ఇజ్రాయెల్ లో జరగనున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ కు 8మంది తెలంగాణ ప్రతినిధుల బృందం హాజరుకానుంది.
హైదరాబాద్ : ఇజ్రాయెల్ లో జరగనున్న వ్యవసాయ ఎగ్జిబిషన్ కు 8మంది తెలంగాణ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు ఇజ్రాయెల్ లో వ్యవసాయ శాఖ అధికారులు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ప్రగతి శీల రైతుల వివాదంలో భాగంగా ఎమ్మెల్యేల పేర్లు చేర్చి విదేశీ పర్యటనకు తెలంగాణ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ కు రైతుల కోటాలో హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, గంగుల కమలాకర్, డి.మనోహర్ రెడ్డిలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.