వలేటివారిపాలెం : సపోట, మామి డి, జామ పండ్ల తోటల్లో కూరగాయలు, మినుమును అంతర పంటలుగా సాగు చేస్తూ రైతులు లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం వలేటివారిపాలెం మండలంలో పలువురు రైతులు మినుము, దొండ, బెండ, కాకర, దోస, చిక్కుడు, వంగ, గోంగూర, తోటకూర, పాలకూరను రైతులు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు.
పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేసినా, చేయకపోయినా దుక్కి, కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకుగాను ఏడాదికి రూ.7 వేలు ఖర్చు చేయాలి. అంతర పంటలు సాగు చేసినా అదే ఖర్చు అవుతుంది. పండ్ల తోటలో కూరగాయలు, మినుము పంట లను సాగు చేస్తే వాటికి వాడే మందులు పండ్ల తోటలకు కూడా ఉపయోగపడతాయి.
పండ్ల తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన పని ఉండదు. పైగా పండ్ల మొక్కలు త్వరితగతిన పెరగడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుకు మూడు నెలలు శ్రమిస్తే ఆ తర్వాత మూడు నెలలపాటు పంటను కోసి విక్రయించుకోవచ్చు. పండ్ల తోటల్లో అంతర పంటలను ఆరేళ్లపాటు సాగు చేసుకోవచ్చు. పండ్ల మొక్కలు ఎదిగిన త ర్వాత అంతర పంటలు సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదు.
Breadcrumb
అంతర పంట లాభదాయకం
Published Thu, Nov 6 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Related news by tags
-
Dogs Attack: కుక్కల నుంచి ప్రజలకు రక్షణేది?
శివార్లలోని జవహర్నగర్లో కుక్కల దాడిలో ఏడాదిన్నర విహాన్ మృతి వార్తతో నగర ప్రజల గుండెలు బరువెక్కాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో సైతం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మరణించడం ఎందరినో కలచివేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామనే ప్రకటనలు తప్ప నిజంగా ప్రజలకు.. ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సరైన సమాధానాలు దొరకడం లేదు. ⇒హైదరాబాద్అక్కడ బాగు..జైపూర్, గోవాల్లో ఏబీసీ కార్యక్రమాల అమలు బాగుందనే అభిప్రాయాలున్నాయి. అక్కడ ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలో ( 5–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తారని, ‘మిషన్ రేబిస్’ పేరిట వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తారని జంతుప్రేమికులు చెబుతున్నారు. పాఠశాలల్లోనూ అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తారని పేర్కొన్నారు.నామ్కే వాస్తేగా హైలెవెల్ కమిటీ ఏళ్ల తరబడిగా కుక్కల బెడద ఉన్నా, వాటి దాడుల్లో ఎందరో మరణిస్తున్నా.. కుక్కలతో ఇక భయం లేదనుకునే పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. రోడ్డు ప్రమాదాలు, నాలాల్లో మరణాల మాదిరే కుక్కకాట్లతో సైతం మరణాలు చోటు చేసుకుంటుండటం విషాదకరం. వీధికుక్కలపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో గత సంవత్సరం జీహెచ్ఎంసీ అఖిలపక్ష సభ్యులతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా, అది 27అంశాలు సిఫార్సు చేసినా ప్రజలకు కుక్కకాట్లు తప్పడం లేదు. సిఫార్సు చేసిన అంశాల్లో ఆరేడు అంశాలు మాత్రం కొద్దిరోజులు అమలు చేశారు. ఆ తర్వాత వాటిని మరచిపోయారు. ఐదు కుక్కల సంరక్షణ కేంద్రాలు, వాటి నిర్వహణ, వెటర్నరీ విభాగంలో సిబ్బంది పెంపు వంటివి మాత్రం అమలు చేశారు. అమలుకు నోచుకోని అమాత్యుడి హామీ.. బహిరంగ ప్రదేశాల్లో మాంసాహార వ్యర్థాలు వేసే హోటళ్లు, దుకాణాలను ప్రాసిక్యూట్ చేయడంతో పాటు వాటిని మూసి వేస్తామనే హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మటన్, చికెన్ షాపుల వ్యర్థాలు బహిరంగంగా వేయకుండా కవర్లను అందజేస్తామన్న అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి హామీ అమలు కాలేదు. మూడు నెలల పాటు వీధికుక్కల స్పెషల్ డ్రైవ్, వీధికుక్కల సమాచారం కోసం ప్రత్యేక యాప్ వంటివి మాటలకే పరిమితమయ్యాయి. సినిమాలు, టీవీల్లో స్లైడ్లు, షార్ట్ ఫిల్మ్, వీడియో కాంటెస్ట్ వంటి వాటితో సహ మిగతా అంశాలు మరచిపోయారు. వీధికుక్కల సంరక్షణకు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలూ అటకెక్కాయి. రాత్రి సమయాల్లోనూ వీధికుక్కలను పట్టుకోవడం, వీధికుక్కల దత్తత వంటివి పట్టింపు లేకుండా పోయాయి. కుక్కలకు ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతామన్న మాటలు కొద్దిరోజులే అమలయ్యాయి. కుక్కలు కనిపించిప్పుడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కొద్దిరోజులు మాత్రం నిర్వహించారు. ఇంతే చేయగలం.. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్రప్రభుత్వ యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)రూల్స్ ,కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ బైలాస్ మేరకు కుక్కల సంతతి తగ్గించడం, రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ (ఏఆర్) వ్యాక్సిన్ వేయడం మాత్రమే తాము చేయగలమని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వాటితోపాటు ఫంగస్ ఇన్ఫెక్షన్ల వంటివి సోకకుండా ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్లు వేస్తున్నామంటున్నారు. కాగా.. సీఎం ఆదేశాల నేపథ్యంలో కుక్క కాట్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వెటర్నరీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. లెక్కకు మిక్కిలిగా.. ⇒ జీహెచ్ఎంసీ గణాంకాల మేరకు పదేళ్లలో 8మంది చిన్నారుల మరణాలు, ఐపీఎం లెక్కల మేరకు 3,36,767 మంది కుక్కల బారిన పడ్డట్లు లెక్కలున్నా, అవి అంతకంటే ఎక్కువగా ఉంటాయని అంచనా. ⇒ 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో ఏళ్ల బాలిక మృతి. ⇒ 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ⇒ 2020లో అమీర్పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. ⇒ 2020 ఆగస్ట్లో లంగర్హౌస్లో నలుగురు చిన్నారులకు గాయాలు. ⇒ 2021 జనవరి 30 బహదూర్పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ⇒ 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. ⇒ 2023 ఫిబ్రవరిలో అంబర్పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ⇒ 2023 డిసెంబర్లో షేక్పేటలో ఐదు మాసాల పసికందు కుక్కల దాడితో అసువులు బాశాడు. ⇒ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ⇒ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని హైకోర్టు ఆదేశాలున్నా, అమలుకు నోచుకోలేదు. నాలాలు, నిర్మాణాలూ కారణమేవీధికుక్కల బెడద పెరగడానికి ఖాళీ జాగాలు లేకుండా వెలుస్తున్న భవన నిర్మాణాలతో నగరం కాంక్రీట్ జంగిల్గా మారడం కూడా ఒక కారణమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. నాలాల పైకప్పులు, మెష్లతోనూ కుక్కల దాహార్తి తీరే దారి లేకుండా పోయిందంటున్నారు. ఖాళీ జాగాలుంటే నీరుండే ప్రాంతాలుంటాయని పేర్కొన్నారు. ఆహారం, నీరు దొరక్కపోవడం కుక్కలు పిచి్చపట్టినట్లు దాడులు చేయడానికి కారణమని అంటున్నారు. వర్షాకాలంలో చర్మవ్యాధుల బాధలతోనూ తట్టుకోలేక వీధికుక్కలు పిచి్చపట్టినట్లు కరుస్తాయని పేర్కొన్నారు. -
ఆశ పెట్టి.. దోచేసిన కి‘లేడీ’..
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల పేరిట ఓ వ్యక్తికి ఆశపెట్టింది ఓ కి‘లేడీ’. పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. లాభాల సంగతేమోకానీ అసలు సొమ్ము అయినా తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరించింది. ఎట్టకేలకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్(ఈఓడబ్ల్యూ) పోలీసులకు చిక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లికి చెందిన పానుగంటి ఇందిరాదేవిరెడ్డి అలియాస్ ఇందిరాలా ఇందిరాదేవిరెడ్డి నాగోల్లో దేవిఫుడ్స్, బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మదీనాగూడకు చెందిన ఎస్.సత్యనారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తాను ప్రవాసరాలినని, తనకు నాగోల్, మాదాపూర్, గచి్చ»ౌలి, నార్సింగి ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీల్లో అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాలు ఉన్నాయని నమ్మించింది. నకిలీ యాజమాన్యపత్రాలను కూడా సృష్టించి చూపించింది. ఫుడ్ ఇండస్ట్రీ, బ్యూటీ పార్లర్లో పెట్టుబడి పెడితే అధికలాభాలు వస్తాయని ఆశపెట్టి సత్యనారాయణ నుంచి రూ.3.06 కోట్లు వసూలు చేసింది. బాధితుడి వద్ద నుంచి రెండు కార్లను తీసుకొని తనఖా పెట్టింది. సూడో పోలీసులతో బెదిరింపులు.. అయితే ఆమె ఎంతకీ లాభాలు ఇవ్వడంలేదు. దీంతో లాభాలు కాదు కదా అసలు సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని నిలదీయగా తన ఇద్దరు స్నేహితులు పోలీసు అధికారులని పరిచయం చేసింది. వారితో కలిసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఇందిరాదేవిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈమె నుంచి రెండు కార్లు, ఐ–ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఈమె గతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడింది. ఈ కేసులో బాధితుడి నుంచి రూ.కోటి వసూలు చేసింది. -
ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
మామునూరు: అనారోగ్య కారణాలతో మనస్తాపం చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బుధవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజ నీరింగ్ కళాశాల ప్రాంగణంలోని వాచ్మెన్ నివాస గదిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మా ల గ్రామం మంగ్లీ తండాకు చెందిన కేలోత్ కిషన్, కవిత దంపతులు వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలోని ఓ గదిలో కుమార్తె నందు(17)తో కలిసి నివా సం ఉంటున్నారు. ఈ దంపతులు కళాశాలలో వంట మనుషులుగా పనిచేస్తున్నారు. నందు(నందిని)ఐనవోలు కస్తుర్బాగాంధీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనెల 9న తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో తరచూ అనారోగ్యానికి గురవడంతో మనస్తాపం చెంది బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు మధ్యాహ్నం గదికి వచ్చి చూడగా ఉరేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని వెంటనే కళాశాల యాజమాన్యం, పోలీసులకు తెలుపగా హుటాహుటిన పోలీసులు చేరుకుని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణవేణి తెలిపారు. జీవితంపై విరక్తి చెంది రఘునాథపల్లిలో యువతి.. రఘునాథపల్లి: జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రఘునాథపల్లికి చెందిన కురాకుల లక్ష్మయ్య, రేణుక దంపతుల కూతురు కావ్య (23)కు మూడేళ్ల క్రితం స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండకు చెందిన అడిగం మహేందర్తో వివాహమైంది. వివాహమైన మూడు నెలలకే దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కావ్య పుట్టింటికి వచ్చింది. పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా.. కాపురానికి తీసుకెళ్లకపోవడంతో భర్తపై హనుమకొండలోని మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రఘునాథపల్లిలో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. ఈ క్రమంలో జీవి తంపై విరక్తి చెందిన కావ్య బుధవారం పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు చూసి అపస్మారక స్థితిలో ఉన్న కూతురును జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
అమ్మా.. ఎంత పనిచేశావు..!
మేడిపల్లి: ‘అమ్మా.. మమ్మల్ని ముద్దుగా పెంచావు. ఎంత అల్లరి చేసినా ఓపికగా భరించా వు.. అందరితో ఆడుకుంటుంటే మురిసిపోయావు. మేమే నీ లోకం.. మేమే నీ సర్వస్వం అ న్నట్లు మెదిలావు.. అంతలోనే మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావా అమ్మా.. ఇక మాకు దిక్కెవరు.. మమ్మల్ని ఎవరు లా లిస్తారు.. ఎవరు బుజ్జగించి బువ్వ తినిపిస్తారు అ మ్మా.. అనే రీతిలో ఆ చిన్నారులు తల్లి మృతదేహం వద్ద కనిపించిన తీరు కంటతడి పెట్టించింది. క్షణికావేశంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అటు పుట్టింట్లో.. ఇటు మెట్టింట్లో తీరని శోకాన్ని మిగిలి్చంది. ఈ విషాధ ఘటన భీమారం మండలంలోని కమ్మరిపేటలో చోటుచేసుకుంది. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పాక లక్ష్మి, రాజం కూతురు శ్రావణిని కమ్మరిపేట గ్రామానికి చెందిన తిపిరి నరేశ్కిచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఇద్దరు కుమారులు శ్రాహన్స్(4), రుద్రాన్స్ (ఏడాది) ఉన్నారు. నరేశ్ తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. శ్రావణి బీడీలు చుడుతోంది. ఉన్నంతలో హాయిగా ఉంటున్నారు. ఈ క్రమంలో శ్రాహన్స్కు ఐదు రోజులుగా జ్వరం వస్తోంది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని నరేశ్ శ్రావణికి చెబుతున్నాడు. తానే తీసుకెళ్లాలంటే ఎలా అని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం ఇంట్లోకి వెళ్లి క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జగిత్యాల ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్కు తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘ఎంత పనిచేశావు బిడ్డా.. నీ పిల్లలు పసిమొగ్గలని గుర్తుకురాలేదా.. ఆ యముడే మదిలో నుంచి జ్ఞాపకాలు తీసేసాడా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. విగతజీవిగా మారిన భార్య మృతదేహాన్ని చూస్తూ భర్త నరేశ్.. అమ్మకు ఏమైంది నాన్న అంటూ నాలుగేళ్ల కొడుకు.. ఏం జరుగుతుందో తెలియక బోసిపోయిన ముఖంతో ఏడాది కుమారుడు.. మీ అమ్మ ఇకరాదు బిడ్డా అని ఎలా చెప్పాలో తెలియక బరువెక్కిన హృదయంతో దిక్కులు పిక్కటెల్లేలా రోదించారు శ్రావణి తల్లిదండ్రులు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఉన్న శ్రావణి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తన ఇద్దరు పిల్లలతోపాటు కుటుంబ సభ్యులకు కడుపుకోతను మిగిలి్చంది. పెద్ద కుమారుడితో శ్రావణికి తలకొరివి పెట్టించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. -
గూండారాజ్.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
మాటలకందని మహా క్రౌర్యం.. నారావారి ఏలుబడిలో నరనరాన ఉన్మాదాన్ని నింపుకున్నట్లు పసుపుగూండాలు పేట్రేగిపోతున్నారు.. పల్నాడులో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్త కొబ్బరి బొండాల కత్తితో తెగబడ్డాడు. వైఎస్సార్సీపీ కార్యకర్తను అత్యంత దారుణంగా నరికేశాడు. పసుపు గూండాల బరితెగింపునకు ఈ ఘటన పరాకాష్ట. రాష్ట్రంలో 40 రోజులుగా అమలవుతున్న ‘రెడ్బుక్ రాజ్యాంగం’ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసింది. హత్యలు, దాడులు, గృహదహనాలు, ప్రభుత్వ–ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. పచ్చముఠాలకు సెల్యూట్ చేస్తూ పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుంది. టీడీపీ రౌడీలు ఆయుధాలు చేతబట్టి కాలకేయుల్లా దాడులకు తెగబడుతున్నారు. ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఏపీ ముఖచిత్రం... రెడ్బుక్ రాజ్యాంగంతో నెలకొన్న అరాచక రాజ్యం. సాక్షి ప్రతినిధి, గుంటూరు: తొలి ఏకాదశి పర్వదినం.. ఎటు చూసినా కోలాహలం.. పల్నాడులో రామలింగేశ్వరుడి దర్శనం కోసం కిక్కిరిసిన భక్త జన సందోహం.. బందోబస్తు విధుల్లో వందల మంది పోలీసులు.. స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ.. బుధవారం రాత్రి 7.30 గంటల సమయం.. రాజకీయ కక్షలతో ఒక్కసారిగా పచ్చ ముఠాల ఉన్మాదం పురి విప్పింది! వినుకొండ నడిబొడ్డున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కొబ్బరిబొండాలు నరికే కత్తితో దారుణంగా నరికి చంపారు. వందలాది మంది చూస్తుండగానే నిత్యం రద్దీగా ఉండే ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. మరోవైపు సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కొబ్బరిబొండాల కత్తితో మాటు వేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ (27) రాత్రి ఇంటికి వెళ్తుండగా పట్టణ తెలుగు యువత నాయకుడు ఎస్కె.జానీ తమ్ముడైన జిలానీ మరో ఇద్దరితో కలసి ముండ్లమూరు బస్టాండ్ సెంటర్లో మాటు వేశాడు. రషీద్ అక్కడికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ హఠాత్ పరిణామంతో బాధితుడి చెయ్యి తెగిపోయి దూరంగా పడిపోయింది. అయినా ఆగకుండా నిందితుడు కిందపడిపోయిన రషీద్పై కూర్చుని విచక్షణా రహితంగా నరుకుతూనే ఉన్నాడు. తర్వాత తాపీగా అక్కడి నుంచి వెళ్లాడు. పోలీసులకు హత్యాయుధాన్ని అప్పగించి లొంగిపోయాడు. ఈ పాశవిక ఘటనతో వినుకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న రషీద్ను పోలీసులు వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యశాల వద్దకు చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్తెనపల్లిలో.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల భాగ్యనగర్ కాలనీలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీకీ చెందిన ఓ మహిళ కుటుంబంపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఘటనలో గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఒక్కసారిగా మళ్లీ పల్నాడులో దాడులు మొదలు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సినిమా అయిపోలేదని, ఇంకా ఉందంటూ టీడీపీ నేతలు బరి తెగించి హెచ్చరికలు చేస్తుండటం గమనార్హం.కొత్త ఎస్పీ రాగానే మళ్లీ మొదలు..సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడులో దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్లకు పాల్పడిన టీడీపీ నేతలు మరోసారి వైఎస్సార్ సీపీ కార్యకర్తలే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. ఎన్నికల రోజు దాడులు, విధ్వంసాలకు సంబంధించి అప్పటి ఎస్పీ బిందుమాధవ్తో పాటు పలువురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. తాజాగా కంచి శ్రీనివాసరావు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే పల్నాడులో హింసాకాండ తిరిగి మొదలైంది. ఎస్పీ స్వయంగా వినుకొండలో ఉన్న సమయంలోనే తెలుగు యువత నాయకుడి తమ్ముడు నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డాడు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ చేయకుండా వ్యక్తిగత కక్షలే కారణమని కొత్తగా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కంచి శ్రీనివాసరావు ఫక్తు రాజకీయ నేత మాదిరిగా వ్యాఖ్యానించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.ప్రభుత్వ హత్యలే: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి వినుకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ హత్య, సత్తెనపల్లిలో వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ కార్యకర్తల దాడులను చూస్తుంటే జిల్లా ఎస్పీని మార్చిన వెంటనే హింసకు తెగబడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ హింసాకాండను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఇవన్నీ సర్కారు హత్యలే. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలి.నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వంరాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. వినుకొండలో వైఎస్సార్సీపీ నేత రషీద్ హత్యే ఇందుకు నిదర్శనం. రషీద్ హత్యోదంతాన్ని సోషల్ మీడియాలో చూడలేకపోయాం. టీడీపీ నేతలు కిరాతకంగా చంపేశారు. రోజుకో దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది. పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా కత్తులతో దాడి చేసి రోడ్లపై చంపేస్తుంటే ప్రజలు రోడ్లపై ఎలా తిరుగుతారు. చంద్రబాబు, లోకేశ్ ప్రోద్బలంతోనే ఈ హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం జరుగుతోంది. – అంజాద్ బాషా, మాజీ మంత్రిటీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్టఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి పల్నాడు జిల్లాలో టీడీపీ హత్యా రాజకీయాలనే నమ్ముకుంటోంది. పోలింగ్ రోజు, ఆ తరువాత ప్రతి నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలతో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను టార్గెట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు చోటుండకూడదు. వినుకొండ పట్టణ నడిబొడ్డున అతి కిరాతకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తను హత్య చేయడం అమానుషం. టీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్ట.– అంబటి రాంబాబు, మాజీ మంత్రిచూస్తూ ఊరుకోంవినుకొండలో ప్రజలంతా తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటుంటే.. టీడీపీ నేతలు మాత్రం వైఎస్సార్సీపీ కార్యకర్తను చంపి ప్రజలను భయాందోళనకు గురి చేశారు. టీడీపీ హత్యారాజకీయాలకు ఓ ముస్లిం యువకుడు బలైపోయాడు. దీనికి చంద్రబాబు, లోకేశ్, జీవీ ఆంజనేయులే కారణం. వారిపై కేసులు నమోదు చేయాలి. కొత్త ఎస్పీ రాగానే టీడీపీ రౌడీలు పేట్రేగిపోయారు. టీడీపీ హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోం.– బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యేశాంతి భద్రతలు లోపించాయిఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఎటువంటి వివక్ష లేకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ది, సంక్షేమ పాలన అందించాం. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పల్నాడులో శాంతి భద్రతలు లోపించాయి. ఫలితాలొచ్చిన రోజే జిల్లాలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వేలాది కుటుంబాలు జిల్లాను వదిలి వెళ్లిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ హత్యారాజకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్ పురుడుపోసుకొనేలా ఉంది. కొత్తగా వచ్చిన ఎస్పీ జిల్లాలో టీడీపీ రౌడీ మూకలను కట్టడి చేయాలి.– కాసు మహేష్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యేక్రూరంగా చంపేశారువైఎస్సార్సీపీ నాయకుడు రషీద్ను రెండు చేతులు నరికి క్రూరంగా చంపేశారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. లోకేశ్ రెడ్బుక్ ప్రకారం హత్యా రాజకీయాలు చేస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారు. రెడ్బుక్లో పేర్లు ఉన్న ఒక్కొక్కరిని హత్య చేస్తూ వస్తున్నారు. తన అనుంగు పోలీసు అధికారులకు కీలకమైన పోస్టింగ్లు ఇచ్చి వారి ఆధ్వర్యంలో రెడ్ బుక్ను అమలు చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు.– ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మర్రి రాజశేఖర్కిరాతకం రాజ్యమేలుతోందికూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కిరాతకం రాజ్యమేలుతోంది. వినుకొండలో వైఎస్సార్సీపీ నాయకుడు రషీద్ను టీడీపీ వ్యక్తులు ఎంత కిరాతకంగా చంపారో యావత్ ప్రపంచం చూసింది. ఆటవికంగా రెండు చేతులు నరికి క్రూరంగా చంపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రెడ్బుక్కి సెల్యూట్ చేస్తున్నారు. రషీద్ హత్యోదంతానికి కారకులు చంద్రబాబు, లోకేశ్లే. ఎన్నికల తర్వాత పల్నాడులో ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి.– ఖాదర్బాషా, అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం వ్యక్తిగత కక్షల వల్లే హత్య జరిగిందట!దర్యాప్తు చేయకుండానే తేల్చేసిన పల్నాడు జిల్లా ఎస్పీప్రభుత్వ పెద్దల ఒత్తిడితో వెంటనే మీడియాకు వెల్లడిగంటల వ్యవధిలోనే ఎందుకంత తొందర?ఫక్తు టీడీపీ నాయకుడిలా వ్యవహరించిన వైనంనరసరావుపేట: వ్యక్తిగత కక్షల వల్లే పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్ అనే వ్యక్తిని జిలాని అనే వ్యక్తి నరికి చంపాడని జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు తేల్చేశారు. మృతుడు వైఎస్సార్సీపీ కార్యకర్త. చంపిన వ్యక్తి టీడీపీలో స్థానికంగా క్రియాశీలకం. అయినప్పటికీ వ్యక్తిగత కక్షల వల్లేనంటూ ఎస్పీ గంటల వ్యవధిలో స్పష్టం చేయడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే ఎలాంటి దర్యాప్తు లేకుండానే నిర్ధిష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎక్కడైనా ఒక హత్య జరిగితే చాలా తతంగం ఉంటుంది. పలు ఆధారాలు, దర్యాప్తు అనంతరం హత్యకుగల కారణాన్ని వెల్లడిస్తుంటారు. అలాంటిది ఏమీ లేకుండానే ఎస్పీ హడావుడిగా బుధవారం అర్ధరాత్రి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సంఘటనలో పార్టీల ప్రమేయం లేదని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైనా, ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రజలు అందరూ సంయమనం పాటించాలని కోరారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Related News by category
Advertisement