47మందితో ప్రయాణిస్తూ కూలిన విమానం! | PIA plane has gone missing | Sakshi
Sakshi News home page

47మందితో ప్రయాణిస్తూ కూలిన విమానం!

Published Wed, Dec 7 2016 6:07 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM

47మందితో ప్రయాణిస్తూ కూలిన విమానం!

47మందితో ప్రయాణిస్తూ కూలిన విమానం!

విమాన ప్రయాణమంటే రోజురోజుకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం కూలిపోయింది. ఈ విమానంలో 47 మంది ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-661 విమానం చిత్రాల్‌ నగరం నుంచి ఇస్తామాబాద్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో అబోటాబాద్‌ సమీపంలో రాడర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి.  

ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని హవేలియన్‌ పట్టణ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిపోయిన సమాచారం తెలియడంతో రక్షణ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో ప్రముఖ గాయకుడు, వ్యాపారవేత్త జునైద్‌ జంషెద్‌ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. విమానం కూలిన ప్రదేశంలో భారీగా మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారని పేర్కొంది.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement