తాండూరు (రంగారెడ్డి): భర్త చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని మాల్కాపూర్ గ్రామానికి చెందిన అంతమ్మపై భర్త భీమయ్య ఆగస్టు 31న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.