తీస్తా సెతల్వాద్ ఆఫీసులపై సీబీఐ దాడులు | CBI raids on the offices of Teesta setalvad | Sakshi
Sakshi News home page

తీస్తా సెతల్వాద్ ఆఫీసులపై సీబీఐ దాడులు

Published Wed, Jul 15 2015 1:01 AM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

తీస్తా సెతల్వాద్ ఆఫీసులపై సీబీఐ దాడులు - Sakshi

తీస్తా సెతల్వాద్ ఆఫీసులపై సీబీఐ దాడులు

ముంబై: కేంద్ర హోం శాఖ అనుమతి పొందకుండా  విదేశీ విరాళాలను స్వీకరించారంటూ.. గోద్రా అల్లర్ల బాధితుల తరఫున పోరాడుతున్న హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు చెందిన ఆఫీసులపై సీబీఐ దాడులు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆరు రోజుల కిందట కేసు నమోదుచేసిన సీబీఐ మంగళవారం సెతల్వాద్, ఆమె భర్త జావెద్ ఆనంద్‌కు చెందిన గులాం మొహమ్మద్ పెషిమామ్, సబ్‌రంగ్ కమ్యూనికేషన్, పబ్లిషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులపై దాడులు జరిపింది.

కేంద్రం అనుమతి లేకుండా సబ్‌రంగ్  ఫోర్డ్ ఫౌండేషన్(అమెరికా) నుంచి సుమారు రూ.1.8 కోట్లు విరాళంగా పొందినట్లు సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. తాము విచారణకు పూర్తిగా సహకరిస్తామని లేఖ రాసినప్పటికీ సీబీఐ ఇలా ఆకస్మిక దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందని సెతల్వాద్ ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement