పాక్ తో చర్చల ప్రసక్తే లేదు! | No talks with Pakistan unless they stop terror, says Rajnath singh | Sakshi
Sakshi News home page

పాక్ తో చర్చల ప్రసక్తే లేదు!

Published Mon, Sep 1 2014 9:59 PM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

పాక్ తో చర్చల ప్రసక్తే లేదు!

పాక్ తో చర్చల ప్రసక్తే లేదు!

పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం స్పష్టంచేశారు.

న్యూఢిల్లీ పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి, హింసాకాండకు పాకిస్థాన్ స్వస్తి చెప్పనిదే ఆ దేశంతో చర్చలు జరపడం సాధ్యంకాదని ఆయన ప్రకటించారు. ఈ నెలలో నేపాల్‌లో జరగనున్నసార్క్ హోం మంత్రుల ఆరవ సమావేశం సందర్భంగా, నేపాల్ రాజధాని కాఠ్మండ్ లో పాక్ హోంమంత్రితో రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కాబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 

 

హింసకు , ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకూ ఆ దేశంతో ఎటువంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని, దీనిపై మీడియాలో వార్తల్లో వాస్తవం లేదని హోం శాఖ స్పష్టం చేసింది. సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ సింగ్ ఈ నెల 18, 19 తేదీల్లో నేపాల్ వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement