఖ గాయని మోహన భోగరాజు లక్ష్మణ్కు ఓ పాట రాయమని అడిగింది. అడిగిన కొన్ని రోజుల్లోనే ‘బుల్లెట్టు బండి’ రాసి ఇచ్చాడు. ఆ పాటను మోహన భోగరాజు పాడి యూట్యూబ్లో విడుదల చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్తో సోషల్ మీడియానే ట్రెండింగ్లోకి వచ్చింది. చదవండి: ఒక్క డ్యాన్స్తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు ఈ పాట తర్వాత ఆ ఇద్దరి సోదరులకు భారీగా అవకాశాలు వచ్చాయంట. మున్ముందు కూడా మరిన్ని మంచి పాటలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం. 8వ తరగతి నుంచి పాటలు రాస్తున్నాడు. చంద్రబోస్, గోరటి వెంకన్న, అందెశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకున్నా. ఈ పాటతో 22 రోజుల్లో ఈ పాట రాసినట్లు లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. తాను చూసిన అక్కాచెల్లెళ్లను చూస్తూ ఆ పాట రాసినట్లు తెలిపారు. ఆ నవ వధువుకు శుభకాంక్షలు తెలిపాడు. -
బీసీలను సీఎం కేసీఆర్ అణచి వేస్తున్నారు: లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్, కమ్యూనిస్టులు 70 ఏళ్లుగా బీసీలను అణచివేశారంటూ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మోదీ తన కేబినెట్లో 27 మంది బీసీలను మంత్రులుగా నియమించారని, ఓబీసీ జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారని పేర్కొన్నారు. ఓబీసీ కులాల వర్గీకరణకు కమిషన్ వేశారని, బీసీలకు న్యాయం చేసింది కేవలం ప్రధాని మోదీనేనని తెలిపారు. బీసీలను సీఎం కేసీఆర్ అణచి వేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటును పరిశీలిస్తున్నామని వెల్లడించారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తీర్మానం చేయాలన్నారు. కులాలవారి బీసీ జనాభా లెక్కల సేకరణకు మేం వ్యతిరేకం కాదని, 33 లక్షల కులాలు ఉన్నాయని యూపీఏ సర్కార్ పక్కదారి పట్టించిందని లక్ష్మణ్ మండిపడ్డారు. -
బీజేపీలో ముసలం..
-
మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఎంఐఎం పార్టీనే తమ ప్రత్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. దుబ్బాక ఫలితాలే హైదరాబాద్లో రిపీట్ అవుతాయని, గ్రేటర్లో గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని పేర్కొన్నారు. జీహెంఎంసీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. రేపటి బీజేపీ ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. గ్రేటర్లో పొత్తులపై తమనెవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.(చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: జనసేన) బీజేపీ గెలుపు ఖాయం: లక్ష్మణ్ ఎల్ఆర్ఎస్ పోవాలంటే గ్రేటర్లో టీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వాలని బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కె.లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్లో బీజేపీని గెలిపిస్తే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్పై వెనక్కితగ్గడం ఖాయమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తమ కార్యాచరణ గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ.. రేపు బీజేపీ తొలి జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ‘‘ఎక్కువ సమయం ఇస్తే బీజేపీ వాళ్ళు గ్రేటర్ పీఠం తన్నుకుపోతారని టిఆర్ఎస్ భావిస్తోంది. అందుకే కుట్ర పూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. 18 లక్షల మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్లో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి 428 మందికి మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఓ మంత్రి లక్ష ఇల్లు చూపిస్తామని చెప్పి అభాసుపాలు అయ్యారు. సీఎం కేసీఆర్ మాట తప్పారు... ఏ ముఖం పెట్టుకుని ఆయన ఓట్లు అడుగుతారు. ఆరేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ప్రాణాంతక కరోనాను ఆరోగ్య శ్రీలో పరిధిలో చేర్చలేదు. హైదరాబాద్లోని బస్తీలన్నీ చెరువులుగా మార్చిన ఘనత కేసీఆర్దే. టీఆర్ఎస్ కార్యకర్తల దోపిడీ కోసమే డబ్బు రూపంలో వరద సాయం చేశారు. హైదరాబాద్ ప్రజలు అధికార పార్టీని నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఏదేమైనా బీజేపీ గెలుపు ఖాయం. మా పార్టీలోకి భారీగా వలసలు పెరిగాయి. 26 విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. టీఆర్ఎస్ కుట్రలను తిప్పికొడతాం. మార్పు కోసం బీజేపీని గెలిపించాలి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ సిటీకి మెట్రోరైలు రాకపోవడానికి కారణం వాళ్లే! అధికార టీఆర్ఎస్ పార్టీ తీరుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘గ్రేటర్లో ఏం సాధించారు? దత్తత తీసుకున్న డివిజన్ వైపు సీఎం కేసీఆర్ ఎప్పుడైనా కన్నెత్తి చూశారా’’ అని ప్రశ్నించారు. ‘‘ఓల్డ్ సిటీకి మెట్రో రైలు వెళ్లకపోవడానికి కారణం టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే. మెట్రో పనులు ఆపిన కారణంగా 3 వేల 500 కోట్లు కట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతోనే ఎంఎంటీఎస్ రైలు ప్రాజెక్టు ఆగింది వాస్తవం కాదా ? ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడానికి టీఆర్ఎస్ కృషి చేయలేదు. అరేళ్ళలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి. అంతేగానీ ఎన్నికల తాయిలాలు చూపి కాదు’’ అంటూ మండిపడ్డారు. ఇక సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప, చేతలు ప్రగతి భవన్ దాటలేదంటూ కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అభివృద్ధి తక్కువ.. ఆర్భాటాలు ఎక్కువ. చేసింది గోరంత... చెప్పుకునేది కొండంత’’ అని విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రతికూల పరిస్థితులు కల్పించినా బీజేపీ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీని ఆదరించండి... ఆశీర్వదించండి. అభివృద్ధి వైపు తీసుకువెళ్తాం’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివేక్ నేతృత్వంలో మ్యానిఫెస్టో కమిటీ సమావేశం జరిపి, మ్యానిఫెస్టో విడుదల చేస్తామని కిషన్రెడ్డి తెలిపారు. కాగా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, టీఆర్ఎస్ 42 పోలింగ్ కేంద్రాలను ఒకే చోట పెట్టారని కిషన్ రెడ్డి విమర్శించారు. -
టీఆర్ఎస్కు ‘మెజారిటీ’ గుబులు!
సాక్షి, హైదరాబాద్: దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంటామని అధికార టీఆర్ఎస్ గట్టిగా చెబుతున్నా మెజారిటీ విషయంలో మాత్రం ఆ పార్టీ గుబులు చెందుతోంది. ఎన్నికల ప్రక్రియ మొదట్లో మెజారిటీ పెంచుకోవడంపైనే దృష్టి సారించిన టీఆర్ఎస్... ఇప్పుడు గెలిస్తే చాలు అన్న స్థాయిలో ఉంది. కనీసం 25 వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నా పోలింగ్ తరువాత వెలువడుతున్న అంచనాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందన్న అంచనాలను కూడా టీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి మూడో వారంలో జరుగుతాయనే సంకేతాలు రావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో దుబ్బాక ఫలితం కమలదళానికి ఆయుధంగా మారకూడదనే అభిప్రాయం టీఆర్ఎస్లో కనిపిస్తోంది. 90 వేల ఓట్లపై ధీమా... ఈ నెల 3న దుబ్బాక ఉప ఎన్నిక ముగిశాక పోలింగ్ సరళితోపాటు తమకు పోలయ్యే ఓట్లపై టీఆర్ఎస్ అంచనాకు వచ్చినట్లు సమాచారం. 1.64 లక్షల ఓట్లు పోలవగా సుమారు 90 వేల ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థి సాధిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మిగతా సుమారు 74 వేల ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు సాధించే ఓట్ల సంఖ్యపైనే మెజారిటీ ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ హడావుడి చేసినా దుబ్బాక నియోజకవర్గంలో ఆ పార్టీకి ఓటింగ్ అదే స్థాయిలో జరగలేదని క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకుగాను 2 లేదా 3 మండలాల పరిధిలోనే బీజేపీ కొంతమేర ప్రభావం చూపిందనే ప్రాథమిక అంచనాకు టీఆర్ఎస్ వచ్చింది. భారీ మెజారిటీ పరిస్థితి నుంచి... రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాక నుంచి వరుసగా నాలుగోసారి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వర్రెడ్డిపై సోలిపేట రామలింగారెడ్డి 62,500పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014, 2018లోనూ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం. రఘునందన్రావు మూడో స్థానంలో నిలిచి డిపాజిట్ కూడా కోల్పోయారు. అయితే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో మాత్రం ఆయన తీవ్ర పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో క్షేత్రస్థాయి అంతర్గత విభేదాలు, పార్టీ అభ్యర్థి విద్యార్హత, ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో అసంతృప్తి వంటి కారణాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దుబ్బాకలోనే మకాం వేయడంతో పోటాపోటీ ప్రచారం జరిగింది. ఈ పరిణామం తమ అనుకూల ఓటింగ్కు దారితీసినట్లు బీజేపీ అంచనా వేస్తోంది. జీహెచ్ఎంసీలో పునరావృతం కాకుండా... రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర నిధుల విషయంలో దుబ్బాకలో బీజేపీ చేసిన ప్రచారం జీహెచ్ఎంసీలో పునరావృతం కాకుండా చూడాలనే అభిప్రాయం టీఆర్ఎస్లో కనిపిస్తోంది. దుబ్బాకలో బీజేపీకి ఓట్ల శాతం పెరిగితే జీహెచ్ఎంసీపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్న టీఆర్ఎస్... వీలైనంత మేర ఆ పార్టీకి అడ్డుకట్ట వేసే వ్యూహాలకు పదును పెడుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో బలమైన బీజేపీ నేతలను పార్టీలోకి ఆకర్షించాలనే వ్యూహంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జితోపాటు పలువురు డివిజన్ స్థాయి నేతలు గులాబీ గూటికి చేరుకున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీలో డివిజన్లవారీగా ఇప్పటికే పార్టీ బలం అంచనాకు వచ్చిన టీఆర్ఎస్... విపక్ష పార్టీల పరిస్థితిని కూడా అంచనా వేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నగర శివార్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే యోచనలో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మాకు ప్రజల మద్దతు పెరుగుతోంది: కె. లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. వరద బాధితులను ఆదుకునేం దుకు తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయిం చిందని ఆయన తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతున్న కారణంగా, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకు నేందుకే మంత్రి కేటీఆర్ తమపై ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో టీఆర్ఎస్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని, త్వరలో హైదరాబాద్లో ‘బడుగుల సభ’ ఏర్పాటు చేసి టీఆర్ఎస్– ఎంఐఎం నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వరద సాయం పేరుతో ప్రభుత్వ ధనాన్ని టీఆర్ఎస్ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం: హైదరాబాద్ అభివృద్ధికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని లక్ష్మణ్ తెలిపారు. కేంద్రం కేటాయించిన నిధులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్కు సవాల్ విసిరారు. -
టీఆర్ఎస్ ఆటలకు కేంద్రం కళ్లెం వేస్తుంది
సాక్షి, మెదక్ : టీఆర్ఎస్ ఆటలకు త్వరలో కేంద్రం కళ్లెం వేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. భారత ప్రధానిని తిట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కూడా ప్రజలకు చేరువవుతామని, దొరల పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. ‘‘ టీఆర్ఎస్- కాంగ్రెస్ రెండూ ఒక్కటే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఏమి చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానిదే. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసింది. టీఆర్ఎస్ను గద్దెదించడమే బీజేపీ ముందున్న సవాలు. ( మళ్లీ సహనం కోల్పోయిన నితీష్) బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిహార్- పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి కానీ ప్రభుత్వాల కోసం కాదు. బీసీ సంక్షేమం కోసం ఇచ్చిన 5000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి. దళితులకు 3 ఎకరాల భూమి, 3 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తా అని మాట తప్పడం ఏంట’’ని ఆయన ప్రశ్నించారు. -
ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆయన సోమవారం బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్తో కలిసి ముషిరాబాద్ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు మంత్రిని కలసి ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు నిర్మించినా.. కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తమదన్నారు. 2015లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తి కాకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని తనమని మండిపడ్డారు. ఎన్నికల కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్లను వాడుకుంటోందని మంత్రి కిషన్రెడ్డి దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని తెలిపారు. కేంద్ర నిధులతో ఆంద్రప్రదేశ్లో 7లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్లో దాదాపు 20లక్షల మంది పేదలకు ఇళ్లు లేవన్నారు. అందరికీ ఇళ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు మౌలిక సదుపాయాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అదే విధంగా బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ముషీరాబాద్ నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. నియోజకవర్గంలో 431 ఇళ్లు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఆశగా చూపి మూడు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్లు వేయించుకుందని విమర్శించారు. -
ఆపరేషన్ 2023
సాక్షి, హైదరాబాద్: బీజేపీని 2023 ఎన్నికల్లో గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముం దుకు సాగుతామని ఆ పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ నియమితులైన సందర్భంగా వారు ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిం దని, ఆ నమ్మకాన్ని నిలబెడతామని పేర్కొన్నారు. ఆపరేషన్ 2023 లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం కట్టబెట్టిన ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్ష బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తా. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ నినాదానికి అనుగుణంగా కేంద్ర పథకాలను ప్రజల దరికి చేరుస్తా. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఓబీసీలు పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేస్తా. తెలంగాణ, ఏపీలో 50 శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాలను పార్టీకి చేరువ చేస్తా, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే ధ్యేయంగా పనిచేస్తా. రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆ దిశలో పనిచేస్తోంది. నేను అందుకు తోడ్పాటునిస్తా. అందుకోసమే పార్టీ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తోంది. – కె. లక్ష్మణ్ రాష్ట్రంలో బీజేపీని 2023లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా జాతీయ పార్టీ ఈ బాధ్యతలు అప్పగించింది. పార్టీలో చేరినప్పటి నుంచి పార్టీ పటిష్టతకు పనిచేస్తున్నా. ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడంతో బాధ్యత మరింత పెరిగింది. ప్రజాసంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని, పథకాలను ప్రజలకు వివరించడం ద్వారా పార్టీని వారికి చేరువ చేస్తా. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం చేస్తున్న కృషిని వివరించడమే నా ధ్యేయం. – డీకే అరుణ -
ఆ 125 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో..
సాక్షి, హైదరాబాద్ : తడి బట్టతో రైతుల గొంతు కోసే కేసీఆర్కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల కమిటీ సిఫార్సులే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టంలో ఉన్నాయని, దళారీలు, కమిషన్ ఏజెంట్లకు కొమ్ముకాసేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలకు కారణమవుతోన్న పత్తి పంటను కేసీఆర్ ప్రోత్సహించటం సరైంది కాదన్నారు. 40 లక్షల ఎకరాల పత్తి పంటను సీఎం కేసీఆర్ 70 లక్షల ఎకరాలకు తీసుకెళ్లారని, భూసార పరీక్షల కోసం కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన 125 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. (అంతుపట్టని రహస్యం: కేసీఆర్ వ్యూహమేంటి?) రైతులను దోచుకోవటానికున్న రాజమార్గం మూసుకుపోతోందని టీఆర్ఎస్కు బాధగా ఉందన్నారు. వ్యవసాయ చట్టంతో రైతుల ఆదాయం రెట్టింపవుతోందని పేర్కొన్నారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్పై ప్రతిపక్ష ఎంపీల దాడిని ఖండిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలను పాటించాల్సిన ఎంపీల తీరు బాధాకరమన్నారు. కొత్త వ్యవసాయ చట్టంతో యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారని, దేశ భవిష్యత్కు వ్యవసాయ చట్టం పునాది లాంటిదని వ్యాఖ్యానించారు. రైతు తనకు నచ్చిన ధరకు పంటను అమ్ముకునే అవకాశం లభించిందని తెలిపారు. -
గ్రేటర్ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తాం
-
గోల్కొండ కోటపై కాషాయ జెండా
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఇంట్లో కూర్చోను. ప్రజల్లోనే ఉంటా. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తా. టీఆర్ఎస్, కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తా. శివాజీ వారసులుగా మేం వస్తాం. ఔరంగజేబు వారసులుగా ఎంఐఎం, టీఆర్ఎస్ వస్తోంది. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటా’ అని రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. తొలుత గన్పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించి.. పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అభినందన సభాస్థలిలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, సుష్మాస్వరాజ్ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కాగా, సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించలేదు. ముహూర్తం చూసుకుని స్వీకరించనున్నట్లు సమాచారం. కాషాయజెండా ఎగరేయడమే లక్ష్యం.. నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయ జండా రెపరేపలాడించేందుకు ఎందరో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకోసం కృషి చేస్తానని చెప్పారు. గోల్కొండ కోటపై కాషాయజెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. టీఆర్ఎస్, ఎంఐఎం విధ్వంసాన్ని అడ్డుకునేందుకు, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. భైంసా సంఘటనను మరచిపోబోమని, తమను కాపాడాలని పిల్లలు, మహిళలు, తమ్ముళ్లు చేసిన ఆర్తనాదాలు ఇంకా తన కళ్ల ముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు. భైంసాకు వచ్చి, అక్రమ కేసులతో జైలుకు వెళ్లిన తమ్ముళ్లను గుండెకు హత్తుకుంటానని చెప్పారు. ఆ తుక్డేగాళ్ల సంగతి చూస్తా.. ‘కేసీఆర్ సంగతేందో.. ఎంఐఎం తుక్డేగాళ్ల సంగతేందో చూస్తా. బండి సంజయ్ రూటు మార్చడు. అడ్డదారిలో పోయే అలవాటు లేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, పేదల కోసం పని చేస్తా, కార్యకర్తలకు అండగా ఉంటా. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా. బీజేపీ మతతత్వ పార్టీ అని, భయంకరమైన హిందువునంటూ కేసీఆర్ చెప్పుకొంటున్నారు. కొడుకును సీఎం చేసేందుకే ఆ యాగాలు చేస్తున్నారు. స్వార్థంతో యాగాలు చేస్తే హిందువుగా గుర్తించరు. ఆయన టూత్ పాలిష్ మాటలను ప్రజలు నమ్మరు’అని సంజయ్ మండిపడ్డారు. ఫాంహౌజ్లో ముద్రిస్తున్నవా? ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, లక్షన్నర కోట్లు ఇచ్చినా ఆ నెపం కేంద్రంపై నెడుతున్నారు. కేంద్రం వాటా లేకుండా ఇస్తున్న పథకాలేంటో చెప్పాలి. రాష్ట్రంలో పథకాలకు ఇచ్చే డబ్బు ఎక్కడిది. ఎవడబ్బ సొమ్మని ఇస్తున్నావు. ఫాంహౌజ్లో ముద్రించి ఇస్తున్నావా? కేంద్రం ఇచ్చే డబ్బులకు కేసీఆర్ లెక్కలు చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా, ఎంపీగా రాష్ట్రానికి నిధులు ఇప్పిస్తా.. దమ్ముంటే నాతో రా.. అందరికీ కరోనా భయం పట్టుకుంటే కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది. కరోనాకు పారాసిటమాల్ చాలు అన్న కేసీఆర్ మాటలకు దేశమంతా నవ్వుకుంటోంది’అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మానవత్వం లేని మృగం ‘మానవత్వం లేని మృగంగా సీఎం వ్యవహరిస్తున్నారు. కొండగట్టు ప్రమాదంలో అంతమంది చనిపోతే కనీసం స్పందించలేదు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా.. ఇలాంటి సీఎం అవసరమా? త్వరలోనే టీఆర్ఎస్ గడీలను కూల్చేస్తాం. ఖబడ్దార్ కేసీఆర్! కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్టయింది. పోరగాళ్లు.. పోరగాళ్లు అంటున్నావు. ఆ పోరగాళ్ల రక్తంతోనే అధికారంలోకి వచ్చావు. ఆ పోరగాళ్లే నీకు ఘోరీ కడతారు. అది బీజేపీలోనే సాధ్యం: బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంజయ్ లాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడంటే అది బీజేపీలోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులైన తమ పార్టీ నేతల్లో ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలు వేదికగా టీఆర్ఎస్కు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయని, ఈ రెండు కుటుంబాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు. సంజయ్ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని హైకమాండ్కు చెప్పానని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. పార్టీలోని యువత అంతా కలసి టీఆర్ఎస్ ముక్కు కట్ చేస్తారని వ్యాఖ్యానించారు. బైంసా బాధితుల కోసం రూ.5 లక్షల చెక్కును ఆయన అందించారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీలు గరికపాటి రామ్మోహనరావు, వివేక్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బీజేపీ బండికి.. సంజయుడే సారథి కేసీఆరే అసలు కరోనా -
‘పీఆర్సీ, నిరుద్యోగం’పై ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల పీఆర్సీ కోసం త్వరలోనే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటలకు, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్కు పొంతనే లేదన్నారు. నిలువెల్లా అబద్ధాలతో కూడిన మోసపూరిత బడ్జెట్గా అభివర్ణించారు. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, బీసీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఇలా అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుత బడ్జెట్ ‘బడ్జెట్ బారెడు – ఖర్చు జానెడు, పేరు గొప్ప – ఊరు దిబ్బ’అన్న చందంగా ఉందని విమర్శించారు. తలసరి ఆదాయం చెప్పిన ప్రభుత్వం అప్పును ఎందుకు చెప్పడం లేదు? లోటును ఎలా పూడ్చుతారో చెప్పలేదేంటని ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్రూం ఇళ్లు.. వంటి కీలకమైనవాటిని గాలికొదిలేశారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.ఒక్కొక్కరి తలపై రూ.91వేలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని విమర్శించారు. ‘నిరుద్యోగ భృతి అని చెప్పి ఏడాదిన్నర కావొస్తున్నా అతీగతి లేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా, తాజాగా డబ్బులు ఇస్తామని కొత్త మోసం చేయబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో ఉన్నందునే నగరానికి రూ.పది వేల కోట్లు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంపై సాకు వేసి తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏమైందని ప్రశ్నించారు. కరోనాకు పారాసిటమాల్ మందును డాక్టర్ కేసీఆర్ కనుగొన్నారా? అని ప్రశ్నించారు. ఎంఐఎంకు తలొగ్గి సీఏఏపై తీర్మానం చేస్తామంటున్నారని విమర్శించారు. -
‘కేసీఆర్ కరోనాకు మందు కనిపెట్టారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది మోసపూరిత, అబద్దాల బడ్జెట్ అని అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంకెల గారడీతో బడ్జెట్ను మసిపూసి మారేడు కాయలా చేశారన్నారు. బడ్జెట్ బారెడు- ఖర్చు చారెడుగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తలసారి ఆదాయం చెప్పిన ప్రభుత్వం అప్పును ఎందుకు చెప్పడం లేదు? లోటును ఎలా పూడ్చుతారో చెప్పలేదేంటని వరుస ప్రశ్నలు సంధించారు. ఫీజు రీయింబర్స్మెంట్, డబుల్ బెడ్రూం.. ఇలా కీలకమైనవాటిని గాలికొదిలేశారన్నారు. ఉద్యోగ నొటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కొక్కరి తలపై రూ.91వేలు అప్పు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని విమర్శించారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు?) ‘నిరుద్యోగ భృతి అని చెప్పి ఏడాదిన్నర కావొస్తున్నా అతీగతి లేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా... తాజాగా డబ్బులు ఇస్తామని కొత్త మోసం చేయబోతున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఎన్నికలు ఉన్నందున నగరానికి రూ.పది వేల కోట్లు అంటున్నారు. ఇది పచ్చి మోసం. డబ్బులు లేవని ఆస్తులను అమ్మే వారు ఏ రకంగా ఆదర్శప్రాయులో వారే చెప్పాలి. రాష్ట్రంలో ఆర్థిక మందగమనం లేదు. ఉన్నదల్లా కేసీఆర్ మందగమనమే. కేంద్రం మీద సాకు చూపి వీరి అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారు. నిరుద్యోగ, ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో పార్టీ నేతృత్వంలో ఉద్యమం చేపడతాం. జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు. ఏమైంది? కరోనాకు పారాసిటమాల్ మందును డాక్టర్ కేసీఆర్ కనుగొన్నారా? కేసీఆర్.. ఎంఐఎంకు తలొగ్గి సీఏఏపై తీర్మానం అంటున్నారు’ అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. (రోహింగ్యాలకు పింఛన్లా?) -
ముస్లింలకు స్వేచ్ఛ భారత్లోనే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వక్రభాష్యం చెబుతూ అస్థిరత్వాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ కార్యాలయంలో సీఏఏ అనుకూల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనూ కొన్ని రాజకీయ పార్టీల నేతలు ముస్లింల పౌరసత్వం తొలగిస్తారని ముస్లింలలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో మైనారిటీలుగా దుర్భర జీవితం గడుపుతున్న వారికి పౌరసత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడితే దానిని తప్పుగా అన్వయిస్తూ దేశంలోని ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. 52 ముస్లిం దేశాల్లో లేని స్వేచ్ఛ.. భారత్లో ముస్లింలకు ఉందని పేర్కొన్నారు. ఎన్ఆర్సీ అంశంపైనా కొందరు ముస్లింలను రెచ్చగొడుతున్నారని, దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయని ఆరోపించారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తామంటే ఆందోళన చేయడం సరికాదని హితవు పలికారు. ప్రధాని మోదీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకే సీఏఏపై మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. సీఏఏకు అనుకూలంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాటం నర్సింహయాదవ్, ఇన్చార్జి కాసం వెంకటేశ్వర్లు, మంత్రి శ్రీనివాస్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంఐఎంను ఎందుకు కట్టడి చేయట్లేదు?
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి సహించలేక కుహనా మేధావులు, కుహన లౌకికవాదులు కడుపుమంటతో దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఢిల్లీలో హింసాత్మక ఆందోళనలు సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం మీడియాసమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ అల్లర్లను అదుపు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇక్కడ తెలంగాణలో మజ్లిస్ పార్టీ, ఎంఐఎం నేతలు సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, ఓ వర్గంలో విష బీజాలు నాటుతుంటే సీఎం కేసీఆర్ వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మోదీ వ్యతిరేక శక్తులు అల్లర్లకు కుట్ర పన్నాయన్నారు.ట్రంప్ పర్యటన సమయంలో ‘ఈశాన్య ఢిల్లీలో దాడులు జరగడానికి కారణమేంటి..? గత కొన్ని రోజులుగా ఆందోళన జరుపుతున్నా.. ట్రంప్ రాకతోనే వారి చేతుల్లోకి తుపాకులు ఎలా వచ్చాయి..? కాల్పులు జరపమని పోలీసులకు ఆదేశాలు రాలేదన్నారు. మరి ఈ కాల్పులు ఎవరు జరిపారు? ’ఈ ప్రశ్నలకు సమాధానం లేదని చెప్పారు. తెలంగాణలో సీఏఏకు మతం రంగు పులిమి ఎంఐఎం నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య విష బీజాలు నాటుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు..? మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదు..?అని ప్రశ్నించారు. కిషన్రెడ్డి, జయశంకర్లకు విజ్ఞప్తి... టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రీస్కో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజా గవిని, దివ్య తో పాటు మరొకరు ప్రేమ్ నాథ్ రామ్ నాథ్ మరణించడం పట్ల లక్ష్మణ్ దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. వారి మృతదేహాలను భారత్కు తెప్పించే విధంగా తగిన సహాయ సహకారాలు అందించవలసిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్లకు లక్ష్మణ్ ఫోన్లో కోరారు. -
రోహింగ్యాలకు పింఛన్లా?
సాక్షి, హైదరాబాద్: దొంగపత్రాలతో భారత గుర్తింపు కార్డులు తీసుకుని, ప్రభుత్వ పింఛన్లు పొందుతున్న రోహింగ్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తోన్న వేలాదిమంది రోహింగ్యాలు గుర్తింపు కార్డులతోపాటు, పాస్పోర్టు వంటి అత్యున్నత ధ్రువీకరణలు పొందుతున్న విషయంపై సోమవారం లక్ష్మణ్ ఆధ్వర్యంలోని బీజేపీ నాయకుల బృందం డీజీపీ మహేందర్రెడ్డికి ఫిర్యాదు చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలలో చాలామంది ఐఎస్ఐ, అల్కాయిదా సానుభూతిపరులు ఉన్నారని ఆరోపించారు. వీరి వల్ల దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రోహింగ్యాలు ధ్రువపత్రాలు తీసుకుంటూ పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు పొందుతున్నారని ఆరోపించారు. 189 మంది రోహింగ్యాలు ఆధార్, ఓటర్ కార్డు, పాసుపోర్టు వంటి ధ్రువీకరణలు సంపాదిస్తుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరికి ఆధార్ నుంచి నోటీసులు వస్తుంటే ఎంఐఎం అధినేత, ఎంపీ ఒవైసీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. విదేశీయులకు మజ్లిస్ పార్టీ మద్దతివ్వడం, ఈ మొత్తం వ్యవహారంపై అధికార పార్టీ చూసీచూడనట్లు వ్యవహరించడంపై మండిపడ్డారు. పాముకు పాలుపోసి పెంచుతున్న ఇలాంటి నాయకులకు టీఆర్ఎస్ మద్దతిస్తోందన్నారు. రోహింగ్యాలు నగరంలో భూములు కబ్జాచేసి, శాశ్వత కట్టడాలు కడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. మార్చి 15వ తేదీన సీఏఏకు అనుకూలంగా నగరంలో తలపెట్టిన అమిత్షా సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
పౌరసత్వ సవరణ చట్టాన్ని సీఎం చదివారా?
సాక్షి, హైదరాబాద్: తాను 85 వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ అసలు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) చదివారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. మిత్రపక్షం ఎంఐఎంను సంతృప్తి పరిచేందుకే సీఏఏను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏను వ్యతిరేకి స్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయాన్ని ఖండించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని మండిపడ్డారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయక తప్పదని అంబేడ్కర్ రచించిన రాజ్యాం గం స్పష్టం చేస్తుందన్నారు. సీఏఏ అమలును నిరాకరించేందుకు రాష్ట్రాలకు ఎలాంటి అవకాశం లేదన్నారు. సీఏఏ ద్వారా ముస్లింలకూ పౌరస త్వం ఇవ్వాలని చెబుతున్న కేసీఆర్.. ఏ ముస్లింలకు ఇవ్వాలో స్పష్టం చే యాలని లక్ష్మణ్ అన్నారు. పాకిస్తాన్ ముస్లింలా.. బంగ్లాదేశ్ ముస్లింలా.. అఫ్గానిస్తాన్ ముస్లింలా? చెప్పాలన్నారు. కేసీఆర్ వెళ్లి పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాధినేతలతో మాట్లాడి భారత్లో విలీనమయ్యేందుకు వారిని ఒప్పించాలని అంటూ కేసీఆర్కు చురకలంటించారు. -
‘తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదు’
సాక్షి,న్యూఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిబంధనలకు విరుద్ధంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేశారని చెప్పారు. సాంకేతికంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదని లక్ష్మణ్ అన్నారు. ఈమేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్టు లక్ష్మణ్ తెలిపారు. ఉప రాష్ట్రపతిని కలిసినవారిలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు,ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. -
కేసీఆర్ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపడం లేదని, తెలంగాణకు రావాల్సిన నిధులను ఇస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రాంతీయ పార్టీలను కూడగడుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యత గల సీఎం సీఏఏను అపహాస్యం చేసేలా మట్లాడటం ఎంతవరకు సబబని కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద రాజకీయ వాదులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ కుట్రలో కేసీఆర్ పావులా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని రాజకీయ పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం, సీట్ల కోసం జనగణనను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. -
భవిష్యత్తులో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం
-
త్వరలోనే జేపీ నడ్డా తెలంగాణ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికవడం సంతోషకరమని, తెలంగాణ బీజేపీ తరపున అభినందనలు తెలిపామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జేపీ నడ్డా త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు. కుటుంబ రాజకీయాలకు, ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉండే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ‘టీఆర్ఎస్, కేసీఆర్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ ఒక గూటి పక్షులే. కోట్లకు పడగలు ఎత్తినవారికే టీఆర్ఎస్ సీట్లు ఇచ్చింది. కల్వకుంట్ల కుటుంబానికి సేవకులుగా, ఫామ్ హౌస్కు పాలేర్లుగా ఉండే వాళ్లకే సీట్లు ఇచ్చారు తప్ప ప్రజా సేవకులకు కాదు’అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్రావు తదితరులు అభినందనలు తెలిపారు. బీజేపీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్త అత్యున్నత పార్టీ పదవిలోకి వెళ్లడం సాధ్యమవుతుందని, నడ్డా అంచెలంచెలుగా ఎదిగారని కిషన్రెడ్డి సందేశంలో పేర్కొన్నారు. -
బీజేపీని గెలిపిస్తే టీఆర్ఎస్కు చెక్
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల దగ్గరకు వెళ్లేందుకు మొహం చెల్లకనే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అందుకే మం త్రులు, ఎమ్మెల్యేలను ప్రచారానికి పంపి గెలిపించి తీసుకురాకపోతే పదవులు పోతాయని బెదిరిస్తు న్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే టీఆర్ఎస్కు చెక్ పెట్టొచ్చని, తమ పార్టీ మేయర్లు, చైర్మన్లు గెలిస్తే రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల అభి వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చా రు. ఈ విశేషాలు ఆయన మాటల్లోనే... మా వ్యూహం మాకుంది... గత ఆరు నెలలుగా మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాం. ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా పార్టీ నాయకులు అంతా విభజన చేసుకుని పని చేస్తున్నాం. ఇది మాకు మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. మొదటిసారి 2వేలకు పైగా వార్డుల్లో, 345 డివిజన్లలో సొంతంగా పోటీ చేస్తున్నాం. ఇంత పెద్ద సంఖ్యలో పోటీకి దిగడమే మా బలానికి నిదర్శనం. రాష్ట్రంలోని రెండు వేల వార్డుల్లో విజయం సాధించబోతున్నాం. ఇవే మా ప్రచారాస్త్రాలు... టీఆర్ఎస్ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం అంశాలనే ఈ ఎన్నికల్లో ప్రజల దృష్టికి తీసుకెళ్లాం. రైతు రుణమాఫీ, రైతు బంధు, కల్యాణ లక్ష్మి లాంటి పథకాల్లో టీఆర్ఎస్ విఫలమయింది. కల్యాణ లక్ష్మి ఆర్థిక సాయం పెళ్లి సమయంలో ఇవ్వాల్సి ఉండగా, పెళ్లి చేసుకున్న ఆడపడుచులు తల్లులు అయిన తర్వాత కూడా అందజేయడం లేదు. టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ఈ ఒక్క పథకం అమలుతోనే అర్థమవుతోంది. టీఆర్ఎస్ ముసుగులో ఎంఐఎం భైంసా తదితర పట్టణాలకు విస్తరించే ప్రయత్నం చేస్తోంది. పౌరసత్వ చట్ట సవరణ గురించి తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ మజ్లిస్ ఎజెండాను అమలు చేయాలని చూస్తోంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో భైంసా లాంటి వాతావరణం ఏర్పడకుండా ఉండాలంటే టీఆర్ఎస్, ఎంఐఎంను ఓడించి బీజేపీని గెలిపించాలి. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే. కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టే. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా మళ్లీ వారు చేరేది టీఆర్ఎస్లోనే. రంగులు మార్చే రాజకీయం.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో రంగు లుమార్చే రాజకీయం నడుస్తోందని కె.లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలి పిస్తే.. గులాబీ పార్టీలో చేరిపోతున్నారని.. గులాబీ పార్టీ ఆకుపచ్చ దారుసలాంకు దాసోహమైందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచా ర సభల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన లక్ష్మణ్.. బీజేపీ కార్యాలయంలో ఎంపీ అర్వింద్తో మీడియాతో మాట్లాడారు. వాళ్లకు మొహం లేదు... ఆరేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీ లేవీ టీఆర్ఎస్ నెరవేర్చలేదు. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ఓట్లడుగుతారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కుటుంబ పాలన, ధన రాజకీయాలు పెరిగిపోయాయి. వాళ్లకు డబ్బు, అధికార బలం, ఎన్నికల కమిషన్, పోలీసులు అందరి సహకారం ఉంది. మాకు మాత్రం ప్రజలు, కార్యకర్తలే బలం. -
నిధుల్లేక పురపాలికలు నిర్వీర్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనపై బీజేపీ చార్జ్షీట్ విడుదల చేసింది. ఆరేళ్లలో టీఆర్ఎస్ పాలనలో పురపాలికలు నిధులు లేక పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించింది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తూ బీజేపీ ముందుకు వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మోసపోకుండా ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ వైఫల్యాలపై 52 అంశాలతో రూపొందించిన చార్జ్షీట్ను బీజేపీ రాష్ట్ర కార్యాయంలో గురువారం లక్ష్మణ్ విడుదల చేశారు. అలాగే పార్టీ పాటల సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం టీఆర్ఎస్ అండతోనే ఇప్పుడు భైంసా వరకు వెళ్లిందని, ఎంఐఎం అజెండాను అమలు చేస్తున్న టీఆర్ఎస్కు ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దన్నారు. ఎంఐఎంతో లాలూచీ లేకపోతే భైంసాలో టీఆర్ఎస్ అభ్యర్థు«లను ఎందుకు పోటీ లో ఉంచలేదని, ఒవైసీకి కేసీఆర్ లొంగిపోయారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సమస్య లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలన్నారు. పట్టణాలను డల్లాస్లా తయారు చేస్తామని, హుస్సేన్సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులే పట్టణాలను ఆదుకుంటున్నది వాస్తవమా.. కాదా.. అన్నది కేటీఆర్ చెప్పాలన్నారు. -
అట్టుడికిన భైంసా
నిర్మల్/భైంసా, సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం సోమవారం అట్టుడికిపోయింది. 2 వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, గృహ దహనాలకు దారితీసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. దీంతో పట్టణంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. అగ్గిరాజేసిన వివాదం... భైంసాలోని కోర్బా గల్లీలో ఆదివారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకుడు బైక్పై పెద్ద శబ్దం చేస్తూ ఇష్టానుసారంగా వెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను కాసేపటికి తన వర్గం వారిని వెంటబెట్టుకొని వచ్చి ఒక వర్గానికి చెందిన ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోగా 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అల్లరిమూకలు 24 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, ఆటో మరికొన్ని వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇళ్లలోంచి సిలిండర్లు, వస్తు సామగ్రిని రోడ్డుపై పడేసి తగులబెట్టారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన దాడులు సోమవారం పట్టణమంతా విస్తరించాయి. ఒక వర్గం చేసిన దాడికి మరో వర్గం వారు ప్రతీకారంతో ప్రతి దాడులకు దిగారు. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు వచ్చిన నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజుతోపాటు భైంసా డీఎస్పీ నర్సింగ్రావు, సీఐ వేణుగోపాలరావు, ముథోల్ ఎస్సై అశోక్, ఐదుగురు కానిస్టేబుళ్లు సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ ప్రమోద్ కుమార్, రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఎస్పీలు విష్ణు వారియర్, శ్వేతారెడ్డి, రాహుల్ హెగ్డే హుటాహుటిన భైంసా చేరుకున్నారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సోమవారం సాయంత్రం ఆర్ఏఎఫ్ దళాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భైంసాలో బుధవారం వరకు 144 సెక్షన్ విధించారు. బిక్కుబిక్కుమంటూ.. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న పట్టణం ఉద్రిక్తంగా మారడంతో భైంసావాసులు భయంభయంగా గడుపుతున్నారు. 100 మందికిపైగా మహిళలు, పిల్లలు ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్లు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ కళ్ల ముందే ఇళ్లు, ఆస్తులు, ధ్వంసం కావడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. పలువురు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఊళ్లకు వెళ్లిపోయారు. బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్ దాడులు జరిగిన ప్రాంతాల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్రావు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. డీజీపీ ఆగ్రహం! తొలి నుంచీ సున్నిత ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికల వేళ హింస చెలరేగడంపై డీజీపీ మహేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘటన పూర్వాపరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజును డీజీపీ ఆదేశించారని సమాచారం. భైంసా ఎన్నిక వాయిదా వేయాలి: బీజేపీ భైంసా మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛగా మరో తేదీన ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకోవా లని కోరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి బృందం సోమవారం నాగిరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించింది. దాడులు ఎంఐఎం పనే: కె.లక్ష్మణ్ నిర్మల్ జిల్లా భైంసాలో ఎంఐఎం గూండాలు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు టీఆర్ఎస్, ఎంఐ ఎం కుట్రపన్నుతున్నట్లు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఒవైసీ బైంసా ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. నిర్మల్లో జరిగిన తబ్లిక్ ఇజ్తేమాకు వెళ్లొస్తున్న వారిపై దాడి జరగడం అమానుషమన్నారు. -
లక్ష్మణ్కే మళ్లీ బీజేపీ పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ మళ్లీ కొనసాగుతారా? ప్రస్తుత రాజ కీయ పరిస్థితుల్లో ఆయనను మార్చి కొత్త నేతను నియమించడం ద్వారా అదనపు ప్రయోజనమేమీ ఉండబోదని, బీసీ వర్గానికి చెందిన ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగించడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చిందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి లక్ష్మణ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటడంతో పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష బాధ్యతల్లో మార్పు చేయాలి. అయితే మరో సారి ఆయనకే చాన్సివ్వాలని, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేసులో ఉన్నా.. ఆయన వైపే మొగ్గు రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్కు వారసులు ఎవరనే దానిపై రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం కూడా దీనిపై లోతుగానే పరిశీలిస్తోంది. ఈ జాబితాలో లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన డీకే అరుణ, ఎంపీ బండి సంజయ్, సీనియర్ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, రాంచందర్రావు, యెండెల లక్ష్మీనారాయణ తదితరుల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. మరోవైపు తనకు ఏ బాధ్యతను అప్పగిస్తే ఆ పని చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అంటున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ను మారిస్తే డీకే అరుణ లేదా మురళీధర్రావును నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణలు, రాజకీయ నేపథ్యం, పార్టీలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో లక్ష్మణ్ వ్యవహరించిన తీరు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఆయననే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలను గెలిపించుకోవడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అటు విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇటు ఆర్టీసీ కార్మికులకు తోడు ఉండి పోరాటం చేయడం, ఆయన హయాంలోనే అనేక మంది నేతలు పార్టీలో చేరడం, జాతీయ నాయకత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండటం లాంటి అంశాలు ఆయనకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తానే ఓడిపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. మరో నేత డీకే అరుణ పేరును కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్గానే పరిగణించారు. మాజీ మంత్రిగా పనిచేసిన ఆమె.. కేసీఆర్ను గట్టిగా ఎదుర్కోగలరని, మహిళా నేత గా బలమైన సామాజిక వర్గానికి చెంది ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండటం, సొంతంగా కేడర్ను అభివృద్ధి చేసుకునే రాజకీయ చతురత తదితరల అంశాలను కూడా పార్టీ పరిశీలించింది. కానీ కాంగ్రెస్ నుంచి వచ్చి కొం తకాలమే కావడం ఆమెకు మైనస్గా మారిందనే చర్చ జరుగుతోంది. ఆమెను అధ్యక్షురాలిని చేస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పగ్గాలిచ్చారనే విమర్శ వస్తుందని యోచిస్తున్నట్లు తెలిసింది. మురళీధర్రావు ఎక్కడా తనంతట తాను అధ్యక్ష పదవి అడక్కపోయినా ఆయనకు కూడా బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరిగింది. జాతీ యస్థాయిలో మంచి గుర్తింపు ఉన్న ఆయనను ఓ రాష్ట్రానికి పరిమితం చేయడం సరైంది కాదని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఫిబ్రవరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. -
రెచ్చగొడుతూ..రాజకీయ పబ్బం
సాక్షి, హైదరాబాద్: మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ‘గృహ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. దిగజారుడు రాజకీయాలు తగవని సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. సీఏఏ,ఎన్ఆర్సీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న మజ్లీస్ పార్టీకి కొన్ని పార్టీలు వంత పాడుతున్నాయన్నారు. టీఆర్ఎస్ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ‘చట్టంలో కొన్ని తప్పులు ఉన్నాయని అంటున్నారు. ఎలాంటి తప్పులున్నాయో చెప్పితే కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. బంగ్లాదేశీయులు హైదరాబాద్ లో సభ పెట్టుకొని మహిళలను కొట్టినప్పుడు మజ్లీస్ పార్టీ ఎక్కడ పోయిందో ఒవైసీ సమాధానం చెప్పాలన్నారు. జాతీయ వాదులంతా ఏకమవుతున్నారని.. ఈ చట్టంపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. జిన్నాకు వారసుడిగా కొనసాగుతున్న ఒవైసీకి బుద్ధి చెబుతామని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
నూతన లక్ష్యాలను పెట్టుకోండి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులు, యువత కొత్త సంవత్సరంలో నూతన లక్ష్యాలను పెట్టుకోవాలని, ఆ లక్ష్యాలను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కష్టపడి పనిచేయాలని మంత్రి టి.హరీశ్రావు ఆకాంక్షించారు. నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆయన రాష్ట్ర ప్రజలకు మంగళవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలి: వినోద్కుమార్ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బి.వినోద్కుమార్ ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు శాంతితో జీవించాలని, అన్ని విధాలా వారికి మంచి జరగాలని ఓ ప్రకటనలో ఆయ న ఆకాంక్షించారు. గతేడాది కొన్ని దుర్ఘటనలు జరిగినా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలి: లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ అభిలషించారు. భారత్ను శక్తిమంతమైన దేశంగా రూపొందించడంలో ప్రజలంతా కృషి చేయాలని, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన కోరారు. ‘ఉల్లాసంగా జరుపుకోండి’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు డీజీపీ ఎం.మహేందర్రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను ప్రమాద రహితంగా జరుపుకోవాలని, పౌరుల భద్రతకై ఉద్దేశించిన ట్రాఫిక్ తదితర నిబంధనలను పాటించాలని ఆయన కోరారు. పోలీసులకు సహకరించి ఈ వేడుకలను ఉల్లాసంగా జరుపుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
‘సీఏఏ భారత పౌరులకు సంబంధించింది కాదు’
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు తట్టుకోలేక పౌరసత్వ సవరణ చట్టంపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందడంతో.. పలు రాజకీయ పార్టీలకు వేరే అంశాలు లేకపోవడంతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఏఏ, ఎన్నార్సీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు సీఏఏకు మతం రంగు పులిమి.. ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇది భారత పౌరులకు సంబంధించిన చట్టం కాదని అన్నారు. నాడు జిన్నా మెప్పు కోసం కాంగ్రెస్ తలోగ్గిందని లక్ష్మణ్ విమర్శించారు. ఆ రోజు కాంగ్రెస్ అలా చేయకపోతే.. నేడు ఈ చట్టం చేసే అవసరమే వచ్చేది కాదని చెప్పారు. గతంలో పాకిస్తాన్లో 23 శాతం ఉన్న హిందువులు.. నేడు 1 శాతానికి పరిమితమయ్యారని గుర్తుచేశారు. మోదీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఏఏపై విష బీజాలు నాటే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ భక్తులు ఈ బిల్లు సమర్థించండి : రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘నేడు దేశ భక్తులకు, దేశ ద్రోహులకు మధ్య సంఘర్షణ జరుగుతోంది. మేము ప్రధాని మోదీ ఏది చెబితే అది చేస్తాం. దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. దేశ ద్రోహులను దేశం నుంచి వెళ్లగొడతాం. రెండోసారి ప్రధాని అయ్యాక మోదీ ఆర్టికల్ 370ని రద్దుచేసి కశ్మీర్, దేశాన్ని కాపాడారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయి. భారతదేశంలోని ముస్లింలు ఇక్కడే ఉంటారు. ఇతర దేశాల్లో నివసించే భారతీయులను మన దేశానికి తీసుకురావాలని మోదీ సంకల్పించారు. దేశ భక్తులు సీఏఏను సమర్థించాలి’ అని పిలుపునిచ్చారు. -
ముగిసిన ఆర్ఎస్ఎస్ సమావేశాలు
-
దుర్జనులకు భయం సజ్జనులకు ప్రేమ
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ఇబ్రహీంపట్నం రూరల్: ‘మన శక్తిని చూస్తే దుర్జనులకు భయం కలుగుతోంది. సమాజ శ్రేయస్సు కోరే సజ్జనుల్లో ప్రేమ పుడుతుంది’అని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజంలో దేశ భక్తి పెంపొందించేలా పని చేయాలని కరసేవకు లకు పిలుపు నిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల మున్సి పాలిటీ పరిధిలోని మంగళ్ పల్లి వద్ద భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడు రోజులుగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లా డుతూ.. సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వమే ప్రధాన సాధనాలని పేర్కొన్నారు. ప్రవర్తన, భాష, సమాజహితం కోరే ఆలోచ నలు స్వయం సేవకులకు ముఖ్యమని, వాటి ని తెలియజేసే విధానం కార్య విస్తర ణలో కీలకమని, వీటిని ఎప్పుడూ విస్మరించ కూడ దని చెప్పారు. శిబిరం, సార్వజనికోత్స వం ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసిం చారు. ఇదే స్ఫూర్తితో స్వయం సేవకులు తమ కార్య క్షేత్రాల్లో పని చేయాలని ఆకాంక్షించారు. నేను చీఫ్ను కాదు..: ‘బయట నన్ను అందరూ ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటున్నారు. నేను మీకు చీఫ్ను కాదు. మీరు నియమించుకున్న వ్యక్తిని’అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దండాలు పెట్టడం, దండలు వేయడం, ఫొటో ఫ్లెక్సీలు పెట్టడం హిందూ సమాజ సంస్కృతి కాదని చెప్పారు. ఇతర సంఘాలకు, ఆర్ఎస్ఎస్కు తేడా ఉందని, మనకంటూ ప్రత్యేకత ఉండాలన్నారు. ఇక్కడ నేర్చుకున్న విషయాలతో సమాజాన్ని జాగృతం చేయాలని, హిందు సమాజ నిర్మాణానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిల భారతీయ సహసర్ కార్యవాహ్ ముకుందా, దక్షిణ మధ్య క్షేత్ర సంఘ చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ చాలక్ బూర్ల దక్షిణామూర్తి, క్షేత్ర ప్రచారక్ ఆలే శ్యామ్కుమార్, దూసి రామకృష్ణతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు డీకే ఆరుణ, విజయ రామారావు, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలసి భోజనం.. మోహన్ భాగవత్తో పాటు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులకు కూడా ఒకే రకమైన భోజనం వడ్డించారు. అందరూ సాధారణ కార్యకర్తలతో కలిసే భోజనం చేశారు. ఆహార పదార్థాలు వృథా కాకుండా ప్రతి ఒక్కరు భుజించడం ప్రత్యేకంగా కన్పించింది. కాగా, శిబిరం ముగింపు కార్యక్రమం వేదికపై మోహన్ భాగవత్తో పాటు దక్షిణ మధ్య క్షేత్ర సంఘ్చాలక్ నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణామూర్తి ఉన్నారు. అయితే మోహన్ భాగవత్ ఒక్కరే ప్రసంగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా.. మూడు రోజుల పాటు భారత్ కళాశాలలో సంఘ్ కార్యకర్తలు వసతి పొందారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన 7,940 స్వయం సేవకులు, మరో వెయ్యి మంది ప్రబంధకులు కలసిమెలసి ఉన్నారు. శిబిరం ముగియడంతో వారంతా తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. ఈ ప్రాంగణంలో జరిగిన అన్ని కార్యక్రమాలకు హాజరయ్యేందుకు చక్కటి నడవడిక, సమయ పాలన పాటించడాన్ని చూసి ఆహూతులు మంత్రముగ్ధులయ్యారు. విజయ సంకల్ప శిబిరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు -
కేసీఆర్ పాలన ‘పైన పటారం..లోన లొటారం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆర్థికమంత్రి ప్రమేయం లేకుండా ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్నారు. ‘సీఎం కేసీఆర్ తీరు ఆవు తోలు కప్పుకున్న పులిలా ఉందని’ వ్యాఖ్యానించారు. కడుపులో కత్తులు పెట్టుకుని.. నోట్లో చక్కెర పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పాలన ‘పైన పటారం..లోన లొటారం’ అనే రీతిలో ఉందన్నారు. ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. ఆరేళ్లలో 30వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారన్నారు. టీఎస్పీఎస్సీ ఉనికి తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదు..ఐఆర్ లేదని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. -
హైదరాబాద్ను బ్రాందీ నగరంగా మార్చారు
భువనగిరి అర్బన్: హైదరాబాద్ను రాష్ట్ర ప్రభుత్వం బ్రాందీ నగరంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారులో బీజేపీ జిల్లా కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంకారెడ్డి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తూ, మరోవైపు బార్లను తెచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామ్సుందర్రావు, రాష్ట్ర నాయకులు కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్రెడ్డి, పోతంశెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిర్మలా సీతారామన్ను కలిసిన లక్ష్మణ్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాను కలిసి తెలంగాణ సమస్యలను వివరించినట్లు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్హెచ్ 44ను పారిశ్రామిక కారిడార్గా ప్రకటించాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్రానికి ఐఐఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలని కోరినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసేవేస్తూ బార్లను తెరిచేందుకు కొత్త విధానం తీసుకువస్తున్నారని ఆయన మండిపడ్డారు. 12 వేల ప్రభుత్వ బడులను మూసివేస్తున్నారని ఆరోపించారు. ఇక కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు కొమ్ము కాస్తు.. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కారంటూ ఆయన ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాలలో 50శాతం ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీని మూసివేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రాథమిక హక్కులు, కరవు అవుతున్నాయని, హైకోర్టును, రాజ్యాంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
కాళేశ్వరానికి జాతీయ హోదా ఎలా ఇస్తారు?
సాక్షి, కొల్లాపూర్: డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని, దానికి జాతీయ హోదా ఎలా ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గాంధీ సంకల్పయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సోమశిల–సిద్దేశ్వరం వంతెనతో పాటు జాతీయ రహదారి నిర్మాణానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. -
రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : ఆధారాలు లేని ఆరోపణలు చేసి బీజేపీపై బురద చల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్ హెచ్చరించారు. రఫెల్ వ్యవహారంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పేదాకా దేశ ప్రజలు వదిలిపెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం, పాతాళంలో కూడా కాంగ్రెస్ అవినీతి ఉంటుందని, కాంగ్రెస్ ఒక బెయిల్ గాడీ అని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆలీబాబా దొంగల ముఠాలంటిదని, దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారని దుయ్యబట్టారు. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు రాహుల్ చిన్న పిల్లల మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని, రఫెల్పై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పడం కాదు, నోరు అదుపులో పెట్టుకోవాలని కోర్టు సూచించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయాలు నడవవని మండిపడ్డారు. దేశ భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తూంటే రాహుల్ మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, మోదీకి మంచి పేరు వస్తుందనే రఫెల్పై రివ్యూ పిటిషన్ వేశారని ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్కు బుద్ది చెప్పి మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ధర్నాలో లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్సీ రామచందర్రావు, పొంగులేటి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అక్కడ ఏం జరిగిందో.. ఇక్కడ హుజూర్నగర్ ఉప ఎన్నికలు కూడా అదే తరహాలో జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి రెండో రాజాధానిగా హైదరాబాద్ను చేసే విషయంపై పార్టీలో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ‘రాజధాని చర్చ అనేది ప్రజల మధ్య జరగాలి. ఒకవేళ చర్చ జరిగితే తప్పేం ఉంది? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయండంపై విద్యాసాగర్ రావు కొత్తగా ఏం చెప్పలేదని, కేంద్రపాలిత ప్రాంతం ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుస్థిర పాలనకు సీట్ల సంఖ్య పెరగాలని, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో రైతు బంధు రావడం లేదని, కేంద్రం ఇచ్చే రూ. 2000 వేలు మాత్రమే అందుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనించారని పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ సమస్య కేంద్రం పరిధిలో లేదని.. అది రాష్ట్ర పరిధిలోని అంశంమని లక్ష్మణ్ తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో కేంద్రం ఇంతవరకు జోక్యం చేసుకోలేదని, కేంద్రం దృష్టికి సమస్యను తాము తీసుకువెళ్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి ఐదేళ్లలో పథకాలు జోరుగా సాగాయి.. కానీ ఇప్పుడు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు.. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతాం’ అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని.. అయితే బీజేపీ అడ్డదారిలో వెళ్లదని రాజ్యాంగ బద్ధంగానే ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజలలో తిరుగుబాటు వస్తే.. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపెడతారని పేర్కొన్నారు. -
మిలియన్ మార్చ్కు మద్దతు ఇవ్వండి: అశ్వత్థామరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్కు మద్దతు కోరడంతోపాటు సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు బుధవారం బీజేపీ, టీజేఎస్ నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్రావు, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్యాంక్బండ్పై నిర్వహించే మిలియన్ మార్చ్కు మద్దతు ఇవ్వాలని బీజేపీ, టీజేఎస్ నేతలను కోరామన్నారు. ఉద్యోగులను కూడా కలుస్తున్నామని, పెన్డౌన్ చేయాలని కోరుతామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఒక్క శాతం మంది కూడా జాయిన్ కాలేదన్నారు. జాయిన్ అయిన వారు 300 మంది కూడా లేరని, చేరిన వారిలో డ్రైవర్లు, కండక్టర్లు 20 మంది కూడా లేరన్నారు. కార్మికులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటే కేంద్రం ఆమోదం అవసరమన్నారు. తమ డిమాండ్లలో విలీనం ఒక్కటే కాదని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలనే తదితర 26 రకాల డి మాండ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా డిమాండ్లపై చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని రకాలుగా బెదిరించినా కార్మికులు వెనక్కి తగ్గలేదన్నారు. కోకన్వీనర్లు వీఎస్రావు, సుధ మాట్లాడుతూ.. సీఎం గడువు పెట్టి డకౌట్ అయ్యారన్నారు. భయాందోళనకు గురికావద్దు మేడ్చల్ రూరల్: కార్మికులెవ్వరూ భయాందోళనకు గురికావద్దని, గట్టిగా నిలబడాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి సూ చించారు. బుధవారం మేడ్చల్లో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయ డం ఎవరి తరం కాదన్నారు. సీఎం కేసీఆర్ వాస్తవా లు గ్రహించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోదండరాం కోరారు. కాగా, మాజీ మంత్రి గీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ తదితరులు మేడ్చల్ డిపోలో ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. -
ఆర్టీసీ ‘మార్చ్’కు బీజేపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని, వారి పోరాటాలకు మద్దతు ఇస్తూనే బీజేపీ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మాజీ ఎంపీలు జి.వివేక్, జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డిలతో ఏర్పాటైన ఆ కమిటీ కార్యాచరణను రూపొందిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడు సార్లు డెడ్లైన్ విధించినా 300 మంది ఆర్టీసీ కార్మికులు కూడా జాయిన్ కాలేదన్నారు. సీఎం వారి ఆదరణను కోల్పోయారని, నైతికంగా సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం గమనిస్తోందని, ఏ సందర్భంలో ఏం చేయాలో అదే చేస్తుందని చెప్పారు. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలపై పదాధికారులు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించామని లక్ష్మణ్ తెలిపారు. నెలాఖరుకి పార్టీ మండల, జిల్లా కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని, డిసెంబర్లో రాష్ట్ర కమిటీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పారన్నారు. కార్యక్రమంలో ఎంపీ దర్మపురి అరవింద్, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి పాల్గొన్నారు. -
‘అలా అయితే ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఓకే’
ఢిల్లీ: కేంద్ర మోటారు వాహనాల చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడెలా అమలు చేస్తారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. బీజేపీ హైకమాండ్ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ కార్మికులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ ఆర్టీసీ సంస్థకు లాభం చేకూరిస్తే.. తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నారు. పోలీసులు తమ బాధ్యత విస్మరించి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. హిందూ మతాచారాలకు విరుద్ధంగా మఫ్టీలో పోలీసులు డ్రైవర్ బాబు శవాన్ని ఎత్తుకెళ్లారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలతో పుండు మీద కారం చల్లుతున్నారని విమర్శించారు. హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసినా.. ముఖ్యమంత్రి వాటిని పట్టించుకోవడం లేదని హేళన చేశారు. తెలంగాణలో పరిపాలన సంక్షోభంలో ఉందని, గవర్నర్ జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడినా కేసీఆర్కు సోయి లేదన్నారు. కోర్టుకు తప్పుడు నివేదికలు ఇచ్చి అధికారులు బలవుతున్నారని బాధ పడ్డారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాలు నిరుత్సాహపరిచినా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే తాము దృష్టి సారించామని అన్నారు. డెంగీ జ్వరాలు విజృంభిస్తున్న పట్టించుకోవడం లేదని.. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైతు బంధు, రుణ మాఫీ, నిరుద్యోగ భృతిని కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. -
ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లక్ష్మణ్ నివేదిక
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్కు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశాలు అందటంతో ఆయనకు శనివారం హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటికి 29వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన కలవనున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. అలాగే ఎంపీ బండి సంజయ్ విషయంలో పోలీసుల ఓవరాక్షన్పై బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు. తాజా పరిణామాలతో లక్ష్మణ్ వెంటనే ఢిల్లీ రావాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆయన ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు శనివారం ఉదయం కలిశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై లక్ష్మణ్తో చర్చించారు. మరోవైపు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి వీ హనుమంతరావు (కాంగ్రెస్), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), మోహన్ రెడ్డి (బీజేపీ) ఎంఎల్ పార్టీ నేత పోటు రంగారావు, ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి వీఎస్ రావు తదితరులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆర్టీసీ సమ్మె సహా మరో 30 అంశాల ఎజెండాపై చర్చించనుంది. ఆర్టీసీ సమ్మె 29 రోజులకు చేరిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. చదవండి: ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు?