ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం వేదిక
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. తొలుత భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 2 నుంచి 3.15 గంటల్లోపు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా 3,404 కిలోల బరువు కలిగిన జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ వాతావరణం అనుకూ లించకపోవడంతో ఒకరోజు వాయిదా వేశారు.
ఈ ఉపగ్రహంలో 24 సీ బాండ్ ట్రాన్స్ఫాండర్స్, 12 ఎక్సెంటెడ్ సీ బాండ్, 12 కేయూ బాండ్ ట్రాన్స్ఫాండర్స్, 2 కేయూ బీకాన్ బాండ్ ట్రాన్స్ ఫాండర్స్ను పంపిస్తున్నారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. ప్రయోగం నిమిత్తం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్, శాటిలైట్ డెరైక్టర్ సూర్యప్రకాశ్రావు ఫ్రాన్స్కు వెళ్లారు. ప్రయోగం పూర్తికాగానే బెంగళూరులోని హాసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని నియంత్రిస్తుంది.
జీశాట్-18 ఉపగ్రహంతో ఉపయోగాలు: దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని జీశాట్-18 అందుబాటులోకి తెస్తుంది. జీశాట్-18 ద్వారా అందుబాటు లోకి రానున్న 50 ట్రాన్స్ఫాండర్లతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో ప్రకటించింది.
రేపు జీశాట్-18 ప్రయోగం
Published Wed, Oct 5 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
Advertisement
Advertisement