Mango
-
పేపర్ కట్టు... లాభాలు పట్టు!
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేరుశెనగ తర్వాత ఎక్కువ మంది రైతులకు ఆదాయం వచ్చే పంట మామిడే. మామిడి తోటల్లో కాయలకు కవర్లను కట్టే విధానం గత రెండు మూడేళ్లుగా కొందరు రైతులు అవలంభిస్తున్నారు. దీంతోపాటు కొందరు కర్ణాటకకు చెందిన రైతులు ఇక్కడి రైతుల మామిడి తోపులను లీజుకు తీసుకొని క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ విధానాలతో తోటలను సస్యరక్షణ చేసి నిమ్మకాయ సైజులో మామిడి కాయలున్న దశలోనే వాటికి పేపర్ను కట్టడం ద్వారా కాయల దిగుబడిలో నాణ్యతను పెంచుతున్నారు. ఈ పేపర్ మ్యాంగోకు మార్కెట్లో ఎక్కువ ధర పలికి మంచి లాభాలను గడిస్తున్నారు. దీన్ని గమనించిన ఇక్కడి మామిడి రైతులు సైతం తోటల్లోని కాయలకు పేపర్ను చుట్టడాన్ని విస్తృత స్థాయిలో చేపడుతున్నారు. కవర్లతో కాయలకు రక్షణసా«ధారణంగా మామిడి కాయలు కోతకొచ్చే ముందు కాయలు నిమ్మసైజులోకి రాగానే కవర్లను కట్టుకో వాల్సి ఉంటుంది. దీంతో కాయలపై సూర్యరశ్మి పడ కుండా, ఎలాంటి క్రిమికీటకాలు సోకకుండా కాయలు నాణ్యంగా ఉంటాయి. దీంతోపాటు కాయల సైజు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా కాయ రంగు, షైనింగ్ వస్తుంది. పురుగులు, క్రిమికీటకాలు, తెగుళ్ళు, బంకపేను లాంటివి కాయపై కనిపించవు. దీంతో వీటిని ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులు సైతం అధిక ధరలకు కొనేందుకు అవకాశం ఉంటుంది. వీటికి మార్కెట్లోనూ మంచి ధర పలుకుతోంది.హెక్టారుకు పది వేల కవర్లుఉద్యానవనశాఖ అంచనా ప్రకారం హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. కవర్ ధర రూ.2గా ఉంది. హార్టికల్చర్ శాఖ కవర్కు రూపాయి రాయితీ ఇస్తోంది. అంటే హెక్టారుకు పదివేల కవ ర్లకు రూ. 20వేలు అయితే రైతులు సంబంధిత రైతు సేవాకేంద్రంలో రూ.10వేలను చెల్లించి రిజిస్టర్ చేయించుకొంటే దానికి ప్రభుత్వం రూ.10వేలను కలిపి హెక్టారుకు పదివేల కవర్లను ఆ రైతుకు అందిస్తుంది. ప్రస్తుతం కవర్లకోసం ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు మొదలైయ్యాయి. రైతులు ప్రైవేటుగా కావాలనుకుంటే ఇండియామార్ట్, అమెజాన్లాంటి ఆన్లైన్లోనూ పొందవచ్చు. వీటిని మ్యాంగో ప్రొటెక్షన్ గ్రోత్ పేపర్ కవర్లుగా పిలుస్తారు. కవర్లు కట్టిన రైతులకు పండగే.మామిడి సీజన్ ముగుస్తున్న దశలో మార్కెట్కు వచ్చే నీలం మామిడికి ఏటా ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. జిల్లాలోని మొత్తం మామిడి సాగులో 20 శాతం మాత్రమే నీలం మామిడి సాగవుతోంది. ఇది మామిడిలో ఆఖరు సీజన్ ఫ్రూట్గా పేరుంది. ఇక్కడి రైతులు సహజ పద్ధతులతో మామిడిని సాగుచేయడమే కాకుండా కాయలకు కవర్లను కట్టడంతో సరుకు నాణ్యంగా ఉంటోంది. దీంతో వ్యాపారులు పోటీపడి మరీ అధిక ధరకు మామిడిని కొంటుండడంతో ధరలు ఆశాజనంగా మారాయి. గతేడాది నీలం రకానికి కవర్లు కట్టినందున టన్ను ధర రూ.లక్షను దాటింది.ఇక్కడి తోపులు లీజుకు పెట్టుకొని..కవర్లు్ల కట్టడం ద్వారా నాణ్యమైన సరుకును పొందే విధానంపై ఎక్కువ అవగాహన కలిగిన కర్ణాటక వ్యాపారులు, రైతులు ఇక్కడి మామిడి తోపులకు లీజుపెట్టుకుంటున్నారు. ఆపై వీరే తోపుల సస్యరక్షణ చేసి కాయలకు పేపర్లు కట్టి ఎక్కువ ధర దక్కేలా బయటి దేశాలకు నేరుగా ఎగుమతి చేస్తున్నారు. దీన్ని గమనించిన ఉమ్మడి జిల్లా రైతులు సైతం ఈ విధానాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళుతున్నారు.కొమ్మఅంటు (టాప్వర్కింగ్) కూడా..ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తోతాపురి రకం మామిడిì కాయలు పల్ఫ్కోసం కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తూ... గ్యారెంటీ మార్కెటింగ్ ప్రయోజనం పొందుతున్నారు. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్ వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్వర్కింగ్ జూలై, ఆగస్టునెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాత తోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్దతులు ప్రత్యామ్నాయంగా మారాయి.రైతులను ప్రోత్సహిస్తున్నాంజిల్లాలోని మామిడి రైతులకు కవర్లను కట్టడంపై అవగాహన కల్పిస్తున్నాం. మామిడి సాగు చేస్తున్న రైతులకు ఏటా సమావేశాలను నిర్వహించి కవర్లను కట్టడం ద్వారా కలిగే మేలును వివరిస్తున్నాం. హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం రైతు రూ.10వేలను చెల్లిస్తే మా శాఖ రూ.10వేలను కలిపి కవర్లను అందిస్తున్నాం. అవసరమైన రైతులు ఆర్ఎస్కేల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. – మధుసూదన్రెడ్డి, చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ అధికారికాయ నాణ్యత బాగుంటుందిగిట్టుబాటు ధర లభించాలంటే మామిడి రైతులు కాయలకు పేపర్ బ్యాగులను అమర్చాలి. దీంతో కాయల నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర వస్తుంది. – నయాజ్, మామిడి వ్యాపారి, పలమనేరుటాప్వర్కింగ్తో భారీ లాభాలు...టాప్వర్కింగ్తో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఉన్న తోటల్లో కాయలకు కవర్లను కట్టడం ద్వారా సరుకు నాణ్యత పెరిగి మంచి ధరలు వస్తాయి. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
ఫలరాజుపై మంచు పంజా!
మామిడి రైతుకు దిగుబడి దిగులు పట్టుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది మామిడి పూత ఆలస్యమవుతోంది. జనవరి (January) మాసం ప్రారంభమై పక్షం రోజులైనా ఆశించిన మేర పూత రాలేదు. ఏటా డిసెంబర్ చివరికల్లా మామిడిచెట్లు పూతతో నిండి కళకళలాడేవి. ఈసారి చలి తీవ్రత, పొగమంచు ప్రభావంతో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక్కడ కనిపిస్తున్న మామిడితోట (Mango Field) కర్నూలు మండలం శివరామపురం గ్రామం రైతుది. ఎలాగైనా ఈసారి మంచి దిగుబడులు సాధించాలని పైరు చీడ పీడల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వేలాది రూపాయలు పెట్టి ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేశాడు. చివరకు చలి తీవ్రత, పొగమంచు ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటి వరకు చెట్లకు పూత పూయలేదు.కర్నూలు(అగ్రికల్చర్): ఈసారి వ్యవసాయం రైతులకు కలిసి రాలేదు. తొలుత అధిక వర్షాలు, తర్వాత వర్షాభావంతో ఖరీఫ్(Kharif) నిరాశకు గురి చేస్తే, వరుస తుఫానులు రబీ ఆశలను దెబ్బతీశాయి. ఈ క్రమంలో కొందరు రైతులు మామిడి తోటలపై నమ్మకం పెంచుకుంటే ప్రస్తుతం నెలకొన్న చలి తీవ్రత ప్రతికూలంగా మారింది. మామిడి తోటలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో మామడి తోటలు భారీగానే ఉన్నాయి. మామిడితోటలకు పెట్టింది పేరు బనగానపల్లె ప్రాంతం. బనగానపల్లె, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, పాణ్యం, వెల్దురి, బేతంచెర్ల తదితర మండలాల్లో భారీగా మామడి తోటలున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వ ప్రోత్సాహంతో 2019 నుంచి 2024 వరకు ఉమ్మడి జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా అభివృద్ధి చెందాయి. ఒకవైపు ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీ ఇస్తుండటం, మరోవైపు ఉద్యాన శాఖ ఆకర్షనీయమైన రాయితీల వల్ల మామిడితోటలు పెరిగాయి.కర్నూలు జిల్లాలో విభిన్న పరిస్థితిజిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మామిడి పూత కొంత కనిపిస్తుండగా..తూర్పు ప్రాంతంలో ఇంకా పట్టే దశలోనే ఉంది. ఈభిన్న పరిస్థితికి వాతావరణంలో మార్పే కారణంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో చలి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు 10–11 డిగ్రీలకు పడిపోయాయి. ఈ వాతావరణం మామిడికి ఇబ్బందికరంగా మారింది. చల్లని వాతావరణం ఉంటే తోటల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. నేడు పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మామిడిలో కొత్త చిగుళ్లు కనిపిస్తున్నాయి. పత్తికొండ, దేవనకొండ. తుగ్గలి, గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల్లో 50 శాతం వరకు మామిడి పూత వచ్చింది. వెల్దుర్తి, ఓర్వకల్లు, బేతంచెర్ల, అవుకు, బనగానపల్లి, కృష్ణగిరి, కల్లూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకే పూత వచ్చింది. మామూలుగా అయితే జనవరి మొదటి పక్షంలోపు అన్ని ప్రాంతాల్లోని మామిడిలో 80 శాతంపైగా పూత రావాలి. వాతావరణం చల్లగా ఉండటం, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా పలు ప్రాంతాల్లో పూత ఆలస్యమవుతోంది. ఒకతోటలో 100 చెట్లు ఉంటే ఇందులో 35–40 శాతం చెట్లు పూతకు వచ్చాయి. మిగిలిన చెట్లలో పూత ఆలస్యమవుతోంది. జనవరి మొదటి పక్షం గడుస్తున్నా ఆశించిన మేర పూత పట్టకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు చలి తీవ్రత వల్ల తేనెమంచు, పురుగుల బెడద పెరుగుతోంది. ఇది మామిడి రైతులను నిరాశకు గురి చేస్తోంది.వచ్చిన పూత నిలిచేనా...కొన్ని ప్రాంతాల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ నిలిస్తేనే కాపు బాగుంటుంది. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పూత పిందె రాలిపోతుంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో ఆరంభంలో పూత బాగానే వచ్చినప్పటికి తర్వాత ఎండల ప్రభావంతో 60 శాతంపైగా రాలిపోయింది. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో పూత విశేషంగా వచ్చినప్పటికి ఎంత వరకు నిలిచి కాపుగా మారుతుందనేది ప్రశ్నార్థకం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.ఇందులో కర్నూలు జిల్లాలో 4848 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10,167 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు 40 శాతం తోటల్లో 50 శాతంపైగా పూత వచ్చింది. 50 శాతం తోటల్లో 30 శాతం వరకే పూత వచ్చింది. 10 శాతం తోటల్లో ఇంకా పూత రాలేదు. పూత రావడంలో హెచ్చు తగ్గులుండటానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఉద్యాన అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి చెందిన మామిడిలో 70 నుంచి 80 శాతం వరకు బేనిసా ఉంటోంది. బేనిసా చెట్లు ఒక ఏడాది బాగా కాపు ఇస్తే... మరుసటి ఏడాది కాపునకు రావు. మామిడిలో చాల వరకు పూత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే పూతను బట్టి మామడి కొనుగోలు యత్నాలు జరుగుతాయి. పూత బాగా నిలిస్తే ఎకరాకు 7–8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ సారి వాతావరణం ప్రతికూలతతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.గతేడాది పూత బాగుండేదినాకు రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. గతంలో ఈ సమయానికి మామిడి చెట్లకు పూత బాగా ఉండేది. ఇప్పటి వరకు ఆశించిన మేర పూత లేదు. తేమశాత ఎక్కువ కవడామో లేక వాతావరణ ప్రభావమో తెలియదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట రాకపోతే ప్రభుత్వం అదుకోవాలి. – కురువ శంకర్, మామిడి రైతు, పూడురు గ్రామందిగుబడిపై ప్రభావం నేను బనగానపల్లె, పాణ్యం, బేతంచర్ల మండలాల్లో సుమారు 14 ఎకరాల తోటలను రూ.3 లక్షల కౌలు ఇచ్చి తీసుకున్నాను. దీనికితోడు మందుల పిచికారీ తదితర వాటి కోసం ల్చక్షకు పైగా ఖర్చు చేశాను. సాధారణంగా ఈ సమయానికి పూత వచ్చి ఉండాలి. ఆలస్యం కావడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది.– పాంషా, మామిడి తోటల కౌలు రైతు, బనగానపల్లెమామిడిలో పూతరాకపోతే ఇలా చేయాలి పలు ప్రాంతాల్లో మామిడిలో పూత రావడం ఆలస్యమ్చవుతోంది. పూత రాని పక్షంలో 13–0–45 రసాయన ఎరువు 10 గ్రాములు, 3 గ్రాముల సల్పర్, 1.6 ఎంఎల్ మోనోక్రోటోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు పూత రానితోటల్లో పొగపెట్టాలి. ఇలా చేయడం ద్వారా పూత వచ్చే అవకాశం ఉంది. మరో 10–15 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోని అన్ని తోటల్లో పూత వచ్చే అవకాశం ఉంది. పూత వచ్చిన తర్వాత చెట్లకు ఎరువులు వేసి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత వచ్చిన తోటల్లో చీడపీడల యాజమాన్యంలో భాగంగా సాఫ్–2 జిఎం, క్లోరోఫైరిఫాస్ 2 ఎంఎల్, బోరాన్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత ఉన్నట్లైతే ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 గ్రాములు, హెక్షాకొనజోల్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. – పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు -
ఫ్యాషన్ టైకూన్ ఇసాక్ ఆండిక్ కన్నుమూత
ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు."మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఇస్తాంబుల్లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్ బ్రాండ్ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్వర్త్ 4.5 బిలియన్ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.తిరుగులేని బ్రాండ్దాదాపు 2,800 స్టోర్లతో యూరప్లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు. -
ఆహా ఆవకాయ! ఒక ముద్ద పడిందంటే.. ఈ రుచులను ఎప్పుడైనా ట్రై చేశారా? (ఫొటోలు)
-
తోతాపురి పండు.. ఎగుమతుల్లో ట్రెండు
చిత్తూరు అర్బన్: తోతాపురి మామిడి కారణంగా చిత్తూరుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. తోతాపురి మామిడి కోసం ఏకంగా 48 దేశాలు చిత్తూరు వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి పంపిస్తున్న మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్)ను ఆయా దేశాల పౌరులు అపారమైన ప్రేమతో ఆస్వాదిస్తున్నారు. ఎగుమతుల్లో మరే దేశానికి లేని ప్రత్యేకత చిత్తూరు వల్లే భారత్కు దక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తూరు మామిడిపై కాస్త దృష్టి సారిస్తే ఎగుమతుల్లో మరింతగా ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1.12 లక్షల హెక్టార్లలోఏ రాష్ట్రంలో లేనివిధంగా మామిడి ఉమ్మడి చిత్తూరులో సాగవుతోంది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి జిల్లాల్లో 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి (బెంగళూరు) రకానికి చెందిన మామిడి చిత్తూరుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి0ది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 వేల హెక్టార్లు తోతాపురి, 42 వేల హెక్టార్లలో టేబుల్ రకాలకు చెందిన మామిడి సాగులో ఉంది. రమారమి ఏటా 7.5 లక్షల టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుండగా.. ఇందులో 5 లక్షల టన్నులతో తోతాపురి సింహభాగంలో ఉంది. తోతాపురి రకం కాయలను పండుగా తినడానికి, పచ్చళ్లకు ఉపయోగించరు. ఇది మృదువుగా, తీపిగా ఉండటంతో దీనిని పూర్తిగా గుజ్జు (పల్ప్) కోసమే ఉపయోగిస్తారు. మామిడి కాయల్ని వేడి నీటిలో శుభ్రంచేసి, టెంకను తొలగించి, గుజ్జును యంత్రాల ద్వారా వేరు చేస్తారు. సహజంగానే ఇది తియ్యగా ఉండటంతో కొద్దిమొత్తంలో చక్కెరను కలిపి మొత్తం గుజ్జును గాలి తీసేసిన కంటైనర్లలో నిల్వచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దేశంలోనూ డిమాండే దేశీయంగా తయారయ్యే పల్పీ, ఫ్రూటీ, స్లైస్, డాబర్, బి–నేచురల్ వంటి కంపెనీలు ఈ గుజ్జుతోనే మామిడి పానీయాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ కంపెనీలు సైతం ఇక్కడి నుంచే గుజ్జును సేకరిస్తాయి. చిత్తూరు జిల్లాలో 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోలెండ్, ఉక్రెయిన్, బెల్జియం, ఆ్రస్టేలియా, క్రోషియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రుమేనియా, ఆల్బేనియా, ఐర్లాండ్, సెజియా, ఐస్లాండ్, స్లోవేనియా, హంగేరి, ఫిన్లాండ్, సెర్బీ, మాల్టా, లాక్సంబర్గ్, సిప్రస్, స్లోవేకియా, మోనాకో లాంటి 48 దేశాలకు చిత్తూరు నుంచే మ్యాంగో పల్ప్ ఎగుమతి అవుతోంది. ఏటా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు 24 గంటలపాటు పనిచేస్తుంటాయి. ఐదేళ్లలో 9 లక్షల టన్నుల ఎగుమతి ఐదేళ్లలో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 9 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతి అయ్యింది. ఇది దేశంలోని మరే ప్రాంతానికి దక్కని గుర్తింపు. గుజ్జు ఎగుమతుల ద్వారా ఏటా సగటున రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్జిస్తోంది. 1.20 లక్షల మంది రైతులు, 2 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగాను, 4 లక్షల మంది పరోక్షంగా మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తే.. భారత్తో పాటు ఈజిప్్ట, ఆఫ్రికా, మెక్సికో, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా అంతర్జాతీయ మార్కెట్కు మామిడి గుజ్జు ఎగుమతులు ప్రారంభించాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జుపై 32% పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని తొలగిస్తే వ్యాపారులు, ఎగుమతిదారులు మామిడి సేకరణ ధరను పెంచుతారు. తద్వారా రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా.. చిత్తూరు నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జును కంటైనర్ల ద్వారా చెన్నైకు తీసుకెళ్లి, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు పంపుతున్నారు. దీనివల్ల ఎగుమతి ప్రోత్సాహకాలు చెన్నైకి అందుతున్నాయి. అలాకాకుండా చిత్తూరు నుంచే కంటైనర్లతో గుజ్జును ఉంచి సీల్ చేసి, ఇక్కడి నుంచి చెన్నైకు పంపిస్తే ఆ ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి లభించడంతోపాటు పారిశ్రామిక రంగానికి అదనపు ఊతం ఇచ్చినట్టవుతుంది. దీనికోసం చిత్తూరులో ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ)ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మధ్యాహ్న భోజన మెనూలో చేర్చాలి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెడుతున్నట్టే పిల్లలకు మ్యాంగో పల్ప్ కూడా ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు మ్యాంగో పల్ప్ ఇస్తే ప్రయోజనం చేకూరుతుంది. కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో మ్యాంగో పల్ప్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే చిత్తూరు పల్ప్కు పేటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. – గోవర్దన బాబి, చైర్మన్, ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్, సౌత్జోన్, చిత్తూరు -
మామిడి, అరటి.. ఉత్పత్తిలో మనమే మేటి
సాక్షి, అమరావతి: అరటి పండ్లు, మామిడి ఉత్పత్తిలో దేశంలోనే అంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. అరటి పండ్లను ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 18.1 శాతంతో మొదటి స్థానంలో ఉందని.. అలాగే మామిడి ఉత్పత్తిలోనూ దేశంలోనే అత్యధికంగా 5.0 మిలియన్ మెట్రిక్ టన్నులతో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. దేశంలో ప్రధానంగా అరటి పండ్లు, మామిడి, ద్రాక్ష పండ్ల ద్రవ్యోల్బణం, ఉత్పత్తిపై ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఏపీ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయని.. ఇవన్నీ దేశం మొత్తం అరటి పండ్ల ఉత్పత్తిలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక వివరించింది.ఇక ఆంధ్రప్రదేశ్లో అరటి పండ్ల ఉత్పత్తి కేంద్రాలుగా తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కర్నూలు, కడప ఉన్నాయి. అలాగే, దేశంలో రెండో అతి ముఖ్యమైన పండు అరటి పండేనని నివేదిక తేల్చిచెప్పింది. ఇక దేశంలో అరటి పండ్ల ఉత్పత్తి 2012–13లో 26.5 మిలియన్ మెట్రిక్ టన్నులుండగా.. 2022–23 నాటికి అది 36.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. అలాగే, దేశం నుంచి అరటి ఎగుమతులు 2013–14లో 35 వేల మెట్రిక్ టన్నులుండగా.. 2022–23లో అది 376 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అరటిపండ్ల అతిపెద్ద వినియోగదారుగా మన దేశమే ఉందని కూడా తెలిపింది. దేశీయ ఫార్మ్గేట్ 2021–22లో అరటి కిలో ధర రూ.14 నుంచి రూ.15 ఉండగా.. 2022–23లో రెండింతలు పెరిగి కిలో రూ.27 నుంచి 28 రూపాయలైందని నివేదిక పేర్కొంది.మామిడి ఉత్పత్తి, సాగులో ఏపీ ఆధిపత్యం.. మరోవైపు.. మామిడి ఉత్పత్తి, సాగులోనూ ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో మామిడి సాగు విస్తీర్ణంలో 17 శాతం వాటాతో.. 5.0 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత 12 శాతం వాటాతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం మామిడి ఉత్పత్తిలో ఏపీ వాటా 23 శాతమని కూడా పేర్కొంది. మామిడి సాగు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలు దేశవ్యాప్తంగా 75 శాతం ఉత్పత్తి కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. -
ఈ డెజర్ట్తో గుండె ఆరోగ్యం పదిలం..!
మన ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కొన్ని డెజర్ట్లను మన ఆహారంలో భాగం చేసుకుంటే చాల రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాంటి డెజర్ట్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఫుడ్ గైడ్ టేస్టీ అట్లాస్ వెల్లడించిన ఉత్తమ డెజర్ట్ల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న ఈ డెజర్ట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉనాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందట. అదెలాగా? దీన్ని ఎలా తయారు చేస్తారు?ఆ డెజర్ట్ పేరు మామిడి స్టిక్కీ రైస్. ఇది థాయిలాండ్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన డెడర్ట్. దీన్ని అక్కడ ప్రజలు మ్యాంగో స్టిక్కీ రైస్గా పిలుస్తారు. ఈ డెజర్ట్ని గ్లూటినస్ రైస్, తాజా మామిడిపండ్లు, కొబ్బరిపాలను మిళితం చేసి తయారు చేస్తారు. ఈ డెజర్ట్ తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ మంచి పోషక విలువలు కలిగినవి. ముందుగా ఇందులో ఉపయోగించే పదార్థాలు ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.ఇందులో ఉపయోగించే అన్నంఈ పాయసం చేయడానికి గ్లూటినస్ రైస్ ఉపయోగిస్తారు. దీనిలోని కార్బోహైడ్రేట్లకి మంచి డైట్కి ఉపయోగపడే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. స్టిక్కీ రైస్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అదీగాక అధిక రక్తపోటు లేదా బరువు సమస్యలు ఉన్నవారికి ఈ డెజర్ట్ గొప్ప ఔషధం. కొబ్బరి పాలుకొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ల ప్రమాదాన్ని నివారించే యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంతేగాదు ధమనులలో ఫలకం కలిగించే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. గుండె జబ్బులకు దారితీసే రక్తంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కొబ్బరి పాలల్లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించి గుండె పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. మామిడి పండ్లు..మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . ఇవన్నీ రక్త నాళాలు విశ్రాంతి తీసుకునేలా రక్తపోటు స్థాయిలను తగ్గించి సాధారణ పల్స్ను ప్రోత్సహిస్తాయి. ఈ సమ్మర్ పండులో మాంగిఫెరిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం. ఇది గుండె కణాల్లోని మంట, ఆక్సీకరణ ఒత్తిడి. కణాల నశించడం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. అంతేగాదు జంతు అధ్యయనాలు మాంగిఫెరిన్ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కొవ్వు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నాయి.ఈ డెజర్ట్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఈ పుడ్డింగ్ కడుపులో చాలా తేలికగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల శరీరంలోని అనేక ఎంజైమ్ల స్రావాన్ని పెంచి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే గ్యాస్, ఉబ్బరం, వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుందివిటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డెజర్ట్, మితంగా తింటే శరీరంలో తెల్ల రక్త కణాల వృద్ధి అవుతాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలంలో వివిధ కాలానుగుణ వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.కంటి చూపును వృద్ధి చేస్తుందిఇందులో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటాయి డెజర్ట్ తయారీ..ఒక పాన్లో బెల్లం పొడితో పాటు ఒక కప్పు కొబ్బరి పాలను వేసి, రెండు పదార్థాలు కలిసే వరకు వేడి చేయండి. అయితే, పాలల్లో బెల్లం కరిగిపోయేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక పెద్ద గిన్నెలో వండిన జిగురుతో కూడిన అన్నం తీసుకుని దానిపై ఈ కొబ్బరి పాలు గ్రేవీ సగం పోయాలి. దీన్ని బాగా కలపి ఒక గంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక మామిడికాయ ముక్కను తీసుకుని ముక్కలు చేసి ఈ అన్నంలో వేశాక, మిగిలిన కొబ్బరిపాల గ్రేవిని ఇప్పుడు వేయాలి. చివరగా వేయించిన నువ్వులతో అందంగా అలంకరించాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టిక్కీ రైస్ మామిడి పాయసం రెడీ..!.(చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!) -
నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!
పండ్లలలో రారాజు మామిడి పండు. ఇది అంటే ఇష్టపడని వారుండరు. భారతీయ వంటకాల్లో ఈ మామిడితో చేసే రెసిపీలు అగ్రభాగన ఉంటాయి. ఈ మామిడితో చేపల కూర నుంచి మామిడి స్మూతీస్ వరకు వివిధ రకాల ప్రత్యేక వంటకాలు ఉంటాయి. వేసవిలో సెలవులతో గడిపే పిల్లలు సైతం ఇష్టంగా తినే పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండే. అలాంటి మామిడి పండు కోసం ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ మామిడిపండ్ల కోసం ఓ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుకుంటున్నాం?. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది?.దీని వెనుకున్న చరిత్ర..భారతీయ సంస్కృతితో మామిడిపండ్లకు ఉన్న సంబంధం ఐదు వేళ ఏళ్ల నాటిది. మామిడి అనే పేరు మలయన్ అనే పదం నుంచి ఉద్భవించింది. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి 1498లో కేరళకు వచ్చినప్పుడు "మాంగా"గా మార్చారు. కాలక్రమేణా దీనిని మ్యాంగోగా పిలుస్తున్నారు. ఇది జీడిపప్పు, పిస్తాపప్పుల జాతికి చెంందిన అనాకార్డియోసికి చెందింది. 1987లో, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మామిడి రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధ చెందిన పండ్లగా గుర్తించి ప్రతి ఏడాది జూలై 22న నేషనల్ మ్యాంగో డే జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకుంటున్నాం. భారత్లో మామిడి రకాలు: భారతదేశంలో వాణిజ్య రకాలు సహా మొత్తం 15 వందల రకాల మామిడిని పండిస్తారు. మామిడి ప్రధాన రకాలు ఒక్కొక్కటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.ఆరోగ్య ప్రయోజనాలు..మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.మామిడిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. 2021 లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మామిడి పండ్లు తినడం వల్ల అందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మారియ విల్లరీల్ గాంజాలేజ్ పాల్గొన్నారు.మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.మామిడిలోని విటమిన్ 'ఏ' కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయని, ముఖంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు.మామిడిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.(చదవండి: ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ మృతి..అంత ప్రమాదమా?) -
ప్రపంచంలోనే అతి పెద్ద మామిడితోట మనదగ్గరే.. ఆ కుబేరుడిదే!
పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్లోని జామ్నగర్లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 1.5 లక్షల కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది. -
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్కు సంబంధించిన స్టార్టర్ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్.. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేప«థ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది. సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా, దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా ‘రుచి’ంచే మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ జాబితాలో టాప్ 10లో నిలవగా.. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్ చికెన్, తందూరీ చికెన్ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నెం–1 గా మ్యాంగో లస్సీ... ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి జాబితాలో అగ్ర స్థానం దక్కింది. అదే విధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్ నిలిచింది. ఇది అనేకమందికి, నగర వాసులకు రోజువారీ అవసరం అనేది తెలిసిందే. ఫుడ్ లవర్స్ ఇష్టపడే బటర్ గార్లిక్ నాన్కు మూడో ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత అమృత్ సర్ కుల్చా, బటర్ చికెన్ వరుసగా నాల్గు, ఐదు ర్యాంక్లు దక్కాయి. ఆ తర్వాత మన హైదరాబాద్ బిర్యానీ ఆరు, షాహి పనీర్ ఏడు, చోలే భటూర్ ఎనిమిది, తందూరీ చికెన్ తొమ్మిది, కోర్మా పదో ర్యాంకును దక్కించుకున్నాయి. -
మండే ఎండల్లో కదిలి వచ్చిన మామిడిచెట్టు.. వైరల్ వీడియో
ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరూ.. ఒక్కో రకంగా తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తమ చేష్టలతో తోటి వారికి ప్రేరణగా నిలవాలని భావిస్తారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది. ఇందులో ఒక వ్యక్తి చేసిన పని చూసినవారంతా వాహ్.. అంటున్నారు. మరి అదేంటో మీరూ చూసేయండి...ఇన్స్టాలో షేర్ అయిన వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం వెనుకాల సీట్లో కుండీలో పెరుగుతున్న మామిడి మొక్క (చెట్టు)ను భద్రంగా కట్టి తీసుకెళ్తున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేశాడా? నిరంతర ప్రయాణంలో కూలర్లను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లలేం గనుక ఇలా తీసుకెళ్లాడా? లేక నర్సరీనుంచి మొక్కను కొనుగోలు చేసి తీసుకెళుతున్నాడా? పెద్దగా పెరిగిన మామిడి చెట్టును ఒకచోటు నుంచి మరో చోటుకి షిఫ్ట్ చేస్తున్నాడా అనేది స్పష్టత లేదు. కానీ కొంతమంది అద్భుతమైన ఐడియా అంటూ కమెంట్ చేశారు. ఇది కావాలనే చేసిన జిమ్మిక్కు అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sethumadhavan Thampi (@sethumadhavan_thampi)ఏది ఏమైనా గ్రోబ్యాగ్లో భారీగా పెరిగిన మామిడి చెట్టును బండిపై తీసుకెళ్లడం వింతగా అనిపిస్తోంది. అంతేకాదు దీనికి మామిడి కాయలు కూడా కనబడుతుండటం విశేషం. వేగానికి చెట్టు కొమ్మలు హాయిగా ఊగుతోంటే.. అంతకంటే గమ్మత్తుగా ఆ మామిడికాయలు నాట్యం చేస్తున్నాయి. ఈ విన్యాసం చూడడానికి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ వీడియో లక్షకు పైగా లైక్లను పొందింది. ప్రస్తుతం ఈ వీడియో 'సేతుమాధవన్ థంపి' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెగ వైరల్ అవుతోంది. ఇవి చదవండి: మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే.. -
పండ్లలో రారాజు మామిడి.. కాదు కాదు అరటి
మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్ ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా భారత్దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే. -
ది బెస్ట్ మ్యాంగో రెసిపీల్లో మామిడి చట్నీ ఎన్నో స్థానం అంటే..!
పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది. వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్తో తయారు చేస్తారు. ఈ జ్యూస్ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!) -
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
వేసవిలో మామిడి పండ్ల జాతర అన్నట్లుగా రకరకాల వెరైటీలు వస్తుంటాయి. మామిడి పండ్ల అంటే ఇష్టపడని వారెవరూ ఉంటారు చెప్పండి. అయితే మనం మామిడి పండ్ల తొక్కును పడేసి తినేస్తుంటాం. కానీ మామిడి పండ్ల తొక్కలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవని అంటున్నారు. అవేంటో చూద్దామా..!మామిడి తొక్కలో ఏ, సీ, కే, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం, ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫైనాల్స్లు ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు 2008లో ప్రచురితమైన ఓక్లహోమ్ స్టేట యూనివర్శిటీ అధ్యయనంలో మామిడి తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే గాక బరువు కూడా అదుపలో ఉంటుందని తేలింది. ముఖ్యంగా నామ్ డాక్ మై, ఇర్వ్విన్ అనే రెండు మామిడి రకాల తొక్కలు శరీరంలోని కొలస్ట్రాల్ని తగ్గిస్తాయి. పండ్లును చక్కగా తినేశాక ఆ మామిడి తొక్కలను ఏం చేయాలనే కదా..! వాటిని పడేయకుండా చక్కగా రకరకాల రెసీపీలు చేసుకుని తినేయండి అని చెబుతున్నారు నిపుణులు. మామిడి తొక్కలతో చేసే రెసీపీలు ఏంటంటే..మామిడి తొక్క టీ: మామిడితొక్కలను చక్కగా నీటిలో ఉడికించి, కొంచెం తేనే, నిమ్మకాయ వేసుకుని టీ మాదిరిగా తాగితే ఆ టేస్టే వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. ఈ టీ వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.మామిడి తొక్క ఊరగాయ: తొక్కతోపాటు ముక్కలు చేసుకుని ఉప్పులో ఊరబెట్టి, రోజ ఎండలో ఆరనియాలి. ఇలా వాటిలో నీరు మొత్తం ఇంకిపోయేలా ఆరనిచ్చి చక్కగా పచ్చడి మాదిరిగా పట్టుకోవడం లేదా వాటిని భద్రపర్చుకుని పప్పులో వేసుకుని తిన్న బాగుంటాయి. మామిడి తొక్కపొడి: ఎండలో ఎండబెట్టిన మామిడి తొక్కను పొడి చేసుకోవాలి. దీన్ని మెరినేడ్లు, సూప్లు, కూరల్లో జోడిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మామిడి తొక్కను ఆహారంలో భాగం చేసుకున్నట్లువుతుంది కూడా. అంతేగాదు ఈ తొక్కల పొడిని బ్యూటీ టోనర్గా కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ వాష్గా కూడా ఉపయోగించొచ్చ. బ్యూటీ స్క్రబ్: మామిడి తొక్కల పొడిని తేనే లేదా పెరుగులో కలిపి ముఖానికి స్క్రబ్లా ఉపయోగించొచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి తాజాగా ఉంటుంది. పైగా చర్మం కూడా రిఫ్రెష్గా ఉంటుంది. జుట్టు సంరక్షణ: ఈ మామిడి తొక్కలను కలిపిని నీటితో షాంపు వేసుకుని తలను శుభ్రం చేసుకుంటే..జుట్టు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు చర్మం కుచ్చులా ఉండి మెరుస్తూ ఉంటుంది. స్కిన్ టోనర్: మామిడి తొక్కలను నీటిలో వేసి మరిగించిన ద్రవాన్ని వడగట్టి చర్మానికి టోనర్గా ఉపయోగించొచ్చు. ఇది ముఖంపై ఉండే రంధ్రాను దగ్గర చేయడమే తాజాగా ఉండేలా చేస్తుంది.(చదవండి: మామిడి బఫే..ఐస్క్రీం నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మ్యాంగో మయం..!) -
మామిడి బఫే..ఐస్క్రీం నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అంతా మ్యాంగో మయం..!
మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్ల రాజు మ్యాంగో. అలాంటి మామిడి పండ్లతో మ్యాంగో బఫేని అందిస్తోంది ఓ రెస్టారెంట్. కేక్లు దగ్గర నుంచి ఐస్క్రీమం వరకు అన్నింటిలోనూ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కడ? ఏ రెస్టారెంట్ ఇలా సర్వ్ చేస్తోందంటే..మామిడి అంటే ఇష్టపడే వాళ్ల కోసం దక్షిణ కొరియాలోని ఒక రెస్టారెంట్ మామిడి పండ్లతో వెరైటీ బఫేని పరిచయం చేసింది. సియోల్లోని లోట్టే అనే హోటల్ ఈ వైరైటీ బఫేట్ని కస్టమర్ల్కు సర్వ్ చేస్తోంది. దీని ధర వచ్చేసి రూ. 8,257లు. ఈ వేసవి మొత్తం ఈ బఫెట్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఆ బఫేలో మామిడి పండ్లతో చేసిన కేక్, మ్యాంగో డ్రింక్, మ్యాంగో ఫుడ్డింగ్, మ్యాంగో డెజర్ట్, మ్యాంగో ఐస్క్రీం, స్పైసీ రైస్ కేక్లతో సహ పది రకాల వెరైటీలను ఈ బఫేలో అందిస్తారు.వవెరైటీ భోజనం కావాలనుకునే వాళ్లకు ఇది అద్భతమైన బఫే సెటప్ అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్ చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బఫే కస్టమర్లకు ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే సుందరమైన జలపాతం, కళాత్మక అలంకరణల మధ్య ఈ మ్యాంగో బఫేని అధిక ధరకు వెచ్చించి మరీ తినడం కస్టమర్లకు ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మామిడి ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్ అని ఒకరు, ఇది స్వర్గానికి మించి..! అని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..) View this post on Instagram A post shared by 포토그래퍼의 공간 탐닉 (@space_tamnik) -
ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
పిఠాపురం: మామిడిలో రారాజుగా పేరొందిన కొత్తపల్లి కొబ్బరి మామిడికి ఎక్కడాలేని గిరాకీ పలుకుతోంది. మామిడి ప్రియుల మనసు దోచుకున్న ఒకే ఒక్క మధుర ఫలం ఇది. రుచిలో అతి మధురంగా ఉండడంతో ఈ మామిడి పండ్ల రేటు పైపైకి ఎగబాకి పండ్ల ప్రియులను ఊరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మామిడిలో ఎన్నో రకాలున్నప్పటికీ వాటిలో గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడికి ఉన్న డిమాండ్ వేరు. మామిడి రకాల్లో ఈ రెండింటినీ హిడెన్ జెమ్స్గా భావిస్తారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించి, సంరక్షించిన గ్రామాల పేరిటే ఇవి ప్రసిద్ధి చెందాయని ఆ ప్రాంతవాసులు అంటున్నారు.ఉత్తమ లక్షణాలున్న పండ్లుగా ఇవి గుర్తింపు పొందడంతో రాజుల కాలం నుంచే వీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని, ఆ రుచిని తాము ఆస్వాదించడంతోపాటు మిత్ర రాజులకు కానుకలుగా పంపేవారట. అందుకే ఒకప్పుడు రాజ సంస్థానాల్లో మాత్రమే ఈ పండ్లు ఉండేవని, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండేవి కావనే ప్రచారం కూడా ఉంది.ఇప్పటికీ ఈ రకం మామిడి పండ్లను తమ స్నేహితులకు, బంధువులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు బహుమతిగా పంపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏటా గోదావరి జిల్లాల నుంచి సుమారు 20 టన్నుల వరకూ కొత్తపల్లి కొబ్బరి, కాకినాడ రూరల్ మండలంలోని పండూరు మామిడి రకాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కవ కాలం నిల్వ ఉండకపోవడంతో ప్రస్తుతం దూర ప్రాంతాలకు ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు. కొత్తపల్లి కొబ్బరి గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన మామిడి రకాల్లో కొత్తపల్లి కొబ్బరిదే ప్రథమ స్థానం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి ప్రాంతంలో లభించే అమోఘమైన రుచి కలిగిన మామిడి పండు ఇది. కొబ్బరి కాయలో మాదిరిగా పీచు అధికంగా ఉండటంతో ఈ రకాన్ని కొత్తపల్లి కొబ్బరిగా పిలుస్తారు. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ సువాసనలు వెదజల్లుతుంటుంది. పూదోటలో మాదిరిగా ఈ రకం మామిడి పండ్లు ఉన్నచోట సువాసనలు వెదజల్లుతుంటాయి.ఈ మామిడి పండులో కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి. ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి సైజు చిన్నగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండటంతో పచ్చి మామిడి తినలేరు. కానీ పండు మాత్రం అతి మధురం. ఇవి మామిడి సీజన్లో మాత్రమే పండుతాయి. పీచు ఎక్కువగా ఉండటంతో ఆవకాయ, ఊరగాయలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మామిడితో పెట్టిన ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ చెట్ల కాపు తక్కువగా ఉంటుంది. పండు చిన్నదే కానీ ధర మాత్రం అదరగొడుతుంది.పండూరు మామిడి ఇది అత్యంత పురాతనమైన మామిడి రకం. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగి, నిండా కాయలుంటాయి. చూడటానికి పప్పులో వేసుకునే చిన్న మామిడి కాయల్లా మాత్రమే ఉంటాయి. పండ్లు కూడా ఆకుపచ్చగానే ఉండటం వీటి ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలగదూరు గ్రామ పరిసరాల్లోని సంస్థానంలో పూర్వం కొందరు దొంగలు మామిడి పండ్లను దొంగిలించి, తిని, వాటి టెంకలను కోట అవతల పారేశారని, వాటిని తీసి నాటగా వచి్చన చెట్టు ద్వారా ఈ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది.దిగుబడి తగ్గి.. డిమాండ్ పెరిగి.. గత ఏడాదికంటే దిగుబడి తగ్గడంతో కొబ్బరి మామిడికి డిమాండ్ అమాంతం పెరిగింది. గత ఏడాది 100 కొబ్బరి మామిడి కాయలు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయించగా ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముడవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పంపడానికి స్థానిక నేతలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు కొని తినే అవకాశం లేకుండా పోయింది. గతంలో దిగుబడి ఎక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండేవి.కానీ ఈ ఏడాది కొబ్బరి మామిడి చెట్లు పూత రాలిపోయి తక్కువగా కాశాయి. దీంతో దిగుబడి చాలా తక్కువ వస్తోంది. కాయ సైజు కూడా చిన్నదిగా ఉంటోంది. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి మామిడి ప్రియులు ఎగబడటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 2 టన్నుల కాయలు విక్రయించాం. మరికొద్ది రోజులు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. – కండేపల్లి సురేన్, మామిడి వ్యాపారి, కొత్తపల్లి వీటి గిరాకీ వేటికీ ఉండదు కొత్తపల్లి కొబ్బరి రకానికి ఉన్న గిరాకీ మరే మామిడి పండుకూ ఉండదు. పీచు అధికంగా ఉండటంతో ఊరగాయలకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండడంతో వీటికి ఎనలేని గిరాకీ పెరిగింది. దీంతో కాయ పెద్దది కాకముందే కోసేస్తున్నాం. మామిడి సీజన్లో మొదటిగా ఇవి అందుబాటులోకి వస్తాయి. కాయ టెంక కట్టగానే పండించడానికి వీలుంటుంది. వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇది తొందరగా ముగ్గిపోతుంది. కాయ బాగా ముదిరితే మంచి నాణ్యత ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా ఉండటంతో ఇవి ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. – ఓరుగంటి నాగబాబు, మామిడి రైతు, చేబ్రోలు -
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు. -
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
జైల్లో కేజ్రీవాల్ కావాలనే అవి తింటున్నారు: ఈడీ
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్ట్ అయిన తరువాత మార్చి 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ గురువారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారు. షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలంకునుటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఈడీ సమర్పణల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. -
'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!
సమ్మర్ అనంగానే గుర్తొచ్చొది తియ్యని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూశాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీపేరు మీదగా కొత్త రకం దేశీ పండును తీసుకొచ్చాడు ఓ రైతు. ఏకంగా హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇతి ప్రత్యేకు రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది. ఇంతకీ ఈ పండు ప్రత్యేకత ఏంటీ..? ఎవరు ఈ కొత్తరకం మామిడిని తీసుకొచ్చారు అంటే..! మామిడి పండు జ్యూస్ అయిన పండు పలంగా అయినా భలే రుచిగా ఉంటాయి. ఇంతవరకు అల్ఫోన్సో, దాషేరి, కేసర్, తోతాపురి, లాంగ్రా, బంగినపల్లి వంటి ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు చూశాం. ఇవన్నీ వేటికవే మంచి సువాసనతో కూడిన రుచిని కలిగి ఉంటాయి. వీటితో ప్రజలు స్మూతీస్, మిల్క్షేక్లు, జామ్లు, ఊరగాయలు, ఐస్క్రీమ్లు,డెజర్ట్లు వంటివి ఎన్నో తయారు చేస్తారు. దీన్ని 'పండ్ల రాజు' అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మామిడి పండంటే తనకెంతో ఇష్టం అని ప్రధాని మోదీ పలు సార్లు వేదికలపై చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన పేరు మీదగా కొత్త రకం మామిడి పండ్లను సాగు చేశారు. 'మ్యాంగో మ్యాన్'గా పిలిచే పద్మశ్రీ హాజీ కలిముల్లా కోల్కతాలోని 'హుస్న్ ఎ ఆరా' అనే మామిడి రకాన్ని, దేశీ దషేరి మామిడి రకంతో క్రాస్ సాగు చేసి ఓ కొత్త వేరియంట్ మామిడిని రూపొందించారు. దీనికి 'నమో' అని పేరు పెట్టారు. అదే విధంగా భాగల్పూర్కు చెందిన ఆశోక్ చౌదరి మోదీ 1,2,3 అనే మూడు రకాల మామిడి పండ్లను సాగు చేయడం జరిగింది. ఇంత వరకు భాగానే ఉంది. వారందరికంటే లక్నోలోని మలిహాబాద్కు చెందిన ఉపేంద్ర సింగ్ ప్రధాని మోదీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండే బెస్ట్ మామిడి అని పేరు దక్కించుకుంది. ఉపేంద్ర రెండు దేశీ మామిడి రకాలను క్రాస్ కల్టివేట్ చేసి ప్రధాని పేరు మీద 'మోదీ' అనే పండుని పండించారు. ఆయన ఎందుకిలా 'మోదీ మామిడి' అనే పేరు పెట్టారంటే..ఆయన రాజకీయాల్లో చాల సందర్భాల్లో సాహోసోపేతమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యచకితులని చేసి అశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశ్యంతో మోదీ మామిడి పండు అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. ఉపేంద్ర సింగ్ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు. అతడు సాగు చేసిన ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతో కూడిన పల్పు ఉండి, మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలో వాణిజ్య మార్కెట్లోకి రానుంది. దీని రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది, గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమాణం కూడా పెద్దది. ఓ వ్యక్తి కడుపు నింపడానికి ఈ కొత్తరకం మామిడి పండు ఒకటి తింటే సరిపోతుందని చెబుతున్నారు. ఇది ఐదు నుంచి ఆరు రోజుల వరు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. అంతేకాదండోయ్ ఈ మోదీ మామిడి పండు భారీ ధరతో కూడిన ట్యాగ్తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య జరిగే వార్షిక మామిడి పండ్ల వెరైటీల ప్రదర్శనలో కూడా ఈ కొత్తరకం మామిడి పండును ఉంచనున్నారు. (చదవండి: కాలేజ్కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!) -
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
సమ్మర్ స్పెషల్ : మ్యాంగో పులిహోర అదరిపోయేలా!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలు నోరూరిస్తాయి. వగరు.. పులుపు కలయికతో లేత మామిడి తొక్కు పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, మామిడి కాయ పప్పు ఇలా ఒకటేమిటి రకరకాల వంటకాలు ఘుమ ఘుమ లాడి పోవాల్సిందే. అసలు మామిడికాయతో ఏమి చేసినా ఆ రుచే వేరు కదా. మరి సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా! మామిడికాయ పులిహోర చేసిపెడితే. పిల్లలు,పెద్దా అంతా ఇష్టంగా తింటారు. ఇది చదువుతుంటేనే మీకూ నోరు ఊరుతోంది కదా. మరింకెందుకు ఆలస్యం ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. కావల్సి పదార్థాలు: తోలు తీసేసి సన్నగా తురిమిన పచ్చిమామిడికాయ తురుము వేయించి పెట్టుకున్న పల్లీలు, లేదా వేరుశెనగలు నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కరివేపాకు ఎండు మిర్చి, పచ్చి మిర్చి తురిమిన అల్లం ఇంగువ పసుపు ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపలాడే వరకూ వేయించుకోవాలి. ఎండు మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతుండగా, మధ్యకు చీల్చి పెట్టుకన్న పచ్చిముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం వేయాలి. పసుపు ,ఇంగువ వేసి ఇంకొంచెం సేపు వేగించు కోవాలి. పోపు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. అపుడు ముందుగానే తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు, జీడిపప్పు వేయాలి. ముందుగా వండి పెట్టుకొన్న అన్నం పోపులో వేసి, అందులోనే ఉప్పుకూడా వేసి అన్నం చితికి పోకుండా బాగా కలపాలి. పులుపు, ఉప్పు సరిచూసుకుంటే..నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ. బ్రేక్ఫాస్ట్గా గానీ, సాయంత్రం పూటగానీ, లంచ్లోగానీ దీన్ని తీసుకోవచ్చు. -
జుట్టు సౌందర్యానికి మామిడి ఆకులు.. ఈ విషయాలు మీకు తెలుసా?
నోరూరించే మామిడి పళ్లు తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. అయితే మామిడి ఆకులు కోసుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అందుకే వివాహాది శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంతేనా? జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు కూడా మామిడి ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించిన వారికి జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు... తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్ను కట్టుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపకరిస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా ఉంచుతాయి. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , నిగారింపు వచ్చేలా చేయడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? ►తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని కాసిని నీళ్లు చేర్చి మిక్సీలో వేసుకుని లేదా రుబ్బుకుని పేస్ట్లా చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్ను చివళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరేదాకా ఉంచి, ఆ తరవాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ►మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతో పాటు నల్లగా మారుతుంది. ►మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా కాచుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
మామిడి టెంకే!.. అని పడేయొద్దు!ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
పండ్లలలో రారాజు మామిడికాయ. టెంకే కదా అని తీసిపడేయొద్దు!. దీని వల్ల కలిగే అద్భత ప్రయోజనలు అన్ని ఇన్ని కావు. మామిడి టెంకను బ్యూటి ప్రొడక్ట్గా వాడతారని మీకు తెలుసా! ఇది మీ చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఇది అందించే ప్రయోజనాలు ఏంటంటే.. ప్రయోజనాలు ఈ టెంకలోని గింజల పొడిని సేవించినా ఆరోగ్యానికి మంచిదే ఇది అతిసారం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని నుంచి తయారు చేసిన నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందంటే.. చుండ్రుకి చెక్పెడుతుంది మాడిగింజల పొడిని ఆవాల నూనెతో కలిపి అప్లై చేస్తే అలోపేసియా, జుట్టు రాలడం, నెరిసిపోవడం, చుండ్రు వంటివి రావు. టూత్ పౌడర్గా మామిడిగింజల పౌడర్ని టూత్ పౌడర్గా ఉపయోగిస్తే మీదంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. విరేచనాలకు ఔషధంగా మామిడి గింజల పొడిని రోజుకు మూడుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఈ మామిడిగింజల పొడిని నీడలో ఎండబెట్టి తేనెతో తీసుకుంటే అతిసారం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఒబెసిటీకి చక్కటి మందులా.. ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి మందులా ఉపయోగపుడుతుంది. దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి పొందడమే గాక కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్ని కరిగించేస్తుంది రక్తప్రసరణను పెంచి చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో పడిపోయిన చక్కెర స్థాయిలను, సీ రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు.. రోజువారీ ఆహాకంలొ మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె సమస్యలు, అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డ్రై లిప్స్కి చెక్ పెదాలు హైడ్రేట్ చేయడానికి మామిడి గింజల పొడితో తయారు చేసిన బామ్ని ఉపయోగిస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. చర్మకణాలు పునురజ్జీవింపజేస్తుంది. మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మధుమేహం మామిడి గింజ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రేగు, కాలేయంలలో గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. అలాగే నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది. మొటిమలు మాయం మామిడి గింజలతో మొటిమల స్క్రబ్ని తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేగాదు మామిడి గింజలను గ్రైండ్ చేసి టమాట రసంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే బ్లాక్హెడ్స్, బ్రేక్ అవుట్లు, మెటిమలు, మచ్చలను నయ చేస్తుంది. ముఖంపై ఏర్పడే రంధ్రాలను తగ్గించి ఎరుపు మారకుండా సంరక్షిస్తుంది. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
ఇక్కడి మామిడి తాండ్రకు 200 ఏళ్ళ చరిత్ర ..
-
టేస్టీ టేస్టీగా మ్యాంగో పూరి ఇలా చేసుకోండి..
మ్యాంగో పూరీకి కావాల్సినవి: మామిడి పండ్లు – 2 (కడిగి, తొక్క, టెంక తొలగించి ముక్కలుగా చేసుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేసుకుని జ్యూస్ చేసుకోవాలి) గోధుమ పిండి – 3 లేదా 4 కప్పులు మైదాపిండి – 3 టేబుల్ స్పూన్లు నూనె – సరిపడా మ్యాంగో పూరీ తయారీ ఇలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మ్యాంగో జ్యూస్, గోధుమ పిండి, మైదాపిండి, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను పొంగే విధంగా ఇరువైపులా వేయించుకోవాలి. వీటిపై తేనె వేసుకుని తింటే భలే ఉంటాయి. -
మ్యాంగో ఈటింగ్ పోటీలు
-
మామిడిపండుతో టేస్టీ డిజర్ట్ ఇలా తయారుచేసుకోండి..
పండ్లలన్నింటిలో రారాజు మామిడి పండు. వీటిని ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యం లేదు. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక రుచి ఉంటుంది. తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక విటమిన్లు, పోషకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా మామిడి పండ్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం, జింక్ మరియు కార్బోహైడ్రేట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మామిడి పండ్ల సీజన్ పూర్తికాకముందే రుచికరమైన మంగోలీసియస్ డిజర్ట్ను ఇలా తయరుచేసుకోండి. మంగోలీసియస్ డిజర్ట్ తయారికి కావాల్సినవి మామిడి పండ్లు – రెండు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు పిస్తాపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు సేమియా – అరకప్పు పాలు– నాలుగు కప్పులు చక్కెర – పావు కప్పు మంగోలీసియస్ డిజర్ట్ తయారీవిధానం ఇలా.. మామిడి పండు తొక్క, టెంక తీసేసి, ముక్కలుగా తరిగి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. టేబుల్ స్పూను నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో మిగతా నెయ్యి వేసి సేమియాను దోరగా వేయించాలి. సేమియా వేగాక, పాలు పోసి పదినిమిషాలు కాగనివ్వాలి. పాలు మరిగాక చక్కెర వేసి కరిగేంత వరకు తిప్పి దించేసి చల్లారనివ్వాలి. చల్లారిన పాల మిశ్రమంలో మామిడి పండు ప్యూరీ, డ్రైఫ్రూట్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. అరగంట తరువాత బయటకు తీసి ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. -
Anasuya Bharadwaj : అనసూయని ఎత్తుకున్న భర్త.. మామిడితోటలో అలా! (ఫోటోలు)
-
అతిఖరీదైన మామిడి ధర వింటే షాకవుతారు, కేజీ 2.75 లక్షలు
పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో జరుగుతున్న మ్యాంగో ఫెస్టివల్ 7వ ఎడిషన్ ఇపుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇక్కడ ప్రదర్శించారు. ఒక ప్రదర్శనలో ఉంచి మామిడి పళ్ల ఫోటోలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ధర వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ‘మియాజాకి’ మామిడి పండ్ల ధర కిలో రూ.2.75 లక్షలు. జూన్ 9న మొదలైన ఈ ఫెస్టివల్లో 262 రకాల మామిడి పండ్లను ప్రదర్శిస్తున్నారు. వీటిలో అతి ఖరీదేన మియాజాకి స్పెషల్గా నిలుస్తోంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో సిలిగురి టైమ్స్ నివేదించిన ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్కు చెందిన రైతు షౌకత్ హుస్సేన్ 10 మియాజాకి మామిడి ముక్కలను ప్రదర్శించారు. ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 2.75 లక్షలు. Siliguri, West Bengal | World's most expensive mango 'Miyazaki' priced at around Rs 2.75 lakh per kg in International market showcased in Siliguri's three days long 7th edition of the Mango Festival. The festival kicked off on June 9 at a mall in Siliguri organised by Modella… pic.twitter.com/GweBPkXons — ANI (@ANI) June 10, 2023 -
దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, విశాఖపట్నం: మార్కెట్ను మామిడి పండ్లు ముంచెత్తుతున్నాయి. నగరంలో రోడ్లు, వీధుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. పైగా చౌకధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. గతం కంటే రుచి, నాణ్యతతో ఉంటున్నాయి. తొలుత వీటి ధర ప్రియంగా ఉండడమే కాదు.. పులుపు, చప్పదనంతో రుచి తక్కువగా ఉండేవి. ఆకర్షణీయమైన రంగుకు ఆకర్షితులైన మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసి పెదవి విరిచే వారు. కానీ పక్షం రోజుల నుంచి మార్కెట్లోకి మంచి రుచి కలిగిన మామిడి పండ్లు వస్తున్నాయి. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటోంది. నెల కిందట కిలో రూ.60–70 ధర పలికిన మామిడి పండ్లు.. ఇప్పుడు రూ.25–30కే దొరుకుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు వంటి పండ్లు మూడు, నాలుగు కిలోలు రూ.100కే లభ్యమవుతున్నాయి. మరికొన్ని రకాలైతే రూ.100కు ఐదారు కిలోలు చొప్పున విక్రయిస్తున్నారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి కొందరు, తోపుడు బండ్లపై మరికొందరు, పోగులుగా పెట్టి ఇంకొందరు ఎక్కడికక్కడే అమ్ముతున్నారు. చౌకగా లభిస్తున్న మామిడి పండ్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ఎగుమతులు లేకే.. ఏటా ఈ ప్రాంతంలో పండిన మామిడి పండ్లు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేయగా మిగిలిన పండ్లను స్థానిక మార్కెట్లకు తరలిస్తుంటారు. వాస్తవానికి నిరుడు, ఈ ఏడాది మామిడి పంట ఆశాజనకంగా లేదు. 50 శాతానికి మించి దిగుబడి లేదు. మామిడి దిగుబడి తగ్గిన సంవత్సరం ధరలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాపు తగ్గినా ధర మాత్రం సరసంగానే ఉంటోంది. ఎగుమతులు క్షీణించడం వల్లే ఈ ఏడాది మామిడి ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. విశాఖ నగరంలో మామిడి పండ్లను విక్రయించే వారు కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి హోల్సేల్గా కొనుగోలు చేస్తున్నారు. 20 కిలోల మామిడి పండ్లు రూ.150–200 కొని నగరంలో కిలో రూ.20–30కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మామిడి పండ్లు పక్వానికి వచ్చిన కావడం వల్ల రుచిగా ఉంటున్నాయని, ధర కూడా అందుబాటులో ఉండడం వల్ల వీటి విక్రయాలు బాగున్నాయని అక్కయ్యపాలెంలో రాజు అనే అమ్మకందారుడు చెప్పాడు. తాను రోజుకు 400–500 కిలోలు విక్రయిస్తున్నానని, గతంలో కిలో, రెండు కిలోలు తీసుకెళ్లిన వారిప్పుడు రెట్టింపునకు పైగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు. మరికొద్ది రోజుల పాటు చౌక ధరలే కొనసాగుతాయని, నెలాఖరు వరకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయని వివరించాడు. -
‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!
సాక్షి, ముంబై: రూ.2 వేల నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటన తరువాత బడా బాబులతోపాటు, సామాన్య ప్రజలు దాకా తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు తమ తమ స్థాయిల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో పెద్ద నోటుదే ప్రస్తుత హవా. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజువారీ నిత్యావసరాలు మొదలు ప్రీమియం బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లదాకా.. మామిడిపండ్ల నుంచి ఖరీదైన వాచీల దాకా రూ.2 వేల నోటుతోనే కొనుగోలు చేస్తున్నారట. రూ.2 వేల నోటు చలామణికి మరో నాలుగు నెలల్లో (సెప్టెంబరు 30) గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లో ఏది కొన్నా చెల్లింపులు మాత్రం రూ.2 వేల నోటుతోనే. దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇపుడు కస్టమర్లు ది బెస్ట్గా భావిస్తున్నారట. ఆన్లైన్లో వేసవి సీజన్లో అత్యధికంగా లభించే మామిడిపళ్ల దగ్గరనుంచి ఖరీదైన వాచీలను, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 8 నుంచి 10 పెద్ద నోట్లు వస్తున్నాయని ముంబైలోని ఓ మామిడి పళ్ల వ్యాపారి చెప్పారు. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) సెంట్రల్ ముంబైలోని రాడో స్టోర్లో స్టోర్ మేనేజర్ మైఖేల్ మార్టిస్ మాట్లాడుతూ తమ స్టోర్లో 2000 రూపాయల నోట్లు 60-70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు తమ వాచ్ అమ్మకాలు గతంలో 1-2 నుండి రోజుకు 3-4కు పెరిగిందని మార్టిస్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కూడా ఎక్కువగా రూ.2 వేల నోటే ఇస్తున్నారని, దీంతో చిల్లర సమస్య ఎదుర్కొంటున్నామని బంకు యజమానులు చెబుతున్నారు. రూ.2 వేల నోటుపై ఆర్బీఐ ప్రకటించింది మొదలు తమకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని జొమాటో ప్రతినిధి తెలిపారు. బంగారం షాపులకు కూడా రద్దీ పుంజుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైన్ రిజర్వేషన్లకు, బస్ టికెట్లకు ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ లావాదేవీ పెద్ద నోటుతోనే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు) కాగా దేశంలోనే అతిపెద్ద డినామినేషన్ నోటు రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ ఈ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో మ్యాంగోస్.. పండు కోసం క్లిక్ చేస్తే పైసలు పోతాయ్!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఏ సీజన్ నడిచినా దానిని మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరకు మామిడి పళ్లను సైతం వదలడం లేదు. వేసవి అంటే మామిడి పళ్ల ప్రియులకు పండగే. తాజా తాజా వెరైటీలు రుచిచూడాలని తహతహలాడేవారు బోలెడుమంది. సరిగ్గా ఇదే బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు..మీ ఇంటికే తాజా మామిడి పళ్లు పంపుతామంటూ ఆన్లైన్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందులో నకిలీ వెబ్సైట్ లింకులు పెడుతున్నారు. అవి నమ్మి ఆన్లైన్లో పళ్లు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయతి్నస్తే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. మొదట సగం డబ్బులు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ పంపుతామని, మొత్తం డబ్బులు ముందే తమ ఖాతాకు పంపితే డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఊరిస్తున్నారు. ఇది నమ్మి డబ్బులు పంపిన తర్వాత ఎదురు చూపులే తప్ప..పళ్లు రావడంలేదు. చివరికి తాము మోసపోయామన్న తత్వం బోధపడుతోంది మామిడి ప్రియులకు. ఆన్లైన్ మామిడిపళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో నకిలీ వెబ్సైట్లు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నదని కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంచేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’వెల్లడించింది. ఈ తరహాలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఆన్లైన్లో పళ్ల కొనుగోలులో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసేముందే అది నిజమైన వెబ్సైటా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుగా డబ్బులు పంపకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
ధరల మంట, ఒక్కో మామిడికాయ రూ.10 పైనే.. పచ్చడి మెతుకులు కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ఎండకాలం వచ్చిందంటే ఎవరింటా చూసినా మామిడికాయ పచ్చడి హడావిడి కనిపిస్తోంది. ఏడాదికి సరిపడా నిల్వ ఉండేలా పచ్చడిని తయారు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈసారి మాత్రం ఏడాదికి తగ్గట్టుగా కొత్త ఆవకాయ పెట్టుకోవాలంటే జేబు చిలుము వదలాల్సిందే! పచ్చడికి ఇదే సీజన్ కావడంతో మామిడి కాయల అమ్మకాలతో మార్కెట్లు సందడిగా మారాయి. కాయలను ముక్కలు మొదలు మసాలా దినుసుల కొనుగోలు వరకు గృహిణులతో రాకతో మార్కెట్ కళకళలాడుతోంది. అయితే పచ్చడికి అవసరమైన సరుకులు ధరలు మాత్రం నింగినంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రెండింతలయ్యాయి. పచ్చడికి మూలమైన మామిడి కాయ ఒకటి రూ.10 పలికితే.. పెద్ద కాయ అయితే రూ.15–20 పలుకుతోంది. కాపు తక్కువగా ఉండడం వల్ల పచ్చడి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక మసాలా దినుసుల ధరలు సరేసరి. మిర్చి ధరలు గణనీయంగా పెరగడంతో కారంపొడి నిరుడితో పోలిస్తే రెట్టింపయింది. గతేడాది కిలో రూ.550 ఉండగా.. ఈసారి రూ.800 చేరుకుంది. మసాలాలు, కారమే కాదు అల్లం, వెల్లుల్లి ధరలు మూడింతలు పెరిగాయి. రిటైల్ మార్కెట్లో అల్లం కేజీ రూ. 180–200 కాగా వెల్లుల్లి కేజీ రూ.160 విక్రయిస్తున్నారు. అలాగే బ్రాండెడ్ వేరుశెనగ నూనె లీటర్ ప్యాకెట్ రూ.190–210, నువ్వుల నూనె కిలో రూ.410, మెంతిపొడి కిలో రూ.180, ఆవాలు కిలో 110, జీలకర్ర కిలో 600 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈసారి పెరిగిన ధరలు సామాన్య, పేద తరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు కష్టంగానే కనిపిస్తున్నాయి. -
చెట్టు చెట్టుకో వెరైటీ.. అరుదైన మియాజాకీ మామిడి.. కిలో ధర 2.70 లక్షలు
పిఠాపురం (తూర్పు గోదావరి): అరుదైన రకాలు పండించాలన్న ఆ రైతు ఆలోచన మొక్కగా మొదలై.. చెట్టుగా మారింది. అది శాఖోపశాఖలుగా విస్తరించి తోటనిండా అద్భుతాలను పండిస్తోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓదూరు నాగేశ్వరరావు అనే రైతు నాలుగు ఎకరాల మామిడి తోటలో ఎన్నో రకాల మామిడి మొక్కలు నాటారు. తోటంతా కాస్తే వచ్చే ఆదాయాన్ని అందులోని ఒకే ఒక మామిడి చెట్టు తెచ్చిపెడుతోంది. ఆ ఒక్క చెట్టుకు 15 కాయలు కాయగా.. వాటి విలువ అక్షరాల రూ.15 లక్షలకు పైగానే ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కింగ్ ఆఫ్ మేంగో.. ఒక్కో కాయ రూ.లక్ష పైనే జపాన్ దేశంలో మాత్రమే పండే మియాజాకీ రకం మామిడిని ఓదూరు నాగేశ్వరరావు పండిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా గుర్తింపు పొందింది. ఇది బంగారం ధరతో పోటీ పడుతుంది. జపాన్లోని మియాజాకీ ప్రాంతంలో పండటం వల్ల దీనికి మియాజాకీ అనే పేరొచ్చింది. దీనిని సూర్యుడి గుడ్లు (ఎగ్స్ ఆఫ్ సన్) అని కూడా పిలుస్తారు. సువాసనలు వెదజల్లుతూ.. లోపల బంగారు ఛాయతో మెరిసిపోయే ఈ మామిడి పండు అత్యధిక పోషకాలను కలిగి ఉంటుందట. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కేజీ రూ.2.70 లక్షల వరకు పలుకుతుందని.. ఒక్కో కాయ ధర కనీసం రూ.లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది క్యాన్సర్కు మందుగా.. కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధంగా పేరొందడంతో దీనికి విలువ పెరిగింది. నాగేశ్వరరావు తోటలో గత ఏడాది మియాజాకీ రకం పండు మాత్రమే ఒకటి మాత్రమే కాయగా.. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. సుమో.. మామిడి! ఈ రైతు తోటలో ఈ ఏడాది కొత్తగా ఐదు కేజీల మామిడి చెట్లు కాపు మొదలుపెట్టాయి. ఒక్కో మామిడి కాయ బరువు సుమారు ఐదు కేజీలు ఉండటం వీటి ప్రత్యేకం. ప్రస్తుతం ఒక చెట్టుకు రెండు మాత్రమే కాసాయి. ఈ రకాన్ని అఫ్గాన్ దేశానికి చెందిన నూర్జహాన్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద కాయగా దీనికి గుర్తింపు ఉంది. ఒక్క కాయ రూ.వెయ్యికి పైనే ఉంటుంది. సుమారు అడుగు పొడవు ఉండడం దీని విశేషం. పూత దశలో ఉండగానే దీనికి డిమాండ్ పెరుగుతుంది. మామిడి ప్రియులు వీటిని ముందుగానే బుక్ చేసుకుంటారు. విచిత్ర ఆకారాలు.. చిత్రమైన రంగులు నాగేశ్వరరావు తోటలో అడుగుపెడితే కళ్లు మిరుమిట్లు గొలిపే రంగులు.. చిత్ర విచిత్రమైన ఆకారాల్లో మామిడి కాయలు కనిపిస్తాయి. చూడటానికి తయారు చేసిన కాయల మాదిరిగా కనిపిస్తాయి. ఇక్కడి మామిడి చెట్లకు అరటి పండ్లు వేలాడుతుంటాయి. వాటిని కోస్తే మాత్రం అచ్చమైన మామిడి పండ్లే. వీటిని అరటి పండ్ల మాదిరిగానే వలుచుకు తినేయొచ్చు. అచ్చం యాపిల్ పండ్ల మాదిరిగా ఉండే మామిడి పండ్లు సైతం ఈ తోటలో కాస్తున్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు వందకు పైగా అబ్బురపరిచే మామిడి మొక్కలతో ఈ పండ్ల తోట కనువిందు చేస్తోంది. మియాజాకీ 15 కాయలు కాసింది నాలుగేళ్ల క్రితం వివిధ రకాల మామిడి మొక్కలు వేయడం ప్రారంభించాను. గత ఏడాది మియాజాకీ మామిడి పండు ఒకటి కాసింది. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. ఈ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో రెండు చెట్లు మాత్రమే కాస్తున్నాయి. ఒక్కో కాయ 380 నుంచి 450 గ్రాముల వరకు బరువు ఉన్నాయి. మొత్తం మామిడి కాయల బరువు సుమారు 6 కేజీల వరకు ఉంటుంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.15 లక్షల పైమాటే. – ఓదూరి నాగేశ్వరరావు, రైతు, చేబ్రోలు ఇవి చాలా అరుదు మియాజాకీ, నూర్జహాన్ రకాల మామిడి మన ప్రాంతంలో పండటం చాలా అరుదు. ఇవి చాలా విలువైనవి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని రకాలు చాలా అరుదైనవే. వీటిని ఇతర రైతులకు పరిచయం చేయడానికి ప్రయతి్నస్తాం. మొక్కలు నాటినా అవి చాలా వరకు పంటకు రావు. కానీ.. ఆయన అరుదైన రకాలను పండించడం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్గానే చెప్పవచ్చు. – అరుణ్కుమార్, ఇన్చార్జ్ ఉద్యాన శాఖాధికారి, గొల్లప్రోలు -
మామిడి మియాజాకిలో అత్యంత పోషక విలువలు
-
మామిడిపళ్లు తినేముందు ఇవి పాటించడం మర్చిపోకండి
మామిడి పండ్లను తినేముందు వాటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలని అమ్మమ్మలు, నానమ్మలు సలహా ఇస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే, మామిడిపండ్లలో ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంటుంది. ఇలా అధికంగా ఉత్పత్తి అయ్యే ఈ యాసిడ్ను తొలగించడానికి నీళ్లలో నానబెట్టాలి. వివిధ కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి వాటిలో ఈ ఫైటికి యాసిడ్ ఉంటుంది. ఇలా నానబెట్టడం వల్ల అది విచ్ఛిన్నమైపోతుంది. ఈ ఫైటిక్ యాసిడ్ అదనపు వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. నీటిలో నానడం వల్ల ఈ అదనపు వేడి తగ్గిపోతుంది. టాక్సిన్లను తొలగిస్తుంది మామిడి పండ్లను తినడానికి ముందు గంటపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి తొక్కపై ఉండే కనిపించని నూనె తొలగిపోతుంది. అది కొందరిలో ఎలర్జీలు కలిగించే అవకాశం ఉంది. అలాగే పాలీఫెనాల్స్, టానిన్లు వంటి సూక్ష్మ పదార్థాల మిశ్రమం తొక్క పైన ఉండే అవకాశం ఉంది. అవి శరీరంలో చేరితే దురద, బొబ్బలు రావడానికి కారణం అవుతుంది. మామిడిపండ్లు నానబెట్టడం వల్ల అవన్నీ తొలగి పండు తినడానికి అనువుగా సురక్షితంగా మారుతుంది. మామిడి పండ్లను ఇలా నీటిలో నానబెట్టడం వల్ల వాటి రుచి కూడా బాగుంటుంది. ప్రత్యేకించి ఆ పండ్లను ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే వాటిని కచ్చితంగా నీళ్ళల్లో నానబెట్టాలి. ఎందుకంటే ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఆ పండులో ఉండే కొన్ని సమ్మేళనాలు పండు వాసనను, రుచిని మార్చేస్తాయి. నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి సహజమైన తీపి, సువాసనను తిరిగి పొందవచ్చు. చదవండి: International Jazz Day: జాజ్ జాజిమల్లి -
పోటెత్తిన మామిడి
సాక్షి, హైదరాబాద్: బాటసింగారం పండ్ల మార్కెట్కు మామిడి పోటెత్తింది. ఈ సంవత్సరం పూత నెల రోజులు ఆలస్యంగా రావడంతో మామిడి పండ్లు మార్కెట్కు ఆలస్యంగా వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్కు మామిడి పండ్ల దిగుమతి ఒకేసారి పెరిగింది. సోమవారం ఈ సీజన్లోనే అత్యధికంగా 1800 నుంచి 2 వేల టన్నుల వరకు మామిడి దిగుమతి అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దిగుమతులు పెరగడంతో పండ్ల ధరలు కూడా తగ్గాయి. మొదటి రకం పండ్ల టన్ను ధర రూ. 60 వేలు ఉండగా సాధారణ రకం టన్ను రూ.30 నుంచి రూ.40 వేల మధ్యలో ధర పలుకుతోంది. దీంతో రిటైల్ మార్కెట్లోనూ పండ్ల ధరలు భారీగా తగ్గాయి. గత వారం కిలో రూ. 90 నుంచి 80 ఉన్న మామిడి ధరలు సోమవారం రిటైల్ మార్కెట్లో రూ. 60 లోపే ఉన్నాయి. పెరగనున్న దిగుమతులు ఈ ఏడాది మామిడి సీజన్ కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ త్వరలో దిగుమతులు పెరుగుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మామిడి సీజన్ జూన్ చివరి వరకు కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రోజు 2 వేల టన్నుల కంటే ఎక్కువగా మామిడి దిగుమతి కావచ్చని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ జిల్లాలనుంచే కాకుండా ఏపీ నుంచి కూడా మామిడి దిగుమతి ఎక్కువ దిగుమతి ఎక్కువగానే ఉంటుందన్నారు. దిగుమతులకు తగినట్లుగా ఏర్పాట్లు ఈ ఏడాది సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనా దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్కు వివిధ జిల్లాల నుంచి వచ్చే లారీలు మార్కెట్ నుంచి కాస్తా ఆలస్యంగా వెళ్లినా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేశాం.. మార్కెట్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి చర్యలు తీసుకున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా మార్కెట్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. – చిలుకా నర్సింహా రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి (ఎఫ్ఏసీ). (చదవండి: రైతన్న ఆశలు ఆవిరి) -
మామిడి కాయకు కవర్, రైతుకు ప్రాఫిట్
జిల్లాలోని ఖరీఫ్ ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం. పంట దిగుబడి నాణ్యంగా ఉంటేనే రైతుకు ఆదాయం. ఇందులో భాగంగానే మామిడి పండ్లు రక్షణ కోసం ఫ్రూట్ కవర్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కీటకాలు, పురుగులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. బయట మార్కెట్లో ఒక్కో ఫ్రూట్ కవర్ ధర రూ.2.5 ఉండగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా రూపాయికే రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు:జిల్లాలోని ఉద్యాన పంటల్లో మామి డితే అగ్రస్థానం. ఈ ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. ఇందులో ఎక్కువగా గుజ్జు పరిశ్రమకు ఉపయోగించే తోతాపూరి రకం సాగులో ఉంది. టేబుల్ వైరెటీస్గా పిలవబడే బంగినపల్లి, ఇమామ్ పసంద్, మల్గూబ, రసాలు, మల్లిక వంటి రకాలు సుమారు 40 వేల ఎకరాలలో సాగువుతోంది. గతంలో రసాయనిక ఎరువు లు ఎక్కువగా వాడుతున్నారని యూరోపియన్ దేశా ల వారు మామిడి ఎగుమతులను తిరస్కరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించింది. మామిడిలోనూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టింది. తద్వారా విదేశాల నుంచి కూడా ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి. సబ్సిడీతో రూపాయికే కవర్ మొదటి విడతలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 15.3 లక్షల మ్యాంగో కవర్లు మంజూరు చేసింది. ఇదే కవర్ బయట మార్కెట్లో రూ.2.5 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సి డీతో రూపాయికే రైతుకు కవర్ మంజూరు చేస్తోంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా రైతు భరోసా కేంద్రాల్లోనే కవర్లు అందుబాటులోకి తెచ్చింది. వీటిని సక్రమంగా వాడుకుంటే రెండు సార్లు ఉపయోగించవచ్చని యంత్రాంగం సూచిస్తోంది. నాణ్యమైన దిగుబడి మామిడిలో పూత దశ నుంచి పిందె.. కాయ దశ వరకు అనేక క్రిమికీటకాలు ఆశిస్తుంటాయి. మామిడి కాయలకు మచ్చతెగులు సోకుతుంటుంది. దీనిద్వారా పంట దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన రైతులు మామిడి కాయలకు రక్షణగా కవర్లు కట్టి కాపాడుతున్నారు. వీటి వాడకం వల్ల మామిడి కాయలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని, లోపలికి ఎటువంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కవర్ లోపల భాగం నలుపు రంగులో ఉండడం వల్ల మామిడికాయకు మంచి ఉష్ణోగ్రత కూడా లభిస్తుంది. దీంతో నాణ్యత గల మామిడి దిగుబడి అవుతుంది. ఆశించిన స్థాయిలో మామిడి ధర ఉంటుంది. సలహా మండలి తీర్మానంతో.. మామిడిలో టేబుల్ వైరెటీస్లో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సభ్యులు ఫ్రూట్ కవర్లు కావాలని తీర్మానించారు. ఆమేరకు ప్రభుత్వానికి పంపాము. ప్రభుత్వ అనుమతితో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీతో కూడిన కవర్లు అందజేస్తున్నాం. – పి.రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, చిత్తూరు జిల్లా నాణ్యమైన పంట దిగుబడి జిల్లాలో మొదటి విడతగా 15.3 లక్షల ఫ్రూట్ కవర్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు. రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించవచ్చు. ఇటీవల మామిడిలో భారీ ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి మామిడి కవర్లు అందుబాటులోకి తెచ్చాం. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిత్తూరు మామిడి రైతుకు బాసట రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుకు నష్టం వాటిల్ల కూడదని అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించింది. మామిడిలో రక్షణ చర్యలు ప్రారంభించింది. కవర్లు వాడడం వల్ల ఎటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించనవసరం లేదు. ఇలాంటి మామిడి కాయలను ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు. – పి.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు జిల్లా సమాచారం ఉద్యాన పంటలు ఎకరాల్లో మామిడి 58,000 అరటి 1,500 దానిమ్మ 700 బొప్పాయి 400 మంచి లాభదాయకం మామిడికి ఫ్రూట్ కవర్ వాడకం ఎంతో లాభదాయకం. గతంలో ఈ విధానంలో సాగుచేసిన రైతులకు మంచి ధర లభించింది. అందుకే ఈ ఏడాది మేము కూడా ఈ విధానాన్ని అనుసరించాం. కవర్ల వాడకం వల్ల ఎలాంటి క్రిమిసంహారక మందులు కూడా అవసరం లేదు. నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు. – ఈశ్వరబాబు, కొత్తపల్లి, గుడిపాల మండలం అవగాహన పెరిగింది అధికారుల సూచనల మేరకు రైతులకు మామిడి కవర్లను సరఫరా చేశాం. క్షేత్రస్థాయిలో ఈ కవర్లను ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించాం. ఒక రూపాయికే కవర్లు పంపిణీ చేశాం. వీటి వల్ల ఎలాంటి కీటకాలు చేరవు. ఎగుమతులకు ఉపయోగపడే విధంగా మామిడి పంట దిగుబడి చేయవచ్చు. – అఖిల, వ్యవసాయకార్యదర్శి, - చేర్లోపల్లి, చిత్తూరు మండలం కవర్ను ఎలా ఉపయోగించాలంటే.. ఒక పెద్ద నిమ్మకాయ సైజు వచ్చిన మామిడికాయకు ఈ కవర్ను తొడగాలి. ఆపై కాండంకు కవరు మొదటి భాగం వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయకు ఎటువంటి పురుగులు ఆశించవు. ఇలా దిగుబడి అయిన మామిడి పళ్లకు మార్కెట్లో 40 శాతానికిపైగా అధిక ధర లభిస్తుంది. (చదవండి : మామిడి ఎగుమతి షురూ) -
హైదరాబాద్.. సీజన్ పూర్తిగా ప్రారంభం కానే లేదు.. మామిడి పండ్లు మహా ప్రియం
సాక్షి, హైదరాబాద్: వేసవి అనగానే గుర్తొచ్చేది.. నోరూరించేది మామిడి. ఫలాల్లో రారాజుగా చెప్పుకునే ఈ పండ్లు ఈసారి ప్రియం కానున్నాయి. ఆలస్యంగా పూత రావడం.. దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సీజన్ ప్రారంభం కాలేదు. మార్చి నెలలో మామిడి మార్కెట్కు వస్తుందని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఇంకా దిగుమతులు జరగలేదు. ఈ నెల ప్రారంభం నుంచి మామిడి దిగుమతులు ఉపందుకున్నప్పటికీ ధర మాత్రం హోల్సేల్ మార్కెట్లోనే మంచి రకం రూ.60–70 పలుకుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అకాల వర్షాల వల్ల కూడా పూత రాలిపోయి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మామిడి సీజన్ ఏప్రిల్ 20 తర్వాతే ప్రారంభమౌతుందని వ్యాపారులు అంటున్నారు. సోమవారం నుంచి మామిడి మార్కెట్కు పోటెత్తింది. బాటసింగారం మార్కెట్కు సోమవారం 1500–1600 టన్నుల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 80–100కు లభిస్తోంది. మార్కెట్కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా. 19 ఎకరాల్లో ఏర్పాట్లు.. మామిడి క్రయ, విక్రయాల కోసం బాటసింగారం మార్కెట్లో 19.27 ఎకరాల్లో మార్కెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో ప్రతి రోజూ 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్కు కేటాయించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మామిడి సీజన్ కోసం మరో లక్ష ఎస్ఎఫ్టీలో 5 షెడ్లు నిర్మించారు. తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న 5 ట్యాంకులకు అదనంగా మరో 2 ట్యాంకులు ఏర్పాటు చేశారు. విద్యుత్తో పాటు జనరేటర్నూ అందుబాటులో ఉంచారు. రైతులు, వ్యాపారుల కోసం రైతు విశ్రాంతి గదులుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సీజన్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మామిడి సరుకు యార్డుకు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలు, తెలంగాణలోని కొల్లాపూర్, ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి మామిడి దిగుమతి అవుతుంది. కొల్లాపూర్ మామిడికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంది. బాటసింగారం మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభ దశలో ఉన్నా బాటసింగారం మార్కెట్ యార్డుకు రోజు రోజుకూ మామిడి దిగుమతి పెరుగుతోందని మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. -
విజయవాడ బెంజి సర్కిల్ లో ప్రమాదం
-
ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా
ఎండాకాలాన్ని వెంటాడుతూ వస్తుంది ఆవకాయ కాలం. మామిడి కాయలు చెట్టుకొమ్మలకు వేళ్లాడుతూ ఆకుల్లోంచి తొంగి చూస్తూ నోరూరిస్తుంటాయి. మామిడి కాయలతో చేసుకునే ఊరగాయలు పచ్చళ్లను చూద్దాం. నీళ్లూరుతున్న జిహ్వను లాలిద్దాం. ఆవకాయ కావలసినవి: ►మామిడికాయ ముక్కలు – 4 కప్పులు ►నూనె– 2 కప్పులు ►ఆవపిండి– కప్పు ►మిరప్పొడి– కప్పు (గుంటూరు కారం రుచికి బాగుంటుంది. కశ్మీరీ కారం వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది) ►ఉప్పు – కప్పు (కల్లుప్పును పొడి చేయాలి, టేబుల్ సాల్ట్ వేయాలనుకుంటే ముప్పావు కప్పు సరిపోతుంది) ►మెంతిపిండి – అర కప్పు ►వెల్లుల్లి రేకలు – అర కప్పు (పొట్టు వలిచినవి) ►ఆవాలు – పావు కప్పు. తయారీ: ►మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. ►సొనపోవడానికి తొడిమలను తొలగించాలి. ►ఆ తర్వాత టెంకతో సహా ముక్కలు చేయాలి. ►మీడియం సైజు కాయను 12 ముక్కలు చేయవచ్చు. ►టెంకలోని గింజను తొలగించి, టెంకకు గింజకు మధ్య ఉండే పొరను కూడా తీసేసి ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి. ►వెడల్పు పాత్ర తీసుకుని తేమలేకుండా శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ►ఆ తర్వాత ఆ పాత్రలో మిరప్పొడి, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి. ►అందులో మామిడికాయ ముక్కలను వేసి ఆవపిండి మిశ్రమం ముక్కలకు సమంగా పట్టే వరకు తడి లేని గరిటెతో కలపాలి. ►ఆవపిండి కారంలో ఉప్పు చూసుకుని రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి. ►బాణలిలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ►నూనె బాగా చల్లారిన తర్వాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటెతో కలపాలి. ►ఈ మిశ్రమాన్ని జాడీలో నింపాలి. ►ఆవకాయ మీద నూనె తేలుతూ ఉండాలి. గమనిక: నూనెను మరిగించకుండా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఆవకాయ, ఇతర ఊరగాయలను నిల్వ చేసే జాడీలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి పది నిమిషాల సేపు ఎండలో ఉంచాలి. ఎండలో నుంచి తీసిన తర్వాత జాడీ వేడి తగ్గిన తరవాత మాత్రమే ఊరగాయలను నింపాలి. -
ఇన్స్టాల్మెంట్లో మామిడి పండ్లు కొనుక్కోవచ్చని మీకు తెలుసా!
ఇంతవరకు ఈఎంఐలో కేవలం ప్రిజ్లు, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కోవడమే తెలుసు. కానీ ఇక నుంచి పండ్లు కూడా ఈఎంఐలో కొనుక్కునే వెసులు బాటు వచ్చేస్తోంది. దీంతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కావాల్సిన పండ్లు కొనేయొచ్చు, తినేయొచ్చు. వివరాల్లోకెళ్తే.. మామిడి పళ్లలో రారాజుగా అల్ఫోన్సో మామిడి పళ్లను పిలుస్తారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ. రిటైల్ మార్కెట్లోనే వీటి ధర డజను రూ. 800 నుంచి రూ. 1300 వరకు పలుకుతుంది. దీంతో బాగా ధనవంతులు తప్ప కామన్మెన్ దీని జోలికే పోనేపోడు. అందుకని అందరు కొనేలా సులభమైన రీతిలో వెసులుబాటు కల్పించాలని ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికాడు పూణెకి చెందిన గౌరవ్సనస్. తన పళ్ల ఉత్పత్తులకు సంబంధించిన గురుకృపా ట్రేడర్స్తో ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగానే ఈఎంఐలో కొనేయొచ్చు అని చెబుతున్నాడు గౌరవ్. అందుకోసం కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించాలి. ఈ ఈఎంఐని మూడు, ఆరు లేదా 12 నెలల్లో కట్టేయాలి. ఇప్పటి వరకు ఈ విధానంలో నలుగురు వినయోగదారులు ఆ మామిడిపళ్లను కొనుగోలు చేసినట్లు గౌరవ్ తెలిపారు. (చదవండి: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
మార్కెట్లోకి పళ్ల రారాజు.. వామ్మో! కిలో హాపస్ మామిడి ధర రూ.2000?
వేసవికాలం ప్రారంభమైంది. అంటే మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేసినట్లే. మామిడి పండు రుచికి ఏ పండు సాటిరాదు. అందుకే ఇది పండ్ల రాజు అయింది. ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పండ్లను ఎప్పుడు ఎప్పుడు రుచి చుద్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం చెట్ల మీద పండే దశలో ఉన్నాయి.మరో నెల రోజులు ఆగితే ఎన్నో రకాల పండ్లు ప్రతి మార్కెట్లోనూ విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే భారత్లోని పలుప్రాంతాల్లో మామిడి పండ్లు వచ్చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి బిహార్లోని పాట్నా మార్కెట్లోకి అడగుపెట్టాయి. సాధారణంగా మామిడి పండు వెరైటీని బట్టి వాటి ధర ఉంటుంది మనకు తెలిసినంత వరకు కేజీ వంద రూపాయలదాకా ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పండ్లు అందుబాటులో ఉండడంతో కిలో ధర రూ.350 నుంచి రూ.500 పలుకుతున్నాయి. మరి కొన్ని రకాల మామిడికాయలు రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ముంబై, ఒరిస్సా, ఢిల్లీ నుంచి మామిడిపండ్లు వస్తున్నాయి.ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ.. త్వరలో విక్రయాలు పుంజుకుంటాయని పాట్నాలోని ఫ్రూట్ మార్కెట్లో పండ్లు అమ్మే ఓ వ్యక్తి తెలిపారు. ఒడిశాలోని మాల్డా, మహారాష్ట్రకు చెందిన ప్యారీతో సహా గులాబ్ఖాస్ మామిడి అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్ల ధర కిలో రూ. 350 నుండి రూ. 500 వరకు ఉంది. అంతేగాక ఈ రకం పండు ఒక్క కాయ ధర ఏకంగా రూ.150-200 వరకు అమ్ముడవుతోంది! అల్ఫోన్సో లేదా హాపస్ అని కూడా పిలువబడే పండు మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ మామిడి పండ్లను ఇన్కమ్ ట్యాక్స్ గోలంబర్ ప్రాంతంలో డజను రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. అల్ఫోన్సో GI ట్యాగ్ కూడా అందుకుంది. ఈ పండ్లకున్న ప్రత్యేక రుచి, సువాసన, తీపి కారణంగా జనాలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేగాక హాపస్ మామిడి పండిన తర్వాత వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇవి మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్ పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. ఈ రకం పండ్లు అన్ని చోట్లా దొరకవు. కొన్ని ప్రత్యేక స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇది రాబోయే 10, 20 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. -
మామిడి చెట్టు తెచ్చిన తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని
సాక్షి, హైదరాబాద్: ‘పచ్చని చెట్లు ప్రగతి మెట్లు’ అని నేర్పించాల్సిన టీచర్ బుద్దే వక్రంగా మారింది. ఇంటి మేడ మీద ఆకులు పడుతున్నాయని, చెట్టు వేర్లు గోడ లోపలికి చొచ్చుకుపోతున్నాయని లేనిపోని తగాదాతో తంటాలు తెచ్చుకుంది ఓ రిటైర్డ్ మహిళా టీచర్. చెట్టును కొట్టేయాలని ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించారు. దీంతో మొదలైన గొడవ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే వరకు వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లికాంబ (పేరు మార్చాం) ఎల్బీనగర్లోని ఫతుల్లగూడలో నివాసం ఉంటుంది. ఆమె ఇంటి వెనక ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారి ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మలు, ఆకులు వృద్ధురాలి భవనం మేడ మీద పడుతున్నాయని ప్రతి రోజు అద్దెవాసులతో గొడవ పడేది. దీంతో వారు పలుమార్లు కొమ్మలను కొట్టేశారు. అయినా ఓర్వలేక చెట్టు వేర్లు గోడల్లోపలికి వెళుతున్నాయని మళ్లీ గొడవ పెట్టుకుంది. కిరాయిదారులు వినకపోవడంతో చెట్టును తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోపోవడంతో ఈసారి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. చెట్టుతో తన ఇంటికి నష్టం వాటిళ్లుతోందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. చేసేదిలేక సంబంధిత అధికారులు మామిడి చెట్టును కొట్టేశారు. ఇటీవల అద్దె వసూలు చేసేందుకు ఇంటికి వచ్చిన యజమాని మామిడి చెట్టు కొట్టేసి ఉండటాన్ని గుర్తించి అద్దెవాసులను ప్రశ్నించాడు. వారు అసలు విషయం చెప్పడంతో మల్లికాంబ, ఇంటి యజమాని, అద్దెదారులకు మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పోలీసు స్టేషన్కు చేరడంతో.. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రిటైర్డ్ టీచర్ వాళ్ల మోహం మీదే తలుపులు వేసి లోపలికి వెళ్లిపోయింది. దీంతో ఇరుగుపొరుగును విచారించిన అధికారులకు ఆమె వైఖరి తెలుసుకుని అవాక్కయ్యారు. కాలనీలోని ప్రతి ఒక్కరితోనూ ఆమెకు తగువులాటేనని, ప్రతి చిన్న విషయానికి దూర్భాషలాడుతుందని చెప్పారు. అద్దెదారుల ఫిర్యాదు మేరకు మలికాంబపై ఎస్సీఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని అరెస్టు చేయకుండా 41–ఏ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఎస్సీఎస్టీ కేసులో చార్జిషీటు దాఖలు చేయాలంటే బాధితులు, నిందితులు ఇరువర్గాల కుల ధ్రువీకరణ పత్రం అనివార్యం. దీంతో పోలీసుల సూచన మేరకు ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆమె ఇంటికి వెళ్లగా.. మీరెవరు, ఎందుకు వచ్చారు. వారిపై విరుచుకుపడింది. దీంతో విస్తుపోయిన అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారని, వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనూ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు. -
అదనపు ఆదాయం కావాలా?.. అయితే ఇలా చేయండి..
పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా రైతులు ఓ పంట కాలంలో ఒక పంటను మాత్రమే సాగుచేయడం సాధారణం. కానీ ఏక కాలంలో ఒకే భూమిలో రెండు మూడు పంటలను సాగుచేయడంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అంతర పంటల సాగుతో ఓ పంటలో నష్టం వచ్చినా మరోపంట రైతును ఆదుకుంటోంది. దీంతోపాటు అదనపు ఆదాయం వస్తోంది. మామిడి తోటలున్న రైతులు ఏడాదికోమారు తోట ను విక్రయించి ఆదాయం పొందేవారు. ఇప్పుడు రైతులు కాస్త విభిన్నంగా ఆలోచిస్తున్నారు. మామిడి తోటలోనే ఏడాదికి మూడు రకాల పంటలను పండిస్తూ ఏడాదికొచ్చే మామిడి ఆదాయంతో పాటు అంతకు మూడు రెట్ల ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి రైతులకెంతో మేలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలుగా ఉంది. ఇందులో నీటి సౌకర్యం ఉన్న తోటలు 80వేల ఎకరాలు. గత మూడేళ్లుగా మామిడి తోటల్లో ఇతర పంటల సాగు క్రమేణా విస్తరిస్తోంది. ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్టు ఉద్యానవన శాఖ తెలిపింది. ఏటా మామిడి ఫలసాయంతోపాటు అంతరపంటల కారణంగా రెట్టింపు ఆదాయం గ్యారెంటీగా దక్కుతుంది. రైతులు మామిడిలో అంతర పంటలుగా బీన్సు, టమాటా, వంగ, బెండ, పసుపు, మిరప లాంటి అంతరపంటలను పండిస్తున్నారు. అలసంద, జీనుగ, పెసర, మునగతో పాటు తక్కువ వ్యవధి పంటలైన ఆకుకూరలను సాగుచేస్తున్నారు. చదవండి: కడుపులో మంట వస్తుందా?.. లైట్ తీసుకోవద్దు.. షాకింగ్ విషయాలు సాగవుతున్న అంతరపంటలు బొప్పాయి తోటలో బీన్సు, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లి, మిరపలో అరటి, టమాటాలో కాకర, దోస, తీగబీన్సు, బీర తదితర పంటలను సాగుచేస్తున్నారు. బంతిపూలలో దోస, కొత్తిమీర, బెండ, బీన్సు, టమాటా, వంగతోటలో బంతి, టమాటలో కాకర లాంటి కాంబినేషన్లు రైతులకు లాభసాటిగా మారాయి. కొందరు రైతులు బొప్పాయిలో బంతి, మిరపలో అరటి, బంతిలో అలసంద, క్యాబేజిలో వెల్లుల్లి, కొత్తిమీర సాలుపంటగా జొన్నలను పండిస్తున్నారు. ఈ విధానాలతో బహుళ లాభాలు పంట సాగుకు అవరసమైన భూసారానికి సేంద్రీయ ఎరువులు, నీటివినియోగం, కూలీలు, క్రిమిసంహారకమందుల ఖర్చు భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా పంటకాలం ఆదా అవుతుంది. కాబట్టి ఏటా మూడు పంటల్లో రెండు, మూడు పంటలను మిశ్రమ, అంతర పంటలుగా సాగుచేసుకోవచ్చు. దీంతో ఓ పంటకు ధర తగ్గినా మరో రెండు పంటలకు ధరలుండే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైతుకు నష్టాలు వచ్చే అవకాశముండదు. టమాటా రైతులకు ఇదోవరం పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో టమాటా ఎక్కువగా సాగవుతోంది. అయితే టమాటా ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ఎకరా పొలంలో టమాటాను సాగుచేసేందుకు దాదాపు రూ.80వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంట దిగుబడి మధ్యలో ఉన్నప్పుడు ఇదే పొలంలో తీగపంటలైన బీన్సు, బీర, కాకర, సొర లాంటి పంటలను సాగుచేస్తే టమాటా పంట అయిపోగానే, అదే కర్రలకు రెండో పంట తీగలను పెట్టుకోవచ్చు. ఫలితంగా పంట పెట్టుబడి తగ్గడంతో పాటు భూమిని కొత్త పంటకు సిద్ధం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. టమాటా ధర లేనప్పుడు, రెండో పంట ఆసరాగా ఉంటుంది. -
ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఆవకాయ పచ్చడి అంటే నోరూరని వారు ఎవరుంటారు. అలాంటి ఆవకాయ పచ్చడి ఒక మహిళను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే....ఇంగ్లాండ్కి చెందిన 57 ఏళ్ల మహిళ ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నప్పుడూ పొరపాటున ఆవకాయ బద్ద గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె హుటాహుటినా ఇంగ్లాంగ్లోని ఎప్పమ్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులకు అసలు విషయం చెప్పి తాను తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నానని వివరించింది. ఐతే వైద్యలు ఒక మెత్తని ఫ్రూట్ ఎలా ఇరుక్కుంటుందని కొట్టిపారేశారు. కానీ ఆ మహిళ తనకు చాలా ఇబ్బందిగా ఉందనడంతో.. ఆమెను పరీక్షించి చొంగకార్చుకునే అలావాటు ఉందని అందువల్ల మింగ లేకపోతుందని తేల్చి చెప్పారు. గొంతులో ఎలాంటిది ఇరుక్కోలేదని, గ్యాస్టిక్ సమస్య ఉన్నా ఇలానే ఉంటుందని అన్నారు వైద్యులు. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువగా ఉంటే రమ్మని చెప్పి ఆ మహిళను పంపించేశారు. ఆ తర్వాత సదరు మహిళ కేవలం నాలుగు రోజుల్లో మళ్లీ ఆస్పత్రికి వచ్చి జాయిన్ అయ్యింది. ఈసారి ఆమె మరింత నొప్పితో మాట్లాడలేని స్థితికి చేరుకుంది. దీంతో వైద్యులు వెంటనే సీటీ స్కాన్చేసి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే స్కానింగ్లో ఆవకాయబద్ద గొంతులో గుచ్చుకోవడంతో అన్నవాహికలో నీరు చేరడం, ఛాతీలో గాలి ఉండటం వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి గొంతులో ఇరుక్కున్న ఆవకాయబద్దను తొలగించారు. ఒక వారంపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండి చికిత్స తీసుకుంది. ఐతే ఆమె ఈ విషయమై ఆస్పత్రి ట్రస్ట్కి ఫిర్యాదు చేసింది. దీంతో ట్రస్ట్ ఎలాంటి పళ్లు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలో వివరంగా ఒక జాబితా ఇవ్వాలని సదరు ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. ఇది చాలా హాస్యస్పదమైన విషయం, ఎందుకంటే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవించేవి అని డాక్టర్ రిచర్డ్ జెన్నింగ్స్ అన్నారు. సాధారణంగా మాంసం తింటే అందులోని ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకోవడం లేదా ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పగలం గానీ ఫలానా పండు వల్ల ఇలా జరుగుతుందని ఎలా చెప్పగలం అని అన్నారు. (చదవండి: చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష) -
రెండేళ్లలో బిలియన్ డాలర్ బ్రాండ్గా మాజా
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్ఫోలియోలోని మాజా సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్గా ఉంది. -
వైరల్: మామిడి పండ్ల దొంగ.. పోలీసోడే!
కొట్టాయం: కక్కుర్తితో ఎవరూ లేని టైంలో ఓ దుకాణం బయటి నుంచి మామిడి పండ్లను కాజేసిన దొంగను.. పోలీసుగా గుర్తించారు కేరళ అధికారులు. కొట్టాయం కంజిరాపల్లి సెప్టెంబర్ 28న ఓ రోడ్ సైడ్ దుకాణం దగ్గర ఈ దొంగతనం జరిగింది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్లో పని చేసే పీవీ షిహాబ్.. ఓ మామిడి పండ్ల దుకాణం ముందు ఈ చోరీకి పాల్పడ్డాడు. ఎవరూ లేనిది చూసి సుమారు పది కేజీల మామిడి పండ్లను బైక్ ద్వారా తరలించాడతను. అయితే.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ చోరీని గుర్తించాడు ఆ దుకాణం యాజమాని. దొంగ హెల్మెట్, రెయిన్కోట్ ధరించి ఉండడంతో.. తొలుత అతన్ని గుర్తించడం వీలుకాలేదు. అయితే బైక్ నెంబర్ ఆధారంగా.. అతను షిహాబ్గా గుర్తించారు. దీంతో డిపార్ట్మెంట్ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అధికారులు గాలింపు చేపట్టారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. When @TheKeralaPolice was #caughtoncamera stealing mangoes... The incident happened in Kanjirappally, Kottayam. The accused has been identified as PV Shihab, a Civil Police Officer posted at Idukki AR Camp.#CCTV #theft #keralapolice pic.twitter.com/CqT3y8ESID — Bobins Abraham Vayalil (@BobinsAbraham) October 4, 2022 -
Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే..
సాధారణంగా పండ్లు ఎవరికైనా మంచిదే. ఎందుకంటే పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్నిరకాల పండ్లు బొత్తిగా మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండేవి. వీటికి దూరంగా ఉండండి! ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. పైనాపిల్, సీతాఫలం, అరటి, సపోటా, మామిడి పండ్లలో అధికమొత్తంలో చక్కెర ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఇవి దోరగా ఉన్నపుడు తినొచ్చు! జామ, బొప్పాయి, అరటి వంటి వాటిని బాగా పండినవాటికంటే దోరగా ఉన్నవి మంచిది. ఇవి ఎలా తిన్నా ఓకే! నేరేడు పళ్లు, కివీ పండ్లు ఎలా తిన్నా చెరుపు చేయవు. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే క్యారట్, బీట్రూట్లలోనూ, ఇతర దుంప కూరలలోనూ బీట్రూట్తో పోల్చితే మధుమేహులకు క్యారట్లే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? -
పునారస్ మామిడికి మంచి గిరాకీ.. వేసవి సీజన్ తర్వాత...
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం జిల్లా): పునారస్ మామిడికి ప్రస్తుతం గిరాకీ వచ్చింది. మామిడి వేసవి సీజన్ పూర్తయిన తరువాత వచ్చే మామిడికాయల రకం ఈ పునారస్.. గతంలో కొద్దిగా వచ్చే ఈ కాయలకు గిరాకీ ఉండడంతో ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఈ చెట్లను అధికంగా నాటారు. దీని కారణంగా ప్రస్తుతం ఈ సీజన్లో పునారస్ మామిడి కాయలు అధికంగా వచ్చాయి. ఉలవపాడు మార్కెట్ నుంచి ఈ కాయలు ప్రస్తుతం భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఉలవపాడు కేంద్రంగా వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఉన్న దళారులు రైతుల నుంచి కాయలను కొనుగోలు చేసి మార్కెట్లో తూకం వేసి బస్తాలు, ట్రేలలో లారీలు, మినీ ట్రక్కులు, ఆటోల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తారు. ఈ ఏడాది మార్కెట్లో దాదాపు 10 కేంద్రాల నుంచి కాయల ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళకు ఈ మామిడికాయలు తరలివెళ్తాయి. పచ్చళ్లకు అధికంగా ఈ కాయలను వినియోగిస్తారు. ఈ ఏడాది రేటు కూడా కాస్త అధికంగానే ఉంది. ఈ వేసవిలో మామిడి కాయలకు పండు ఈగ సోకి కాయల్లో పురుగులు రావడంతో రైతులు నష్టపోయారు. ఈ సమయంలో పునారస్ చెట్లు ఉన్న రైతులు ఈ ఏడాది రేటు అధికంగా ఉండడంతో ఊరట ఇచ్చినట్టయింది. పెరిగిన ఎగుమతులు గత నాలుగేళ్ల క్రితం నుంచి పోలిస్తే ఈ ఏడాది పునారస్ మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగాయి. రైతులు సీజన్ కాని సమయంలో వస్తున్న కాయలు కావడంతో ఇటీవల కాలంలో ఎక్కువగా సాగు చేశారు. ఉలవపాడు ప్రాంతంలో దాదాపు 4000 ఎకరాలకు పైగా ఈ తోటలు ఉన్నాయి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 వేక ఎకరాల్లో పునారస్ తోటలు ఉన్నట్లు సమాచారం. కానీ ప్రతి ఏడాదికి వీటి సాగు శాతం పెరుగుతుంది. ఈ ఏడాది గత నెల నుంచి రోజుకు సుమారు 50 నుంచి 80 టన్నుల కాయలు ఎగుమతులు చేస్తున్నారు. కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు ఈ ఏడాది కేజీ 40 నుంచి రూ.50 వరకు పునారస్ మామిడి రేటు పలుకుతుంది. గతంలో 25 నుంచి చిన్నగా పెరుగుతూ చివరి దశలో రూ.50కు చేరుకునేది. ఈ సారిమాత్రం రూ.40 నుంచి రూ.50 మధ్యనే ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మామిడికాయలు చెన్నై, తిరువనంతపురం, కోయంబేడు, కోయంబత్తూరుకు తరలివెళుతున్నాయి. రోజుకు సుమారు 30 నుంచి 50 లక్షల మధ్య ఉలవపాడు మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది. కేరళ ఓనం పండుగకు ఉలవపాడు పునారస్... కేరళలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వచ్చే నెల 8 వరకు జరిగే ఓనమ్ పండుగకు ఉలవపాడు పునారస్ కాయలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అక్కడ పెట్టే పచ్చడికి దీనిని ఉపయోగిస్తారు. ఈ సమయంలో అంటే సెప్టెంబరులో ఇంకా భారీగా రేట్లు పెరుగుతాయి. ఇక్కడ నుంచి ఓనమ్ పండుగకు ప్రత్యేకంగా గ్రేడ్ చేసిన కాయలను తరలిస్తారు. ఈ ఏడాది రేట్లు బాగున్నాయి గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రేట్లు బాగున్నాయి. కాయలు కూడా నాణ్యత బాగుంది. గతంలో కేజీ రూ.25 నుంచి రూ.35 లోపు ధర ఉండేది. ఈ ఏడాది మాత్రం రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. – ఆర్ కోటేశ్వరరావు, ఉలవపాడు అధికంగా దిగుబడులు ఈ ఏడాది కాయలు అధికంగా కాశాయి. అయినా రేటు తగ్గలేదు. రైతులు ఎక్కువ మంది పునారస్ మామిడి సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. – వింజమూరి సురేష్ బాబు, రైతు ఉలవపాడు మంచి రేటుకే కొంటున్నాము మా ప్రాంతంలో ఈ కాయలకు డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి లారీల్లో తీసుకుని వెళుతున్నాం. కాయకు మంచి రేటు ఇస్తున్నాము. – రఫీ, కొనుగోలుదారుడు, కోయంబత్తూరు -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
ఒకే ఊరు.. 102 రకాల మామిడి కాయలు.. చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే
మీకు ఎన్ని రకాల మామిడి పండ్లు తెలుసు..? ఐదు, పది, ఇరవై...! ఏకంగా వంద రకాల మామిళ్లను తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఓ గ్రామస్తులు. కేరళలోని కన్నూర్ జిల్లా కన్నపురం వెళ్తే.. మీకు మొత్తానికి మామిడిపండ్ల ఉత్సవమే కళ్ల ముందు నిలబడుతుంది. 207పైగా దేశవాళీ మామిడి రకాలుండగా అందులో 102 రకాలు ఈ ఊళ్లో ఉన్నాయి. కన్నపురంలోని కరువక్కువు ప్రాంతంలో 20 కుటుంబాలు కలిసి.. 300 చదరపు గజాల స్థలంలో 102 రకాల మామిడి చెట్లను పెంచుతున్నారు. స్థానిక పోలీసాఫీసర్ శైజు మచాతి 2016 నుంచి ఈ మామిడి రకాలను సంరక్షించడం మొదలుపెట్టాడు. 200 ఏళ్లనాటి మామిడి చెట్టును కొట్టేస్తున్నారని వ్యవసాయ అధికారి అయిన స్నేహితుడి ద్వారా తెలుసుకుని వెళ్లి, అంటుకట్టి దాన్ని రక్షించాడు. తరువాత 39 వెరైటీలను కలెక్ట్ చేశాడు. ఆయనకు గ్రామస్తుల సాయం తోడైంది.. మొత్తానికి 2020 కళ్లా 102 రకాలను సేకరించి, పెంచగలిగారు. ఏటా మే మొదటి ఆదివారం కన్నపురంలో ‘మ్యాంగో ఫెస్ట్’నిర్వహిస్తారు. జూలై 22 వరల్డ్ మ్యాంగో డే సందర్భంగా.. కేరళ బయోడైవర్సిటీ బోర్డు కరువక్కవును ‘దేశీయ మామిడి వారసత్వ ప్రాంతం’గా ప్రకటించింది. -
విపరీతమైన డిమాండ్.. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం!
చిక్కబళ్లాపురం(బెంగళూరు): పండ్లలో రారాజైన మామిడిలో మల్లిక రకం మామిడికి మార్కెట్లో యమక్రేజ్ ఏర్పడింది. రుచిలో, దిగుబడిలో మేటి అయిన మల్లిక మామిడిని సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఆ రకం మామిడికి నర్సరీల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు మామిడి తోటల సాగుపై దృష్టి పెడుతున్నారు. నర్సరీల్లో ఇప్పటికే 20వేలకు పైగా మొక్కలు విక్రయం జరిగినట్లు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. సొప్పళ్లి, శిడ్లఘట్ట తాలూకా చిక్కదాసరహళ్లి, చింతామణి తాలూకా మాడికెరె, గుడిబండ తాలూకా పసుపులోడులో హైబ్రిడ్ మల్లిక మామిడి నారు పెంచుతున్నారు. కాగా మల్లిక రకం మామిడి ఈ ఏడాది మంచి ధర పలికింది. టన్ను మామిడి రూ.60వేలకు విక్రయించారు. మూడేళ్లలో పంట చేతికి వస్తుందని, ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో మామిడి చెట్ల పెంపకానికి మంచి వాతావరణం అని చెబుతున్నారు. గత ఏడాది కరోనా వల్ల నగరాల నుంచి పల్లెబాట పట్టిన యువకులు పండ్లతోటల సాగుపై దృష్టి పెడుతున్నారని, మామిడి, పనస, దానిమ్మ, డ్రాగన్ తదితర పంటలను పెట్టారని, మరో రెండు సంవత్సరాల్లో ఆ పంటలు చేతికందుతాయని అధికారులు తెలిపారు. -
దారుణం.. మామిడిపండు అడిగిందని గొంతుకోసి..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ శామ్లీలోని ఖేడా కుర్తార్ గ్రామంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. అన్నం తినే సమయంలో మామిడిపండు అడిగిందనే కారణంతో ఐదేళ్ల మేనకోడల్ని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆమె పదే పదే మామిడిపండు కావాలని అడుగుతుందని చిరాకుపడి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నిందితుడు మొదట చిన్నారి తలపై రాడ్డుతో కొట్టాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. శవాన్ని సంచిలో చుట్టి ఇంట్లోనే దాచాడు. పాప కన్పించకపోయేసరికి గ్రామస్థులంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నిందితుడు కూడా ఏమీ తెలియన్నట్లు వారితో కలిసి పాపను వెతుకుతున్నట్లు నటించాడు. అయితే చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి నిందితుడిపై అనుమానం వచ్చింది. దీంతో అతడు గ్రామం వదిలి పారిపోయాడు. అతని ఇల్లు వెతికిన పోలీసులకు సంచిలో బాలిక మృతదేహం లభించింది. పోలీసులు నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టి గురువారం రాత్రి ఓ అడవి సమీపంలో అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనలో హత్యకు గురైన చిన్నారి పేరు ఖైరు నిషా.. కాగా నిందితుడి పేరు ఉమర్దీన్ అని పోలీసులు తెలిపారు. చదవండి: ఎన్నో కలలు..మరెన్నో ఆశలు.. పెళ్లై ఏడు నెలలు తిరగక ముందే.. -
దిల్ ‘మ్యాంగో’మోర్... సమ్మర్ ఎండ్ పికిల్స్ ట్రెండ్
వేసవి ముగింపుకొచ్చింది. దాంతో పాటే సీజన్లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే సమయం కూడా. ఆవకాయ అంటే ఒక పచ్చడి కాదు కొన్ని పచ్చళ్ల సమ్మేళనం. ఆ కొన్ని పచ్చళ్ల విశేషాలు... ► మామిడి ఆవకాయ తెలియనిదెవరికి?కనీస పదార్థాలతోనే చేసుకునేందుకు, ఎక్కువకాలం నిల్వఉంచుకునే వీలు వల్ల ఇది జాబితాలో అగ్రభాగంలో ఉంటుంది. ► బెల్లం తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... కలిపిందే బెల్లం ఆవకాయ. అయితే బెల్లం నాణ్యత బాగుండాలనేది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మర్చిపోకూడని విషయం. ► నువ్వులతో మామిడి పచ్చడి తయారు చేస్తారు. దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. ► అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్ మేళవింపు మరో రకం పచ్చడి. అయితే అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్ . ► పల్లి ఆవకాయ నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు నాణ్యతతో ఉంటే పచ్చడి మరింతగా నిల్వ ఉంటుంది. ► ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడిని ఎంచుకోవాలి. ఎండబెట్టిన మామిడికాయలతో ఇది తయారు చేస్తారు. ► ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా ఈ సీజన్ లో ట్రై చేయొచ్చు. ‘‘చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు తయారు చేసుకోవడం అంటే కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కూడా. భోజనం సమయంలో ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి వాసన చూస్తేనే ఎక్కడా లేని ఆనందం కలిగేది’’ అని గోల్డ్డ్రాప్ డైరెక్టర్ మితేష్ లోహియా గుర్తు చేసుకున్నారు. -
సమ్మర్ సీజన్: ఫలరాజు భలే క్రేజు
సాక్షి రాయచోటి(కడప): మామిడి పండ్లలో గుర్తింపు పొందిన అనేక రకాల మామిడి కాయలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు జిల్లాలు, రాష్ట్రాలు సరిహద్దులు దాటుతున్నాయి. కచ్చితంగా రెండు నెలలపాటు సీజన్లో కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సారి ఆశించిన మేర దిగుబడి లేకపోగా.. ధర మొదట్లో పెద్దగా లేకపోయినా ప్రస్తుతం బాగానే ఉండటంతో దిగుబడి ఉన్న మేరకు కాయలను విక్రయిస్తున్నారు.ఇక్కడి పండ్లు తియ్యగా ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన కాయలకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు లారీల్లో సరుకు రవాణా అవుతోంది. బెనీషా, నీలం, తోతాపురి, ఇమామ్ పసందు, మలిగుబ్బ లాంటి రకాల మామిడి కాయలకు సంబంధించి పల్ప్ ఫ్యాక్టరీలతోపాటు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు కాయలు రవాణా అవుతున్నాయి. మామిడికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోని అనేక మండలాల్లో విస్తారంగా మామిడి పండిస్తారు. కాబట్టి ఇతర రాష్ట్రాల షేట్లు(వ్యాపారులు) సైతం ఇక్కడే మకాం వేసి ఇక్కడ నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు లారీల ద్వారా పంపిస్తున్నారు. జిల్లాలో సరాసరి 90 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. దిగుబడి ఈసారి ఎకరాకు ఒక టన్ను చొప్పున కంటే లేకపోవడంతో సరాసరిన 90–100 వేల టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు, నవంబర్ నెలల్లో విరివిగా వర్షాలు కురవడం.. పూతకు అవకాశం లేకపోవడంతో దిగుబడి తగ్గినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న దిగుబడికి సంబంధించి లోకల్ మార్కెట్ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కడికక్కడ సరుకు రవాణా అవుతోంది. రాయచోటి, రైల్వేకోడూరు, సుండుపల్లె, వీరబల్లె, కె.వి.పల్లె, చిన్నమండెం, సంబేపల్లె, పీలేరులతోపాటు లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పుల్లంపేట తదితర మండలాల్లో మామిడి విస్తారంగా పండిస్తారు. రైల్వేకోడూరు, వీరబల్లె, కె.వి.పల్లె, సుండుపల్లె, చిన్నమండెం తదితర ప్రాంతాల నుంచి ప్రతి రోజు 40 నుంచి 50లారీలలో సరుకు రవాణా జరుగుతోంది. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూరు, తోతపూరి, బేనీషా, నీలం, ఇమామ్ పసంద్, రుమాని, పులిహార, ఖాదర్, లాల్ బహర్ రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రస్తుతం బేనీషా టన్ను రూ.35వేల నుంచి రూ.45వేల వరకు ఉండగా.. ఇమామ్ పసంద్ టన్ను లక్ష రూపాయలకుపైన, తోతపూరి రూ.16–20 వేలు, నీలం రూ. 30వేల నుంచి రూ. 40వేల వరకు ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడి కాయలను ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ముంబై, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది. అన్నమయ్య జిల్లాలో మామిడి పంట సీజన్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు (షేట్లు) జిల్లాలో మకాం వేస్తారు. కొన్నేళ్లుగా సీజన్లో రావడం, కొనుగోళ్లు చేసి ఆయా రాష్ట్రాలకు లారీల ద్వారా పంపుతుంటారు. రైల్వేకోడూరుతోపాటు రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో70నుంచి 80మంది దాకా షేట్లు ఇక్కడే ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకుని ఉంటారు. లారీలు కూడా దాదాపు 100నుంచి 150 వరకు ప్రతినిత్యం సమీప ప్రాంతాల్లోనే సిద్ధంగా ఉంటాయి. వీటిల్లో సరుకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుంటాం అన్నమయ్య జిల్లాలో ప్రతి ఏడాది వేసవి సీజన్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చి మామిడి కాయల వ్యాపారం నిర్వహిస్తుంటాం. నాతోపాటు చాలామంది వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి మార్కెట్ల నుంచి మహారాష్ట్రకు పంపుతుంటాం. కాయల కొనుగోలుకు లారీలు కూడా ఆయా రాష్ట్రాల నుంచి వస్తాయి. మామిడి కాయలు రుచిగా, నాణ్యతగా ఉండటంతో వీటికి మంచి గిరాకీ ఉంటోంది. – జావేద్, మామిడికాయల వ్యాపారి, మహారాష్ట్ర మామిడి పండ్లకు డిమాండ్ జిల్లాలోని మామిడిపండ్లకు డిమాండ్ ఉంటోంది. ఇక్కడి మామిడి పండు రుచికరంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి ఏడాది సరుకు ఇక్కడ నుంచి పలు రాష్ట్రాలకు వెళుతోంది. అనేక రకాల మామిడి పండ్లు పండిస్తారు. కాకపోతే ఈ ఏడాది చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది. అయినప్పటికీ ఇక్కడి నుంచి డిమాండ్కు అనుగుణంగా జ్యూస్, మార్కెట్లకు, ఇతర రాష్ట్రాలకు మామిడి కాయలు వెళుతున్నాయి. – రవీంద్రనాథరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, అన్నమయ్య జిల్లా -
మామిడి ఒరుగులు: 15 వేల రూపాయలు పెడితే లక్ష ఆదాయం.. అప్పటి నుంచి!
సీజనల్గా ప్రకృతి ఇచ్చే వరాల్లో మామిడి ఒకటి. మామిడి కాయలనే ఉపాధిగా మార్చుకుంది ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష. ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి ఇస్తోంది. వేసవిలో రెండు నెలలు మాత్రమే చేసే ఈ తయారీ మార్కెట్ రంగంలో తనకో కొత్త మార్గాన్ని చూపింది అని వివరించింది అనూష. ‘మాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. పెళ్లై, ఇద్దరు పిల్లలు. ఎకరంన్నర భూమిలో పత్తి సాగు చేస్తున్నాం. ఏడేళ్ల క్రితం మార్కెట్లో పత్తి అమ్ముతున్నప్పుడు మామిడి ఒరుగుల వ్యాపారం గురించి తెలిసింది. సాధారణంగా ప్రతి వేసవిలో ఇంట్లో మామిడి ఒరుగులను తయారుచేసుకుంటాం. వాటిని వర్షాకాలంలో వంటల్లో వాడుకుంటాం. అలాంటి ఈ ఒరుగులను పొడి చేసి, ఉత్తరభారతదేశంలో పెద్ద మార్కెట్ చేస్తున్నారని తెలిసింది. పులుపుకు బదులుగా వంటల్లో ఆమ్చూర్ పొడిని వాడుతుంటారని, ఈ బిజినెస్లో మంచి లాభాలు చూడవచ్చని తెలుసుకొని, దీని తయారీనే పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం. పదిహేనువేల రూపాయలతో మొదలు మొదటి ఏడాది మావారు రామకృష్ణ నేను కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశాం. మా బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాం. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను నియమించుకున్నాం. ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం చూశాం. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేశాం. నష్టం వచ్చినా వదల్లేదు ప్రతి యేటా పనిని పెంచుతూనే వస్తున్నాం. ఐదేళ్లుగా ప్రతియేటా 50 క్వింటాళ్ల ఒరుగులు తయారుచేస్తున్నాం. ఒకసారి లాభం వచ్చిందంటే, మరోసారి తీవ్రమైన నష్టం కూడా చూస్తున్నాం. మామిడికాయ నుంచి ముక్క కట్ చేసి, ఆరబెట్టాక బాగా ఎండాలి. ఏ మాత్రం వర్షం వచ్చినా, ఒరుగులు పాడైపోతాయి. అమ్ముడుపోవు. వాతావరణం మీద ఆధారపడే తయారీ విధానం కాబట్టి, సమస్యలు తప్పవు. మా ఇంటిపైన, ఖాళీగా ఉన్న రోడ్డువారన మామిడి ముక్కలను ఎండబెడుతుంటాం. దాదాపు ఎండల్లోనే పని అంతా ఉంటుంది. రెండు నెలల పాటు టెంట్లు వేసి, ఈ పని చేస్తుంటాం. ఈ పనిలో అంతా మహిళలే పాల్గొంటారు. రోజూ 30 మందికి పైగా పాల్గొనే ఈ పని రెండు నెలల పాటు కొనసాగుతుంది. మా వర్క్ చూసి డీఆర్డీఎ, వి–హబ్ వాళ్లు రుణం ఇచ్చి సాయం చేశారు. కారం, పసుపు మిషన్లను కూడా కొనుగోలు చేశాం. ఒరుగులను పొడి చేసి అమ్మాలనుకున్నాం. ‘కృషి’ పేరుతో లేబుల్ కూడా వచ్చింది. కానీ, ఒరుగులను పొడి చేసే మిషన్లతో పాటు, లేబుల్ ప్రింట్కు, ప్యాకింగ్కి లక్షల్లో ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది ఆమ్చూర్ పొడిని మా సొంత లేబుల్తో అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నాను’ అని వివరించింది అనూష. – నిర్మలారెడ్డి -
Mamidi Tandra: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
ముంచంగిపుట్టు(అరకులోయ)అల్లూరి సీతారామరాజు జిల్లా: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరుతుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారుచేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిందంటే చాలు. మన్యంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. కొండ, అటవీ ప్రాంతాల్లో లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర.. చాలా రుచిగా ఉంటుంది. గిరిజన మహిళలు తయారు చేసే ఈ తాండ్రకు మన్యంతో పాటు మైదానంలో మంచి గిరాకీ ఉంది. చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే! ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో మామిడి తాండ్ర తయారు చేసే పనిలో గిరిజన మహిళలు బిజీగా ఉన్నారు. వారపు సంతలో కిలో తాండ్ర రూ.100 వరకు పలుకుతున్నా.. ఎంతో రుచిగా ఉండడంతో కొనుగోలుదారులు ధరను లెక్క చేయడం లేదు. మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత కూడా తాండ్రను భద్ర పరుచుకుని తినే అవకాశం ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా మన్యం మహిళలు తాండ్రను తయారు చేస్తున్నారు. తాండ్రను తయారు చేస్తున్న గిరిజన మహిళ సహజసిద్ధంగా తయారీ గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో మామిడి చెట్లకు కాసే కొండ మామిడి పండ్లను ఇంటిల్లిపాదీ సేకరిస్తారు. వాటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు, బిందెలలో వేసి రోకలితో దంచుతారు. మామిడి రసాన్ని చాటలు, ప్లేట్లు, చాపలపై పలుచగా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలపకుండానే పొరలు, పొరలుగా వేస్తారు. వారం, పది రోజుల పాటు ఆరబెట్టి.. తర్వాత తాండ్రగా ప్యాక్ చేస్తారు. తాండ్ర తయారీకి కొండ మామిడి పండ్లను సేకరిస్తున్న చిన్నారులు తొక్కతో పచ్చడి మామిడి పండ్ల నుంచి వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తుండగా.. మిగిలిన మామిడి తొక్కలు, టెంకలను వేరు చేస్తారు. తొక్కలను కొందరు కారంతో, మరికొందరు బెల్లంతో కలిసి ఎండ బెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఏడాది పొడవునా గంజి అన్నంతో పచ్చడి మాదిరిగా వినియోగిస్తారు. కొన్ని గ్రామాల్లో మామిడి టెంకలను ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకుని ఆరగిస్తారు. మామిడి టెంకలతో కూరను కూడా తయారు చేస్తారు. ఈ కూరను లొట్టలేసుకుని మరీ తింటారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి ఏటా మామిడితో ఆదాయం సంపాదిస్తున్నాం. మొదట్లో మామిడి తాండ్రను ఇంట్లో వాడకం కోసం మాత్రమే తయారు చేసుకునేవాళ్లం. వారపు సంతల్లో తాండ్రకు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పెంచాం. కొంత మంది వ్యాపారులు ఇంటికి వచ్చి మరీ తాండ్రను కొనుగోలు చేస్తున్నారు. సహజసిద్ధంగా తయారుచేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఆదాయం బాగుంటుంది. –రాధమ్మ, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం -
Recipe: పచ్చిమామిడి తురుముతో మ్యాంగో వడ.. తయారీ ఇలా!
పచ్చిమామిడి తురుము, మినప్పిండితో రుచికరమైన మ్యాంగో వడ ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. మ్యాంగో వడ తయారీకి కావలసినవి: ►పచ్చి మామిడి తురుము – 1 కప్పు ►మినప్పిండి – రెండున్నర కప్పులు ►క్యారెట్ తురుము – పావు కప్పు ►శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు ►పెరుగు – పావు కప్పు ►కారం, గరం మసాలా, చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►ఉల్లిపాయ ముక్కలు – 1 టీ స్పూన్ ►పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా ►జీలకర్ర, వాము, నువ్వులు – కొద్దికొద్దిగా ►ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి పరిపడా తయారీ: ముందుగా ఒక పాత్రలో.. ► మినప్పిండి, పచ్చి మామిడి తురుము, క్యారెట్ తురుము ►పెరుగు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, వాము, నువ్వులు వేసుకోవాలి ►తర్వాత తగినంత ఉప్పు కలుపుకుని.. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ►ఆ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో వడల్లా వేసుకుని వేయించాలి. ►వాటిని సాస్లో లేదా చట్నీతో తినొచ్చు లేదా పెరుగులో నాబెట్టుకుని ఆవడల్లా తిన్నా బాగుంటాయి. ఇది కూడా ట్రై చేయండి: Kachalu Chamadumpa Chaat In Telugu: చామదుంపతో.. నోరూరించే కచ్లు చాట్ తయారీ ఇలా! -
టేస్టీ..యమ్మీ!.. విదేశాల్లో మన మామిడికి ఫుల్ డిమాండ్
సాక్షి,జి సిగడాం(శ్రీకాకుళం): సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో సిక్కోలు మామిడికి మంచి గిరాకీ ఉందన్న సంగతి తెలుసా..? ఆశ్చర్యంగా అని పించినా ఇదే నిజం. జిల్లాలోని గంగువారి సిగడాం మండలం వెలగాడ పంచాయతీ చంద్రయ్యపేట గ్రామం నుంచి ఏటా మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇక్కడ వివిధ రకాల మామిడి కాయలు పండించడంతో ఈ కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హిమాపసల్ అంటే మహా ఇష్టం ఈ గ్రామంలోని తోట నుంచి హిమాపసల్ మామిడి కాయలను సింగపూర్, దుబాయి, స్విట్జర్లాండ్, అ మెరికా దేశాలకు తరచూ ఎగుమతి చేస్తారు. అలాగే మనదేశంలోని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకూ ఈ మామిడిని తరలిస్తారు. అక్కడ కాయ రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతుంది. వందకాయలు దాదాపు రూ.7వేల వరకు విక్రయిస్తారు. ఈ రకం మామిడి సువాసన కిలోమీటర్ వరకు వ్యాపిస్తుందని చెబుతుంటారు. రుచి కూడా అమోఘం. కాయ సుమారుగా ఐదువందల గ్రాముల బరువు ఉంటుంది. 60 ఎకరాల్లో హిమాపసల్.. ఈ ఏడాది హిమాపసల్ మామిడి కాయ దిగుబడి తగ్గింది. ఉన్న మేర ఎగుమతి చేశాం. ఈ తోటలో 60 ఎకరాల్లో హిమపసల్ చెట్లు ఉన్నాయి. – ఎస్ కృష్ణ, కౌలు రైతు చదవండి: మెట్రో రైలులో యువతి ‘జిగల్’ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్ -
కలర్ఫుల్.. ప్రూట్స్
కడియం: పనస తొనలు తెలుపు లేత గోధుమ లేదా పసుపు రంగులో ఉండటం సహజమే. అవే తొనలు చూడగానే ఆకర్షించేలా ఆరెంజ్ కలర్లో ఉంటే ఆశ్చర్యమే. సీతాఫలాలు పైకి ఆకుపచ్చగా.. లోపల తెల్లటి గుజ్జుతో ఉండటం సహజమే. అవే ఫలాలు పైకి పింక్ కలర్లో కనిపిస్తే ‘ఎంత బాగున్నాయో’ అనిపించక మానదు. సాధారణంగా నేరేడు పండ్లు నల్లగా ఉంటాయి. అవే పండ్లు తెల్లగా ఉంటే..! సహజ సిద్ధంగా లభిస్తున్న ఫండ్లను ఇలా సరికొత్తగా అభివృద్ధి చేస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. సాధారణంగా మనం చూసే పండ్లను భిన్నమైన రంగుల్లో కాసే అనేక రకాల మొక్కలను తమ నర్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మన దేశంలో లభించే వివిధ రకాల పండ్లకు ఉండే సహజ గుణాలకు భిన్నంగా రూపొందిస్తున్న ఈ మొక్కలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగని వీటి తయారీ ప్రకృతి విరుద్ధంగానో లేక జీన్ మోడిఫైడ్గానో చేయడం లేదు. ప్రకృతి సహజంగా లభించే పండ్ల మొక్కల్లో భిన్నమైన లక్షణాలను ముందుగా గుర్తిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక మొక్కలో వచ్చేవిధంగా అంటు కట్టి తయారు చేస్తున్నారు. ఇలా దేశ, విదేశాల్లో విభిన్న రకాలైన పండ్ల మొక్కలను ఇక్కడకు తీసుకువచ్చి, సరికొత్తగా అభివృద్ధి చేసి, కొనుగోలుదార్లకు అందుబాటులో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం.. సాధారణంగా వేరే ప్రదేశం నుంచి ఏదైనా మొక్కను తేవాలంటే ప్లాంట్ క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా పండ్ల మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. విభిన్న రకాల మొక్కలను ఆయా నిబంధనలకు లోబడి ఇక్కడి నర్సరీ రైతులు తీసుకువస్తున్నారు. ముంబై, పుణే, కోల్కతా, కేరళ, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో క్వారంటైన్ లైసెన్సులు ఉన్న పలువురు నర్సరీ రైతులు ఇతర దేశాల నుంచి ఈ రకమైన పండ్ల మొక్కలకు మన దేశానికి తీసుకువస్తున్నారు. వీటిని కడియం ప్రాంత నర్సరీ రైతుల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. కంటికి భిన్నంగా కనిపించినప్పటికీ రుచిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు. తెల్ల నేరేడు, పింక్ జామ, ఎరుపు రంగు తొనలు ఇచ్చే పనస, సీడ్ లెస్ నిమ్మ, పింక్ కలర్ సీతాఫలం, ఎరుపు రంగులో ఉండే గులాబీ జామ, వెరిగేటెడ్ అరటి, స్వీట్ గుమ్మడి, పింక్ కొబ్బరి, వివిధ రంగుల్లో చిలగడదుంప, ఉసిరి, డ్రాగన్ఫ్రూట్, రామాఫలం, ఎర్రని చింత/సీమచింత తదితర రకాల పండ్ల మొక్కలను స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. పింక్ కలర్ గులాబీజామ ,ఆరెంజ్ పనస స్వీట్ గుమ్మడికొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి సాధారణంగా ఉండే పండ్ల కంటే భిన్నంగా కనిపిస్తుండడంతో కొనుగోలుదారులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వీటి అభివృద్ధి శ్రమతో కూడినది. కానీ నాణ్యమైన దిగుబడి ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహిక రైతులు వీటిని నాటి మంచి ఫలసాయం పొందుతున్నారు. ఇవి సహజసిద్ధంగా రూపుదిద్దుకున్నవే. – కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ, బుర్రిలంక సహజమైనవే.. కొన్ని రకాల పండ్లు, పువ్వులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగు, రుచి, వాసన కలిగి ఉంటాయి. మన దేశంలో పనస సాధారణంగా తెలుపు, లేత గోధుమ, పసుపు రంగుల్లో ఉంటుంది. థాయ్లాండ్లో ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన భిన్న లక్షణాలుంటాయి. వీటిని సేకరించి తీసుకువచ్చి, స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. సంబంధిత రకాన్ని అభివృద్ధి చేయడంగానే దీనిని చెప్పవచ్చు. – సుధీర్కుమార్, ఉద్యాన అధికారి, కడియం -
తుని.. మూడు తరాలుగా మామిడికి ప్రసిద్ధి
సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. మూడు తరాలుగా ఎగుమతులు మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. – పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం నేల స్వభావంతో మంచి రుచి తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని -
మామిడితో కాసులు.. ఆర్టీసీకి ఏ దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీకి మామిడి కాసులు తెచ్చి పెడుతోంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు మామిడి కాయలు/పండ్లను పార్శిల్ ద్వారా పంపే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టీసీ కార్గో, కొరియర్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటికి డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించడంతో మంచి ఆదరణ లభిస్తోంది. పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశిత ప్రాంతాలకు సరకును అందజేస్తోంది. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. చదవండి: కేశినేని కుటుంబంలో కుంపటి! మామిడికి ప్రత్యేక కౌంటర్.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో కార్గో బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం నుంచి మామిడి సీజను మొదలైంది. మామిడిని పార్శిల్ ద్వారా పంపే వారి కోసం ప్రత్యేకంగా పీఎన్ బస్టాండులోని 60వ నంబరు ప్లాట్ఫాం వద్ద కౌంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక ర్యాక్లను కూడా అమర్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే మ్యాంగో బాక్సుల డెలివరీకి 57వ నంబరు ప్లాట్ఫాం వద్ద మరో ప్రత్యేక కౌంటర్ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కార్గో బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పార్శిళ్లను బుక్ చేసుకునే వీలుంటోంది. ఇలా ఈ మ్యాంగో బుకింగ్ కౌంటర్లో నెలకు 600 నుంచి 800 వరకు బాక్సులు/పార్శిళ్లు బుక్ అవుతున్నాయి. గతేడాది కంటే మిన్నగా.. గత ఏడాది ఏప్రిల్లో 400 మ్యాంగో పార్శిళ్లు, మే నెలలో 600, జూన్లో 600 చొప్పున పీఎన్ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు బుక్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో 600, మే నెలలో ఇప్పటివరకు 800 వరకు పార్శిళ్లను పంపించారు. అంటే గత ఏడాదికంటే ఈ సీజనులో మామిడి పండ్ల/కాయల పార్శిళ్ల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆర్టీసీ ఒక్కో బాక్సుకు (5–15 కిలోల బరువు వరకు) రూ.100–120 వరకు రవాణా చార్జీ వసూలు చేస్తోంది. ఈ లెక్కన మామిడి రవాణా ద్వారా ఏప్రిల్లో రూ.60 వేలు, మే నెలలో (ఇప్పటి దాకా) రూ.80 వేల వరకు కార్గో ఆదాయం సమకూరింది. జూన్లోనూ 800 వరకు మ్యాంగో పార్శిళ్లు బుక్ అవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, విశాఖలకు అధికం.. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలకు అధికంగా మ్యాంగో పార్శిళ్లు బుక్ చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతి, రాజమండ్రిలకు బుక్ అవుతున్నాయని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు చెబుతున్నారు. ఒకే వినియోగదారుడు నాలుగైదుసార్లు పార్శిళ్లను పంపుతున్న వారు కూడా ఉంటున్నారని వివరిస్తున్నారు. మామిడి తర్వాత.. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో రవాణాలో మామిడి తర్వాత మందులు, ఫ్యాన్సీ సరుకులు, వ్రస్తాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పుస్తకాలు వంటివి ఉంటున్నాయి. ఇలా వీటి ద్వారా విజయవాడ కార్గో కౌంటర్కు రోజుకు రూ.2.50 నుంచి 3 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని ఆర్టీసీ కార్గో విభాగం డెప్యూటీ సీటీఎం (కమర్షియల్) రాజశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. డోర్ డెలివరీ కూడా.. మరోవైపు పది కిలోమీటర్లలోపు డోర్ డెలివరీకి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా వినియోగదారులకు వెసులుబాటుగా ఉంటోంది. బుక్ చేసిన సరకును వెళ్లి తీసుకురావడానికి సమయాన్ని వెచ్చించడంతో పాటు ఆటో, బస్సు, వాహన చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. డోర్ డెలివరీ వెసులుబాటు ఉండడం వల్ల వీరికి డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. దీంతో పలువురు ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. విడిపించని సరకులకు నేడు వేలం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పార్శిళ్లను కొంతమంది విడిపించుకోరు. అలాంటి వాటిని ఆర్టీసీ అధికారులు కొన్నాళ్ల పాటు వేచి చూసి ఎవరూ రాకపోతే వేలం వేస్తుంటారు. ఇలా పీఎన్ బస్టాండులో 2–3 నెలలుగా విడిపించుకోని 80 వరకు పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో మందులు, దుస్తులు, స్టేషనరీ, స్పేర్ పార్టులు వంటివి ఉన్నట్టు గుర్తించారు. వీటికి శనివారం ఉదయం 11 గంటల నుంచి వేలం వేస్తామని పార్శిల్ విభాగం అధికారులు తెలిపారు. -
Recipe: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా!
నోరూరించే చేపల ఇగురు ఇలా సులువుగా తయారు చేసుకోండి. చేపల ఇగురు తయారీకి కావలసినవి: ►పచ్చి చిన్న చేపలు – కేజీ ►కారం – మూడు టీస్పూన్లు ►కరివేపాకు – రెండు రెమ్మలు ►అల్లం – రెండు అంగుళాల ముక్క ►పుల్లటి పచ్చి మామిడి కాయ – ఒకటి ►పచ్చికొబ్బరి తురుము – కప్పు ►పసుపు – చిటికెడు ►పచ్చిమిర్చి – నాలుగు ►ఉప్పు – రుచికి సరిపడా. ►గార్నిష్ కోసం: ఆవాలు – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – రెమ్మ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం.. ►మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి ►చేపలను శుభ్రం చేసి నీచు వాసనలేకుండా ఐదారుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ►అల్లంని తొక్కతీసి పేస్టుచేయాలి ►పచ్చికొబ్బరి తురుములో పసుపువేసి మెత్తగా రుబ్బుకోవాలి ►బాణలిలో మామిడికాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కప్పు నీళ్లుపోసి ఉడికించాలి ∙ ►మామిడికాయ ముక్కలు ఉడికిన తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను వేయాలి ►చేపలు ఉడికిన తరువాత కొబ్బరి పేస్టు వేసి మరో 10 నిమిషాలు ఉడికించి దించేయాలి ►ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి, ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి ►ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి మారాక తాలింపుని ఉడికిన చేపల కూరలో వేసి కలుపుకుంటే చేపల ఇగురు రెడీ. చదవండి👇 Egg Chapati Recipe In Telugu: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా! Recipe: నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! Anapa Ginjala Charu: పాలకూర.. పచ్చిమామిడి ముక్కలతో రుచికరమైన అనపగింజల చారు! -
పేదోడి ఇంట పచ్చడి మెతుకులూ కష్టమే
ఖమ్మం (మధిర) : గ్యాస్, నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు పెరుగుతుండగా... పచ్చడితోనైనా కడుపు నింపుకుందామని భావించే పేదలకు అది కూడా భారంగా మారుతోంది. దిగుబడి తగ్గడంతో పెరిగిన మామిడి కాయల ధరలకు తోడు, పచ్చడి తయారీకి ఉపయోగించే ఇతర దినుసుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణాన ఈ ఏడాది పలువురు పచ్చడిపైనే ఆశలు వదిలేసుకున్నారు. దీంతో పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏటా పెట్టే మామిడికాయ పచ్చడి సువాసన ఈసారి అక్కడక్కడే వస్తోంది. వేసవి వచ్చిందంటే... వేసవికాలం వస్తుందంటే అన్ని వర్గాల ప్రజలు మొదటగా మామిడికాయ పచ్చడిపైనే దృష్టి సారి స్తారు. ఇందుకోసం మేలు రకాల కాయలను ఎంచుకుని పచ్చడి పెట్టడం ఆనవాయితీ. ఇళ్లలో ఉపయోగానికే కాకుండా దూరప్రాంతాల్లో ఉంటున్న బంధువులు, కుటుంబీకులకు పంపించేందుకు గాను అవసరమైన పచ్చడి కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈసారి మామిడి పూత పెద్దగా రాకపోగా, వచ్చిన పూత కూడా తెగుళ్ల బెడదతో నిలవలేదు. దీంతో మామిడికాయల ధరలు అమాంతకం పైకి వెళ్లాయి. ఫలితంగా పచ్చడి కోసం కాయల కొనుగోలుకు వస్తున్న వారు ధరలు చూసి నిరాశగా వెనుతిరుగుతున్నారు. మటన్ ముక్కలే... చాలా మంది ఇళ్లలో మామిడికాయ పచ్చడి ఇష్టంగా తింటారు. దీనికి తోడు ఉదయం ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే వారి క్యారేజీల్లో పచ్చడి తప్పక కనిపిస్తుంది. కానీ ఈసారి కాయల కొరత, పెరిగిన ధరలతో పచ్చడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోగా, కొందరు పెడుతున్నా యాభై కాయలకు బదులు పది, ఇరవై కాయలతో సరిపుచ్చుకుంటున్నారు. దీంతో బంధువులకు పంపించడం మాటేమో కానీ ఇంట్లో పెట్టిన పచ్చడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తినాల్సిందేనని చెబుతున్నారు. ఏపీ నుంచి దిగుమతి సాధారణంగా పచ్చడి తయారీకి చిన్నరసాలు, పెద్దరసాలు, జలాలు, తెల్లగులాబీ, నాటు తదితర రకాలను వినియోగిస్తారు. అయితే, జిల్లాలో 2018 – 19లో 1.20లక్షల ఎకరాలు, 2019 – 20లో 70వేలు, 2020 – 21లో 31,994, 2021 – 22లో 33,861 ఎకరాల్లో మామిడిసాగు విస్తీర్ణం ఉంది. చీడపీడలు ఆశించడం, అధిక వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది రైతులు తోటలను తొలగించారు. అలాగే, ఉన్న తోటల్లోనూ ఈసారి పెద్దగా దిగుబడి లేదు. దీంతో ఆంధ్రా సరిహద్దులో ఉన్న తిరువూరు, నూజివీడు, విస్సన్నపేట, ఎ కొండూరు, చింతలపూడి తదితర ప్రాంతాలనుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా మామిడికాయలకు ధర పెరిగిందని చెబుతున్నారు. ఆ జోలికే వెళ్లలేదు... ప్రతిరోజూ పనులకు వెళ్తుంటాం. ఉదయం వంట చేసుకోలేనందున ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి పెట్టి ఏడాదంతా వాడుకుంటాం. కానీ ఈసారి మామిడికాయలే కాదు నూనె ధర కూడా పెరిగింది. దీంతో ఈ ఏడాది పచ్చడి జోలికే వెళ్లలేదు. యాభై కాయలకు బదులు పది కాయలతో పచ్చడి పెట్టాలన్నా ధైర్యం చేయలేకపోయాం. – ఆదిలక్ష్మి, లడకబజార్, మధిర ఖర్చు ఇలా... మామిడి పచ్చడికి ఎక్కువగా ఉపయోగించే జలాల రకం కాయ ఒక్కొక్కటి రూ.40, చిన్నరసం రూ.30చొప్పున విక్రయిస్తున్నారు. దీనికి తోడు మిర్చి రకానికి అనుగుణంగా కేజీకి 250కు పైగా పలుకుతుండగా నూనె కేజీ ధర రూ.190 వరకు ఉంది. అలాగే, మామిడికాయ ముక్కలు కొట్టించడం, కారం పట్టించే ఖర్చు... ఎల్లిపాయలు, మెంతులు, ఉప్పు ఇలా దినుసుల ధరలు కూడా పెరి గాయి. ఫలితంగా ఈసారి పచ్చడి పెట్టడం భారంగా మారిందని సామాన్యులు వాపోతున్నారు. -
Recipe: పాలకూర.. పచ్చిమామిడి ముక్కలతో రుచికరమైన అనపగింజల చారు!
అనపకాయ చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఐరన్లు, పీచుపదార్థం పుష్కలం. కూర లేదంటే జ్యూస్.. దీనిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఇక వేసవిలో లభించే పచ్చిమామిడికాయ ముక్కలతో అనప గింజల చారు పెడితే టేస్ట్ అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇంట్లోనే ఈ వంటకాన్ని తయారు చేసుకోండి. కావలసినవి: ►లేత పాలకూర – రెండు కట్టలు ►అనపగింజలు – కప్పు ►కొత్తి మీర – చిన్న కట్ట ►ఉల్లిపాయ – ఒకటి ►టొమాటోలు – రెండు ►పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు ►పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు ►పసుపు – అరటీస్పూను, ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు ►ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను ►ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. ►పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. ►కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. ►దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి ►మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ►ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ►స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి ►ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి! -
పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో
సాక్షి, కరీంనగర్: రామడుగు మండలంలోని గోపాల్రావుపేటకు చెందిన ఇరుకు సాయిప్రియ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సాయిప్రియ–తిరుపతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సాయిప్రియ బీడీలు చేస్తుండగా తిరుపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గురువారం సాయంత్రం మామిడికాయ పచ్చడి విషయంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. సాయిప్రియ క్షణికావేశంలో వంట గదిలోకి వెళ్లి, ఒంటిపైన కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పివేసే క్రమంలో భర్త తిరుపతి, తోటి కోడలికి గాయాలయ్యాయి. సాయిప్రియను కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. శుక్రవారం మృతురాలి తండ్రి గంటి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నోరూరించే కొండ మామిడి.. దీని ప్రత్యేకత ఏమిటంటే?
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమ అడవుల్లో ఈ కాలంలో ప్రకృతి సిద్ధంగా విరివిగా కనిపించే కొండమామిడి కాయలు అంటే ఇష్టపడని వారుండరు. ఇవి పక్వానికి వచ్చి పండుగా మారేందుకు మరో 20 రోజులు పడుతుంది. రైతులు సాగు చేసే సాధారణ రకాలకు సంబంధించి దిగుబడి గణనీయంగా పడిపోయింది. కలెక్టర్, బంగినపల్లి, రసాల రకాలకు చెంది కాపు ఏటా కన్నా ఈ ఏడాది బాగా తగ్గింది. అక్కడక్కడ కలెక్టర్ రకం కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అటవీప్రాంతంలో మాత్రం అడవి మామిడి చెట్లు మాత్రం విరగ్గాశాయి. పక్వానికి రాగానే వాటికవే చెట్ల పైనుంచి నేలరాలతాయి. మంచి సువాసనతో నోరూరించే ఈ పండ్లను తినేందుకు పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తి చూపుతారు. చదవండి: Viral Video: సెల్ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి.. పండ్లు కాయలు ఆకుపచ్చ రంగులోనే ఉండటం వీటి ప్రత్యేకత. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ మామిడి పండ్లకు స్థానికంగా మంచి గిరాకీ. ఏమాత్రం పచ్చిగా ఉన్నా నోట్లో పెట్టలేనంత పుల్లగా వుంటాయి. పీచు ఎక్కువ. గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. వేసవిలో పిల్లలు ఈ చెట్ల కిందనే ఎక్కువ సమయం గడుపుతారు. మండలంలోని కిమ్మిలిగెడ్డ, అమ్మిరేఖల, కొత్తవీధి, లోదొడ్డి తదితర లోతట్టు ప్రాంతాల్లో కొండమామిడి చెట్లకు కొదవలేదు. కిమ్మిలిగెడ్డ సమీపాన రక్షిత అడవుల్లో ఇవి గుబురు గుబురుగా, ఎత్తుగా పెరిగి కనిపిస్తాయి. ఆవకాయకు బహుబాగు కొండమామిడి కాయలు ఆవకాయకు బాగుంటాయని చెబుతుంటారు. ఈ కాయలకు టెంక పెద్దది, గుజ్జు పీచు కట్టి ఉన్నందున ముక్కలు బాగా వస్తాయని, పులుపు ఎక్కువ కనుక ఆవకాయ పచ్చడికి శ్రేష్టమని గృహిణులు చెబుతారు. సాధారణ మామిడి రకాలు అందుబాటులో లేని కారణంగా ఈ ఏడాది ఇక కొండమామిడి కాయలపైనే ఆధారపడాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. -
తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. రుచికరమైన ఆవకాయ రెసిపీ!
బెల్లం ఆవకాయను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. మరి ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! బెల్లం ఆవకాయ తయారీకి కావలసినవి: ►తోతాపురి మామిడికాయలు – ఐదు ►బెల్లం – అరకేజీ ►నువ్వులనూనె – పావుకేజీ ►ఆవాలు – పావు కేజీ ►కారం – కప్పు, ఉప్పు – కప్పు ►మెంతులు – రెండు టీస్పూన్లు ►పసుపు – రెండు టీస్పూన్లు ►ఇంగువ – అరటీస్పూను ►తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు – కప్పు. బెల్లం ఆవకాయ తయారీ విధానం ►ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి. ►కాయల్లో జీడి తీసేసి ముక్కలు చేసుకోవాలి. టెంకపైన ఉన్న జీడిపొరను తీసేసి శుభ్రంగా తుడవాలి. ►ఆవాలు, మెంతులను గంటపాటు ఎండబెట్టి పొడిచేసుకోవాలి ►ఇప్పుడు పెద్ద గిన్నెతీసుకుని ఆవపొడి, పసుపు, మెంతి పిండి, కారం, ఉప్పు వేసి కలపాలి. ►ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తురిమి వేయాలి. దీనిలో ఇంగువ కూడా వేసి చక్కగా కలపాలి. ►ఇప్పుడు మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో కలపాలి. ►తర్వాత కొద్దిగా ఆయిల్ తీసి పక్కనపెట్టి, మిగతా ఆయిల్ వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పొడి జాడీలో వేసి పైన మిగతా ఆయిల్ వేయాలి. ►మూడు రోజుల తరువాత పచ్చడిని ఒకసారి కలపాలి, జాడీలో నిల్వచేసుకోవాలి. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా రెసిపీ -
Summer: పచ్చిమామిడికాయ ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకుంటే..
Summer Drinks: వేసవి అంటే మామిడి పండ్ల సీజన్. కేవలం పండ్లతోనే కాదు.. పచ్చి మామిడితోనూ ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ►పచ్చిమామిడికాయ ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు బయటకు పోకుండా ఉంటుంది. ►అంతేగాక శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. ►దీనితో తయారు చేసే కచ్చీకేరి షర్బత్ షర్బత్లో పుష్కలంగా సి విటమిన్ ఉండడం వల్ల, సి విటమిన్ లోపం వల్ల వచ్చే స్కర్వి వ్యాధిని ఈ డ్రింక్ నిరోధిస్తుంది. ►వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట రూపంలో చాలా నీరు పోతుంది. ఈ నీటిలో కీలకమైన ఖనిజ పోషకాలు ఐరన్, సోడియం, క్లోరైడ్లు కూడా బయటకు వెళ్లి పోతాయి. ►పచ్చిమామిడి ఈ పోషకాలను బయటకు పోనీయకుండా నియంత్రిస్తుంది. ►అజీర్ణం, డయేరియా వంటి ఉదర సమస్యలు ఈ షర్బత్ తాగితే తగ్గుతాయి. ►పచ్చిమామిడి రక్తహీనత, క్యాన్సర్, అధిక రక్తస్రావాన్ని నిరోధించడంతోపాటు, రోగనిరోధక వ్యవస్థను మరింత దృఢంగా మారుస్తుంది. ►పచ్చిమామిడి కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ►దంతాలు, చిగుళ్లను కూడా రక్షిస్తుంది. ►నోటి నుంచి వెలువడే దుర్వాసనను రానివ్వదు. ►మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న పచ్చి మామిడితో కచ్చీకేరి షర్బత్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! కచ్చీకేరి షర్బత్ తయారీకి కావలసినవి: తొక్కతీసిన పచ్చిమామిడికాయ ముక్కలు – అరకప్పు, పుదీనా ఆకులు – పది, పంచదార – టీస్పూను, వేయించిన జీలకర్ర పొడి – టీస్పూను, రాక్సాల్ట్ – టీస్పూను, నీళ్లు – మూడు కప్పులు, ఐస్క్యూబ్స్ – ఆరు. తయారీ: ►మామిడికాయ ముక్కలు, పంచదార, పుదీనా ఆకులు, జీలకర్ర పొడి , రాక్సాల్ట్ను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి ►ఈ మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్ని గ్లాస్లో తీసుకుని ఐస్క్యూబ్స్ వేసుకుంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన సమ్మర్ డ్రింక్ కచ్చీ కేరి షర్బత్ రెడీ. వేసవిలో ట్రై చేయండి: Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల! -
Recipes: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి!
మార్కెట్లన్నింటిని ఆక్రమించి తెగ సందడి చేస్తోన్న మామిడికాయలతో ఆవకాయ, పులిహోరలేగాక, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్తో కలిపి వండుకుంటే రుచికి రుచితోపాటు, మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. కాస్త పుల్లగా, మసాలా ఘాటుతో జ్యూసీగా ఉండే వెరైటీ వంటకాలను మామిడితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.... జ్యూసీ చికెన్ కావలసినవి: చికెన్ ముక్కలు – అరకేజీ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, యాలుక్కాయలు – ఆరు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ధనియాలపొడి – టీస్పూను, గరం మసాలా – టీస్పూను ఉల్లిపాయ – ఒకటి ( ముక్కలు తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – రెండు(సన్నగా తరగాలి), టొమాటో ప్యూరీ – పావు కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తొక్కతీసిన పచ్చి మామిడికాయ ముక్కలు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు. మసాలా పేస్టు: ఉల్లిపాయలు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, కారం – రెండు టీస్పూన్లు, పసుపు – టీస్పూను, ఎండు మిర్చి – పది, సోంపు – రెండు టీస్పూన్లు, పెరుగు – పావు కప్పు. తయారీ.. మసాలా పేస్టుకోసం తీసుకున్న వాటిలో పెరుగు తప్ప, మిగతా వాటన్నింటిని బ్లెండర్లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి. తరువాత గ్రైండ్ అయిన మిశ్రమంలో పెరుగు కలపాలి ∙చికెన్ను శుభ్రంగా కడిగి ఈ మసాలా పేస్టు పట్టించి రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి స్టవ్ మీద కూర వండడానికి బాణలి పెట్టుకుని ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తరువత యాలకులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, చికెన్ పట్టించగా మిగిలిన మసాలా పేస్టు, టొమాటో ప్యూరీ వేసి పదినిమిషాలపాటు వేయించాలి ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి తురుము వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత నానబెట్టుకున్న చికెన్, మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద అరగంట మగ్గనివ్వాలి అరగంట తరువాత కొబ్బరి క్రీమ్, కొత్తిమీర చల్లుకుని ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి. మటన్ మామిడి మసాలా కావలసినవి: మటన్ – అరకేజీ, పచ్చిమామిడికాయ – ఒకటి, ఆయిల్ – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉల్లిపాయ తరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా – టీస్పూను, పసుపు – అరటీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు. తయారీ.. ∙ ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙స్టవ్ మీద కుకర్ గిన్నెపెట్టి, ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించాలి ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ∙ ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి నాలుగు విజిల్స్ను రానివ్వాలి ∙ మటన్ ముక్క మెత్తగా ఉడికిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి తిప్పి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తరువాత కూరకు సరిపడా నీళ్లు, మామిడికాయ ముక్కలను వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి మామిడికాయ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. అనప గింజల చారు కావలసినవి: లేత పాలకూర – రెండు కట్టలు, అనపగింజలు – కప్పు, కొత్తి మీర – చిన్న కట్ట, ఉల్లిపాయ – ఒకటి, టొమాటోలు – రెండు, పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు, పసుపు – అరటీస్పూను ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ∙ ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ∙స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా -
Summer Drinks: మ్యాంగో మస్తానీ.. ఇందులోని సెలీనియం వల్ల..
Summer Drinks- Mango Mastani Recipe: మంచి ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక మ్యాంగో మస్తానీ తాగితే దాహం తీరుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మస్తానీ తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఈ ఒక్క జ్యూస్ తాగడం వల్ల.. విటమిన్ ఎ, బి2, బి6, బి12, సి, డి, క్యాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీచుపదార్థం, ఫోలేట్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియంలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. మ్యాంగో మస్తానీ తయారీకి కావాల్సినవి: మామిడి పండు ముక్కలు – కప్పు, చల్లటి క్రీమ్ మిల్క్ – కప్పు, జాజికాయ పొడి – చిటికెడు, ఐస్క్యూబ్స్ – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఐస్క్రీమ్ – రెండు స్కూపులు, చెర్రీ, పిస్తా, బాదం పప్పు, టూటీప్రూటీ, మామిడి ముక్కలు – గార్నిష్కు సరిపడా, ఉప్పు – చిటికెడు. మ్యాంగో మస్తానీ తయారీ విధానం: ►మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►దీనిలో పంచదార, జాజికాయ పొడి, ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. ►ఈ ప్యూరీలో పాలు, ఐస్క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంగుళం గ్యాప్ ఉండేలా గ్లాసులో పోయాలి. ►గ్లాసులో గ్యాప్ ఉన్న దగ్గర ఐస్క్రీమ్, మామిడి పండు ముక్కలు, డ్రైఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే.. -
Recipes: నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా!
అమ్మను, ఆవకాయను ఎప్పటికీ మర్చిపోలేమని తెలుగువారి నోటి నుంచి కామన్గా వినిపించే మాట. వంటల్లో ఏది బోర్ కొట్టినా ఆవకాయ మాత్రం ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అన్నంలో పప్పు, నెయ్యి ఆవకాయ కలుపుకుని తింటే స్వర్గానికి బెత్తెడు దూరమే అన్నట్టు ఉంటుంది. పెరుగన్నంలో ఆవకాయ ముక్కను నంచుకుంటే అమృతంలా అనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లన్నీ నోరూరించే మామిడి కాయలు కళ కళలాడిపోతున్నాయి. మరోవైపు మహిళలంతా జాడీలను సిద్ధం చేసుకుని ఆవకాయ పెట్టడానికి హడావుడి పడుతున్నారు. ఏడాదిపాటు నిల్వ ఉండేలా వివిధ రకాల ఆవకాయలను ఎలా పడతారో చూద్దాం.... నువ్వుల ఆవకాయ కావలసినవి పచ్చిమామిడికాయ ముక్కలు – రెండు కేజీలు, నువ్వుపప్పు నూనె – కేజీ, జీలకర్ర – టేబుల్ స్పూను, మెంతులు – టేబుల్ స్పూను, ఆవాలు – టేబుల్ స్పూను, అల్లం – పావు కేజీ, వెల్లుల్లి – పావుకేజీ, కల్లుప్పు – అరకేజీ, ఆవపిండి – 200 గ్రాములు, నువ్వుపిండి – ఆరకేజీ, జీలకర్ర పొడి – వందగ్రాములు, మెంతిపిండి – రెండు టీస్పూన్లు, పసుపు – రెండు టీస్పూన్లు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – అరకప్పు. తయారీ.. ముందుగా మామిడికాయ ముక్కల టెంక మీద ఉన్న సన్నని పొరను తీసేసి పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని తొక్క తీసి శుభ్రంగా కడిగి పేస్టుచేసి పక్కనపెట్టుకోవాలి. బాణలిని స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తరువాత కేజీ నూనె పోయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి బాణలిని స్టవ్ మీద నుంచి దించేసి పక్కనపెట్టుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తిప్పి చల్లారనివ్వాలి. కల్లుప్పుని గంటపాటు ఎండబెట్టి మిక్సీపట్టి మామిడికాయ ముక్కల్లో వేయాలి, దీనిలో ఆవపిండి, నువ్వుపిండి, జీలకర్రపొడి, మెంతిపిండి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో చక్కగా కలుపుకోవాలి. పొడులన్నీ కలిపాక పూర్తిగా చల్లారిన ఆయిల్ మిశ్రమం వేసి చక్కగా కలుపుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ సరిపోనట్లు కనిపిస్తుంది కానీ, మూడు రోజులకు ఆయిల్ పైకి తేలుతుంది. మూడోరోజు మూత తీసి పచ్చడిని మరోమారు కిందినుంచి పైదాకా బాగా కలుపుకోవాలి. ఉప్పు, ఆయిల్ సరిపోకపోతే ఇప్పుడు కలుపుకుని, గాజు లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకోవాలి. తొక్కుడు పచ్చడి కావలసినవి పచ్చిమామిడికాయలు – నాలుగు, ఉప్పు – అరకప్పు, పసుపు – టీస్పూను, ఆవపిండి – రెండు టేబుల్ స్పూన్లు, ఆవపిండి – టీస్పూను, కారం – ముప్పావు కప్పు, పప్పునూనె – ఒకటిన్నర కప్పులు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఆవాలు– పావు టీస్పూను , ఇంగువ – టీస్పూను. తయారీ.. మామిడికాయలను తొక్కతీసి ముక్కలుగా తరిగి మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తురుముని కప్పుతో కొలుచుకోవాలి. ఇది మూడు కప్పులు అవుతుంది. ఈ తురుములో పసుపు, ఉప్పు వేసి కలిపి ఒకరోజంతా పక్కన పెట్టుకోవాలి. మరుసటిరోజు ఊరిన ఊటను వడగట్టి ఊటను వేరు వేరుగా, తురుముని విడివిడిగా ఎండబెట్టాలి. ఎండిన తురుముని ఊటలో వేసి బాగా కలపాలి. నూనెను వేడెక్కిన తరువాత ఆవాలు, వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకుని వేయాలి. ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. నూనెను చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎండిన తురుములో కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక చల్లారిన నూనె వేసి కలపాలి. ఉప్పు, నూనె తగ్గితే, కలుపుకొని, జాడీలో నిల్వ చేసుకోవాలి. చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
మ్యాంగో కోకోనట్ కొలడా.. వేసవిలో అదిరిపోయే డ్రింక్
కావలసినవి: మామిడిపండు ముక్కలు – కప్పు, కొబ్బరి నీళ్లు – కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తులసి ఆకులు – మూడు, పంచదార – టీస్పూను, ఐస్ క్యూబ్స్ – ఐదు. తయారీ: గ్లాసులో తులసి ఆకులు, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి మామిడిపండు ముక్కలు, ఐస్క్యూబ్స్, కొబ్బరి నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తులసి ఆకులున్న గ్లాసులో పోయాలి ఈ గ్లాసులో కొబ్బరి క్రీమ్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలోæ వెంటనే దాహం తీర్చేవాటిలో మ్యాంగో కోకోనట్ కొలడా ఒకటి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, మామిడిలోని పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. -
రికార్డు స్థాయిలో ధరలు.. ఆమ్చూర్ క్వింటాలుకు రూ.36,900..కారణమిదే!
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్చూర్ ధర రికార్డు స్థాయిలో మంగళవారం క్వింటాలుకు రూ.36,900 పలికింది. మామిడి కాత తక్కువగా ఉండటంతో ఈ ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే ఆమ్చూర్ కొనుగోళ్లు జరుగుతాయి. మార్కెట్ యార్డుకు నల్లగొండ, మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కర్ణాటక రాష్ట్రం ఔరాద్ నుంచి మొత్తం 373 క్వింటాళ్ల ఆమ్చూర్ నిజామాబాద్ మార్కెట్కు వచ్చింది. ఈ నెలాఖరుకు ఆమ్చూర్ క్వింటాలు ధర రూ.40 వేల పైచిలుకు పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇతర దేశాల్లో చింతపండుకు బదులుగా పులుపుకోసం ఆమ్చూర్ను వాడుతారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
రైతులే నేరుగా విక్రయించుకునేలా సరికొత్త వెబ్సైట్
Mangoes Doorstep-Delivery: కర్నాటక ప్రభుత్వం ఎటువంటి మధ్యవర్తుల అవసరం లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు మామిడి పండ్లను విక్రయించడానికి సరి కొత్త పోర్టల్ను ప్రారంభించింది. మామిడి అత్యంత రుచికరమైన పండ్లలో ఒకటి. పైగా వేసవిలో విరివిగా లభించేది కూడా. దేశ వ్యాప్తంగా వందలాది మామిడి రకాలు ఉన్నాయి. ఐతే వాటిలో స్థానికంగా ప్రసిద్ధి చెందినవి సేకరించడం కష్టం. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ సమస్యకు చెక్పెట్టేలా సరికొత్త వెబ్సెట్ను ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రంలో పండించే స్థానిక రకాల మామిడి పండ్లను ఆన్లైన్ మాధ్యమం ద్వారా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా కర్ణాటక స్టేట్ మ్యాంగో డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మే 16న మధ్యవర్తులు లేకుండా ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు మార్కెట్ చేయడానికి వెబ్సైట్ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లతో రైతులు నేరుగా కనెక్ట్ అవ్వడమే కాకుండా మంచి తాజా పళ్లను కూడా పొందగలుగుతారు. ఈ ఆన్లైన్ పోర్టల్ కర్ణాటక ట్రేడ్మార్క్ కర్సిరి మాంగోస్ పేరుతో వెళ్తోంది. దీంతో వినియోగదారులు కనిష్ట ధరతో వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడిన రుచికరమైన తాజా మామిడి పళ్లను ఆస్వాదించగలుగుతారు. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
మ్యాంగో మ్యాగీ.. ‘దేవుడా! నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’
Mango Maggi Video: వంటకాలపై ఎప్పటికప్పుడు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కొత్త కొత్త వెరైటీలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని వెరైటీలను చూస్తే మాత్రం ఇదెక్కడి విచిత్రమని అనిపిస్తుంది. ‘ఇలా ఎవరైనా చేస్తారా?’అని అడగాలనిపిస్తుంది. అలాంటి వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరలైంది. అదే ‘మ్యాంగో మ్యాగీ’. మీరు విన్నది నిజమే. మ్యాగీని ముప్పుతిప్పలు పెట్టి చేసిన ఈ వెరైటీ వంటకం గురించి మీరూ తెలుసుకోవాల్సిందే. వీడియోలో ముందుగా.. ఫ్రై చేసే పెనంపై ఓ మహిళ మ్యాగీ నూడుల్స్ను వేసి, నీళ్లు పోసి మ్యాజిక్ మసాలా వేసింది. ఆ తర్వాత మ్యాంగో స్లైస్ బాటిల్ లోంచి జ్యూస్ను ఆ వంట కంలో పోసింది. వంటకమయ్యాక మామిడి ముక్కలను దానిపై చల్లి అందించింది. ఈ మ్యాం గో మ్యాగీ తయారీ వీడియోను ఒకరు పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ఆ లొకేషన్ ఎక్కడో చెప్పరా. ఆ వంటకం చేసిన వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఎవరైనా వెళ్తారు’అని ఒకరు.. ‘మీరు నరకానికి వెళ్తారు’అని మరొకరు, ‘దేవుడా.. నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’అని ఇంకొకరు కామెంట్లు పెట్టారు. Mango Maggi kha lo doston.🙌🏼 pic.twitter.com/4fY2HWJumV — Professor D (@RetardedHurt) May 13, 2022