space station
-
గ్లాసు వైన్ 5 లక్షల డాలర్లు!
అవున్నిజమే! మన రూపాయల్లో కోటి 24 లక్షల రూపాయల పైమాటే. అంత ఖరీదెందుకు, ఏమిటా వైన్ ప్రత్యేకత వంటి సందేహాలెన్నో వస్తున్నాయి కదా! ఆ వైన్ అంతరిక్ష కేంద్రంలో తయారవుతోంది మరి! ఇదంతా జపాన్కు చెందిన ప్రముఖ సేక్ (వైన్) బ్రాండ్ దస్సాయ్ తయారీ సంస్థ అసాహి షుజో ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది. ముడి పదార్థాలను ఏకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పంపించి అక్కడ పులియబెట్టాలని యోచిస్తోంది. ఇది విజయవంతమైన మీదట కేవలం 100 మి.లీ. వైన్ బాటిల్ను ఏకంగా రూ.5.53 కోట్లకు అమ్మనుంది. ఈ ప్రయోగానికి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి కంపెనీ భారీ మొత్తమే చెల్లించింది. ఈ ప్రాజెక్టును 2025లో లాంచ్ చేయనుంది. అంతరిక్షంలో పులియబెట్టేందుకు కావాల్సిన పరికరాల తయారీలో బిజీగా ఉంది. అయితే గురుత్వాకర్షణ ఉండని అంతరిక్ష కేంద్రంలో పులియడానికి కావాల్సిన కిణ్వ ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది చూడాలి. చంద్రుడే లక్ష్యంగా.. ప్రయోగం గనుక సక్సెసైతే ఇదే అతి ఖరీదైన పానీయం అవుతుందని అసాహి షుజో కంపెనీ బ్రూవర్ ప్రాజెక్ట్ ఇన్చార్జి సౌయా ఉట్సుకి చెప్పారు. ‘‘అయితే ఈ పరీక్ష 100% విజయవంతమవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే మా ప్రయత్నం వెనుక కేవలం ఘనత కోసం కాదు. అంతరిక్షంలో కిణ్వ ప్రక్రియ ఏ మేరకు జరుగుతుందన్న దానిపై మా కంపెనీ దృష్టి పెట్టింది. జరిగితే ఏదో ఒకనాడు చంద్రుడిపైనా వైన్ను పులియబెట్టడం మా కంపెనీ లక్ష్యం. మున్ముందు మనుషులు చంద్రుడిపైకి స్వేచ్ఛగా ప్రయాణించే రోజు రానుంది. పర్యాటకులు చంద్రునిపై ఆహ్లాదకరమైన క్షణాలను ఆస్వాదించాలన్నది మా ఉద్దేశం. అంతేగాక పులియబెట్టిన ఆహారాన్ని ఇష్టపడే భావి అంతరిక్ష పర్యాటకులకు కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. నాటో, మిసో వంటి జపనీస్ ఆహారాలు పులియబెట్టడం ద్వారానే తయారవుతాయి. ఏమిటీ సేక్? సేక్ ఒక రకమైన వైన్ లేదా సారాయి. జపనీస్ బియ్యం, నీరు, ఈస్ట్, కోజీ (ఒక రకమైన అచ్చు) తో తయారవుతుంది. నిర్దిష్ట సమయాల్లో పలు దశల్లో ఆవిరి పట్టడం, కదిలించడం, పులియబెట్టడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. అందుకు 2 నెలలు పడుతుంది. ఇది జపాన్ సాంస్కృతిక వారసత్వ పానీయంగా యునెస్కో గుర్తింపు పొందింది. సేక్ బ్రాండ్లలో దస్సాయ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. – వాషింగ్టన్ -
‘డ్రీమ్’ మిషన్ను లాంచ్ చేసిన చైనా
బీజింగ్: చైనా తన డ్రీమ్ మిషన్ అయిన షెంజౌ-19ను విజయవంతంగా ప్రయోగించింది. చైనాలోని జియూక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఈరోజు (బుధవారం)తెల్లవారు జామున 4.27 గంటలకు (చైనా కాలమానం ప్రకారం) ఈ మిషన్ ఆకాశంలోకి దూసుకెళ్లింది.ఈ మిషన్లో భాగంగా ఒక మహిళా స్పేస్ ప్లైట్ ఇంజనీర్తో సహా ముగ్గురు వ్యోమగాములు అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. షెంజౌ-19 నింగిలోకి దూసుకెళ్లిన పది నిమిషాల అనంతరం ఆ వ్యోమగాములతో కూడిన అంతరిక్ష నౌక రాకెట్ నుండి విడిపోయి దాని కక్ష్యలోకి ప్రవేశించింది. వ్యోమగాములంతా క్షేమంగా ఉన్నారని, ప్రయోగం విజయవంతమైందని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ వెల్లడించింది. Congratulations to the successful launch of #Shenzhou19 crewed spaceship🚀 and wish the 3 astronauts all the best! #SpaceChina pic.twitter.com/v26V0pAExK— CAI Run 蔡润 (@AmbCaiRun) October 29, 2024ఈ షెంజౌ-19లో మిషన్ కమాండర్ కై జుబేతో పాటు వ్యోమగాములు సాంగ్ లింగ్ డాంగ్, వాంగ్ హవోజ్ ఉన్నారు. కై జుబే ఎంతో అనుభవజ్ఞుడైన వ్యోమగామి. దీనికి ముందు ఆయన 2022లో షెంజౌ-14 మిషన్లో పాల్గొని అంతరిక్షంలో ప్రయాణించారు. వాంగ్ ప్రస్తుతం చైనాలో ఏకైక మహిళా అంతరిక్ష ఇంజనీర్గా పేరొందారు. ఆమె అంతరిక్ష యాత్రకు వెళ్లిన మూడో చైనా మహిళ అని స్పేస్ ఏజెన్సీ మీడియాకు తెలిపింది. ఇది కూడా చదవండి: మరింత దగ్గరైన పాక్- రష్యా.. సైనికాధికారుల భేటీలో వెల్లడి -
2033కల్లా రష్యా సొంత స్పేస్ స్టేషన్
మాస్కో: ఇంటర్నేషనల్ స్పేస్స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమైన రష్యా 2033నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోనుంది. ఈ విషయాన్ని రష్యాస్టేట్స్పేస్కార్పొరేషన్ (రోస్కోస్మోస్) మంగళవారం(జులై 23)ప్రకటించింది. రష్యా ఆర్బిటల్ స్టేషన్(రోస్) ఏర్పాటు షెడ్యూల్ను సంస్థ చీఫ్ యూరి బొరిసోవ్ ఆమోదించినట్లు తెలిపింది. రోస్ను నిర్మించాలని 2021లోనే నిర్ణయించినట్లు తెలిపింది. 2027లో తొలి రీసెర్చ్ ఇంధన మాడ్యూల్ను లాంచ్ చేస్తామని వెల్లడించింది. దీని తర్వాత 2030లో యూనివర్సల్ నోడల్, గేట్వే, బేస్లైన్ మాడ్యూల్స్ను నింగిలోకి పంపుతామని తెలిపింది. అనంతరం కీలకమైన స్పెషల్ పర్పస్ మాడ్యూళ్లు టీఎస్ఎమ్1, టీఎస్ఎమ్2లను 2033కల్లా స్టేషన్కు అనుసంధానిస్తామని రోస్కోస్మోస్ వెల్లడించింది. స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ కోసం సుమారు 7 బిలియన్ డాలర్ల వ్యయం చేస్తామని రోస్కోస్మోస్ తెలిపింది. 2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా, యూరప్లు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేస్తామని అప్పట్లో రష్యా హెచ్చరించింది. ఈ హెచ్చరికకు అమెరికా స్పందించకపోవడంతో ఐఎస్ఎస్ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకుంది. స్పేస్స్టేషన్లు వ్యోమగాములకు నింగిలో ఆశ్రయమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు దోహదపడతాయి. -
మన అంతరిక్ష కేంద్రంపై... ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష్య తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమ నౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ (ఓఐ)ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90 శాతానికి పైగా జనావాసాలనూ కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానం సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఐఎస్ఎస్ కక్ష్యే ఎందుకు? ఐఎస్ఎస్ భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో స్థిర కక్ష్యకు 51.6 డిగ్రీల వంపు కోణంలో పరిభ్రమిస్తుంది. బీఏఎస్ కోసం ఇస్రో దాదాపు అదే కోణాన్ని ఎంచుకోవడం దూరదృష్టితో కూడిన నిర్ణయమని చెబుతున్నారు. ఈ కోణంలో భూమిని అత్యంత విస్తృతంగా కవర్ చేయడం సులువవుతుంది. అంతేగాక ఐఎస్ఎస్ 2030 నాటికి పూర్తిగా తెరమరుగు కానుంది. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు సంబంధించి ఏర్పడే శూన్యాన్ని బీఏఎస్ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రానికి సులువుగా అనుసంధానమయేందుకు ఈ కోణం వీలు కలి్పస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘తద్వారా ఇంధన వాడకం తగ్గడమే గాక పనితీరుకు సంబంధించిన అనేకానేక సంక్లిష్టతలు తప్పుతాయి. దీనికి తోడు ఐఎస్ఎస్తో కమ్యూనికేషన్, ట్రాకింగ్ కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ఇస్రో యథాతథంగా వాడుకోగలుగుతుంది. కనుక మనకు వ్యయ ప్రయాసలు కూడా బాగా తగ్గిపోతాయి’’ అని ఇస్రో మాజీ ఇంజనీర్ మనీశ్ పురోహిత్ వివరించారు. అయితే బీఏఎస్ ఏర్పాటులో కీలకమైన 51.6 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ను సాధించడం సవాలే కానుందని ఆయన అభిప్రాయపడ్డారు. బీఏఎస్ కొన్ని విశేషాలు... → భారతీయ అంతరిక్ష స్టేషన్ అంతరిక్షంలో మన సొంత పరిశోధన కేంద్రం → ఐఎస్ఎస్ మాదిరిగానే ఇది కూడా భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు కానుంది → బీఏఎస్ ప్రస్తుతం డిజైన్ దశలో ఉంది → దీన్ని 2035కల్లా పూర్తిస్థాయిలో నిర్మించాలన్నది లక్ష్యం → బీఏఎస్ నమూనాను 2029 కల్లా ప్రయోగాత్మకంగా పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నీ రాక కోసం.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీత
సునీతా విలియమ్స్. పరిచయమే అవసరం లేని పేరు. భారత మూలాలున్న ఈ నాసా వ్యోమగామి మరో సహచరునితో కలిసి ఇటీవలే ముచ్చటగా మూడో అంతరిక్ష యాత్ర చేపట్టి మరోసారి వార్తల్లోకెక్కారు. తీరా అంతరిక్ష కేంద్రానికి చేరాక వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుబడిపోయి నెలకు పైగా రోజూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు. వ్యోమ నౌకకు నాసా తలపెట్టిన మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయి, సునీత ఎప్పుడు సురక్షితంగా తిరిగొస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి ఎప్పటికి తెర పడుతుందన్న దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు...ప్రపంచంలో అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత రోదసీ యాత్రలో సునీత భాగస్వామి అయ్యారు. సహచరుడు బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ ‘స్టార్లైనర్’ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అయితే యాత్ర సజావుగా సాగలేదు. ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ మొదలుకుని వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమే ఎట్టకేలకు జూన్ 6న స్టార్లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది.నిజానికి ఇది మానవసహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ (సీఎఫ్టీ). షెడ్యూల్ ప్రకారం సునీత, విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ 13న బయల్దేరి 14న భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ తదితరాలకు తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలుగా ఉంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో తమకు హడావుడేమీ లేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ స్పష్టం చేశారు. వారి భద్రతకే తొలి ప్రాధాన్యమని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ సమస్యలు ఏమిటి?⇒ స్టార్లైనర్ వ్యోమ నౌకలో ఏకంగా ఐదు చోట్ల హీలియం లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఇది పెను సమస్య. దీనివల్ల వ్యోమనౌక లోపలి భాగంలో అవసరమైన మేరకు ఒత్తిడిని మెయిన్టెయిన్ చేయడం కష్టమవుతుంది. నౌక పనితీరూ బాగా దెబ్బ తింటుంది. ⇒ దీంతోపాటు వ్యోమ నౌకలో కీలకమైన 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు. అవి ఉన్నట్టుండి పని చేయడం మానేశాయి. సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం 14 థ్రస్టర్లు సజావుగా పని చేయాలి.⇒ ప్రొపెల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిలైంది.⇒ వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని సాంకేతిక సమస్యలూ బయటపడ్డాయి. థ్రస్టర్లలో ప్రస్తుతానికి నాలుగింటిని రిపేర్ చేశారని, అవి సజావుగా పని చేస్తున్నాయని చెబుతున్నారు.⇒ ఈ సమస్యలను సరి చేసేందుకు బోయింగ్ బృందం నాసాతో కలిసి పని చేస్తోంది. నెవెడాలో అచ్చం ఐఎస్ఎస్ తరహా పరిస్థితులను సృష్టించి స్టార్లైనర్లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు. ఇది తుది దశలో ఉన్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి...బోయింగ్ స్టార్లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉండగలదు. అది జూన్ 6న అక్కడికి చేరింది. ఆ లెక్కన జూలై 22 దాకా సమయముంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే? సునీత, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయి. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా, లేదంటే రష్యా సూయజ్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకురావచ్చు.ఐఎస్ఎస్లోనే మకాంసునీత, విల్మోర్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్లోనే సురక్షితంగా ఉన్నారు. సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు, ప్రయోగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న ఏడుగురుతో కలిసి ఐఎస్ఎస్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు.నేను, మీ సునీతను...!అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న సునీతా విలియమ్స్ తమ తాజా అంతరిక్ష యాత్ర గురించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30కు ఈ కార్యక్రమం ఉంటుంది. నాసా టీవీ, నాసా యాప్, సంస్థ వెబ్సైట్తో పాటు యూట్యూబ్లో దీన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
అంతరిక్ష నడకల్లో చైనా రికార్డు
బీజింగ్: అంతరిక్ష పరిశోధనల్లో చైనా దూసుకెళ్తోంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్వాక్లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్ఎస్) ‘తియాన్గాంగ్’లో షెన్జౌ–18 మిషన్లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు యె గాంగ్ఫు, లీ కాంగ్, లీ గాంగ్సూ దాదాపు 6.5 గంటలపాటు స్పేస్వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచి్చ, శూన్య వాతావరణంలో విహరించడమే స్పేస్వాక్. సీఎస్ఎస్ అప్లికేషన్, డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్వాక్ అని చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపారు. సంబంధిత వీడియోలను విడుదల చేశారు. ఇందులో వ్యోమగామి లీ కాంగ్ తెల్లరంగు స్పేస్ సూట్ ధరించి చేసిన తొలి స్పేస్ వాక్ కనిపిస్తోంది. లీ కాంగ్ వెనుక భూగోళం స్పష్టంగా దర్శనమిస్తోంది. షెన్జౌ–18 మిషన్లో ఇది రెండో స్పేస్వాక్. ఇదే మిషన్లో మే 28వ తేదీన వ్యోమగాములు 8.5 గంటలపాటు స్పేస్వాక్ నిర్వహించారు. చైనా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సుదీర్ఘకాలం జరిగిన స్పేస్వాక్ ఇదే కావడం విశేషం. సీఎస్ఎస్ నుంచి మొట్టమొదటి అంతరిక్ష నడక 2021 జూలై నెలలో జరిగింది. షెన్జౌ–12 మిషన్ వ్యోమగాములు 7 గంటలపాటు స్పేస్వాక్ చేశారు. షెన్జౌ–13 మిషన్లో మొట్టమొదటిసారిగా ఓ మహిళా వ్యోమగామి స్పేస్వాక్లో పాల్గొన్నారు. షెన్జౌ–14 మిషన్ అస్ట్రోనాట్స్ మూడు స్పేస్వాక్లు నిర్వహించారు. షెన్జౌ–15 మిషన్లో భాగంగా ఒకే వ్యోమగామి ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్పేస్వాక్లు చేశారు. ప్రస్తుతం షెన్జౌ–18 మిషన్ కొనసాగుతోంది. మరికొన్ని స్పేస్వాక్లు చేసే, కొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. భూదిగువ కక్ష్యలో పరిశోధనల విషయంలో చైనా ముందంజలో ఉంది. స్పేస్వాక్లు సునాయాసంగా చేయడం అనేది సాంకేతిక నైపుణ్యాలను నిరూపించుకోవడంతోపాటు భవిష్యత్తులో మరిన్ని సంక్లిష్టమైన అంతరిక్ష పరిశోధనలకు నాంది అని చెప్పొచ్చు. -
Isro: భారత్ స్పేస్ స్టేషన్.. ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన
చండీగఢ్: భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక విషయం వెల్లడించారు. భారత స్పేస్ స్టేషన్ ప్రాథమిక వెర్షన్ 2028లో నింగిలోకి వెళుతుందని తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘భారత్ స్పేస్ స్టేషన్కు సంబంధించి వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తాం. స్పేస్ స్టేషన్ బేసిక్ మోడల్ను 2028లో కక్ష్యలోకి పంపి 2035కల్లా దానికి పూర్తిస్థాయి రూపు తీసుకువస్తాం. స్పేస్ స్టేషన్ క్రూ కమాండ్ మాడ్యూల్, నివాస మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్, డాకింగ్ పోర్ట్ అనే విభాగాలు కలిగి ఉంటుంది. ఈ మొత్తం స్టేషన్ 25 టన్నుల బరువు ఉంటుంది. అవసరమైతే తర్వాత దీనిని విస్తరిస్తాం. స్పేస్ స్టేషన్ ద్వారా మైక్రో గ్రావిటీ పరిశోధనలు చేస్తాం’ అని సోమనాథ్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు నింగిలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) మాత్రమే ఉంది. దీనిని అమెరికా, కెనడా, జపాన్, యూరప్ సంయుక్తంగా నిర్మించాయి. 1984నుంచి 1993 మధ్య ఐఎస్ఎస్ను డిజైన్ చేశారు. ఇదీచదవండి.. అయోధ్య వాతావరణం.. ఐఎండీ ప్రత్యేక వెబ్పేజీ -
2040నాటికి చంద్రునిపైకి వ్యోమగామి..సరికొత్త లక్ష్యాలతో భారత్
న్యూఢిల్లీ: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను (చంద్రయాన్-3) ల్యాండ్ చేసిన తొలి దేశంగా అవతరించిన ఇండియా అంతరిక్షం, పరిశోధనలు విషయంలో మరింత వేగం పెంచింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ సరికొత్త వ్యూహంతో దూసుకుపోనుంది. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగామిని పంపే లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేశారని కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ గగన్యాన్ మిషన్ పురోగతి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఒక ఉన్నత స్థాయి సమావేశాశం జరిగింది. ఈ సందర్బంగా మోదీ భవిష్యత్తు రోదసి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రానికి ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి సంబంధించిన ప్రణాళికలతో సహా సరికొత్త వ్యూహంతో సాగాలని ఆదేశించారు. సొంత 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (ఇండియన్ స్పేస్ స్టేషన్) ఏర్పాటుతోపాటు చంద్రునిపైకి తొలి భారతీయుడిని పంపడం లాంటి సరికొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించు కోవాలని ఆయన కోరారు. అలాగే వీనస్,అంగారక గ్రహాలకు సంబంధించిన మిషన్లపై పనిచేయాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇస్రో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న స్పేస్ డిపార్ట్మెంట్ భారత భావి చంద్ర మిషన్ల కోసం రోడ్మ్యాప్ను అభివృద్ధి చేయాలని తదుపరి తరం లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)అభివృద్ధి, రిటర్న్ మిషన్లను చేపట్టడానికి సన్నద్ధం కావాలని ప్రధాని శాస్త్రవేత్తలకు సూచించారు. కొత్త లాంచ్ ప్యాడ్, మానవ-కేంద్రీకృత ప్రయోగశాలలు, అనుబంధ సాంకేతికతలను ఏర్పాటు చేయాలన్నారు. కాగా ఇస్రో ఆధ్వర్యంలో చంద్రయాన్-3 సక్సెస్ తరువాత ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్నిచేపట్టింది. ఈ మిషన్లోపీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు గగన్యాన్ మిషన్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన మానవ అంతరిక్ష యాత్రకు సంబంధించిన తొలి మానవరహిత విమాన టెస్టింగ్ ఈనెల(అక్టోబర్) 21న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరగనుంది. గగన్యాన్ ప్రాజెక్ట్ అనేది మానవ అంతరిక్ష యాత్రల నిర్వహణలో భారతదేశ సామర్థ్యానికి నిదర్శనంగా నిలవనుంది. ఈ మూడు రోజుల మిషన్లో 400 కి.మీ కక్ష్యలో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షయాత్ర చేయనున్నారు. కాగా గగన్యాన్ మిషన్ మనుషులను సురక్షితంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి మానవ రేటింగ్ పొందిన ప్రయోగ వాహనం. ఇది అంతరిక్షంలోని వ్యోమగాములకు భూమి తరహా పర్యావరణాన్ని అందించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, అత్యవసర ఎస్కేప్ సదుపాయంతోపాటు పలు క్లిష్టమైన సాంకేతికతలను అభివృద్ధి చేయనుంది. మానవ అంతరిక్ష విమాన మిషన్ ప్రయోగంలో ముందుగా మిషన్ సాంకేతిక సంసిద్ధత స్థాయిలను ప్రదర్శించనున్నామని అంతరిక్ష సంస్థ తెలిపింది. ఈ డెమోన్స్ట్రేటర్ మిషన్లలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ), ప్యాడ్ అబార్ట్ టెస్ట్ (పీఏటీ) టెస్ట్ వెహికల్ (టీవీ) విమానాలు ఉన్నాయి. టీవీ-డీ1 పరీక్ష వాహనం ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన ఏక దశ లిక్విడ్ రాకెట్. పేలోడ్లలో క్రూ మాడ్యూల్ (సీఎం), క్రూ ఎస్కేప్ సిస్టమ్లు (సీఈఎస్) వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్లతో పాటు సీఎం ఫెయిరింగ్ (సీఎంఎప్), ఇంటర్ఫేస్ అడాప్టర్లు ఉంటాయి. ఈ ఫ్లైట్ గగన్యాన్ మిషన్లో మాదిరి మ్యాక్ నంబర్ 1.2కి అనుగుణంగా ఆరోహణ పథంలో అబార్ట్ స్థితిని అనుసరిస్తుంది. సిఎంతో కూడిన సీఇఎస్ పరీక్ష వాహనం నుండి సుమారు 17 కి.మీ ఎత్తులో వేరు అవుతుంది. తదనంతరం అబార్ట్ సీక్వెన్స్ స్వయంప్రతిపత్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. అప్పడు సీఈఎస్ని వేరు చేయడం, పారాచూట్ల శ్రేణిని మోహరించడం మొదలవుతుంది చివరకు శ్రీహరికోట తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో సురక్షిత టచ్డౌన్తో ప్రయోగం ముగుస్తుంది’అని అంతరిక్ష సంస్థ వెల్లడించింది. TV-D1 Flight Test: The test is scheduled for October 21, 2023, at 0800 Hrs. IST from the First launchpad at SDSC-SHAR, Sriharikota. It will be a short-duration mission and the visibility from the Launch View Gallery (LVG) will be limited. Students and the Public can witness… pic.twitter.com/MROzlmPjRa — ISRO (@isro) October 17, 2023 -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్బాట్ చాట్జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పునరుత్పత్తి’ అధ్యయనానికి...అంతరిక్షంలోకి కోతులు
బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాన్ని డ్రాగన్ దేశం చైనా చేస్తోంది. గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా? అసలు అంతరిక్షంలో సంభోగం సాధ్యమేనా? అనేది తెలుసుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇందుకోసం కోతులను అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షిస్తోంది. చైనా సొంతంగా ‘తియాంగాంగ్’ పేరిట స్పేస్ స్టేషన్ను నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్లోని వెంటియన్ మాడ్యుల్లోకి కోతులను పంపించనున్నారు. గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేనిచోట వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. భార రహిత స్థితిలో వాటి మధ్య సంభోగం, ఆడ కోతుల్లో పునరుత్పత్తి జరుగుతాయో లేదో తెలుసుకుంటారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలు ఏర్పాటు చేసుకొనే దిశగా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో కోతుల పునరుత్పత్తిపై చైనా చేస్తున్న ప్రయోగాల ఫలితాలు కీలకంగా మారుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ప్రస్తుతం భూమి నుంచి 388.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇందులోని వెంటియన్ మాడ్యుల్లో ప్రస్తుతం ఆల్గే, చేపలు, నత్తలు వంటి చిన్న జీవులు జీవించడానికి అవకాశం ఉంది. కానీ, అవసరమైతే పెద్ద జీవులకు తగ్గట్లుగా పరిణామం పెంచుకొనేలా మాడ్యూల్ను డిజైన్ చేశారు. స్పేస్ స్టేషన్లోకి కోతులను పంపించగానే సరిపోదు, వాటికి ఆహారం అందజేయడం, ఆరోగ్యాన్ని కాపాడడం, వాటి వ్యర్థాలను నిర్వీర్యం చేయడం పెద్ద సవాలేనని చెప్పొచ్చు. -
చైనా ఎంత పనిచేసింది.. పలు దేశాల్లో విమానాశ్రయాలు బంద్!
డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన భారీ రాకెట్ శిథిలాలు నియంత్రణ కోల్పోయి భూమిపైకి వేగంగా దూసుకొస్తున్నాయి. కాగా, చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ (సీజెడ్-5బీ) అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం, నియంత్రణ కోల్పోవడంతో రాకెట్ శిథిలాలు భూమిపై పడనున్నాయి. ఈ నేపథ్యంలో స్పెయిన్లోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. వివరాల ప్రకారం.. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్ను లాంగ్ మార్చ్ 5బీ ద్వారా పంపించారు. ఈ క్రమంలో లాంగ్ మార్చ్ నియంత్రణ కోల్పోవడంతో రాకెట్ శిథిలాలు.. అట్లాంటిక్ మహా సముద్రంలో కూలవచ్చని యూరోపియన్ యూనియన్ స్పేస్ సర్వైలెన్స్ అండ్ ట్రాకింగ్ సర్వీస్ అంచనా వేసింది. ఇందులో భాగంగానే ఉత్తర స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఇటలీలో కూడా రాకెట్ శిథిలాలు కూలే ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో అప్రమత్తమైన స్పెయిన్.. దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేసింది. దీంతో, టార్రాగోనా, ఇబిజా, రియస్లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, ఫ్రాన్స్లోని మార్సెయిల్ విమానాశ్రయంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. విమానాల బంద్ కావడంతో యూరప్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రాకెట్లోని కొన్ని భాగాలు శుక్రవారం, మరి కొన్ని భాగాలు శనివారం భూమిపై పడే అవకాశం ఉంది. Parece que esto iba en serio, fijaros como se ha vaciado el espacio aéreo en la trayectoria de reentrada del #CZ5B. Reflexión: ¿Nadie pondrá límites y exigirá a las agencias espaciales desorbitar estas fases monstruosas de cohete (éste de 17,5 Tm!) de manera controlada? pic.twitter.com/oHzBp6KefN — Dr. Josep M. Trigo ⭐🎗#PlanetaryDefense #DART HERA (@Josep_Trigo) November 4, 2022 -
భూమిపైకి 23 టన్నుల రాకెట్ శకలాలు.. ఎక్కడ పడతాయో తెలియదు!
సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోన్న చైనా.. అందుకోసం రాకెట్లను పంపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలోకి చేరుకున్న ఓ భారీ రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయి. ఈ వారాంతంలోనే భూమిని తాకనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొత్త తియాంగాంగ్ స్పేష్ స్టేషన్ కోసం మూడో మోడ్యూల్ను పంపించేందుకు 23 టన్నుల లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ను అంతరిక్షంలోకి ఇటీవలే ప్రయోగంచింది చైనా. ఆ రాకెట్కు చెందిన 23 టన్నుల బరువుండే శకలాలు ఈ వారాంతంలోనే భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఈ శిథిలాల వల్ల మానవాళికి ఏర్పడే ప్రమాదంపై అంచనా వేస్తున్నారు. అవి ఎక్కడ పడనున్నాయనే విషయం స్పష్టంగా తెలియదని హెచ్చరిస్తున్నారు. ఈ రాకెట్ భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపైకి తిరిగి ప్రవేశిస్తుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం నుంచి మొదలై శనివారమంతా కొనసాగుతుంది. సుమారు 10 అంతస్తుల పెద్ద భవన అంత పెద్దగా ఉండే ఈ రాకెట్ భూవాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోతుంది. మిగిలిన కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు.. దీని వల్ల కొంత ప్రమాదం ఉండొచ్చని ఏరోస్పేస్ కార్పొరేషన్ చెబుతోంది. 88శాతం ప్రపంచ జనాభా నివసించే ప్రాంతాల్లో ఇవి పడే అవకాశముందట. అయితే శకలాల్లో చాలా వరకు జనసాంద్రత తక్కువ ఉండే ప్రదేశాలు.. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం ఉండటంతో ముప్పు కాస్త తగ్గొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. తీవ్ర ఉద్రిక్తత, జపాన్, సౌత్ కొరియా అలర్ట్ -
భారత్కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
India celebrates its Independence Day not world But Space Well: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్ వ్యోమోగామి రాజా చారి ట్విట్టర్లో విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. రాజా చారి ఇటీవల ఐఎస్ఎస్లో ఆరునెలల మిషన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ చేసిన స్పేఎక్స్ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమోగాములలో అతను కూడా ఉన్నారు. ఈ మేరకు చారి ట్విట్టర్లో.... " భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటునమ్నాను. వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతుంది. యూఎస్లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుంది. తాను యూఎస్లోని ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్ నగర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రోఫెసర్గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత చారీ అక్కడే యూఎస్లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో జన్మించాడు. అయోవాలోని వాటర్లూలో కొలంబస్ హై స్కూల్ నుంచి ప్రాధమిక విద్యను, కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశడు. ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజా చారి 2017లో వ్యోమోగామిగా ఎంపికయ్యాడు. On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6 — Raja Chari (@Astro_Raja) August 14, 2022 (చదవండి: భారత్తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
ల్యాబ్ మాడ్యూల్లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు
బీజింగ్: భూ కక్ష్యలో చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోకి ఆ దేశ వ్యోమగాములు అడుగుపెట్టారు. ఆదివారం ప్రయోగించిన వెంటియాన్ అనే ల్యాబ్ మాడ్యూల్ కక్ష్యలోకి చేరుకుని సోమవారం ఉదయం అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా అనుసంధానం అయింది. దీంతో మొట్టమొదటి సారిగా నిర్మాణంలో ఉన్న తమ ‘టియాన్గాంగ్’ అంతరిక్ష కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములు అడుగుపెట్టారు. వీరు అక్కడ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయనున్నారని అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. -
ఎలన్ మస్క్పై దుమ్మెతిపోస్తున్న చైనా పౌరులు! ఎందుకంటే..
Chinese Citizens Slam Musk Online After Space Station Near Misses: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ను చైనా పౌరులు ఆన్లైన్లో దుమ్మెతిపోస్తున్నారు. తీవ్ర పదజాలంతో మస్క్పై చైనా దేశస్తులు విరుచుకుపడుతున్నారు. కారణం ఇదే..! ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ ఇంటెర్నెట్ సేవలను అందించేందుకు స్టార్లింక్ ప్రొగ్రాంను ఎలన్ మస్క్ ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థతో సుమారు 42 వేలకుపైగా స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫాల్కన్ రాకెట్ ద్వారా ఇప్పటికే 18 వందలకు పైగా స్టార్లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపింది. దశలవారీగా స్టార్లింక్ శాటిలైట్లను స్పేస్ ఎక్స్ పంపుతోంది. కాగా ఈ మిషన్లో భాగంగా 2021లో జూలై 1 నుంచి అక్టోబర్ 21 సమయంలో స్టార్లింక్ శాటిలైట్స్ చైనా స్పేస్ స్టేషన్కు ప్రమాదాన్ని గురిచేసే అవకాశం ఏర్పడిందని చైనా అంతరిక్ష సంస్థ సోమవారం డిసెంబర్ 27న యూఎన్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అలర్ట్గా ఉండడంతో చైనా స్పేస్ స్టేషన్ కక్ష్యను కాస్త జరపడంతో పెద్ద ముప్పు నుంచి తృటిలో తప్పిందని పేర్కొంది. యూఎన్కు చైనా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పడే వెలుగులోకి వచ్చింది. దీంతో చైనా పౌరులు స్పేస్ ఎక్స్ అధినేతపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. రానున్న రోజుల్లో చైనా స్పేస్ స్టేషన్ టియాన్హేలోని మూడు మాడ్యూళ్లలో అతిపెద్దదైన టియాన్హేను ప్రయోగాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభించింది. 2022 చివరి నాటికి స్టేషన్ పూర్తవుతుందని చైనా ప్రకటించింది. అమెరికన్ స్పేస్ వార్ఫేర్..! చైనా చేసిన వ్యాఖ్యలపై స్పేస్ ఎక్స్ స్పందించలేదు. సోమవారం చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ విబోలో చైనా పౌరులు ఎలన్ మస్క్ ప్రయోగిస్తోన్న స్టార్లింక్ ఉపగ్రహాలను అంతరిక్ష వ్యర్థాల కుప్పతో పోల్చుతున్నారు. ఇంకొంతమందైతే..."అమెరికన్ స్పేస్ వార్ఫేర్ ఆయుధాలు" అని అభివర్ణించారు. చదవండి: అంతరిక్షంలోకి యువరాజ్సింగ్ బ్యాట్..! తొలి వ్యక్తిగా యువీ రికార్డు..! -
స్కైలాబ్ మీదపడుతుందని భయపడి చచ్చారు..! అందరి గుండెలో దడ పుట్టించిన స్కైలాబ్..!
స్కైలాబ్ ఈ పేరు ప్రస్తుతం 50 సంవత్సరాలు పైబడినవారికి గుర్తుండే ఉంటుంది. 1970 దశకం చివర్లో స్కైలాబ్ సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. నాసా ప్రయోగించిన అంతరిక్ష స్టేషన్ ఎప్పుడు భూమ్మీద పడిపోతుందో అంటూ కొన్ని దేశాలకి చెందిన ప్రజలు కొన్నాళ్లపాటు బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారు. కొంతమందైతే ఇదే మనకు చివరిరోజు అని భావించి విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. అదే నేపథ్యంలో స్కైలాబ్ మూవీతో యువ దర్శకుడు విశ్వక్ ఖండేరావు ముందుకువచ్చిన విషయం తెలిసిందే..అది రీల్ స్కైలాబ్ అయితే రియల్ స్కైలాబ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం... రష్యాకు పోటీగా..! 1960-1970 మధ్యకాలంలో అమెరికా-రష్యా మధ్య స్పేస్ను జయించాలనే తీవ్రమైన పోటీ ఉండేది. స్పేస్ టెక్నాలజీలో రష్యా ఒక అడుగు ముందుకేసి 1971లో సెల్యూట్ వన్ అనే స్పేస్ స్టేషన్ను అంతరిక్షంలోకి పంపింది. ఈ స్పేస్ స్టేషన్ హక్కులు కేవలం రష్యాకు మాత్రమే ఉండేవి. వేరే ఇతర దేశాలకు లేవు. దీంతో అమెరికా కూడా ఎలాగైనా తమకు సొంత స్టేషన్ ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. వాటితో బయోకెమికిల్ రిసెర్చ్, సూర్యుడిపై పరిశోధనలు అనేక ఇతర టెస్ట్లను చేయడానికి స్కైలాబ్ ఉపయోగించి చేయవచ్చునని అమెరికా భావించింది. మిల్లీ మీటర్ సైజ్ శకలం కొంపముంచింది 1973 మే 14 రోజున సాట్రన్వీ అనే రాకెట్ ద్వారా స్కైలాబ్ను నాసా అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగం లాంచ్ చేసిన సమయంలో నాసాకు చెడు సంఘటన ఎదురైంది. అదేంటంటే ఎర్త్ వాతావరణంలోని ఒక మిల్లీ మీటర్ సైజ్లో ఉండే ఒక శకలం స్కైలాబ్ స్పేస్ స్టేషన్ను ఢీ కొట్టింది. దీంతో స్కైలాబ్ హిట్ షేల్, సోలార్ ప్యానెల్ దెబ్బతింది. స్కైలాబ్ ఆర్బిట్లోకి చేరాక..స్పేస్ స్టేషన్ దెబ్బతిందని నాసా గుర్తించింది. తీవ్రమైన సౌరవేడి నుంచి స్కైలాబ్కు రక్షణ లేకుండా పోయింది. అదే నెలలో మే 25 రోజున స్కైలాబ్-2 మిషన్ ద్వారా ఆస్ట్రోనాట్స్ బృందాన్ని పంపింది. స్పేస్ స్టేషన్కు వెళ్లిన మొదటి సిబ్బంది ప్రత్యామ్నాయ హీట్ షేడ్ను ఏర్పాటుచేసి, సోలార్ ప్యానెల్ను సరిచేశారు.వ్యోమగాములు ఇక్కడ 28 రోజులు స్కైలాబ్ స్పేస్ స్టేషన్లో గడిపారు. తరువాతి స్కైలాబ్ -3 మిషన్ లో క్రూ 59 రోజులు ఉండగా, నవంబర్లో మరో సిబ్బంది 84 రోజులు స్కైలాబ్ స్టేషన్లో ఉన్నారు. సమస్య అక్కడ మొదలైంది..! స్కైలాబ్ స్పేస్స్టేషన్కు రెండు రకాల గైరోస్కోప్స్ ఉన్నాయి. మొదటిది కంట్రోల్ మూమెంట్. ఇది స్పేస్ స్టేషన్ మూవ్ చేయడానికి ఉపయోగపడుతోంది. రెండోది రేట్ గైరోస్కోప్. స్పేస్ స్టేషన్ ఏ రేట్తో కదులుతుందే అనే విషయాన్ని చెప్తుంది. వీటిలో కంట్రోల్ మూమెంట్ గైరోస్కోప్ పనిచేయడం ఆగిపోయింది. ఈ విషయాన్ని నాసా 1975లో గుర్తించింది. ఆ సమయంలో స్కైలాబ్ భూమి నుంచి 433 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అయితే వాతావారణ సాంద్రత, గ్రావిటీ, ఆయా వస్తువు ద్రవ్యరాశి కారణంగా 430 కిమీ కక్ష్యలో తిరిగే ఏ వస్తువైనా కొద్దికొద్దిగా భూమిపైకి వచ్చే అవకాశం ఉంది. నాసా అంచనా ప్రకారం 1980 వరకు కక్ష్యలో ఉంటుందని భావించింది. ఇంకా స్కైలాబ్లో ఒక ఏడాదికి సరిపోయే పుడ్, ఆక్సిజన్ ఉన్నాయి. మరికొన్ని పరికరాలను యాడ్ చేసి మరో ఐదు సంవత్సరాల మేర స్కైలాబ్ను ఉంచాలని నాసా భావించగా...మెల్లమెల్లగా స్కైలాబ్ తన కక్ష్యను కోల్పోతూ వచ్చింది. వెంటాడిన దురదృష్టం..! ఎలాగైనా స్కైలాబ్ను తిరిగి యథాస్థానంలో ఉంచాలనుకున్న నాసా చర్యలకు సోలార్ ఫ్లేర్ అడ్డంకిగా మారింది. సోలార్ ఫ్లేర్స్తో వాతావరణంలో డెన్సిటీ పెరిగింది. దీంతో 1980లో వస్తోందనకున్న ఉపద్రవం 1979లో రానుందని నాసా గ్రహించింది. ఇక చేసేదేమి లేక స్కైలాబ్ భూమిపై పడనుందని అమెరికా అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఎక్కడ పడుతుందనే విషయం ఎవరికీ తెలియదు. లక్ష వరకు ప్రాణాలు పోయే అవకాశం..! స్కైలాబ్ ఎక్కువ శాతం 1979లో జులై 10 నుంచి జులై 14లోపు సౌతాఫ్రికాకు వెయ్యి కిలోమీటర్ల సమీపంలో సముద్రంలో పడుతోందని నాసా అంచనా వేసింది. భారత కాలమాన ప్రకారం...1979 జులై 11 న రాత్రి భూమి వైపుగా రావడం మొదలుపెట్టింది. స్కైలాబ్ భూ వాతావరణంలోకి రాగనే వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో పడే అవకాశం ఉందని నాసా తెలిపింది. సుమారు 2 వేల ముక్కలుగా స్కైలాబ్ భాగాలు విడిపోతాయని పేర్కొంది. స్కైలాబ్ ఒకవేళ జనవాసాల మీద పడితే లక్షకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందని నాసా హెచ్చరించింది. అది కాస్త 5000కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ మహాసముద్రంలో పడగా..మిగతావి వెస్ట్రన్ ఆస్ట్రేలియా పడ్డాయి. ఆస్ట్రేలియాలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఒక్కసారిగా ప్రపంచదేశాలు ఊపిరిపిల్చుకున్నాయి. మిల్లీమీటర్ సైజులో ఉన్న ఒక చిన్న అంతరిక్ష శకలం..స్కైలాబ్కు తాకడంతో భారీ ప్రమాదాన్నే కొనితెచ్చింది. అప్పటినుంచి నాసా అంతరిక్ష ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. స్కైలాబ్ కనిపెట్టినవి..! ఆ సమయంలో అంత ఎత్తున వ్యోమగాములు మరమ్మతులు చేయడం అదే తొలిసారి. సౌర తుఫాన్కు సంబంధించిన విషయాలను స్కైలాబ్ అందించింది. స్పేస్లో మానవుడు ఎలా ఉండాలో తదితర విషయాలు మొదటిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లో గ్రావిటీ వంటి విషయాలను కూడా తెలుసుకోవడంలో ఉపయోగపడింది. చదవండి: టెస్లా ఎంట్రీపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..! -
మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమైన జెఫ్ బెజోస్..!
జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ అంతరిక్ష రంగంలో సంచలన విజయాలను సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూఆరిజిన్ రెండు అంతరిక్షయాత్రలను విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా మరో మహత్తర ప్రయోగాన్ని లాంచ్ చేసేందుకు జెఫ్ బెజోస్ సంస్థ బ్లూఆరిజిన్ సంస్థ సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ స్టేషన్ను నిర్మించాలని బ్లూ ఆరిజిన్ భావిస్తోంది. బ్లూ ఆరిజిన్ ‘ ఆర్బిటల్ రీఫ్’ అనే స్పేస్ స్టేషన్ను వచ్చే పదేళ్లలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: చరిత్ర తిరగ రాసిన టెస్లా కంపెనీ 2025- 2030 మధ్య కాలంలో ఆర్మిటల్ రీఫ్ స్పేస్ స్టేషన్ను బ్లూ ఆరిజిన్ నిర్మించనుంది. ఈ స్పేస్ స్టేషన్లో సుమారు 10 మంది ఉండేట్లుగా నిర్మాణం చేపట్టనున్నారు. ఆర్బిటల్ రీఫ్ను బ్లూఆరిజిన్ సంస్ధ పలు సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనుంది. ఇందులో సియెర్రా స్పేస్ జాయింట్ వెంచర్, బోయింగ్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ సహయంతో ఈ స్పేస్ స్టేషన్ను నిర్మించనునున్నారు. అంతరిక్ష పర్యాటకులకు అతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని ఆర్బిటల్ రీఫ్ కలిగి ఉంది. ఆర్బిటల్ రీఫ్ను నిర్మాణం కోసం కంపెనీ తన న్యూ గ్లెన్ రాకెట్ను ఉపయోగించాలని యోచిస్తోంది. స్పేస్ స్టేషన్ యుటిలిటీ సిస్టమ్లు, కోర్ మాడ్యూల్లను కూడా అందిస్తుంది. అంతరిక్ష పర్యాటకంపై కన్ను..! అంతరిక్ష పర్యాటకం రంగంపై జెఫ్బెజోస్ కన్నేశాడు. ఏకంగా అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ను నిర్మించడంతో ఎక్కువ మేర అంతరిక్ష ప్రయాణాలను చేపట్టే అవకాశం ఉంటుందని జెఫ్ బెజోస్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. చదవండి: Elon Musk: అది ప్రజల క్రిప్టోకరెన్సీ ..! అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా..! -
చైనా దూకుడు.. ఏలియన్ల కోసమే!
అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ఎజెండాతో ముందుకు వెళ్తుంటే.. చైనా మాత్రం డిఫరెంట్ పంథాలో నడుస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యాలు మాత్రం స్పేస్ టూరిజంలో ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసమే అంతరిక్ష ప్రయోగాలు చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో మరో అరుదైన ఘట్టానికి చైనా వేదికైంది. ముగ్గురు వ్యోమగాములతో చైనా రాకెట్ నింగికెగసింది. అయితే ఇది ఇతర గ్రహా ప్రయోగం కాదు. చైనా భారీ ఖర్చుతో నిర్మించిన సొంత స్పేస్ స్టేషన్ కోసం. భారతకాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 2 ఎఫ్ రాకెట్ లాంఛ్ అయ్యింది. మొత్తం ముగ్గురు (షెంజావు 13 స్పేస్షిప్) వ్యోమగాములు ఆరు నెలలపాటు చైనా నిర్మించిన టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో గడపనున్నారు. ఇప్పటిదాకా చైనా చేపట్టిన సుదీర్గ అంతరిక్ష ప్రయోగం ఇదే. టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్లో ఎక్విప్మెంట్ను సెటప్ చేయడంతో పాటు టెక్నాలజీని పరీక్షించడానికి వీళ్లు బయలుదేరారు. తద్వారా ఏలియన్ల కోసం పరిశోధనను ముమ్మరం చేయనున్నారు. 2008లో చైనా తరపున స్పేస్ వాక్ చేసిన జాయ్ ఇఝ్గ్యాంగ్ తాజా మిషన్కు నాయకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాకి ఇది రెండో అధికారిక స్పేస్ యాత్ర. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం చైనా అతిపెద్ద సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: నటుడి అరుదైన రికార్డు -
చైనా పెను సంచలనం
సంచలనానికి చైనా సిద్ధపడింది. సొంత స్పేస్ స్టేషన్ ‘టియాన్గోంగ్’ ద్వారా అరుదైన ప్రయత్నానికి సిద్ధపడింది. త్వరలో ప్రారంభం కానున్న(పూర్తి స్థాయిలో) ఈ స్పేస్ స్టేషన్ ద్వారా ఒకేసారి వెయ్యి ప్రయోగాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో క్యాన్సర్కి ‘స్పేస్ ట్రీట్మెంట్’ సంబంధిత ప్రయోగాలు కూడా ఉండడం విశేషం. బీజింగ్: మెడికల్ రీసెర్చ్, సాంకేతిక అధ్యయనాలతో పాటుగా వెయ్యి ప్రయోగాలను అదీ ఒకేసారి స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ స్టేషన్లో నిర్వహించాలని చూస్తోంది. భూమి నుంచి 388.9 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ స్పేస్ ఏజెన్సీలోకి ఇంటర్నేషనల్ స్పేష్ ఏజెన్సీ(ఐఎస్ఎస్), రష్యా స్పేస్ ఏజెన్సీ మిర్ లాగా ఇతర దేశాల స్పేస్ సైంటిస్టులకు అనుమతి ఇవ్వకూడాదని నిర్ణయించుకుంది. మైక్రోగ్రావిటీ ప్రయోగాలు ఇక స్పేస్ స్టేషన్ ద్వారా ప్రయోగాలకు డిఫరెంట్ మాడ్యూల్స్ను(ఇప్పటికే మూడు ఉన్నాయి) ఏర్పాటు చేయబోతోంది డ్రాగన్ కంట్రీ. నేచర్ కథనం ప్రకారం.. హై ఎనర్జీ కాస్మిక్ రేడియేషన్ను గుర్తించడానికి 1-2బిలియన్ల యువాన్లను(దాదాపు 310 బిలియన్ డాలర్లు)దాకా ఖర్చు చేయబోతోంది. తద్వారా కాస్మిక్ కిరణాలు, చీకటి సంబంధిత అధ్యయనాలను సులువుగా కొనసాగించనుంది. అంతరిక్షంలో చికిత్స? స్పేస్ క్రోగ్రావిటీలో క్యాన్సర్ మీద కూడా అధ్యయనం చేపట్టాలని చైనా నిర్ణయించుకుంది. త్రీడీ బ్లాబ్స్ను పంపడం ద్వారా ఆరోగ్యవంతమైన వాటితో పాటు క్యాన్సర్ కణజాలాల మీద ఏకకాలంలో ప్రయోగాలు నిర్వహించనుంది. తద్వారా.. తక్కువ గ్రావిటీ వాతావరణంలో(అంతరిక్షంలో) క్యాన్సర్ కణాల పెరుగుదల నెమ్మదించడమో లేదంటే పూర్తిగా ఆగిపోవడమో నిర్ధారించుకునే దిశగా ప్రయోగాలు చేయనుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే.. The China Manned Space Agency ‘అంతరిక్ష వైద్యానికి బీజం వేయనుంది. అంటే క్యాన్సర్ పేషెంట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి చికిత్స అందించడమో లేదంటే అక్కడ తయారు చేసిన మందుల్ని ఉపయోగించడమో(భూ వాతావరణానికి తగ్గట్లు పనిచేసే విధంగా) ద్వారా సంచలనానికి తెర తీయాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ‘వ్యోమగాముల ఆరోగ్యం కోసం’ అనే హింట్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తుల్లో క్యాన్సర్ పేషెంట్లకు స్పేస్ ట్రీట్మెంట్ అందించే ఆలోచన చేస్తున్నట్లు డ్రాగన్ కంట్రీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు గ్లోబల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రెండు స్పేస్ ల్యాబ్లు స్పేస్ స్టేషన్లో కొత్తగా రెండు ల్యాబ్లను ప్రారంభించాలని చైనా భావిస్తోంది. అయితే ఐఎస్ఎస్ లాగా కాకుండా.. ఒకేసారి వంద మంది చేరుకునే ప్రయోగానికి రెడీ అయ్యింది. ఇంకా చాలా ప్రయోగాలు అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయని, చైనా ఆస్ట్రోఫిజిస్ట్ జాంగ్ షువాంగ్ నాన్ ‘నేచర్’తో వ్యాఖ్యానించాడు. వీటిలో చాలావరకు(తొమ్మిది ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు కలిపి) ఇతర దేశాల సహకారంతోనూ నిర్వహించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు 40 దేశాల నుంచి అభ్యర్థనలు రాగా.. అమెరికా-రష్యాలతో పోటీపడి నిలబడేందుకు చైనాకు మంచి అవకాశమే దొరికినట్లయ్యింది. -
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
ఛాలెంజ్ నెగ్గిన నాసా.. ‘స్పేస్’లో మిరపకాయలు?
అంతరిక్షంలో నివాస యోగ్యత గురించి పరిశోధనలు-ప్రయోగాలు ఎన్నేళ్లు సాగుతాయో చెప్పడం కష్టంగా ఉంది. అయితే విశ్వంలోని కొన్ని మర్మాలను చేధించడం, అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మరో అడుగు ముందుకు వేసింది. స్పేస్ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది. 15,000 వేలకోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మిరపకాయల్ని పండిస్తోంది నాసా. మెక్సికన్ రకానికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరప గింజలు ఈ జూన్లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్ కిమ్బ్రాగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు. కిచెన్ ఓవెన్ సైజులో ఉండే ‘సైన్స్ క్యారియర్’ అనే డివైజ్లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన, సంక్లిష్టమైన పరిశోధనగా అభివర్ణించుకుంటోంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు, దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్గా తీసుకున్న నాసా.. సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన, రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు ‘స్పైసీ’ ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది. 🌶️ Chile peppers are spicing up the @Space_Station! Recently, @astro_kimbrough added water to NASA’s Plant Habitat-04 experiment. In less than 4⃣ months, @NASA_Astronauts will pick their first harvest. Follow along as these space peppers kick up the heat: https://t.co/KpCVpd850U pic.twitter.com/KS3qvRoz22 — NASA's Kennedy Space Center (@NASAKennedy) July 14, 2021 -
చైనా అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాములు
బీజింగ్/జియుక్వాన్: అగ్రరాజ్యాలకు దీటుగా అంతరిక్షంలో పాగా వేయడమే లక్ష్యంగా చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చైనా ముగ్గురు వ్యోమగాములను నిర్మాణంలో ఉన్న తమ స్పేస్ స్టేషన్లోని కోర్ మాడ్యూల్ ‘తియాన్హే’లోకి విజయవంతంగా పంపించింది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 9.22 గంటలకు షెన్జౌ–12 అంతరిక్ష నౌక ముగ్గురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. 6.50 గంటల పాటు నిరాటంకంగా ప్రయాణించి, మధ్యాహ్నం 3.54 గంటలకు కోర్ మాడ్యూల్ను చేరుకుంది. ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అక్కడే ఉంటారు. స్పేస్స్టేషన్ నిర్మాణంలో పాలుపంచుకుంటారు. భూగోళంపై తమ నిఘా నేత్రంగా భావిస్తున్న సొంత స్పేస్స్టేషన్ను వచ్చే ఏడాదికల్లా సిద్ధం చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. కోర్ మాడ్యూల్ తియాన్హేను ఈ ఏడాది ఏప్రిల్ 29న చైనా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చైనాలో ఆర్బిట్ స్పేస్స్టేషన్ను నిర్మిస్తోంది. -
అంతరిక్ష ప్రయోగాలు.. చైనా మరో ముందడుగు
బీజింగ్: అంతరిక్షంలో పాగా వేయాలని భావిస్తున్న చైనా ఆ దిశగా తన ప్రయత్నాలను ముమ్మర చేస్తుంది. ఇప్పటికే స్పేస్స్టేషన్ నిర్మాణం తలపెట్టని చైనా మరో ముందడుగు వేసింది. నిర్మాణంలో ఉన్న స్పేస్స్టేషన్లోకి ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్తున్న అంతరిక్ష నౌకను గురువారం ప్రయోగించింది. ఈ ముగ్గురిని టియాంగాంగ్ స్టేషన్ నుంచి లాంగ్ మార్చి -2 ఎఫ్ రాకెట్ ద్వారా స్పేస్ స్టేషన్లోకి పంపించారు. అక్కడ వారు మూడు నెలలు గడుపుతారు. చైనా గోబి ఎడారిలో ప్రయోగించిన ఈ రాకెట్ గురువారం ఉదయం 9.22 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. చైనా తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్న స్పేస్ స్టేషన్ పూర్తి చేసే క్రమంలో షెన్జౌ -12.. 11 మిషన్లలో మూడవది. వీటిలో నాలుగు బృందాలు ఉంటాయి. మూడు మాడ్యూళ్ళలో మొదటిది, అతిపెద్దది అయిన టియాన్హే ప్రారంభించడంతో ఏప్రిల్లో స్పేస్ స్టేషన్ నిర్మాణం ప్రారంభమైంది. వ్యోమగాములు నీ హైషెంగ్(56), లియు బోమింగ్(54), టాంగ్ హాంగ్బో(45), భవిష్యత్ అంతరిక్ష కేంద్ర నివాస గృహమైన టియాన్హేలో మూడు నెలలు పని చేయవలసి ఉంటుంది. చైనా షెన్జౌ -12 అంతరిక్ష నౌక ఏప్రిల్ 29 న భూమికి 340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని టియాన్హె ప్రధాన విభాగంతో డాక్ అవుతుంది. మాడ్యుల్లో ప్రతి దానికి ప్రత్యేక లివింగ్ స్పేస్, వ్యాయామం కోసం ట్రెడ్మిల్, గ్రౌండ్ కంట్రోల్తో ఈమెయిల్, వీడియో కాల్ల కోసం కమ్యూనికేషన్ సెంటర్ సదుపాయం ఉంది. మిషన్ కోసం తయారు కావడానికి, సిబ్బంది 6,000 గంటలకు పైగా శిక్షణ పొందారు. చైనా అంతరిక్ష సంస్థ వచ్చే ఏడాది చివరి వరకు మొత్తం 11 ప్రయోగాలను ప్లాన్ చేస్తోంది, వీటిలో మరో మూడు మిషిన్లలో మనుషులను తీసుకెళ్లనున్నారు. ఇవి 70 టన్నుల స్టేషన్ను విస్తరించడానికి రెండు ల్యాబ్ మాడ్యూళ్లను, సిబ్బందిని తీసుకెళ్తాయి. వీరు ఆన్బోర్డ్లో వ్యవస్థలను పరీక్షించి, స్పేస్ వాక్ను నిర్వహిస్తారు, శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. చదవండి: అంతరిక్షంపై డ్రాగన్ నజర్...! -
అంగారకుడిపై ‘జురోంగ్’ తొలి అడుగులు
బీజింగ్: అంగారక గ్రహం ఉపరితలంపై జీవం మనుగడకు గల పరిస్థితులను అన్వేషించేందుకు డ్రాగన్ దేశం చైనా తొలిసారిగా ప్రయోగించిన జురోంగ్ రోవర్ తన విధులు నిర్వర్తించేందుకు రంగం సిద్ధమయ్యింది. శనివారం ల్యాండర్ నుంచి జురోంగ్ విజయవంతంగా బయటకు అడుగుపెట్టింది. ఆరు చక్రాలున్న ఈ రోవర్ బరువు 240 కిలోలు. సౌర శక్తితో పని చేస్తుంది. ల్యాండర్ నుంచి నెమ్మదిగా కిందికి దిగి, మార్స్పై ఇసుక నేలలో పాదం మోపినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. అరుణ గ్రహంపై పరిశోధనల కోసం చైనా 2020 జూలై 23న టియాన్వెన్–1న మిషన్కు శ్రీకారం చుట్టింది. ఇందులో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ల్యాండర్ ఈ నెల 15న మార్స్పై దిగింది. జురోంగ్ రోవర్ మూడు నెలలపాటు పని చేయనుంది. -
క్రూ– 3 లేడీ ఇలా వచ్చి అలా వెళ్తోంది
స్పేస్ ఎక్స్ ‘క్రూ–3’ మిషన్కు నాసా మహిళా వ్యోమగామి కేలా బ్యారన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆఖరి దశ నిర్మాణంలో ఉన్న ‘డ్రాగన్’ అనే వ్యోమనౌకలో కేలా, మరో ముగ్గురు పురుష వ్యోమగాములు వచ్చే అక్టోబర్ 23 న అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి బయల్దేరి వెళ్తారు. అక్కడ కనీసం ఆరు నెలల పాటు పరిశోధనలు జరిపి భూమిని చేరుకుంటారు. ‘క్రూ–3’ కి కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్. నిన్న గాక మొన్న నాసాలోకి వచ్చిన కేలా తన ప్రతిభతో స్పేస్లోకి స్పేస్ సంపాదించారు! ‘నాసా’ ప్రభుత్వానిదైతే, ‘స్పేస్ ఎక్స్’ ప్రైవేటు సంస్థ. నాసా వాషింగ్టన్లో ఉంటే, స్పేస్ ఎక్స్ కాలిఫోర్నియాలో ఉంటుంది. రెండిటి పనీ అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష ప్రయాణాలు. స్పేస్ ఎక్స్కి ఇప్పటివరకైతే సొంత వ్యోమగాములు లేరు. నాసా నుంచి, లేదంటే మరో దేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి సుశిక్షితులైన వ్యోమగాములను తీసుకుంటుంది. ఎలాన్ మస్క్ అనే బిలియనీర్ స్థాపించిన సంస్థ స్పేస్ ఎక్స్. మార్స్లోకి మనిషిని పంపేందుకు ప్రయోగాత్మకంగా స్పేస్ ఎక్స్ వేస్తున్న మెట్లే ఈ స్పేస్ షటిల్స్. ఆ మెట్లలోని మూడో మెట్టే ‘క్రూ–3’. ఇందులో నాసా నుంచి కేలా, రాజాచారి (మిషన్ కమాండర్), టామ్ మార్ష్బర్న్ (మిషన్ పైలట్), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మథియాస్ మారర్ (మిషన్ స్పెషలిస్ట్ 1) ఉంటారు. కేలా బ్యారన్.. మిషన్ స్పెషలిస్ట్ 2. స్పేస్ ఎక్స్ ఇలా మార్స్కి ఎన్ని మెట్లు కట్టుకుంటూ వెళుతుంది? తెలియదు! మార్స్లోకి మనిషిని పంపి, మెల్లిగా మార్స్లో మానవ కాలనీలను నిర్మించే ధ్యేయంతోనే ఎలాన్ మస్క్ 2002 లో ఈ సంస్థను నెలకొల్పారు. వ్యోమగాములతో అతడు వేయించే ప్రతి అడుగు, గమ్యమూ చివరికి అంగారక గ్రహమే. వాస్తవానికి స్పేస్ ఎక్స్ వల్ల నాసాకు ఖర్చు, భారం తగ్గాయి. పరిశోధనలకు సమయమూ కలిసివస్తోంది. అందుకే స్పేస్ ఎక్స్కి సహాయపడుతోంది. అంతే తప్ప తనకు పోటీ అనుకోవడం లేదు. ∙∙ ఇప్పటికి స్పేస్ ఎక్స్ పంపిన రెండు ‘క్రూ’ మిషన్లలోనూ ఒక్కో మహిళా వ్యోమగామి ఉన్నారు. వారిద్దరి కన్నా వయసులో చిన్న.. ఇప్పుడు ‘క్రూ–3’లో సభ్యురాలిగా ఉన్న కేలా బ్యారన్. ‘క్రూ–1’లో అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగామి షానన్ వాకర్ వయసు 55. ‘క్రూ–2’లో వెళ్లిన మహిళ మెగాన్ మెకార్తర్ వయసు 49 ఏళ్లు. కేలా బ్యారెన్ వయసు 33 ఏళ్లు. షానన్ వాకర్ భూమి మీదకు తిరిగి వచ్చేశారు. మెగాన్ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నారు. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లబోతున్న కేలా బ్యారన్ వాషింగ్టన్లో పుట్టారు. యు.ఎస్. నేవల్ అకాడమీలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివారు. తర్వాత ఇంగ్లండ్ వెళ్లి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం యుద్ధ నౌకల్ని కమాండ్ చేసే సబ్మెరైన్ ఆఫీసర్గా శిక్షణ తీసుకున్నారు. యు.ఎస్.ఎస్. మెనీలో డివిజన్ ఆఫీసర్గా, నేవల్ అకాడమీలో సూపరింటెండెంట్గా పని చేశారు. 2017లో నాసాకు ఎంపిక అయ్యారు. వ్యోమగామి గా రెండేళ్లు శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడీ స్పేస్ ఎక్స్ ప్రయాణానికి అవకాశం పొందారు. మిషన్ ఆఫీసర్గా ఆమె అంతరిక్షంలో ఉన్నంత కాలం కమాండర్, పైలట్, మరొక మిషన్ స్పెషలిస్టుతో అనుసంధానం అయి ఉండాలి. క్రూ యాక్టివిటీ ప్లానింగ్, పర్యవేక్షణ ఆమె విధులే. ఇక ప్రయోగాలు ఎలాగూ ఉంటాయి. వ్యోమగామిగా నాసా శిక్షణలో ఉన్నప్పుడు కేలా బ్యారన్ -
చైనా తీరుపై మండిపడ్డ నాసా..!
వాషింగ్టన్: ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన చైనా రాకెట్ భారీ శకలం ఆదివారం తెల్లవారుజామున మాల్దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో కూలిన విషయం తెలిసిందే. రాకెటు శకలాలు సముద్రంలో కూలడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాగా చైనా తీరుపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీవ్రంగా మండిపడింది. చైనా అంతరిక్ష శకలాల విషయంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిందని అంతేకాకుండా అంతరిక్ష ప్రయోగ ప్రమాణాలను పాటించడంలో చైనా ఘోరంగా విఫలమైందని పేర్కొంది. చైనా అతిపెద్ద రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ నియంత్రణ కోల్పోయి సముద్రంలో కూలిపోయిన కొద్దిసేపటికే నాసా స్పందించింది. చైనా స్పేస్ ప్రోగ్రామ్పై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ.. అంతరిక్ష ప్రయోగాలపై చైనా అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.అంతరిక్ష ప్రయోగాలను చేసే దేశాలు కచ్చితంగా స్పేస్ డెబ్రిస్(శకలాలు)పై బాధ్యతవహించాలని తెలిపారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించిన శకలాలు నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, భూమిపై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. చైనా ప్రయోగించే అంతరిక్ష ప్రయోగాలపై పారదర్శకత ఉండేలా చూసుకొవాలని సూచించారు. అంతరిక్షంలో పాగా వేసేందుకు చైనా సొంత స్పేస్స్టేషన్ కోసం ఏప్రిల్ 29 రోజున లాంగ్ మార్చ్ 5బి రాకెటును ఉపయోగించి టియాన్హే మ్యాడుల్ను అంతరిక్షంలోకి పంపింది. మ్యాడుల్కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని వచ్చింది. చదవండి: అంతరిక్షంపై డ్రాగన్ నజర్...! -
తప్పిన ముప్పు: హిందూ మహాసముద్రంలో రాకెట్ శకలాలు
న్యూఢిల్లీ: ఇటీవల చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5-బీ రాకెట్ ముప్పు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా అని టెన్షన్ పెట్టిన చైనా రాకెట్ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. భూ వాతావరణంలోకి రాగానే రాకెట్ శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి. అవి పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో నేలకూలినట్లు నిర్ధారించారు. ఈ రాకెట్ శకలాలు సముద్రంలో కూలడం కంటే ముందే దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్ 29న చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ అనే భారీ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ పడతాయని అందరూ టెన్షన్ పడిన సంగతి తెలిసిందే. అమెరికా మిలిటరీ మాత్రం.. ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలాలు పూర్తిగా బూడిద అయిపోతాయిని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలాలు తుర్కిమెనిస్తాన్లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతాయిని చెప్పాయి. కానీ చివరికి హిందూ మహా సముద్రంలో ఆ రాకెట్ శకలాలు పడిపోవటం గమనార్హం. ( చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా ) -
దూసుకొస్తున్న చైనా రాకెట్.. ‘లాంగ్’ క్రాష్ జరగనుందా?
చైనాలోని హైనన్ ద్వీపం నుంచి ఏప్రిల్ 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భారీ శకలం ఒకటి భూమిని ఢీకొట్టనుందా?. చైనాకు చెందిన అంతరిక్ష పరిశోధనశాల భాగాలు పంపేందుకు ఈ రాకెట్ను ప్రయోగించారు. తిరిగి భూమిపైకి వచ్చే సమయంలో ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆ శకలం పూర్తిగా బూడిద అయిపోతుందని, జనావాసాలపై పడే అవకాశాలు చాలా తక్కువ అని ఎక్కువమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా మిలిటరీ మాత్రం.. ఆ శకలం తుర్కిమెనిస్తాన్ లో భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు పడుతుందని అంటోంది. ఇలా జనావాసాలపై ఈ రాకెట్ పడితే.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. చైనా మాత్రం వాతావరణంలో వేడికి అది పూర్తిగా కరిగిపోతుందని.. ఒకవేళ పడినా చిన్న ముక్కలే మిగులుతాయని.. వీటి వల్ల పెద్దగా నష్టం కూడా జరగదు అని వాదిస్తోంది. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) -
దూసుకొస్తున్న భారీ శకలం.. భూమిపై ఎక్కడ పడనుందో తెలుసా...!
అంతరిక్షంలో పాగా వేసేందుకు చైనా సొంత స్పేస్స్టేషన్ కోసం ఏప్రిల్ 29 రోజున లాంగ్ మార్చ్ 5బి రాకెటును ఉపయోగించి టియాన్హే మ్యాడుల్ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని వస్తోంది. ఈ రాకెట్ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు. అంతరిక్షం నుంచి రాకెట్లు శకలాలు తరుచూ భూమిపైకి దూసుకొస్తుంటాయి. అవి భూవాతావరణంలోకి వస్తుండగా కొన్నిశకలాలు పూర్తిగా గాలిలోనే మండిపోతాయి. భారీ సైజులో ఉండే రాకెటు శకలాలు కొన్ని భూమిపై పడి కొంత నష్టాన్ని మిగుల్చుతాయి. చైనా ప్రయోగించిన టియాన్హే మ్యాడుల్ రాకెట్ శకలం సుమారు 20000 కేజీల బరువును, 30 మీటర్ల పొడవును కలిగి ఉంది. కాగా ఈ రాకెట్ భూమిపై పడితే చాలా వరకు ఆస్తి, ప్రాణ నష్టాన్నికలిగిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. రాకెట్ శకలాలు భారత కాలమాన ప్రకారం మే 8న రాత్రి 7.30 నుంచి మే 10 తారీఖున అర్ధరాత్రి 1.00 గంటల మధ్య పడే అవకాశముందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం రాకెట్ ఉత్తర అమెరికా, దక్షిణ ఐరోపా, చైనా గుండా 41.5 డిగ్రీల అక్షాంశాలకు ఉత్తరంగా, 41.5 డిగ్రీల అక్షాంశాలకు దక్షిణంగా ఉన్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రాకెట్ అంతర్జాతీయ జలాల్లో పడుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. చదవండి: అంతరిక్షంపై డ్రాగన్ నజర్...! -
చైనా నిర్వాకం: ప్రపంచం నెత్తిన మరో ప్రమాదం...
వాషింగ్టన్: కోవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తి మొదలై ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర కావోస్తుంది. దీన్నుంచి ఇంకా కోలుకోకమునుపే చైనా ప్రపంచం నెత్తిన మరో బాంబు వేసింది. డ్రాగన్ దేశం పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమి దిశగా పయనిస్తుందట. ఏ క్షణమైన అది భూమ్మీద పడవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ రాకెట్ కూలిపోయిన సముద్రంలో పడుతుంది. కానీ చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ మాత్ర భూమి దిశగా దూసుకువస్తుందట. అది ఎక్కడ పడనుందో తెలియక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రక్షణశాఖ ప్రస్తుతం 5బీ రాకెట్ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న అది భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పెంటగాన్ శాస్త్రవేత్తలు. కాకపోతే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూవాతవరణంలో ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ రాకెట్ మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఇక లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ బరువు సుమారు 21 టన్నులు. ఇది ఏ క్షణానైనా భూమిపై పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. గత వారం అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ కంట్రీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మొదటి మాడ్యూల్ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మించడం కోసం చైనా లాంగ్మార్చ్ 5బీ రాకెట్ తియాన్హే స్పేస్ మ్యాడుల్ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. నియంత్రణ కోల్పోయిన ఈ రాకెట్ శకలాలు భూమి మీదకు దూసుకురానున్నాయి. చైనా 2022 నాటి కల్లా అంతరిక్షంలో సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో సుమారు ముగ్గురు వ్యోమగాములు ఉండేలా చైనా ప్లాన్ చేస్తోంది. తియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్లో భాగంగా 30 మీటర్ల పొడవైన తొలి మ్యాడుల్ ‘టియాన్హె’ను చైనా లాంగ్ మార్చ్ రాకెటును ఉపయోగించి అంతరిక్షంలోనికి పంపింది. చదవండి: అంతరిక్షంపై డ్రాగన్ నజర్...! -
అంతరిక్షంపై డ్రాగన్ నజర్...!
బీజింగ్: అంతరిక్షంలో పాగా వేయడం కోసం చైనా పావులు కదుపుతోంది. అందుకుగాను అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసే ప్రయత్నాలను చైనా ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29 రోజున స్పేస్ స్టేషన్ను అంతరిక్షంలో నిర్మించడం కోసం ఒక మ్యాడుల్ను స్పేస్లోకి పంపింది. 2022లోపు స్పేస్ స్టేషన్ను పూర్తి చేయడానికి చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మ్యాడుల్కు ‘టియాన్హె’ గా నామకరణం చేశారు. దీనిలో సుమారు ముగ్గురు వ్యోమగాములు ఉండేలా చైనా ప్లాన్ చేస్తోంది. తియాన్ గాంగ్ స్పేస్ స్టేషన్లో భాగంగా తొలి మ్యాడుల్ ‘టియాన్హె’ను చైనా లాంగ్ మార్చ్ రాకెటును ఉపయోగించి అంతరిక్షంలోనికి పంపింది. చైనా మొట్టమొదటిసారిగా తన సొంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్నస్పేస్ స్టేషన్లోని మూడు ప్రధాన భాగాలలో టియాన్హె ఒకటి.భూమి నుంచి సుమారు 340 నుంచి 450 కిమీ ఎత్తులో ఒక నిర్ధిష్ట కక్ష్యలో స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. కాగా ఇప్పటి వరకు అంతరిక్షంలో నాసా అభివృద్ధి చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటే వ్యోమగాములకు నివాస కేంద్రంగా ఉంది. ఈ స్పేస్ స్టేషన్కు యునైటెడ్ స్టేట్స్, రష్యా, యూరప్, జపాన్ ,కెనడా దేశాల మద్దతుతో నిర్మించారు. కాగా ఈ స్టేషన్లో చైనా పాల్గొనకుండా యునైటెడ్ స్టేట్స్ నిరోధించింది. టియాన్హే ప్రాజెక్ట్ అంతరిక్షంలో చైనాను శక్తివంతమైన దేశంగా నిర్మించడంలో ఉపయోగపడుతుందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2030లోపు చైనా అంతరిక్షంలో తిరుగులేని శక్తిగా ఎదగాలనే ప్రయత్నంలో ఇప్పట్నుంచే తన కార్యచరణను ముమ్మరం చేసింది. చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం.. నాసాపై.. -
అంతరిక్షంలో నాట్లు.. వ్యోమోనౌకలోనే పంటలు
ప్లాంట్ రిసెర్చ్లో అద్భుతంగా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఇటీవలే భూమికి 400 కిలోమీటర్ల పైన అంతరిక్షంలో జరిగింది. భూమి వాతావరణం లేనిచోట తొలిసారి మొక్కలు నాటే ప్రయత్నం (ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్) ఫలించింది. అంతరిక్షంలోని ఐఎస్ఎస్(అంతర్జాతీయ స్పేస్ స్టేషన్)లోని ఐఎస్ఎస్ వెజిటబుల్ ప్రొడక్షన్ సిస్టమ్ ఫెసిలిటీలో మైక్హాప్కిన్స్ అనే ఆస్ట్రోనాట్ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. భవిష్యత్లో అంతరిక్షంలో భారీగా పంటలు పండించే ప్రయోగాలకు ఇది తొలిమెట్టుగా నాసా వ్యాఖ్యానించింది. ఐఎస్ఎస్లో పంటలు పండించడంతో అందులోని వ్యోమోగాములకు ఆహార కొరత లేకుండా చూడవచ్చు. అలాగే భవిష్యత్లో ఇతర గ్రహాలకు జరిపే ప్రయాణంలో భూమిపై నుంచే ఆహారం తీసుకుపోయే అవసరం లేకుండా అవసరమైనప్పుడు వ్యోమోనౌకలోనే పంటలు పండించుకోవచ్చని అభిప్రాయపడింది. ఎక్స్పెడిషన్ 64 కార్యక్రమంలో మైక్ పనిచేస్తున్నారు. స్పేస్ఎక్స్ క్రూ1 మిషన్లో భాగంగా ఆయన ఐఎస్ఎస్కు వచ్చారు. ఐఎస్ఎస్లో పలు మొక్కలు జీవించలేక పోవడాన్ని గమనించిన మైక్ వాటిని తిరిగి నాటడం చేపట్టారు. మొలకల దశలో ఉన్న మొక్కలను ఒకచోట నుంచి తీసి మరోచోట నాటడం అనే ప్రక్రియ సాధారణంగా మొక్కలకు రిస్కుగా భావిస్తారు. కానీ ఐఎస్ఎస్లో ఈ ప్రక్రియను విజయవంతం గా పూర్తి చేశారని నాసా తెలిపింది. మైక్రోగ్రావిటీ అంతరిక్షంలో పలు ప్రతికూలతలకు కారణమని, కానీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో మైక్రోగ్రావిటీనే సక్సెస్కు కారణమైందని వివరించింది. ఆముదం, ఆకుకూర మొక్కలను ఈ ప్రయోగంలో నాటడం జరిగిందని, అవి బాగానే ఉన్నాయని తెలిపింది. భవిష్యత్లో ఈ అంశంపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సైంటిస్టులకు తాజా ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయి. -
వాళ్ల వివరాలు రహస్యంగా ఉంచిన ఇస్రో
ఆస్ట్రోనాట్స్.. అంతరిక్ష యాత్రికులు, వీరిని వ్యోమగాములని కూడా పిలుస్తాం. మన గగన్యాన్ మిషన్ కోసం రష్యాలో శిక్షణ తీసుకునే వ్యోమగాముల్ని గగన్నాట్స్ అని ముద్దుగా పిలుస్తున్నారు. వీరిని అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకొచ్చే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అడుగులు వేస్తోంది. ఈ మిషన్ కోసం తొలుత 12 మంది ఎంపిక చేసింది. భారత్లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరో స్పేస్ మెడిసిన్ (ఐఏఎం)లో వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న నలుగురిని తుది జాబితాలోకి చేర్చింది. ఈ నలుగురిలో మహిళలెవరికీ చోటు దక్కలేదు. ప్రస్తుతానికి వీరి వివరాలను ఇస్రో రహస్యంగా ఉంచింది. అయితే వీరంతా భారత వైమానిక దళానికి చెందిన పైలట్లని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. మానవ లక్షణాలు కలిగిన ఒక రోబోని కూడా వ్యోమగాముల వెంట పంపించనున్నారు. ►గగన్యాన్ ఎప్పుడు: భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022లో అంతరిక్షంలోకి అడుగు పెట్టాలని లక్ష్యం ►తుది జాబితాలో వ్యోమగాములు: నలుగురు ►రష్యాలో శిక్షణ ఎంతకాలం: 11 నెలలు ►వ్యయం: రూ.10 వేల కోట్లు ►అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములు: ఇద్దరు లేదా ముగ్గురు ►గడిపే కాలం: వారం రోజులు ►వ్యోమగాముల్ని తీసుకువెళ్లే వాహకనౌక: బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్–త్రీ -
తమిళనాడులో మరో అంతరిక్ష కేంద్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ భౌగోళిక చిత్రపటంలో తమిళనాడు సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. అంతరిక్ష ప్రయోగాలకు ఏకైక కేంద్రమైన ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సరసన తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిలో ప్రతిష్టాత్మకంగా రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించి... శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో రెండు లాంచింగ్ ప్యాడ్ (1,2)లు ఉన్నాయి. భవిష్యత్తులో మరో రెండు లాంచింగ్ ప్యాడ్లు అవసరమని భావిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి అనువైన భూమికోసం అన్వేషించారు. తూత్తుకూడి జిల్లా తిరుచెందూరుకు సమీపంలోని కులశేఖరపట్టి అనుకూలమని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కులశేఖరపట్టిలో 3, 4 లాంచింగ్ ప్యాడ్లను నిర్మించేందుకు కేంద్రం సైతం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాల్లో గతవారం కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. రిస్క్ తక్కువ, ఇంధనం ఆదా... కులశేఖరపట్టి అంతరిక్ష ప్రయోగాల నుంచి చేసే ప్రయోగాలతో ఎన్నో లాభాలున్నాయి. శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేసేటపుడు వాహక నౌకను దక్షిణం వైపునకు మాత్రమే పయనింపజేయాల్సి ఉంది. అయితే దక్షిణం వైపున శ్రీలంక దేశం ఉంది. అంతరిక్ష ప్రయోగాలు చేసేపుడు మరో దేశం మీదుగా వాహక నౌక ప్రయాణించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. వాహక నౌక ప్రయోగం విఫలమైతే దారితప్పి శ్రీలంకపైకి వెళ్లకుండా సముద్రంలోనే కూల్చివేసేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. అధిక శ్రమకోర్చి దిశను మార్చడం వల్ల దూరంతోపాటు ఖర్చూ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కులశేఖరపట్టి నుంచి ప్రయోగిస్తే దారిమళ్లించే అవసరం ఉండదని విశ్వసిస్తున్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తే శ్రీలంక చుట్టూ తిరుగుతూ నాలుగు దశల్లో విడిపోతూ గమ్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. కులశేఖరపట్టినుంచయితే మూడు దశలే సరిపోతాయి. ఇంధనం ఎంతో ఆదా అవుతుంది. మరింత బరువైన వాహక నౌకల ప్రయోగానికి అనుకూలం... కులశేఖరపట్టి భూమధ్య రేఖకు అతి సమీపంలో ఉంది. శ్రీహరికోట కేంద్రంలోని భూమికి గరిష్టంగా 1,350 కిలోల బరువైన వాహక నౌకను ప్రయోగించగల సామర్థ్యం ఉండగా, కులశేఖరపట్టి వద్ద భూమికి 1,800 కిలోల బరువును తట్టుకోగల శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణాలవల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. తొలిదశగా కులశేఖరపట్టి పరిధిలోని మూడు గ్రామాల్లో 2,300 ఎకరాల భూ సేకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. తిరుచెందూరులో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఎనిమిది విభాగాలకు చెందిన అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. -
మనకూ ఓ అంతరిక్ష కేంద్రం
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మెగా ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది! ఆంక్షల చట్రాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచంలోనే అత్యంత చవకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించగల సత్తా సాధించుకున్న ఇస్రో... ఇప్పుడు సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులువేస్తోంది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘చంద్రయాన్–2 ప్రయోగం పూర్తయ్యాక సూర్యుడిపై ఆదిత్య–ఎల్1 వాహకనౌక 2020 తొలి అర్ధభాగంలో పంపిస్తాం. అనంతరం 2–3 సంవత్సరాల వ్యవధిలో ఫ్రాన్స్తో కలిసి శుక్రుడిని అధ్యయనం చేసేందుకు మరో ప్రయోగం చేపడతాం’ అని తెలిపారు. ఆదిత్య ఎల్1 వాహకనౌక సూర్యుడిలో అత్యంత వేడి ప్రదేశమైన కరోనాను విశ్లేషిస్తుందనీ, దీనివల్ల వాతావరణ మార్పులను అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. ఇస్రో అంతరిక్ష పర్యాటకంపై దృష్టి సారించడంలేదని డా.శివన్ స్పష్టం చేశారు. 2030 నాటికి పూర్తి భారతీయుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు రూ.10,000 కోట్లతో ఇస్రో చేపట్టిన ‘గగన్యాన్’ ప్రాజెక్టుకు కొనసాగింపుగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఉంటుందని డా.శివన్ తెలిపారు. ‘అమెరికా, జపాన్, కెనడా, రష్యా, ఈయూ దేశాలు కలిసి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బరువు 420 టన్నులు ఉండగా, ఇస్రో ఏర్పాటుచేయనున్న అంతరిక్ష కేంద్రం బరువు 20 టన్నులు మాత్రమే ఉంటుంది. ఈ కేంద్రంలో తొలుత వ్యోమగాములు 15–20 రోజులు గడిపేలా ఏర్పాట్లు చేస్తాం. దాన్ని క్రమంగా విస్తరిస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉంది. ఓసారి ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2030 నాటికి మనకు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుంది. దీనికోసం ఐఎస్ఎస్తో కానీ, మరేదేశంతో కానీ పనిచేయబోం’ అని పేర్కొన్నారు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే పరిస్థితుల్లో మానవశరీరంతో పాటు మొక్కలు, ఇతర జీవులు, బ్యాక్టీరియాలు ఎలా ప్రతిస్పందిస్తాయన్న విషయమై ఈ కేంద్రంలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చంద్రుడిపై మానవసహిత యాత్రలు చేపడతామని, గ్రహశకలాలను విశ్లేషిస్తామని కె.శివన్ తెలిపారు. అంతరిక్ష కేంద్రం అంటే? భూమికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కొన్ని రోజులపాటు వ్యోమగాములు ఉండేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని అంతరిక్ష కేంద్రం అని పిలవొచ్చు. దీనిని భూస్థిర కక్ష్యలో తిరుగుతూ ఉండే ఓ భారీ ఉపగ్రహంగానూ అనొచ్చు. అగ్రరాజ్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎస్ఎస్ను 1998 నుంచి దశలవారీగా విస్తరిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం ఐఎస్ఎస్ బరువు దాదాపు 420 టన్నులకు చేరుకుంది. 2000లో తొలిసారిగా ఇందులో ఓ వ్యోమగామి అడుగుపెట్టారు. 2011లో ఐఎస్ఎస్కు చివరి మాడ్యూల్ను జోడించారు. ఐదేళ్ల తర్వాత ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివాసం ఉండేందుకు వీలుగా ప్రత్యేకమైన గాలిబుడగలాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేశారు. 2030 వరకూ పనిచేసే ఈ ఐఎస్ఎస్లో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి? పదార్థాల భౌతిక ధర్మాలు మారతాయా? బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. గగన్యాన్ తర్వాతే.. జూలై 15న చంద్రయాన్ –2 ప్రయోగం పూర్తయ్యాక గగన్యాన్పై దృష్టి సారిస్తామని శివన్ తెలిపారు. ‘వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు రెండుసార్లు వారు ప్రయాణించే మాడ్యూల్ను పరీక్షిస్తాం. 2022లో తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపడతాం. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను రాబోయే 6 నెలల్లో ఎంపిక చేస్తాం. ఆ తరువాత వీరికి ఏడాది పాటు శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించింది’ అని శివన్ చెప్పారు. గగన్యాన్ ప్రయోగం పూర్తయ్యాక దానికి కొనసాగింపుగా అంతరిక్ష కేంద్రం నిర్మాణంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. -
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇదే..
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. భారత్ సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందని ఇస్రో చీఫ్ కే శివన్ గురువారం వెల్లడించారు. గగన్యాన్ మిషన్కు కొనసాగింపుగా ఈ ప్రాజెక్టును చేపడతామని చెప్పారు. మానవ సహిత గగన్యాన్ కార్యక్రమాన్ని పూర్తిచేసిన అనంతరం ఇదే ఊపును కొనసాగించేందుకు మనకు సొంత స్పేస్ స్టేషన్ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు. కాగా జులైలో జరిగే చంద్రయాన్ 2, 2022లో జరిగే గగన్యాన్పై తాము దృష్టి కేంద్రీకరించామని, ఈ మిషన్ పూర్తయిన తర్వాత స్పేస్ స్టేషన్పై ఫోకస్ చేస్తామని అన్నారు. స్పేస్ స్టేషన్ను పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసేందుకు ఐదు నుంచి ఏడేళ్ల సమయం పడుతుందని, ఖర్చు విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. -
నేడు నింగిలోకి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్
-
ఇస్రో ‘బాహుబలి’ కౌంట్డౌన్ ప్రారంభం
శ్రీహరికోట/తిరుమల: ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 27 గంటల కౌంట్డౌన్ ప్రారంభమైంది. వాతావరణం సహకరిస్తే బుధవారం సాయంత్రం సరిగ్గా 5.08 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లనుంది. గజ తుపాను కారణంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం తెలిసిందే. మొత్తంగా ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. శ్రీవారి పాదాల చెంత పూజలు ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ కె.శివన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని, నెల్లూరు జిల్లాలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయంలో రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల శివన్ మాట్లాడుతూ ‘వాతావరణం సహకరించకపోతే జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ప్రయోగం వాయిదా పడుతుంది. అయితే రేపు సాయంత్రమే రాకెట్ను ప్రయోగించగలమని మేం ఆశిస్తున్నాం. ఇస్రోకు అత్యంత ముఖ్యమైన ప్రయోగాల్లో ఇదొకటి. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇది మైలురాయి వంటిది’ అని తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరింత అధునాతన ఉపగ్రహాలను అభివృద్ధి చేసేందుకు ఇస్రోకు మార్గం సుగమమవుతుందన్నారు. ‘చంద్రయాన్–2, అంతరిక్ష మానవ సహిత యాత్ర ప్రయోగాలను కూడా జీఎస్ఎల్వీ–మార్క్3 రాకెట్ ద్వారానే చేపట్టనున్నాం. మేం అందుకు సన్నద్ధమవుతున్నాం’ అని శివన్ చెప్పారు. జీఎస్ఎల్వీ–మార్క్3 ఇస్రో అభివృద్ధి చేసిన ఐదో తరం రాకెట్. 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇది భూస్థిర బదిలీ కక్ష్య (జీటీవో–జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టగలదు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. -
నేడే సోలార్ మిషన్
టాంపా: భగభగ మండే సూర్యుడి ఆవరణం గుట్టువిప్పే తొలి అంతరిక్ష ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. పార్కర్ సోలార్ ప్రోబ్ అనే భారీ వాహక నౌకను నింగిలోకి పంపేందుకు నాసా పూర్తి ఏర్పాట్లు చేసింది. శనివారం వేకువజామున ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ శుక్రవారం ప్రారంభమైంది. సూర్యుడి చుట్టూ ఉండే కరోనా పొర రహస్యాలను ఛేదించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని నాసా ప్రకటించింది. సౌర పవనాల్లో ఏర్పడే అలజడులు భూమిపై ఎప్పుడు, ఎలా ప్రభావం చూపుతాయో అంచనావేయడానికి ఈ ప్రయోగం దోహదపడుతుందని తెలిపింది. సూర్యుడికి సమీపంగా వెళ్లిన తరువాత పార్కర్ గంటకు 7 లక్షల కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. -
మీడియా కథనాలు.. చైనా సీరియస్
బీజింగ్ : స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ కూలిపోవటంపై గత రెండు రోజులుగా ప్రపంచ మీడియాలో వస్తున్న కథనాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏరో స్పేస్ రంగంలో చైనా ఎదుగుదలను భరించలేక బురద జల్లుతు.. మీడియా ఛానెళ్లు అతి ప్రదర్శించాయంటూ దుమ్మెత్తిపోసింది. ‘అదొక సాధారణ స్పేస్క్రాఫ్ట్. అయినా కూలిపోతే ఏదో విపత్తు సంభవిస్తుందన్న స్థాయిలో అధిక ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రచురించాయి. చైనా అంతరిక్ష రంగాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి చేష్టలకు పాల్పడ్డాయి. కొందరైతే అది ఎక్కడ కూలిపోతుందో చెబుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు’ అంటూ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాగా, దాదాపు 11 మీటర్లు ఉన్న తియాంగాంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. కాలపరిమితి ముగియటంతో 2017లోనే ఇది కూలిపోతుందని భావించినప్పటికీ.. కాస్త ఆలస్యం అయ్యింది. చివరకు ఆదివారం అర్ధరాత్రి దాటాక భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మంటలు చెలరేగి దగ్ధమైపోయినట్లు చైనా స్పేస్ విభాగం వెల్లడించింది. ఆ శకలాలు ఫసిఫిక్ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో పడిపోయినట్లు పేర్కొంది. -
తప్పిన ముప్పు.. కూలిన చైనా స్కైలాబ్..!
బీజింగ్: ప్రస్తుతం నిరుపయోగంగా మారిన చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. టియాంగంగ్-1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, భూవాతావరణంలోకి రావడంతోనే దగ్ధమైన అది దక్షిణ పసిఫిక్ సముద్రంలో కూలిపోయిందని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొన్నట్టు ఆ దేశ వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. అమెరికా సైన్యం కూడా ఈ వార్తను ధ్రువీకరించింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఇది కూలిపోయిందని తెలిపింది. టియాంగంగ్-1 స్పేస్ స్టేషన్ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా అప్పట్లో రూపొందించారు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్–1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించడంతో ఇది భూవాతావరణంలోకి దూసుకొస్తున్న విషయంలో వెలుగులోకి వచ్చింది. అయితే టియాంగంగ్-1 భూమిపై ఏ సమయంలో, ఎక్కడ పడుతుందనే కచ్చితమైన వివరాలను ఏజెన్సీ వెల్లడించకపోవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవుండే టియాంగంగ్ స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ తదితర దేశాల్లో పడిపోయే అవకాశం ఉందని, లేదా న్యూజిలాండ్, టాస్మానియా, అమెరికాల్లోనూ కూలొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. అంతరిక్ష కేంద్రం కూలిపోయినా భూమిపై జరిగే నష్టం పెద్దగా ఉండబోదనీ, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చైనా అధికారులు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇది సముద్రంలో కూలిపోవడంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నాయి. -
ఇది చైనా స్కైలాబ్!
బీజింగ్: ప్రస్తుతం నిరుపయోగంగా మారిన, నియంత్రణలో లేని అంతరిక్ష ప్రయోగ కేంద్రమొకటి భూమిపై కూలిపోనుంది. చైనాకు చెందిన టియాంగంగ్–1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం సోమవారం తెల్లవారుజామున 5 గంటలలోపు (భారత కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా నుంచి అమెరికా మధ్యలో ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టియాంగంగ్–1ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా అప్పట్లో రూపొందించారు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్–1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ చెప్పింది. అయితే టియాంగంగ్–1 భూమిపై ఏ సమయంలో, ఎక్కడ పడుతుం దనే కచ్చితమైన వివరాలను ఏజెన్సీ వెల్లడించలేదు. యూరోపియన్ అంతరిక్ష సంస్థ మాత్రం చైనా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.25 గంటలకు టియాంగంగ్ భూమిపై పడొచ్చని అంచనా వేస్తోంది. యూరప్లోనూ కూలొచ్చు దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ అంచనా మరోలా ఉంది. ఆ సంస్థ చెబుతున్న దాని ప్రకారమైతే భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి 1.42 గంటల నుంచి సోమవారం ఉదయం 9.42 గంటల మధ్య టియాంగంగ్ భూమిపై కూలిపోవచ్చు. ఇది బ్రిటన్లో కూలే అవకాశం లేదనీ, అయితే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ తదితర దేశాల్లో పడిపోయే అవకాశం ఉందంది. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవుండే టియాంగంగ్ న్యూజిలాండ్, టాస్మానియా, అమెరికాల్లోనూ కూలొచ్చనీ వెల్లడించింది. ఏం భయం లేదు.. అంతరిక్ష కేంద్రం కూలిపోయినా భూమిపై జరిగే నష్టం పెద్దగా ఉండబోదనీ, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చైనా అధికారులు చెబుతున్నారు. భూ వాతావరణంలోకి అంతరిక్ష కేంద్రం ప్రవేశించగానే అందులోని ఇంధనం అంటుకొని అనేక భాగాలు ఆకాశంలోనే కాలిపోతాయని వారు వివరిస్తున్నారు. భూమికి 80 కిలో మీటర్ల దూరంలో ఉండగానే ఇది మంటల్లో చిక్కుకుని, భూమిపై చిన్న చిన్న ముక్కలు మాత్రమే తక్కువ వేగంతో పడతాయన్నారు. ‘టియాంగంగ్ భూమికి ఎలాంటి హానినీ కలిగించదు. విషపదార్థాలను కూడా విడుదల చేయదు’ అని చైనా సైన్యంలోని అధికారులు చెప్పారు. టియాంగంగ్ గురించి ఐక్యరాజ్యసమితి సహా అన్ని సంబంధిత అంతర్జాతీయ సంస్థలకు సమాచారమిచ్చామన్నారు. ‘సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోలాగా టియాంగంగ్ భూమిపైకి దూసుకొచ్చి కూలదు. ఆకాశం నుంచి ఉల్కలు రాలుతున్నట్లుగా కనిపిస్తుంది అంతే’ అని చైనా ఏజెన్సీ చెప్పింది. గత 60 ఏళ్లలో ఆరు వేలకు పైగా వస్తువులు/పరికరాలు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాయనీ, వీటి వల్ల ఎవ్వరికీ హానీ జరగలేదని యూరోపియన్ అంతరిక్ష సంస్థ పేర్కొంది. -
మరికొన్ని రోజుల్లో.. మహావినాశనం!
చైనాకు చెందిన ఒక అంతరిక్ష కేంద్రం భూమిపై కూలిపోనుందా? భూమికి మహా వినాశనం తప్పదా? స్పేస్స్టేషన్పై సైంటిస్టులు నియంత్రణ కోల్పోయారా? కూలుతున్న అంతరిక్ష కేంద్రం భూ కక్ష్యలోకి ప్రవేశించిందా? భూమిపై విలయం ఎప్పుడు సృష్టిస్తుంది.. వంటి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలతో అంతరిక్ష పరిశోధనల్లో పోటీపడ్డ చైనా.. ఇప్పుడు భూమికి మహా ప్రమాదాన్ని తెచ్చిపట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా ప్రత్యేకంగా తియాంగాంగ్-1 పేరుతో స్పేస్ స్టేషన్ నిర్మించుకుంది. సుమారు 19 వేల పౌండ్ల బరువున్న ఈ స్పేస్ స్టేషన్ అంతరిక్షం నుంచి భూమిపైన పడబోతోంది. తియాంగాంగ్-1.. 2016 మార్చిలోనే శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయింది. అప్పటినుంచి ఆకాశంలో పరిభ్రమిస్తూ.. నెమ్మదిగా భూమివైపు ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది భూ కక్ష్యలోకి ప్రవేశించిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఎక్కడ పడుతుంది? ఉత్తర-దక్షిణ ధృవాల మధ్యలోని 43 డిగ్రీల అక్షాంశాల మధ్య ఎక్కడైనా పడొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జనవరి నుంచి - మార్చి మధ్యకాలంలో భూమిమీద భీకరంగా కూలిపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎక్కడ పడొచ్చు? ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలున్నాయి. ప్రమాద స్థాయి తియాంగాంగ్-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి. తియాంగాంగ్-1 నుంచి భారత్, బ్రిటన్లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. చైనా ఏమంటోంది? తియాంగాంగ్ - 1 కూలిపోవడం వల్ల భూమికి వచ్చే నష్టం పెద్దగా ఏం ఉండదని చైనా చెబుతోంది. ఈ స్పేస్ స్టేషన్ నాలుగున్నర సంవత్సరాలు పనిచేసింది. మరో రెండున్నర ఏళ్లు అదనంగా విధులు నిర్వహించింది. ఇప్పటికే స్పేస్ స్టేషన్లోకి కీలక భాగాలన్ని అగ్నికి ఆహుతి అయ్యాయని.. స్పేస్ ఇంజినీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ వూ పింగ్ అంటున్నారు. భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే.. స్పేస్ స్టేషన్ మండిపోతుందని.. ఆయన చెబుతున్నారు. -
మరో స్కైలాబ్?! మహావినాశనం??
చైనాకు చెందిన ఒక స్పేస్ స్టేషన్ మరో స్కైలాబ్ కానుందా? ఇప్పటికే భూ నియంత్రణ కోల్పోయిందా? ఒక మహానగరం మొత్తం సర్వనాశనం కానుందా? దీనిపై శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? భూమిపై ఎప్పుడు విలయం సృష్టిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవండి. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాలతో పోటీ పడే చైనా.. ప్రపంచానికి మహా ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. అంతరిక్ష పరిశోధనల కోసం చైనా పంపిన తియాంగాంగ్-1 పూర్తిగా భూ నియంత్రణ కోల్పోయినట్లు ఐరోపా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సైంటిస్టుల నియంత్రణ కోల్పోయిన ఈ స్పేస్ స్టేషన్ వచ్చే ఏడాది లోపు ఉత్తర, దక్షిణార్ధ గోళాల మధ్యలో ఎక్కడైనా పడొచ్చని వారు ప్రకటించారు. భారీ స్పేస్ స్టేషన్ చైనా నిర్మించిన తియాంగాంగ్-1 8.5 టన్నుల బరువు ఉంటుంది. 12 మీటర్ల పొడవున్న తియాంగాంగ్ జనవరి-మార్చి మధ్య కాలంలో ఎప్పుడైనా, ఎక్కడైనా భీకరంగా నేల కూలవచ్చని సైంటిస్టుల హెచ్చరిస్తున్నారు. ప్రమాదంలో ప్రధాన నగరాలు ప్రపంచ ఆర్థిక, వాణిజ్య, దేశ రాజధానులుగా పేరున్న ప్రధాన నగరాలపై పడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, బీజింగ్, రోమ్, ఇస్తాంబుల్, టోక్యో నగరాలున్నాయి. ప్రమాద స్థాయి తియాంగాంగ్-1 నేల కూలితే.. మన రాజధాని ఢిల్లీ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. జీవరాశి మొత్తం అంతరించిపోగా, భారీ భవనాలు సైతం నేల మట్టమవుతాయి. మనకు ప్రమాదం? తియాంగాంగ్-1 నుంచి భారత్, బ్రిటన్లకు పెద్దగా ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. -
అంతరిక్ష కేంద్రంలో ‘అలమర’
వాషింగ్టన్: అంతరిక్ష కేంద్రంలోకి అత్యాధునిక అలమర (వస్తువులు దాచి ఉంచుకునే పెట్టె)ను శాస్త్రవేత్తలు త్వరలో తీసుకువెళ్లనున్నారు. హెచ్టీవీ–7గా పిలిచే ఈ అలమరను 2018 చివరి కల్లా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) బుధవారం వెల్లడించింది. సైంటిస్టులు అంతరిక్ష కేంద్రంపైకి పరిశోధనలకు అవసరమయ్యే పరికరాలను తీసుకువెళుతుంటారు. అయితే అక్కడ మరిన్ని వస్తువులు దాయడానికి వీలుగా ఆధునిక పరికరాలతో అలమరను తయారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. అంతరిక్ష కేంద్రంలో ఎనిమిది అలమరలను పొందుపరిచే వీలున్నట్లు నాసా వెల్లడించింది. ఈ అలమరలను బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఈ అలమరలో పరిశోధనలకు ఉపయోగపడే ప్రామాణిక ఈథర్నెట్ కేబుల్ వైర్లను ఉంచనున్నట్లు వివరించింది. -
ఇక చైనా స్పేస్స్టేషన్
► మొట్టమొదటి కార్గో స్పేస్క్రాప్ట్ నింగిలోకి పంపుతున్న డ్రాగన్ ► పూర్తయితే అమెరికా, రష్యాల సరసన చైనా బీజింగ్: మొట్టమొదటి కార్గో స్పేస్క్రాప్ట్ని అంతరిక్షంలోకి పంపేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. టీయాన్జు-1 అనే స్సేస్క్రాప్ట్ను ఏప్రిల్ 20 నుంచి 24 వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. వెన్చాంగ్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్మార్చ్–7 వై2 రాకెట్ ద్వారా ఈ కార్గో స్పేస్క్రాఫ్ట్ను నింగిలోకి పంపుతున్నారు. దీనిని అంతరిక్షంలోకి పంపడం పూర్తయితే అమెరికా, రష్యాల తర్వాత సొంత స్పేస్ స్టేషన్ కలిగిన దేశంగా చైనా ఆవిర్భవిస్తుంది. 2022 నాటికి తమ స్పేస్ స్టేషన్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని చైనా ఇప్పటి ప్రకటించింది. ఈ స్పేస్క్రాఫ్ట్ ప్రయోగానికి సంబంధించిన పరీక్షలను శాస్త్రవేత్తలు పూర్తిచేశారని, ప్రయోగానికి వాతావరణం అనుకూలించడం మినహా మరే ఇతర అడ్డంకులు లేవని తెలిపింది. -
అంతరిక్షంలో అడుగు పెట్టిన చైనా వ్యోమగాములు
-
నిర్దేశిత కక్ష్యలోకి జీశాట్-18
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 6న ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా ప్రయోగిం చిన జీశాట్-18 ఉపగ్రహ కక్ష్య దూరా న్ని శాస్త్రవేత్తలు పెంచారు. భూమికి 36 వేల కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 0.136 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హాసన్ ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం (ఎంసీఎఫ్) వారు అధీనంలోకి తీసుకుని ఉపగ్రహంలో నింపిన 2,004 కిలోల ఇంధనంలో కొంతభాగాన్ని శుక్రవారం 6,040 సెకెండ్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. మొదటి విడతలో 251.7 కి.మీ. దూరంలోని పెరిజీని 14,843 కి.మీ.లకు పెంచుతూ అపోజీని మాత్రం 35,888 కి.మీ. నుంచి 35,802 కి.మీ.కు తగ్గించారు. శని, ఆదివారాల్లో రెండు విడతలుగా ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి ప్రస్తుతం 35,802 కి.మీ. అపోజి, 35,294 కి.మీ. పెరిజిని పెంచుతూ భూమికి 36 కి.మీ. ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి సమస్థితిలో స్థిరపరచే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మరో రెండు రోజుల్లో ఉపగ్రహ సేవలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. -
రేపు జీశాట్-18 ప్రయోగం
ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం వేదిక శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. తొలుత భారత కాలమానం ప్రకారం బుధవారం వేకువజామున 2 నుంచి 3.15 గంటల్లోపు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా 3,404 కిలోల బరువు కలిగిన జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించాలని నిర్ణయించినప్పటికీ వాతావరణం అనుకూ లించకపోవడంతో ఒకరోజు వాయిదా వేశారు. ఈ ఉపగ్రహంలో 24 సీ బాండ్ ట్రాన్స్ఫాండర్స్, 12 ఎక్సెంటెడ్ సీ బాండ్, 12 కేయూ బాండ్ ట్రాన్స్ఫాండర్స్, 2 కేయూ బీకాన్ బాండ్ ట్రాన్స్ ఫాండర్స్ను పంపిస్తున్నారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. ప్రయోగం నిమిత్తం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్, శాటిలైట్ డెరైక్టర్ సూర్యప్రకాశ్రావు ఫ్రాన్స్కు వెళ్లారు. ప్రయోగం పూర్తికాగానే బెంగళూరులోని హాసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని నియంత్రిస్తుంది. జీశాట్-18 ఉపగ్రహంతో ఉపయోగాలు: దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని జీశాట్-18 అందుబాటులోకి తెస్తుంది. జీశాట్-18 ద్వారా అందుబాటు లోకి రానున్న 50 ట్రాన్స్ఫాండర్లతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో ప్రకటించింది. -
అంతా గోప్యమే..
► అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా అంతరిక్ష కేంద్రం ► బయటకు పొక్కనీయకుండా అధికారుల జాగ్రత్తలు ► ఇదే అదునుగా రెచ్చిపోతున్న కొందరు ► షార్ ప్రతిష్టకే మచ్చ తెస్తున్న ఘటనలు శ్రీహరికోట(సూళ్లూరుపేట) : సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. తరచుగా చోటు చేసుకుంటున్న ఏదో ఒక ఘటనతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శ్రీహరిపేట పేరుప్రతిష్టలు చిన్నబోతున్నాయి. ఇలాంటి ఘటనల మీద ఘాటుగా స్పందించాల్సిన పరిపాలనా యంత్రాంగం బయటకు పొక్కనీయకుండా రహస్యంగా ఉంచడంతో ఎవరికీ భయం లేకుండా పోతోంది. ఇక్కడ జరుగుతున్న అనేక ఘటనలను విచారణ పేరుతో అధికారులే గోప్యంగా వుంచుతున్నారు. శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం లో విద్యార్థినులతో కొందరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం అలవాటైపోయింది. గతంలో ఈ స్కూ ల్లో ఇదే తరహాలోనే ఎన్నో ఘటనలు జరిగాయి. అప్పట్లో జరిగిన ఘటనలను తేలికగా తీసుకుని ఇంక్రిమెంట్ కటింగ్తో సరిపెట్టడంతో వేధింపులు, వెకిలిచేష్టలు పునరావృతమవుతున్నాయి. వారితో ఎదురవుతున్న బా ధలను ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థినులు లోలోపల కుమిలిపోతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉపాధ్యాయుల చేష్టలు పరాకాష్టకు చేరడంతో బాధిత విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద గొల్లుమన్నారు. వారు ఈ ఘటనలపై రెండు రోజుల క్రితం షార్ కంట్రోలర్ జేవీ రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన లలితకుమారితో మహిళా వేధింపుల నిరోధక కమిటీ వేసి నివేదిక కోరారు. ఆమె నేతృత్వం లో జరిగిన విచారణలో ఉపాధ్యాయులు దార్భజీ, కృష్ణప్రసాద్, షణ్ముగనాథన్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు సుధీర్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. విచారణ నివేదికను ఆమె గురువారం షార్ కంట్రోలర్కు సమర్పించగా నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి పక్కన పెట్టారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని కంట్రోలర్ రాజారెడ్డి తెలిపారు. కఠినమైన చర్యలు లేకనే గతంలోనూ షార్లో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ప్రాజెక్ట్లు చేయడం కోసం వచ్చే ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థినులతోనూ అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలున్నా యి. అయితే ఘటనకు కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ యథాప్రకారం చెలరేగిపోతున్నారు. తప్పు చేసిన వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తే మరొకరు అదే తప్పు చేసేందుకు వెనకడుగు వేస్తారని షార్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రిన్సిపల్కు మెమో అంతరిక్ష కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపల్కు శుక్రవారం షార్ పరిపాలనా విభాగం అధికారులు మెమో ఇచ్చినట్లు సమాచారం. స్కూలులో విద్యార్థినులపై వేధింపులు జరుగుతుంటే ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడాన్ని క్రమశిక్షణరాహిత్యంగా భావించినట్లు తెలిసింది. -
ఐఎస్ఎస్@15
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)... కేవలం ఒక పరిశోధనా స్థానం మాత్రమే కాదు, సువిశాల విశ్వ పరిశోధనలో మనిషి చేరుకున్న ఒక గమ్యస్థానం. భూమ్మీద జనాభా పెరుగుతోంది. వాళ్ల కోసం అదనపు నివాస స్థలాలను వెతకాల్సిందే. మనకు సరిపడే వాతావరణం ఉన్న గ్రహాలు ఇంకేమైనా ఉన్నాయా? మన అనుభవాలను పంచుకోగలిగే వాళ్లు ఈ విశాల విశ్వంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ఐఎస్ఎస్ ఒక మెట్టులాంటిది. దీని తర్వాత ఈ తరహా పరిశోధనకు చంద్రుడు, ఆ తర్వాత కుజుడు.. ఇంకా వేరే వేరే గ్రహాలున్నాయి. భూమికి సుమారు నాలుగువందల కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు ఆధారంగా నిలుస్తున్న ఐఎస్ఎస్ ప్రస్థానంలో తాజాగా పదిహేను సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2000 సంవత్సరం నవంబర్ ఆరంభం నుంచి వివిధ దేశాల సహకారంతో నాసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్పేస్ స్టేషన్కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇవి. - సాక్షి సెంట్రల్ డెస్క్ మనిషి నిర్మించిన వాటిలో అత్యంత ఖరీదైనది మనిషి తన నాగ రకతలో ఇప్పటి వరకూ నిర్మించిన వాటన్నింటిలోనూ అత్యంత ఎక్కువ ఖర్చు చేసిన నిర్మాణం ఐఎస్ఎస్. 2010 లెక్కల ప్రకారం ఐఎస్ఎస్ దాదాపు 15,000 కోట్ల డాలర్ల విలువ చేస్తుంది. ఇందులో సగం మొత్తాన్ని అమెరికా మాత్రమే భరించగా, మిగిలిన మొత్తాన్ని యూరప్ దేశాలు కొన్ని, జపాన్, రష్యాలు వెచ్చించాయి. 211 మంది సందర్శించారు పదిహేను దేశాలకు చెందిన 211 మంది వ్యోమగాములు ఇప్పటి వరకూ ఐఎస్ఎస్ను సందర్శించారు. వీరిలో భారత సంతతికి చెందిన పలువురు వ్యోమగాములున్నారు. మనిషే ఒక ప్రయోగశాల ఐఎస్ఎస్లో వ్యోమగాముల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. భారరహిత స్థితిలో వారు మనుగడ సాగించాలి. ఆ స్థితిలో ఏం తినాలి? తింటే ఏం జరుగుతుంది? ఎలా జీర్ణమవుతుందనే అంశాలపైనా పరిశోధనలు జరుగుతాయి. చిత్రమైన జీవితం కింద, పైన అనేవి కేవలం భూమ్మీద. భారరహిత స్థితిలో ఉండే ఈ స్టేషన్లో అంతా ఒక్కటే. స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు తేలుతూ ఉంటారు. నిద్రపోవడం అనేది మరో చిత్రమైన విన్యాసం. పడక, దిండూ.. అంటూ ఏమీ ఉండవు. తేలుతూ నిద్రపోవాలంతే! తినడం మరో కష్టమైన ఫీట్. పదార్థాలు అన్నీ తేలుతూ ఉంటాయి. పట్టుకొని తినాలి. గంటకు 17,240 మైళ్ల వేగం గంటకు 17,240 మైళ్ల వేగంతో తన కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది ఐఎస్ఎస్. ఈ వేగాన్ని మరో రకంగా వివరించాలంటే ఐఎస్ఎస్ రోజుకు దాదాపు పదిహేను సార్లు భూమిని చుట్టేస్తూ ఉంటుంది. ఒక రోజులో ఐఎస్ఎస్ ప్రయాణించే దూరం భూమి నుంచి చంద్రునికి మూడు సార్లు ప్రయాణం చేయడంతో సమానం. -
అంతరిక్షంలో అడుగు పెట్టిన ఒలంపిక్ జ్యోతి