ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు | AAP Ved Prakash legislator shot at in Delhi | Sakshi

ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేపై కాల్పులు

Published Fri, Jul 17 2015 11:55 AM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

వేద ప్రకాశ్(ఫైల్) - Sakshi

వేద ప్రకాశ్(ఫైల్)

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

ఈశ్వర్ కాలనీలోని తన కార్యాలయం వెలుపలే వేద ప్రకాశ్ పై దుండగులు కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. బవానా నియోజకవర్గానికి వేద ప్రకాశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement