దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
జోహన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో వెళుతున్న బస్సు శుక్రవారం ప్రమాదానికి గురైంది. దేశ రాజధాని ప్రిటోరియాకు 70 కిలోమీటర్ల (45 మైళ్ళు) దూరంలో ఉన్న బ్రోంకోర్సట్స్ రూట్ వెరేనా పట్టణాల మధ్య రహదారిపై మినీబస్ -ట్రక్కు గుద్దుకోవడంతో 20మంది చిన్నారులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగడంతో చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటనలో మరికొంత మంది విద్యార్థులు గాయపడ్డట్టు తెలుస్తోంది. పారామెడికల్ సిబ్బంది, అగ్రిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాతున్నాయని స్తానిక అధికారులు ఒక ప్రకటనలోతెలిపారు.