విద్యుద్ఘాతంతో విద్యార్థి మృతి | student died with power shok in rangareddy distirict | Sakshi
Sakshi News home page

విద్యుద్ఘాతంతో విద్యార్థి మృతి

Mar 19 2015 10:46 AM | Updated on Nov 9 2018 5:02 PM

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అడవి పందుల నుంచి రక్షణ కోసం పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి ఓ విద్యార్థి బలైపోయాడు. ఈ ఘటన జిల్లాలోని కుల్కచర్ల మండలంలోని కుర్సపల్లి గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన రాజు (16) అనే విద్యార్ధి పొలాల సమీపంలోంచి వెళుతుండగా చేనుకు వేసిన కంచె తగిలింది. దీంతో రాజు విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు స్తానిక పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement