రాజీవ్ హత్య కేసు దోషుల పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా | Supreme court reserves order on plea of death convicts in Rajiv Gandhi assassination case | Sakshi
Sakshi News home page

రాజీవ్ హత్య కేసు దోషుల పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా

Feb 5 2014 1:11 AM | Updated on Sep 2 2018 5:20 PM

రాజీవ్ హత్య కేసు దోషుల పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా - Sakshi

రాజీవ్ హత్య కేసు దోషుల పిటిషన్‌పై సుప్రీం తీర్పు వాయిదా

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు దోషులు తమ శిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం వాదనలు విని తీర్పును వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు దోషులు తమ శిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం వాదనలు విని తీర్పును వాయిదా వేసింది. సంతన్, మురుగన్, పెరివాలన్‌ల న్యాయవాది, శిక్ష మార్పును వ్యతిరేకిస్తున్న కేంద్రం తరఫున అటార్నీ జనరల్ జీఈ వాహనవతి  వాదనలు వినిపించారు. దోషుల క్షమాభిక్ష పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం నిర్హేతుకం కాదని, శిక్షను మార్చకూడదని వాహన్‌వతి వాదించగా ప్రభుత్వ జాప్యం వల్ల పిటిషర్లు బాధలు అనుభవించారని, కోర్టు వారి శిక్షను మార్చాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement