'చర్లపల్లి జైల్లో స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవం'
హైదరాబాద్:చర్లపల్లి జైలులో ఖైదీలకు స్వైన్ ఫ్లూ ఉన్నమాట అవాస్తవమని సూపరిండెంట్ కె.వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. తాము ఇప్పటికే 2 వేల మంది ఖైదీలకు స్వైన్ ఫ్లూ మందలు పంపిణీ చేశామన్నారు. స్వైన్ ఫ్లూ బారిన పడి ఓ ఖైదీ మృతి చెందడానే వార్తలను ఆయన ఖండించారు. మూడు రోజుల క్రితం మృతిచెందిన ఆ ఖైదీ స్వైన్ ఫ్లూ తో చనిపోలేదని.. గుండెపోటుతో మరణించాడని ఆయన తెలిపారు.