
30న ఓటరు తుది జాబితా
రాష్ట్రంలోని 83 నియోజకవర్గాల్లో 2017 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన యువత తుది ఓటరు జాబితాను ఈనెల 30న విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు.
అర్బన్ ప్రాంతాల్లోని 36 నియోజకవర్గాల్లో బూత్లెవల్ ఆఫీసర్లతో ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఇంటింటా సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. దీంతో 1.10 కోట్ల ఓటర్ల తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ విధానాన్ని గతంలోనే ఆంధ్రప్రదేశ్లోని 28 నియోజకవర్గాల్లో పూర్తి చేశామన్నారు. ఇకనుంచి ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.