కశ్మీర్ లోయలో బుధవారం ఆర్మీ కాన్వాయ్పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పోలీసు మత్యువాత పడ్డారు.
ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి
శ్రీనగర్: కశ్మీర్ లోయలో బుధవారం ఆర్మీ కాన్వాయ్పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పోలీసు మత్యువాత పడ్డారు. మరో ఇద్దరు సైనికులు, ఓ పోలీసు గాయపడ్డారు. ఈ సంఘటన బారాముల్లా జిల్లాలోని ఖ్వాజాబాగ్లో చోటుచేసుకుంది. దుండగులను పట్టుకోవడానికి ఆపరేషన్ ప్రారంభించినా వారింకా దొరకలేదు.