హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 9 నుంచి మట్టి సత్యాగ్రహం చేపట్టనుంది. 9న ఏపీ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా అమరావతిలో సత్యాగ్రహాన్ని ప్రారంభించనుంది. నవంబర్ నెలాఖరువరకు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోని ముఖ్యపట్టణాల్లో యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 29న తిరుపతిలో ముగింపు సభ నిర్వహిస్తారు.