Mango
-
మామిడికాయతో ఆవకాయేనా..? తియ్యటి మిఠాయిలు కూడా చెసేయండి ఇలా..!
పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్లూ తాగించొచ్చు.కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి; ఈ పేస్ట్లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.పచ్చి మామిడి హల్వాకావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలుతయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.మ్యాంగో బనానా షర్బత్కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంతతయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. (చదవండి: -
పుల్ల పుల్లగా.. తియ్యతియ్యగా.. మామిడి భలే రుచి అంటున్న నిహారిక (ఫోటోలు)
-
పేపర్ కట్టు... లాభాలు పట్టు!
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేరుశెనగ తర్వాత ఎక్కువ మంది రైతులకు ఆదాయం వచ్చే పంట మామిడే. మామిడి తోటల్లో కాయలకు కవర్లను కట్టే విధానం గత రెండు మూడేళ్లుగా కొందరు రైతులు అవలంభిస్తున్నారు. దీంతోపాటు కొందరు కర్ణాటకకు చెందిన రైతులు ఇక్కడి రైతుల మామిడి తోపులను లీజుకు తీసుకొని క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ విధానాలతో తోటలను సస్యరక్షణ చేసి నిమ్మకాయ సైజులో మామిడి కాయలున్న దశలోనే వాటికి పేపర్ను కట్టడం ద్వారా కాయల దిగుబడిలో నాణ్యతను పెంచుతున్నారు. ఈ పేపర్ మ్యాంగోకు మార్కెట్లో ఎక్కువ ధర పలికి మంచి లాభాలను గడిస్తున్నారు. దీన్ని గమనించిన ఇక్కడి మామిడి రైతులు సైతం తోటల్లోని కాయలకు పేపర్ను చుట్టడాన్ని విస్తృత స్థాయిలో చేపడుతున్నారు. కవర్లతో కాయలకు రక్షణసా«ధారణంగా మామిడి కాయలు కోతకొచ్చే ముందు కాయలు నిమ్మసైజులోకి రాగానే కవర్లను కట్టుకో వాల్సి ఉంటుంది. దీంతో కాయలపై సూర్యరశ్మి పడ కుండా, ఎలాంటి క్రిమికీటకాలు సోకకుండా కాయలు నాణ్యంగా ఉంటాయి. దీంతోపాటు కాయల సైజు పరిమాణం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా కాయ రంగు, షైనింగ్ వస్తుంది. పురుగులు, క్రిమికీటకాలు, తెగుళ్ళు, బంకపేను లాంటివి కాయపై కనిపించవు. దీంతో వీటిని ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారులు సైతం అధిక ధరలకు కొనేందుకు అవకాశం ఉంటుంది. వీటికి మార్కెట్లోనూ మంచి ధర పలుకుతోంది.హెక్టారుకు పది వేల కవర్లుఉద్యానవనశాఖ అంచనా ప్రకారం హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. కవర్ ధర రూ.2గా ఉంది. హార్టికల్చర్ శాఖ కవర్కు రూపాయి రాయితీ ఇస్తోంది. అంటే హెక్టారుకు పదివేల కవ ర్లకు రూ. 20వేలు అయితే రైతులు సంబంధిత రైతు సేవాకేంద్రంలో రూ.10వేలను చెల్లించి రిజిస్టర్ చేయించుకొంటే దానికి ప్రభుత్వం రూ.10వేలను కలిపి హెక్టారుకు పదివేల కవర్లను ఆ రైతుకు అందిస్తుంది. ప్రస్తుతం కవర్లకోసం ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు మొదలైయ్యాయి. రైతులు ప్రైవేటుగా కావాలనుకుంటే ఇండియామార్ట్, అమెజాన్లాంటి ఆన్లైన్లోనూ పొందవచ్చు. వీటిని మ్యాంగో ప్రొటెక్షన్ గ్రోత్ పేపర్ కవర్లుగా పిలుస్తారు. కవర్లు కట్టిన రైతులకు పండగే.మామిడి సీజన్ ముగుస్తున్న దశలో మార్కెట్కు వచ్చే నీలం మామిడికి ఏటా ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. జిల్లాలోని మొత్తం మామిడి సాగులో 20 శాతం మాత్రమే నీలం మామిడి సాగవుతోంది. ఇది మామిడిలో ఆఖరు సీజన్ ఫ్రూట్గా పేరుంది. ఇక్కడి రైతులు సహజ పద్ధతులతో మామిడిని సాగుచేయడమే కాకుండా కాయలకు కవర్లను కట్టడంతో సరుకు నాణ్యంగా ఉంటోంది. దీంతో వ్యాపారులు పోటీపడి మరీ అధిక ధరకు మామిడిని కొంటుండడంతో ధరలు ఆశాజనంగా మారాయి. గతేడాది నీలం రకానికి కవర్లు కట్టినందున టన్ను ధర రూ.లక్షను దాటింది.ఇక్కడి తోపులు లీజుకు పెట్టుకొని..కవర్లు్ల కట్టడం ద్వారా నాణ్యమైన సరుకును పొందే విధానంపై ఎక్కువ అవగాహన కలిగిన కర్ణాటక వ్యాపారులు, రైతులు ఇక్కడి మామిడి తోపులకు లీజుపెట్టుకుంటున్నారు. ఆపై వీరే తోపుల సస్యరక్షణ చేసి కాయలకు పేపర్లు కట్టి ఎక్కువ ధర దక్కేలా బయటి దేశాలకు నేరుగా ఎగుమతి చేస్తున్నారు. దీన్ని గమనించిన ఉమ్మడి జిల్లా రైతులు సైతం ఈ విధానాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళుతున్నారు.కొమ్మఅంటు (టాప్వర్కింగ్) కూడా..ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తోతాపురి రకం మామిడిì కాయలు పల్ఫ్కోసం కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తూ... గ్యారెంటీ మార్కెటింగ్ ప్రయోజనం పొందుతున్నారు. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్ వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్వర్కింగ్ జూలై, ఆగస్టునెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాత తోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్దతులు ప్రత్యామ్నాయంగా మారాయి.రైతులను ప్రోత్సహిస్తున్నాంజిల్లాలోని మామిడి రైతులకు కవర్లను కట్టడంపై అవగాహన కల్పిస్తున్నాం. మామిడి సాగు చేస్తున్న రైతులకు ఏటా సమావేశాలను నిర్వహించి కవర్లను కట్టడం ద్వారా కలిగే మేలును వివరిస్తున్నాం. హెక్టారుకు పదివేల కవర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం రైతు రూ.10వేలను చెల్లిస్తే మా శాఖ రూ.10వేలను కలిపి కవర్లను అందిస్తున్నాం. అవసరమైన రైతులు ఆర్ఎస్కేల్లో వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. – మధుసూదన్రెడ్డి, చిత్తూరు జిల్లా ఉద్యానశాఖ అధికారికాయ నాణ్యత బాగుంటుందిగిట్టుబాటు ధర లభించాలంటే మామిడి రైతులు కాయలకు పేపర్ బ్యాగులను అమర్చాలి. దీంతో కాయల నాణ్యత పెరిగి మార్కెట్లో మంచి ధర వస్తుంది. – నయాజ్, మామిడి వ్యాపారి, పలమనేరుటాప్వర్కింగ్తో భారీ లాభాలు...టాప్వర్కింగ్తో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీంతోపాటు ఉన్న తోటల్లో కాయలకు కవర్లను కట్టడం ద్వారా సరుకు నాణ్యత పెరిగి మంచి ధరలు వస్తాయి. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
ఫలరాజుపై మంచు పంజా!
మామిడి రైతుకు దిగుబడి దిగులు పట్టుకుంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఏడాది మామిడి పూత ఆలస్యమవుతోంది. జనవరి (January) మాసం ప్రారంభమై పక్షం రోజులైనా ఆశించిన మేర పూత రాలేదు. ఏటా డిసెంబర్ చివరికల్లా మామిడిచెట్లు పూతతో నిండి కళకళలాడేవి. ఈసారి చలి తీవ్రత, పొగమంచు ప్రభావంతో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఎన్నో ఆశలతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇక్కడ కనిపిస్తున్న మామిడితోట (Mango Field) కర్నూలు మండలం శివరామపురం గ్రామం రైతుది. ఎలాగైనా ఈసారి మంచి దిగుబడులు సాధించాలని పైరు చీడ పీడల బారిన పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. వేలాది రూపాయలు పెట్టి ఎప్పటికప్పుడు మందులు పిచికారీ చేశాడు. చివరకు చలి తీవ్రత, పొగమంచు ఆశలపై నీళ్లు చల్లాయి. ఇప్పటి వరకు చెట్లకు పూత పూయలేదు.కర్నూలు(అగ్రికల్చర్): ఈసారి వ్యవసాయం రైతులకు కలిసి రాలేదు. తొలుత అధిక వర్షాలు, తర్వాత వర్షాభావంతో ఖరీఫ్(Kharif) నిరాశకు గురి చేస్తే, వరుస తుఫానులు రబీ ఆశలను దెబ్బతీశాయి. ఈ క్రమంలో కొందరు రైతులు మామిడి తోటలపై నమ్మకం పెంచుకుంటే ప్రస్తుతం నెలకొన్న చలి తీవ్రత ప్రతికూలంగా మారింది. మామిడి తోటలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో మామడి తోటలు భారీగానే ఉన్నాయి. మామిడితోటలకు పెట్టింది పేరు బనగానపల్లె ప్రాంతం. బనగానపల్లె, అవుకు, సంజామల, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, పాణ్యం, వెల్దురి, బేతంచెర్ల తదితర మండలాల్లో భారీగా మామడి తోటలున్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వ ప్రోత్సాహంతో 2019 నుంచి 2024 వరకు ఉమ్మడి జిల్లాలో మామిడి తోటలు విస్తారంగా అభివృద్ధి చెందాయి. ఒకవైపు ఉపాధి నిధులతో 100 శాతం సబ్సిడీ ఇస్తుండటం, మరోవైపు ఉద్యాన శాఖ ఆకర్షనీయమైన రాయితీల వల్ల మామిడితోటలు పెరిగాయి.కర్నూలు జిల్లాలో విభిన్న పరిస్థితిజిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మామిడి పూత కొంత కనిపిస్తుండగా..తూర్పు ప్రాంతంలో ఇంకా పట్టే దశలోనే ఉంది. ఈభిన్న పరిస్థితికి వాతావరణంలో మార్పే కారణంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో చలి వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు 10–11 డిగ్రీలకు పడిపోయాయి. ఈ వాతావరణం మామిడికి ఇబ్బందికరంగా మారింది. చల్లని వాతావరణం ఉంటే తోటల్లో కొత్త చిగుళ్లు వస్తాయి. నేడు పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మామిడిలో కొత్త చిగుళ్లు కనిపిస్తున్నాయి. పత్తికొండ, దేవనకొండ. తుగ్గలి, గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల్లో 50 శాతం వరకు మామిడి పూత వచ్చింది. వెల్దుర్తి, ఓర్వకల్లు, బేతంచెర్ల, అవుకు, బనగానపల్లి, కృష్ణగిరి, కల్లూరు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకే పూత వచ్చింది. మామూలుగా అయితే జనవరి మొదటి పక్షంలోపు అన్ని ప్రాంతాల్లోని మామిడిలో 80 శాతంపైగా పూత రావాలి. వాతావరణం చల్లగా ఉండటం, పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటం ద్వారా పలు ప్రాంతాల్లో పూత ఆలస్యమవుతోంది. ఒకతోటలో 100 చెట్లు ఉంటే ఇందులో 35–40 శాతం చెట్లు పూతకు వచ్చాయి. మిగిలిన చెట్లలో పూత ఆలస్యమవుతోంది. జనవరి మొదటి పక్షం గడుస్తున్నా ఆశించిన మేర పూత పట్టకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు చలి తీవ్రత వల్ల తేనెమంచు, పురుగుల బెడద పెరుగుతోంది. ఇది మామిడి రైతులను నిరాశకు గురి చేస్తోంది.వచ్చిన పూత నిలిచేనా...కొన్ని ప్రాంతాల్లో పూత ఆశాజనకంగా వచ్చినప్పటికీ నిలిస్తేనే కాపు బాగుంటుంది. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పూత పిందె రాలిపోతుంది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో ఆరంభంలో పూత బాగానే వచ్చినప్పటికి తర్వాత ఎండల ప్రభావంతో 60 శాతంపైగా రాలిపోయింది. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో పూత విశేషంగా వచ్చినప్పటికి ఎంత వరకు నిలిచి కాపుగా మారుతుందనేది ప్రశ్నార్థకం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి.ఇందులో కర్నూలు జిల్లాలో 4848 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 10,167 ఎకరాల్లో మామిడి తోటలు అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు 40 శాతం తోటల్లో 50 శాతంపైగా పూత వచ్చింది. 50 శాతం తోటల్లో 30 శాతం వరకే పూత వచ్చింది. 10 శాతం తోటల్లో ఇంకా పూత రాలేదు. పూత రావడంలో హెచ్చు తగ్గులుండటానికి వాతావరణ పరిస్థితులే కారణమని ఉద్యాన అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి చెందిన మామిడిలో 70 నుంచి 80 శాతం వరకు బేనిసా ఉంటోంది. బేనిసా చెట్లు ఒక ఏడాది బాగా కాపు ఇస్తే... మరుసటి ఏడాది కాపునకు రావు. మామిడిలో చాల వరకు పూత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే పూతను బట్టి మామడి కొనుగోలు యత్నాలు జరుగుతాయి. పూత బాగా నిలిస్తే ఎకరాకు 7–8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ సారి వాతావరణం ప్రతికూలతతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.గతేడాది పూత బాగుండేదినాకు రెండు ఎకరాల్లో మామిడి తోట ఉంది. గతంలో ఈ సమయానికి మామిడి చెట్లకు పూత బాగా ఉండేది. ఇప్పటి వరకు ఆశించిన మేర పూత లేదు. తేమశాత ఎక్కువ కవడామో లేక వాతావరణ ప్రభావమో తెలియదు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. పంట రాకపోతే ప్రభుత్వం అదుకోవాలి. – కురువ శంకర్, మామిడి రైతు, పూడురు గ్రామందిగుబడిపై ప్రభావం నేను బనగానపల్లె, పాణ్యం, బేతంచర్ల మండలాల్లో సుమారు 14 ఎకరాల తోటలను రూ.3 లక్షల కౌలు ఇచ్చి తీసుకున్నాను. దీనికితోడు మందుల పిచికారీ తదితర వాటి కోసం ల్చక్షకు పైగా ఖర్చు చేశాను. సాధారణంగా ఈ సమయానికి పూత వచ్చి ఉండాలి. ఆలస్యం కావడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది.– పాంషా, మామిడి తోటల కౌలు రైతు, బనగానపల్లెమామిడిలో పూతరాకపోతే ఇలా చేయాలి పలు ప్రాంతాల్లో మామిడిలో పూత రావడం ఆలస్యమ్చవుతోంది. పూత రాని పక్షంలో 13–0–45 రసాయన ఎరువు 10 గ్రాములు, 3 గ్రాముల సల్పర్, 1.6 ఎంఎల్ మోనోక్రోటోపాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో పాటు పూత రానితోటల్లో పొగపెట్టాలి. ఇలా చేయడం ద్వారా పూత వచ్చే అవకాశం ఉంది. మరో 10–15 రోజుల్లో అన్ని ప్రాంతాల్లోని అన్ని తోటల్లో పూత వచ్చే అవకాశం ఉంది. పూత వచ్చిన తర్వాత చెట్లకు ఎరువులు వేసి తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. పూత వచ్చిన తోటల్లో చీడపీడల యాజమాన్యంలో భాగంగా సాఫ్–2 జిఎం, క్లోరోఫైరిఫాస్ 2 ఎంఎల్, బోరాన్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత ఉన్నట్లైతే ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 గ్రాములు, హెక్షాకొనజోల్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంది. – పి.రామాంజనేయులు, జిల్లా ఉద్యాన అధికారి, కర్నూలు -
ఫ్యాషన్ టైకూన్ ఇసాక్ ఆండిక్ కన్నుమూత
ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు."మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఇస్తాంబుల్లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్ బ్రాండ్ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్వర్త్ 4.5 బిలియన్ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.తిరుగులేని బ్రాండ్దాదాపు 2,800 స్టోర్లతో యూరప్లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు. -
ఆహా ఆవకాయ! ఒక ముద్ద పడిందంటే.. ఈ రుచులను ఎప్పుడైనా ట్రై చేశారా? (ఫొటోలు)
-
తోతాపురి పండు.. ఎగుమతుల్లో ట్రెండు
చిత్తూరు అర్బన్: తోతాపురి మామిడి కారణంగా చిత్తూరుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. తోతాపురి మామిడి కోసం ఏకంగా 48 దేశాలు చిత్తూరు వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి పంపిస్తున్న మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్)ను ఆయా దేశాల పౌరులు అపారమైన ప్రేమతో ఆస్వాదిస్తున్నారు. ఎగుమతుల్లో మరే దేశానికి లేని ప్రత్యేకత చిత్తూరు వల్లే భారత్కు దక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తూరు మామిడిపై కాస్త దృష్టి సారిస్తే ఎగుమతుల్లో మరింతగా ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1.12 లక్షల హెక్టార్లలోఏ రాష్ట్రంలో లేనివిధంగా మామిడి ఉమ్మడి చిత్తూరులో సాగవుతోంది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి జిల్లాల్లో 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి (బెంగళూరు) రకానికి చెందిన మామిడి చిత్తూరుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి0ది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 వేల హెక్టార్లు తోతాపురి, 42 వేల హెక్టార్లలో టేబుల్ రకాలకు చెందిన మామిడి సాగులో ఉంది. రమారమి ఏటా 7.5 లక్షల టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుండగా.. ఇందులో 5 లక్షల టన్నులతో తోతాపురి సింహభాగంలో ఉంది. తోతాపురి రకం కాయలను పండుగా తినడానికి, పచ్చళ్లకు ఉపయోగించరు. ఇది మృదువుగా, తీపిగా ఉండటంతో దీనిని పూర్తిగా గుజ్జు (పల్ప్) కోసమే ఉపయోగిస్తారు. మామిడి కాయల్ని వేడి నీటిలో శుభ్రంచేసి, టెంకను తొలగించి, గుజ్జును యంత్రాల ద్వారా వేరు చేస్తారు. సహజంగానే ఇది తియ్యగా ఉండటంతో కొద్దిమొత్తంలో చక్కెరను కలిపి మొత్తం గుజ్జును గాలి తీసేసిన కంటైనర్లలో నిల్వచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దేశంలోనూ డిమాండే దేశీయంగా తయారయ్యే పల్పీ, ఫ్రూటీ, స్లైస్, డాబర్, బి–నేచురల్ వంటి కంపెనీలు ఈ గుజ్జుతోనే మామిడి పానీయాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ కంపెనీలు సైతం ఇక్కడి నుంచే గుజ్జును సేకరిస్తాయి. చిత్తూరు జిల్లాలో 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోలెండ్, ఉక్రెయిన్, బెల్జియం, ఆ్రస్టేలియా, క్రోషియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రుమేనియా, ఆల్బేనియా, ఐర్లాండ్, సెజియా, ఐస్లాండ్, స్లోవేనియా, హంగేరి, ఫిన్లాండ్, సెర్బీ, మాల్టా, లాక్సంబర్గ్, సిప్రస్, స్లోవేకియా, మోనాకో లాంటి 48 దేశాలకు చిత్తూరు నుంచే మ్యాంగో పల్ప్ ఎగుమతి అవుతోంది. ఏటా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు 24 గంటలపాటు పనిచేస్తుంటాయి. ఐదేళ్లలో 9 లక్షల టన్నుల ఎగుమతి ఐదేళ్లలో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 9 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతి అయ్యింది. ఇది దేశంలోని మరే ప్రాంతానికి దక్కని గుర్తింపు. గుజ్జు ఎగుమతుల ద్వారా ఏటా సగటున రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్జిస్తోంది. 1.20 లక్షల మంది రైతులు, 2 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగాను, 4 లక్షల మంది పరోక్షంగా మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తే.. భారత్తో పాటు ఈజిప్్ట, ఆఫ్రికా, మెక్సికో, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా అంతర్జాతీయ మార్కెట్కు మామిడి గుజ్జు ఎగుమతులు ప్రారంభించాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జుపై 32% పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని తొలగిస్తే వ్యాపారులు, ఎగుమతిదారులు మామిడి సేకరణ ధరను పెంచుతారు. తద్వారా రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా.. చిత్తూరు నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జును కంటైనర్ల ద్వారా చెన్నైకు తీసుకెళ్లి, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు పంపుతున్నారు. దీనివల్ల ఎగుమతి ప్రోత్సాహకాలు చెన్నైకి అందుతున్నాయి. అలాకాకుండా చిత్తూరు నుంచే కంటైనర్లతో గుజ్జును ఉంచి సీల్ చేసి, ఇక్కడి నుంచి చెన్నైకు పంపిస్తే ఆ ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి లభించడంతోపాటు పారిశ్రామిక రంగానికి అదనపు ఊతం ఇచ్చినట్టవుతుంది. దీనికోసం చిత్తూరులో ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ)ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మధ్యాహ్న భోజన మెనూలో చేర్చాలి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెడుతున్నట్టే పిల్లలకు మ్యాంగో పల్ప్ కూడా ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు మ్యాంగో పల్ప్ ఇస్తే ప్రయోజనం చేకూరుతుంది. కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో మ్యాంగో పల్ప్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే చిత్తూరు పల్ప్కు పేటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. – గోవర్దన బాబి, చైర్మన్, ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్, సౌత్జోన్, చిత్తూరు -
మామిడి, అరటి.. ఉత్పత్తిలో మనమే మేటి
సాక్షి, అమరావతి: అరటి పండ్లు, మామిడి ఉత్పత్తిలో దేశంలోనే అంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. అరటి పండ్లను ఉత్పత్తి చేసే ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 18.1 శాతంతో మొదటి స్థానంలో ఉందని.. అలాగే మామిడి ఉత్పత్తిలోనూ దేశంలోనే అత్యధికంగా 5.0 మిలియన్ మెట్రిక్ టన్నులతో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపింది. దేశంలో ప్రధానంగా అరటి పండ్లు, మామిడి, ద్రాక్ష పండ్ల ద్రవ్యోల్బణం, ఉత్పత్తిపై ఆర్బీఐ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఏపీ తరువాత స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయని.. ఇవన్నీ దేశం మొత్తం అరటి పండ్ల ఉత్పత్తిలో 80 శాతం వాటాను కలిగి ఉన్నాయని నివేదిక వివరించింది.ఇక ఆంధ్రప్రదేశ్లో అరటి పండ్ల ఉత్పత్తి కేంద్రాలుగా తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కర్నూలు, కడప ఉన్నాయి. అలాగే, దేశంలో రెండో అతి ముఖ్యమైన పండు అరటి పండేనని నివేదిక తేల్చిచెప్పింది. ఇక దేశంలో అరటి పండ్ల ఉత్పత్తి 2012–13లో 26.5 మిలియన్ మెట్రిక్ టన్నులుండగా.. 2022–23 నాటికి అది 36.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. అలాగే, దేశం నుంచి అరటి ఎగుమతులు 2013–14లో 35 వేల మెట్రిక్ టన్నులుండగా.. 2022–23లో అది 376 వేల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అరటిపండ్ల అతిపెద్ద వినియోగదారుగా మన దేశమే ఉందని కూడా తెలిపింది. దేశీయ ఫార్మ్గేట్ 2021–22లో అరటి కిలో ధర రూ.14 నుంచి రూ.15 ఉండగా.. 2022–23లో రెండింతలు పెరిగి కిలో రూ.27 నుంచి 28 రూపాయలైందని నివేదిక పేర్కొంది.మామిడి ఉత్పత్తి, సాగులో ఏపీ ఆధిపత్యం.. మరోవైపు.. మామిడి ఉత్పత్తి, సాగులోనూ ఆంధ్రప్రదేశ్ ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు నివేదిక తెలిపింది. దేశంలో మామిడి సాగు విస్తీర్ణంలో 17 శాతం వాటాతో.. 5.0 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఆ తర్వాత 12 శాతం వాటాతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దేశంలో మొత్తం మామిడి ఉత్పత్తిలో ఏపీ వాటా 23 శాతమని కూడా పేర్కొంది. మామిడి సాగు ప్రధాన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణలు దేశవ్యాప్తంగా 75 శాతం ఉత్పత్తి కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. -
ఈ డెజర్ట్తో గుండె ఆరోగ్యం పదిలం..!
మన ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే కొన్ని డెజర్ట్లను మన ఆహారంలో భాగం చేసుకుంటే చాల రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాంటి డెజర్ట్ గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఫుడ్ గైడ్ టేస్టీ అట్లాస్ వెల్లడించిన ఉత్తమ డెజర్ట్ల జాబితాలో రెండో స్థానం దక్కించుకున్న ఈ డెజర్ట్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉనాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మన గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుందట. అదెలాగా? దీన్ని ఎలా తయారు చేస్తారు?ఆ డెజర్ట్ పేరు మామిడి స్టిక్కీ రైస్. ఇది థాయిలాండ్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన డెడర్ట్. దీన్ని అక్కడ ప్రజలు మ్యాంగో స్టిక్కీ రైస్గా పిలుస్తారు. ఈ డెజర్ట్ని గ్లూటినస్ రైస్, తాజా మామిడిపండ్లు, కొబ్బరిపాలను మిళితం చేసి తయారు చేస్తారు. ఈ డెజర్ట్ తయారీలో ఉపయోగించే పదార్థాలన్నీ మంచి పోషక విలువలు కలిగినవి. ముందుగా ఇందులో ఉపయోగించే పదార్థాలు ప్రయోజనాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.ఇందులో ఉపయోగించే అన్నంఈ పాయసం చేయడానికి గ్లూటినస్ రైస్ ఉపయోగిస్తారు. దీనిలోని కార్బోహైడ్రేట్లకి మంచి డైట్కి ఉపయోగపడే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది. స్టిక్కీ రైస్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల నిపుణుల అభిప్రాయం ప్రకారం తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న ఆహారాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అదీగాక అధిక రక్తపోటు లేదా బరువు సమస్యలు ఉన్నవారికి ఈ డెజర్ట్ గొప్ప ఔషధం. కొబ్బరి పాలుకొబ్బరి పాలలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ల ప్రమాదాన్ని నివారించే యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అంతేగాదు ధమనులలో ఫలకం కలిగించే బ్యాక్టీరియాను కూడా చంపుతుంది. గుండె జబ్బులకు దారితీసే రక్తంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. కొబ్బరి పాలల్లోని పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించి గుండె పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. మామిడి పండ్లు..మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి . ఇవన్నీ రక్త నాళాలు విశ్రాంతి తీసుకునేలా రక్తపోటు స్థాయిలను తగ్గించి సాధారణ పల్స్ను ప్రోత్సహిస్తాయి. ఈ సమ్మర్ పండులో మాంగిఫెరిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ సమ్మేళనం. ఇది గుండె కణాల్లోని మంట, ఆక్సీకరణ ఒత్తిడి. కణాల నశించడం వంటి వాటి నుంచి రక్షిస్తుంది. అంతేగాదు జంతు అధ్యయనాలు మాంగిఫెరిన్ రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కొవ్వు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొన్నాయి.ఈ డెజర్ట్తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఈ పుడ్డింగ్ కడుపులో చాలా తేలికగా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ కలిగి ఉండటం వల్ల శరీరంలోని అనేక ఎంజైమ్ల స్రావాన్ని పెంచి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే గ్యాస్, ఉబ్బరం, వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుందివిటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డెజర్ట్, మితంగా తింటే శరీరంలో తెల్ల రక్త కణాల వృద్ధి అవుతాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, దీర్ఘకాలంలో వివిధ కాలానుగుణ వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.కంటి చూపును వృద్ధి చేస్తుందిఇందులో విటమిన్ ఏ, బీటా-కెరోటిన్ అధికంగా ఉంటాయి డెజర్ట్ తయారీ..ఒక పాన్లో బెల్లం పొడితో పాటు ఒక కప్పు కొబ్బరి పాలను వేసి, రెండు పదార్థాలు కలిసే వరకు వేడి చేయండి. అయితే, పాలల్లో బెల్లం కరిగిపోయేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక పెద్ద గిన్నెలో వండిన జిగురుతో కూడిన అన్నం తీసుకుని దానిపై ఈ కొబ్బరి పాలు గ్రేవీ సగం పోయాలి. దీన్ని బాగా కలపి ఒక గంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఒక మామిడికాయ ముక్కను తీసుకుని ముక్కలు చేసి ఈ అన్నంలో వేశాక, మిగిలిన కొబ్బరిపాల గ్రేవిని ఇప్పుడు వేయాలి. చివరగా వేయించిన నువ్వులతో అందంగా అలంకరించాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే స్టిక్కీ రైస్ మామిడి పాయసం రెడీ..!.(చదవండి: హీరో మాధవన్ ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ తెలిస్తే..నోరెళ్లబెడతారు!) -
నేషనల్ మ్యాంగో డే: నోరూరిస్తూ..ఆరోగ్యానికి మేలు చేసే పండు!
పండ్లలలో రారాజు మామిడి పండు. ఇది అంటే ఇష్టపడని వారుండరు. భారతీయ వంటకాల్లో ఈ మామిడితో చేసే రెసిపీలు అగ్రభాగన ఉంటాయి. ఈ మామిడితో చేపల కూర నుంచి మామిడి స్మూతీస్ వరకు వివిధ రకాల ప్రత్యేక వంటకాలు ఉంటాయి. వేసవిలో సెలవులతో గడిపే పిల్లలు సైతం ఇష్టంగా తినే పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండే. అలాంటి మామిడి పండు కోసం ప్రత్యేకమైన రోజు ఒకటి ఉంది. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ మామిడిపండ్ల కోసం ఓ దినోత్సవాన్ని ఏర్పాటు చేసి మరీ ఎందుకు జరుపుకుంటున్నాం?. దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏం వచ్చింది?.దీని వెనుకున్న చరిత్ర..భారతీయ సంస్కృతితో మామిడిపండ్లకు ఉన్న సంబంధం ఐదు వేళ ఏళ్ల నాటిది. మామిడి అనే పేరు మలయన్ అనే పదం నుంచి ఉద్భవించింది. పోర్చుగీస్ వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేయడానికి 1498లో కేరళకు వచ్చినప్పుడు "మాంగా"గా మార్చారు. కాలక్రమేణా దీనిని మ్యాంగోగా పిలుస్తున్నారు. ఇది జీడిపప్పు, పిస్తాపప్పుల జాతికి చెంందిన అనాకార్డియోసికి చెందింది. 1987లో, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మామిడి రుచికి, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధ చెందిన పండ్లగా గుర్తించి ప్రతి ఏడాది జూలై 22న నేషనల్ మ్యాంగో డే జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకుంటున్నాం. భారత్లో మామిడి రకాలు: భారతదేశంలో వాణిజ్య రకాలు సహా మొత్తం 15 వందల రకాల మామిడిని పండిస్తారు. మామిడి ప్రధాన రకాలు ఒక్కొక్కటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల మామిడి పండ్లను పండిస్తారు.ఆరోగ్య ప్రయోజనాలు..మామిడిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి అధికంగా ఉంటాయి.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.మామిడిలోని ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. 2021 లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మామిడి పండ్లు తినడం వల్ల అందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ మారియ విల్లరీల్ గాంజాలేజ్ పాల్గొన్నారు.మామిడిలోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.మామిడిలోని విటమిన్ 'ఏ' కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.మామిడిలోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయని, ముఖంపై ముడతలను తగ్గించడానికి సహాయపడతాయని అంటున్నారు.మామిడిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.మామిడిలోని యాంటీఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.(చదవండి: ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ మృతి..అంత ప్రమాదమా?) -
ప్రపంచంలోనే అతి పెద్ద మామిడితోట మనదగ్గరే.. ఆ కుబేరుడిదే!
పెట్రోలియం, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్లోని జామ్నగర్లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 1.5 లక్షల కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది. -
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్కు సంబంధించిన స్టార్టర్ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో తనకంటూ ప్రత్యేక ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ఘనతను నిర్ధారించుకుంది. సంప్రదాయ వంటకాలకు సంబంధించిన పరిశోధన, సమీక్షలకు పర్యాటక ప్రదేశాల గురించిన సమాచారానికి పేరొందిన ఆన్లైన్ వేదిక టేస్ట్ అట్లాస్.. అత్యున్నత భారతీయ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీకి 6వ స్థానాన్ని కట్టబెట్టింది. గతేడాది ఇదే సంస్థ అందించిన ర్యాంకుల్లో మన బిర్యానీకి చోటు దక్కని నేప«థ్యంలో ఈ ఏడాది తన పాపులారిటీని తిరిగి నిలబెట్టుకోగలిగింది. సిటీజనులకు అత్యంత ప్రీతిపాత్రమైన వంటకంగానే కాక నగర సంప్రదాయ వంటకాల విశిష్టతను నలుదిశలా చాటేదిగా, దేశ విదేశీ ప్రముఖులకు నగర సందర్శనలో తప్పనిసరిగా ‘రుచి’ంచే మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ జాబితాలో టాప్ 10లో నిలవగా.. మన నగరంలో విరివిగా ఇష్టపడే బటర్ చికెన్, తందూరీ చికెన్ వంటివి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. నెం–1 గా మ్యాంగో లస్సీ... ఈ జాబితాలో మ్యాంగో లస్సీ నెంబర్ 1 గా నిలిచింది. వేసవిలో విరివిగా జనం ఆస్వాదించే ఈ లస్సీకి జాబితాలో అగ్ర స్థానం దక్కింది. అదే విధంగా దాని తర్వాతి స్థానంలో మసాలా చాయ్ నిలిచింది. ఇది అనేకమందికి, నగర వాసులకు రోజువారీ అవసరం అనేది తెలిసిందే. ఫుడ్ లవర్స్ ఇష్టపడే బటర్ గార్లిక్ నాన్కు మూడో ర్యాంక్ దక్కింది. ఆ తర్వాత అమృత్ సర్ కుల్చా, బటర్ చికెన్ వరుసగా నాల్గు, ఐదు ర్యాంక్లు దక్కాయి. ఆ తర్వాత మన హైదరాబాద్ బిర్యానీ ఆరు, షాహి పనీర్ ఏడు, చోలే భటూర్ ఎనిమిది, తందూరీ చికెన్ తొమ్మిది, కోర్మా పదో ర్యాంకును దక్కించుకున్నాయి. -
మండే ఎండల్లో కదిలి వచ్చిన మామిడిచెట్టు.. వైరల్ వీడియో
ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరూ.. ఒక్కో రకంగా తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. తమ చేష్టలతో తోటి వారికి ప్రేరణగా నిలవాలని భావిస్తారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట విశేషంగా నిలిచింది. ఇందులో ఒక వ్యక్తి చేసిన పని చూసినవారంతా వాహ్.. అంటున్నారు. మరి అదేంటో మీరూ చూసేయండి...ఇన్స్టాలో షేర్ అయిన వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం వెనుకాల సీట్లో కుండీలో పెరుగుతున్న మామిడి మొక్క (చెట్టు)ను భద్రంగా కట్టి తీసుకెళ్తున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక ఇలా చేశాడా? నిరంతర ప్రయాణంలో కూలర్లను నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లలేం గనుక ఇలా తీసుకెళ్లాడా? లేక నర్సరీనుంచి మొక్కను కొనుగోలు చేసి తీసుకెళుతున్నాడా? పెద్దగా పెరిగిన మామిడి చెట్టును ఒకచోటు నుంచి మరో చోటుకి షిఫ్ట్ చేస్తున్నాడా అనేది స్పష్టత లేదు. కానీ కొంతమంది అద్భుతమైన ఐడియా అంటూ కమెంట్ చేశారు. ఇది కావాలనే చేసిన జిమ్మిక్కు అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sethumadhavan Thampi (@sethumadhavan_thampi)ఏది ఏమైనా గ్రోబ్యాగ్లో భారీగా పెరిగిన మామిడి చెట్టును బండిపై తీసుకెళ్లడం వింతగా అనిపిస్తోంది. అంతేకాదు దీనికి మామిడి కాయలు కూడా కనబడుతుండటం విశేషం. వేగానికి చెట్టు కొమ్మలు హాయిగా ఊగుతోంటే.. అంతకంటే గమ్మత్తుగా ఆ మామిడికాయలు నాట్యం చేస్తున్నాయి. ఈ విన్యాసం చూడడానికి ఎంతో చూడముచ్చటగా కనిపిస్తోంది. ఈ వీడియో లక్షకు పైగా లైక్లను పొందింది. ప్రస్తుతం ఈ వీడియో 'సేతుమాధవన్ థంపి' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెగ వైరల్ అవుతోంది. ఇవి చదవండి: మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే.. -
పండ్లలో రారాజు మామిడి.. కాదు కాదు అరటి
మనదేశంలో మామిడిని పండ్లలో రారాజు అని అంటారు. వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. మార్కెట్లో పలు రకాల మామిడి పండ్లు కనిపిస్తాయి. అయితే ఇకపై దేశంలో మామిడికి బదులు ‘అరటి’ పండ్లలో రారాజుగా మారబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.2022-23లో ఉత్పత్తి పరంగా అరటి.. మామిడిని అధిగమించింది. అరటి వాటా 10.9 శాతం కాగా మామిడి 10 శాతంగా ఉంది. దేశంలో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మామిడి ఉత్పత్తి అవుతుంది. మన దేశానికి చెందిన మామిడి, అరటిపండ్లకు విదేశాలలో అత్యధిక డిమాండ్ ఉంది. మన మార్కెట్లలో కనిపించని అనేక రకాల మామిడిని నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.మామిడి పండించే ప్రధాన దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచ ఉత్పత్తిలో 42 శాతం వాటా భారత్దే. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం మామిడి ఉత్పత్తిలో 23.64 శాతం యూపీలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో మామిడి మొత్తం ఉత్పత్తి 21 మిలియన్ టన్నులు. దేశంలో 1,500కుపైగా మామిడి రకాలు ఉన్నాయి.మనదేశంలో అరటి పండ్లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటి పండు అన్ని రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి అవుతుంది. అరటిపండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐదు రాష్ట్రాలు సమిష్టిగా 67 శాతం అరటిపండ్ల వాటాను అందించాయి. అరటిపండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా భారత్ ఉన్నప్పటికీ మనదేశ ఎగుమతుల వాటా ప్రపంచం మొత్తం మీద ఒకశాతం మాత్రమే. -
ది బెస్ట్ మ్యాంగో రెసిపీల్లో మామిడి చట్నీ ఎన్నో స్థానం అంటే..!
పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది. వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్తో తయారు చేస్తారు. ఈ జ్యూస్ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!) -
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
వేసవిలో మామిడి పండ్ల జాతర అన్నట్లుగా రకరకాల వెరైటీలు వస్తుంటాయి. మామిడి పండ్ల అంటే ఇష్టపడని వారెవరూ ఉంటారు చెప్పండి. అయితే మనం మామిడి పండ్ల తొక్కును పడేసి తినేస్తుంటాం. కానీ మామిడి పండ్ల తొక్కలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరెందులోనూ ఉండవని అంటున్నారు. అవేంటో చూద్దామా..!మామిడి తొక్కలో ఏ, సీ, కే, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం, ఫైబర్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫైనాల్స్లు ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, కేన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్తవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు 2008లో ప్రచురితమైన ఓక్లహోమ్ స్టేట యూనివర్శిటీ అధ్యయనంలో మామిడి తొక్కలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే గాక బరువు కూడా అదుపలో ఉంటుందని తేలింది. ముఖ్యంగా నామ్ డాక్ మై, ఇర్వ్విన్ అనే రెండు మామిడి రకాల తొక్కలు శరీరంలోని కొలస్ట్రాల్ని తగ్గిస్తాయి. పండ్లును చక్కగా తినేశాక ఆ మామిడి తొక్కలను ఏం చేయాలనే కదా..! వాటిని పడేయకుండా చక్కగా రకరకాల రెసీపీలు చేసుకుని తినేయండి అని చెబుతున్నారు నిపుణులు. మామిడి తొక్కలతో చేసే రెసీపీలు ఏంటంటే..మామిడి తొక్క టీ: మామిడితొక్కలను చక్కగా నీటిలో ఉడికించి, కొంచెం తేనే, నిమ్మకాయ వేసుకుని టీ మాదిరిగా తాగితే ఆ టేస్టే వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. ఈ టీ వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అందుతాయి.మామిడి తొక్క ఊరగాయ: తొక్కతోపాటు ముక్కలు చేసుకుని ఉప్పులో ఊరబెట్టి, రోజ ఎండలో ఆరనియాలి. ఇలా వాటిలో నీరు మొత్తం ఇంకిపోయేలా ఆరనిచ్చి చక్కగా పచ్చడి మాదిరిగా పట్టుకోవడం లేదా వాటిని భద్రపర్చుకుని పప్పులో వేసుకుని తిన్న బాగుంటాయి. మామిడి తొక్కపొడి: ఎండలో ఎండబెట్టిన మామిడి తొక్కను పొడి చేసుకోవాలి. దీన్ని మెరినేడ్లు, సూప్లు, కూరల్లో జోడిస్తే మంచి టేస్ట్ వస్తుంది. పైగా మామిడి తొక్కను ఆహారంలో భాగం చేసుకున్నట్లువుతుంది కూడా. అంతేగాదు ఈ తొక్కల పొడిని బ్యూటీ టోనర్గా కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ వాష్గా కూడా ఉపయోగించొచ్చ. బ్యూటీ స్క్రబ్: మామిడి తొక్కల పొడిని తేనే లేదా పెరుగులో కలిపి ముఖానికి స్క్రబ్లా ఉపయోగించొచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి తాజాగా ఉంటుంది. పైగా చర్మం కూడా రిఫ్రెష్గా ఉంటుంది. జుట్టు సంరక్షణ: ఈ మామిడి తొక్కలను కలిపిని నీటితో షాంపు వేసుకుని తలను శుభ్రం చేసుకుంటే..జుట్టు చిట్లడం వంటి సమస్యలను అరికట్టి సిల్కీగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు చర్మం కుచ్చులా ఉండి మెరుస్తూ ఉంటుంది. స్కిన్ టోనర్: మామిడి తొక్కలను నీటిలో వేసి మరిగించిన ద్రవాన్ని వడగట్టి చర్మానికి టోనర్గా ఉపయోగించొచ్చు. ఇది ముఖంపై ఉండే రంధ్రాను దగ్గర చేయడమే తాజాగా ఉండేలా చేస్తుంది.(చదవండి: మామిడి బఫే..ఐస్క్రీం నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని మ్యాంగో మయం..!) -
మామిడి బఫే..ఐస్క్రీం నుంచి బ్రేక్ఫాస్ట్ వరకు అంతా మ్యాంగో మయం..!
మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్ల రాజు మ్యాంగో. అలాంటి మామిడి పండ్లతో మ్యాంగో బఫేని అందిస్తోంది ఓ రెస్టారెంట్. కేక్లు దగ్గర నుంచి ఐస్క్రీమం వరకు అన్నింటిలోనూ మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కడ? ఏ రెస్టారెంట్ ఇలా సర్వ్ చేస్తోందంటే..మామిడి అంటే ఇష్టపడే వాళ్ల కోసం దక్షిణ కొరియాలోని ఒక రెస్టారెంట్ మామిడి పండ్లతో వెరైటీ బఫేని పరిచయం చేసింది. సియోల్లోని లోట్టే అనే హోటల్ ఈ వైరైటీ బఫేట్ని కస్టమర్ల్కు సర్వ్ చేస్తోంది. దీని ధర వచ్చేసి రూ. 8,257లు. ఈ వేసవి మొత్తం ఈ బఫెట్ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఆ బఫేలో మామిడి పండ్లతో చేసిన కేక్, మ్యాంగో డ్రింక్, మ్యాంగో ఫుడ్డింగ్, మ్యాంగో డెజర్ట్, మ్యాంగో ఐస్క్రీం, స్పైసీ రైస్ కేక్లతో సహ పది రకాల వెరైటీలను ఈ బఫేలో అందిస్తారు.వవెరైటీ భోజనం కావాలనుకునే వాళ్లకు ఇది అద్భతమైన బఫే సెటప్ అని చెప్పొచ్చు. ఆ రెస్టారెంట్ చుట్టూ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ బఫే కస్టమర్లకు ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండే సుందరమైన జలపాతం, కళాత్మక అలంకరణల మధ్య ఈ మ్యాంగో బఫేని అధిక ధరకు వెచ్చించి మరీ తినడం కస్టమర్లకు ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటుందట. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మామిడి ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్ అని ఒకరు, ఇది స్వర్గానికి మించి..! అని మరోకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: మే పుష్పం' గురించి విన్నారా! ఏడాదిలో ఒకసారి మాత్రమే..) View this post on Instagram A post shared by 포토그래퍼의 공간 탐닉 (@space_tamnik) -
ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
పిఠాపురం: మామిడిలో రారాజుగా పేరొందిన కొత్తపల్లి కొబ్బరి మామిడికి ఎక్కడాలేని గిరాకీ పలుకుతోంది. మామిడి ప్రియుల మనసు దోచుకున్న ఒకే ఒక్క మధుర ఫలం ఇది. రుచిలో అతి మధురంగా ఉండడంతో ఈ మామిడి పండ్ల రేటు పైపైకి ఎగబాకి పండ్ల ప్రియులను ఊరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... మామిడిలో ఎన్నో రకాలున్నప్పటికీ వాటిలో గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడికి ఉన్న డిమాండ్ వేరు. మామిడి రకాల్లో ఈ రెండింటినీ హిడెన్ జెమ్స్గా భావిస్తారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించి, సంరక్షించిన గ్రామాల పేరిటే ఇవి ప్రసిద్ధి చెందాయని ఆ ప్రాంతవాసులు అంటున్నారు.ఉత్తమ లక్షణాలున్న పండ్లుగా ఇవి గుర్తింపు పొందడంతో రాజుల కాలం నుంచే వీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని, ఆ రుచిని తాము ఆస్వాదించడంతోపాటు మిత్ర రాజులకు కానుకలుగా పంపేవారట. అందుకే ఒకప్పుడు రాజ సంస్థానాల్లో మాత్రమే ఈ పండ్లు ఉండేవని, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండేవి కావనే ప్రచారం కూడా ఉంది.ఇప్పటికీ ఈ రకం మామిడి పండ్లను తమ స్నేహితులకు, బంధువులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు బహుమతిగా పంపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఏటా గోదావరి జిల్లాల నుంచి సుమారు 20 టన్నుల వరకూ కొత్తపల్లి కొబ్బరి, కాకినాడ రూరల్ మండలంలోని పండూరు మామిడి రకాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కవ కాలం నిల్వ ఉండకపోవడంతో ప్రస్తుతం దూర ప్రాంతాలకు ఎగుమతులు జరగడం లేదని అంటున్నారు. కొత్తపల్లి కొబ్బరి గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన మామిడి రకాల్లో కొత్తపల్లి కొబ్బరిదే ప్రథమ స్థానం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి ప్రాంతంలో లభించే అమోఘమైన రుచి కలిగిన మామిడి పండు ఇది. కొబ్బరి కాయలో మాదిరిగా పీచు అధికంగా ఉండటంతో ఈ రకాన్ని కొత్తపల్లి కొబ్బరిగా పిలుస్తారు. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతూ సువాసనలు వెదజల్లుతుంటుంది. పూదోటలో మాదిరిగా ఈ రకం మామిడి పండ్లు ఉన్నచోట సువాసనలు వెదజల్లుతుంటాయి.ఈ మామిడి పండులో కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి. ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి సైజు చిన్నగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండటంతో పచ్చి మామిడి తినలేరు. కానీ పండు మాత్రం అతి మధురం. ఇవి మామిడి సీజన్లో మాత్రమే పండుతాయి. పీచు ఎక్కువగా ఉండటంతో ఆవకాయ, ఊరగాయలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మామిడితో పెట్టిన ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ చెట్ల కాపు తక్కువగా ఉంటుంది. పండు చిన్నదే కానీ ధర మాత్రం అదరగొడుతుంది.పండూరు మామిడి ఇది అత్యంత పురాతనమైన మామిడి రకం. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగి, నిండా కాయలుంటాయి. చూడటానికి పప్పులో వేసుకునే చిన్న మామిడి కాయల్లా మాత్రమే ఉంటాయి. పండ్లు కూడా ఆకుపచ్చగానే ఉండటం వీటి ప్రత్యేకత. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వెలగదూరు గ్రామ పరిసరాల్లోని సంస్థానంలో పూర్వం కొందరు దొంగలు మామిడి పండ్లను దొంగిలించి, తిని, వాటి టెంకలను కోట అవతల పారేశారని, వాటిని తీసి నాటగా వచి్చన చెట్టు ద్వారా ఈ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది.దిగుబడి తగ్గి.. డిమాండ్ పెరిగి.. గత ఏడాదికంటే దిగుబడి తగ్గడంతో కొబ్బరి మామిడికి డిమాండ్ అమాంతం పెరిగింది. గత ఏడాది 100 కొబ్బరి మామిడి కాయలు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయించగా ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అమ్ముడవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పంపడానికి స్థానిక నేతలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు కొని తినే అవకాశం లేకుండా పోయింది. గతంలో దిగుబడి ఎక్కువగా ఉండటంతో అందరికీ అందుబాటులో ఉండేవి.కానీ ఈ ఏడాది కొబ్బరి మామిడి చెట్లు పూత రాలిపోయి తక్కువగా కాశాయి. దీంతో దిగుబడి చాలా తక్కువ వస్తోంది. కాయ సైజు కూడా చిన్నదిగా ఉంటోంది. ఎంత ఖరీదైనా కొనుగోలు చేయడానికి మామిడి ప్రియులు ఎగబడటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 2 టన్నుల కాయలు విక్రయించాం. మరికొద్ది రోజులు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి. – కండేపల్లి సురేన్, మామిడి వ్యాపారి, కొత్తపల్లి వీటి గిరాకీ వేటికీ ఉండదు కొత్తపల్లి కొబ్బరి రకానికి ఉన్న గిరాకీ మరే మామిడి పండుకూ ఉండదు. పీచు అధికంగా ఉండటంతో ఊరగాయలకు ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండడంతో వీటికి ఎనలేని గిరాకీ పెరిగింది. దీంతో కాయ పెద్దది కాకముందే కోసేస్తున్నాం. మామిడి సీజన్లో మొదటిగా ఇవి అందుబాటులోకి వస్తాయి. కాయ టెంక కట్టగానే పండించడానికి వీలుంటుంది. వందల సంఖ్యలో ఆర్డర్లు ఇస్తున్నారు. ఇది తొందరగా ముగ్గిపోతుంది. కాయ బాగా ముదిరితే మంచి నాణ్యత ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా ఉండటంతో ఇవి ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. – ఓరుగంటి నాగబాబు, మామిడి రైతు, చేబ్రోలు -
ఆవురావురుగా... కమ్మని ఆవకాయ!
ఎండాకాలం... మే నెల సగం అయిపోయింది. మామిడి కాయలు టెంక కట్టి ఎదురు చూస్తున్నాయి. జాడీలు స్నానాలు చేసి ఎండలో సేదదీరుతుంటాయి. ఇంట్లో మిక్సీలు గిర్ర్ర్ అంటూ గోల చేస్తుంటాయి. మామిడి కాయలు కొట్టే కత్తి పుల్లబారి పదునుదేలింది. ముక్కలు కొట్టండి... పళ్లెంలో వేయండి... కారం కలపండి. జాడీలకెత్తండి... పళ్లెంలో వేడి వేడి అన్నం వేసి కలపండి. ఇంటిల్లిపాదీ ఆవురావురుమని తినకపోతే అడగండి.ఆంధ్రా ఆవకాయ..కావలసినవి..పచ్చి మామిడి ముక్కలు – కేజీ;పచ్చి శనగలు – 50 గ్రాములు;సన్న ఆవాలు –పావు కేజీ;మెంతులు – రెండు టేబుల్ స్పూన్లు;గుంటూరు మిరపపొడి –పావు కేజీ;ఉప్పు – నూట యాభై గ్రాములు;పసుపు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె –పావు కేజీ.తయారీ..ఆవకాయ పెట్టడానికి ముందు రోజు మిరపకాయలు, ఆవాలు, మెంతులను విడిగా ఎండబెట్టాలి. మరునాడు ఉదయం ఆవాలను మిక్సీలో పొడి చేయాలి. మిరపపొడి రెడీమేడ్ది కూడా తీసుకోవచ్చు. కానీ ఆవాలు స్వయంగా చేసుకోవాలి.మామిడి కాయలను కడిగి తేమపోయే వరకు తుడిచి ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత కాయలకున్న తొడిమ తొలగించాలి.అప్పటికీ సొన కారుతుంటే శుభ్రమైన నూలు వస్త్రంతో తుడిచేయాలి. ఇలా సిద్ధం చేసుకున్న మామిడికాయలను టెంకతో సహా చిన్న ముక్కలు చేసుకోవాలి.శనగలను శుభ్రమైన వస్త్రంతో తుడిచి పక్కన పెట్టాలి.వెడల్పుగా ఉన్న పెద్దపాత్రలో మామిడి ముక్కలు వేయాలి. అందులో శనగలు, ఆవాల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.మెంతులు కూడా వేసి బాగా కలపాలి. చివరగా నూనెపోసి ముక్కలకు ఒత్తిడికి కలగకుండా అడుగు నుంచి కలిపితే ఆవకాయ రెడీ. దీనిని పింగాణి జాడీలో పెట్టి అంచులకు తెల్లని శుభ్రమైన నూలు వస్త్రాన్ని కట్టాలి.ఆ పైన మూత పెట్టాలి. ఈ జాడీలోని ఆవకాయను రోజూ మూత తీయకూడదు. రోజువారీ వాడుకకు అవసరమైనంత చిన్న జాడీలోకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.బెల్లం ఆవకాయ..కావలసినవి..మామిడి ముక్కలు – అర కేజీ; బెల్లం – అర కేజీ;మిరపపొడి– 200 గ్రాములు;ఉప్పు – 200 గ్రాములు;ఆవపిండి– 100 గ్రాములు;నూనె – 200 గ్రాములు.తయారీ..మామిడి కాయలను శుభ్రంగా కడిగి తుడిచి టెంకతో సహా ముక్కలు చేసుకోవాలి.బెల్లాన్ని తురిమి వెడల్పుపాత్రలో వేసి అందులో మామిడికాయ ముక్కలు, ఆవపిండి, మిరపపొడి, ఉప్పు, కప్పు నూనె వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని రెండు రోజులపాటు ఎండలో పెట్టాలి. బెల్లం కరిగిపాకంలా జిగురుగా వచ్చినట్లనిపిస్తే సరే, లేకపోతే మూడవ రోజు కూడా ఎండలో పెట్టాలి.పాకం వచ్చిన తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి.ఈ బెల్లం ఆవకాయను పిల్లలు బాగా ఇష్టపడతారు. ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మహిళలు రోజూ తీసుకోవచ్చు.నువ్వుల ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు – 3 కప్పులు;నువ్వులు – ఒకటిన్నర కప్పులు;మిరపపొడి– ముప్పావు కప్పు;ఉప్పు–పావు కప్పు;పసుపు – అర టీ స్పూన్;వేరు శనగ నూనె – ఒకటిన్నర కప్పులు.తయారీ..నువ్వులను తయారీ దోరగా వేయించి చల్లారిన పొడి చేయాలి.మామిడి ముక్కలను వెడల్పుపాత్రలో వేసి అందులో నువ్వుల పొడి, మిరపపొడి, ఉప్పు, పసుపు వేసి అట్లకాడతో బాగా కలపాలి.ఉప్పు, కారం, నువ్వుపిండి సమంగా కలిసిన తర్వాత కప్పు నూనెపోసి మళ్లీ కలపాలి.ఈ మిశ్రమాన్ని జాడీలోకి తీసుకుని, మిగిలిన నూనెను పైన తేలేటట్లుపోయాలి.ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వెల్లుల్లి ఆవకాయ..కావలసినవి..మామిడి కాయ ముక్కలు –పావు కేజీ లేదా (మీడియం సైజు కాయలు 3);వెల్లుల్లి – 200 గ్రాములు;ఉప్పు – 100 గ్రాములు;మిరపపొడి– 200 గ్రాములు;ఆవాలు – 150 గ్రాములు (ఎండబెట్టి పొడి చేయాలి);పసుపు – టీ స్పూన్;మెంతులు – టేబుల్ స్పూన్;నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – కిలో.తయారీ..ఒకపాత్రలో నూనెపోసి మామిడి ముక్కలను వస్త్రంతో తుడిచి నూనెలో వేయాలి.వెల్లుల్లిపాయలను పొట్టు వలిచి ఒక ప్లేట్లో వేసి గాలికి ఆరనివ్వాలి.మరొకపాత్రలో మిరపపొడి, ఆవపిండి, ఉప్పు, పసుపు, మెంతులు వేసి సమంగా కలిసేవరకు కలపాలి. ఇప్పుడు వెల్లుల్లి రేకలను వేసి కలపాలి.మామిడి ముక్కల లోని నూనెను ఒక జాడీలోకి వంపాలి. ఇప్పుడు మామిడి ముక్కలలో ముందుగా కలిపి సిద్ధంగా ఉంచిన ఉప్పు, వెల్లుల్లి ఇతర పొడుల మిశ్రమాన్ని వేసి పొడులన్నీ మామిడి ముక్కలకు పట్టేలా కలపాలి.మామిడి ముక్కలను పట్టి ఉన్న నూనె ఈ పొడులను పీల్చుకుని కొంత తడి పొడిగా మారుతుంది.ఈ మిశ్రమాన్ని నూనె వంపుకున్న జాడీలో వేసి అదమాలి.నూనె పైకి తేలుతుంది. వెల్లుల్లి బ్లడ్ థిన్నర్. రక్తాన్ని పలచబరిచి రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ హాయిగా తినవచ్చు. -
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
జైల్లో కేజ్రీవాల్ కావాలనే అవి తింటున్నారు: ఈడీ
ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. మార్చి 21న అరెస్ట్ అయిన తరువాత మార్చి 28వ తేదీ వరకు అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవల షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ గురువారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారు. షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలను చూపుతూ బెయిల్ పొందాలంకునుటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఈడీ సమర్పణల మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. -
'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!
సమ్మర్ అనంగానే గుర్తొచ్చొది తియ్యని మామిడి పండ్లు. వాటిని చూస్తేనే నోరూరిపోతుంది. అంత రుచికరమైన ఈ మ్యాంగో ఫ్రూట్లో ఎన్నో వైవిధ్యమైన రకాలు చూశాం. కానీ ఏకంగా దేశ ప్రధాని మోదీపేరు మీదగా కొత్త రకం దేశీ పండును తీసుకొచ్చాడు ఓ రైతు. ఏకంగా హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఇతి ప్రత్యేకు రుచిని కలిగి ఉన్న మామిడి పండు అని సర్టిఫై చేసింది. ఇంతకీ ఈ పండు ప్రత్యేకత ఏంటీ..? ఎవరు ఈ కొత్తరకం మామిడిని తీసుకొచ్చారు అంటే..! మామిడి పండు జ్యూస్ అయిన పండు పలంగా అయినా భలే రుచిగా ఉంటాయి. ఇంతవరకు అల్ఫోన్సో, దాషేరి, కేసర్, తోతాపురి, లాంగ్రా, బంగినపల్లి వంటి ఎన్నో రకాల మామిడి పండ్ల రుచులు చూశాం. ఇవన్నీ వేటికవే మంచి సువాసనతో కూడిన రుచిని కలిగి ఉంటాయి. వీటితో ప్రజలు స్మూతీస్, మిల్క్షేక్లు, జామ్లు, ఊరగాయలు, ఐస్క్రీమ్లు,డెజర్ట్లు వంటివి ఎన్నో తయారు చేస్తారు. దీన్ని 'పండ్ల రాజు' అని కూడా పిలుస్తారు. అలాంటి ఈ మామిడి పండంటే తనకెంతో ఇష్టం అని ప్రధాని మోదీ పలు సార్లు వేదికలపై చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన పేరు మీదగా కొత్త రకం మామిడి పండ్లను సాగు చేశారు. 'మ్యాంగో మ్యాన్'గా పిలిచే పద్మశ్రీ హాజీ కలిముల్లా కోల్కతాలోని 'హుస్న్ ఎ ఆరా' అనే మామిడి రకాన్ని, దేశీ దషేరి మామిడి రకంతో క్రాస్ సాగు చేసి ఓ కొత్త వేరియంట్ మామిడిని రూపొందించారు. దీనికి 'నమో' అని పేరు పెట్టారు. అదే విధంగా భాగల్పూర్కు చెందిన ఆశోక్ చౌదరి మోదీ 1,2,3 అనే మూడు రకాల మామిడి పండ్లను సాగు చేయడం జరిగింది. ఇంత వరకు భాగానే ఉంది. వారందరికంటే లక్నోలోని మలిహాబాద్కు చెందిన ఉపేంద్ర సింగ్ ప్రధాని మోదీ పేరుతో పండించిన కొత్త రకం మామిడి పండే బెస్ట్ మామిడి అని పేరు దక్కించుకుంది. ఉపేంద్ర రెండు దేశీ మామిడి రకాలను క్రాస్ కల్టివేట్ చేసి ప్రధాని పేరు మీద 'మోదీ' అనే పండుని పండించారు. ఆయన ఎందుకిలా 'మోదీ మామిడి' అనే పేరు పెట్టారంటే..ఆయన రాజకీయాల్లో చాల సందర్భాల్లో సాహోసోపేతమైన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యచకితులని చేసి అశేష ఆదరాభిమానాలు పొందారన్న ఉద్దేశ్యంతో మోదీ మామిడి పండు అనే పేరు పెట్టడం జరిగిందని చెప్పారు. ఉపేంద్ర సింగ్ అక్కడితో ఆగకుండా ఆ పేరు మీద పూర్తి హక్కులను కూడా సంపాదించుకున్నారు. అతడు సాగు చేసిన ఈ కొత్త రకం మోదీ మామిడి మిగతా వాటికంటే మంచి నాణ్యతో కూడిన పల్పు ఉండి, మంచి రుచిని కలిగి ఉందని పేర్కొంటూ మోదీ అనే పేరుపై ఉపేంద్రకి ప్రత్యేక హక్కును మంజూరు చేసింది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఈ పండు త్వరలో వాణిజ్య మార్కెట్లోకి రానుంది. దీని రుచి ఇప్పటికే ఉన్న రకాల కంటే చాలా రుచికరమైనది, గుజ్జు కూడా ఎక్కువగా ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పైగా పరిమాణం కూడా పెద్దది. ఓ వ్యక్తి కడుపు నింపడానికి ఈ కొత్తరకం మామిడి పండు ఒకటి తింటే సరిపోతుందని చెబుతున్నారు. ఇది ఐదు నుంచి ఆరు రోజుల వరు పాడవ్వదని, చౌసా, దుషేరి, లాంగ్రా వంటి రకాల మామిడి పండ్ల కంటే పెద్దదిగా ఉండి టేస్టీగా ఉంటుందని సెంట్రల్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ కూడా ధృవీకరించింది. అంతేకాదండోయ్ ఈ మోదీ మామిడి పండు భారీ ధరతో కూడిన ట్యాగ్తో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ ఏడాది జులై నుంచి ఆగస్టు మధ్య జరిగే వార్షిక మామిడి పండ్ల వెరైటీల ప్రదర్శనలో కూడా ఈ కొత్తరకం మామిడి పండును ఉంచనున్నారు. (చదవండి: కాలేజ్కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!) -
పూత రాలి.. కాయ కుళ్లి
కొల్లాపూర్ /జగిత్యాల అగ్రికల్చర్ ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులెంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతుల ఆశలు అడియాసలు కాగా, కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా, మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్లు డిసెంబర్లో చలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్దమొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడా పంటలో పూత నిలబడినా, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండటంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురు గులు గుంపులు, గుంపులుగా మామిడి పూత, పిందెపై చేరి, వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో, పూత, పిందె రాలి మాడిపోయాయి. కొన్నిచోట్ల పూత, పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100 శాతం వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు బంక తెగులు సోకి కాయలు నేలరాలాయి. మితిమీరి పురుగు మందుల పిచికారీ తేనె మంచు పురుగు కట్టడికి రైతులు విపరీతంగా రసాయన మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కో రైతు ఒక్క ఎకరానికి దాదాపు రూ.20వేల వరకు ఖర్చు చేశారు. రెండుమూడు నుంచి ఏడుసార్ల వరకూ మందులు పిచికారీ చేసిన రైతులు ఉన్నారు. ధరలు సైతం నేలచూపులే ఏటా సీజన్ ప్రారంభంలో మామిడి కాయల ధర టన్నుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు పలికేది. కానీ, ఈసారి ఫిబ్రవరి రెండో వారంలో టన్ను ధర రూ.1.20 లక్షల వరకు పలికింది. నెలాఖరులో టన్ను ధర రూ.80 వేలకు పడిపోయి.. ప్రస్తుతం రూ.50–60 వేల వరకు పలుకుతోంది. వ్యాపారుల సిండికేట్తోనూ ధరలు తగ్గాయి. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లిలో హైదరాబాద్, ముంబయికి చెందిన వ్యాపారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో రూ.60– 75 వేల వరకు టన్ను మామిడి కాయలను కొనుగోలు చేసి.. ఇప్పుడు తగ్గించేశారు. జగిత్యాల మామిడి మార్కెట్లో మొన్నటి వరకు కిలో రూ.65 వరకు ఉన్న బంగినపల్లి రకం ధర ప్రస్తుతం రూ.45–55 మధ్య పలుకుతోంది. దశేరి రకం కిలో రూ.75 వరకు పలకగా, ప్రస్తుతం రూ.50–65 మధ్య పలుకుతోంది. హిమాయత్ రకం కిలో రూ.130 వరకు పలకగా, ఇప్పుడు రూ.100గా కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57,344 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో 70 శాతం మేర తోటలు కాపు కాసేవి ఉన్నాయి. సాగు చేస్తున్న తోటల లెక్కల ప్రకారం ఈ ఏడాది 1,38,848 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అందులో 50 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలో 40వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 70శాతం మామిడి తోటల్లో పురుగు ఆశించి 100శాతం పంటనష్టం జరిగింది. మామిడికాయ ఇప్పుడిప్పుడే మార్కెట్కు వస్తోంది. దిగుబడి నాలుగైదు టన్నులకే పరిమితమైంది. పూతకు ముందే తోటలు లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం ఆ తోటలను చూసి తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వమంటూ రైతులను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా: బోధన్రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని మందర్న, హున్స గ్రామాలు మామిడి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఇక్కడ 80 నుంచి 100 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పూత రాలిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆదుకోవాలి.. నేను 40 ఎకరాల తోటలను రూ.42 లక్షలకు కౌలుకు తీసుకున్నా. సొంత తోటలు కూడా ఉన్నాయి. సాగు పనులకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశా. ఇప్పటి వరకు 20 టన్నుల కాయలు మాత్రమే అమ్మాను. సాగు, కౌలు కోసం ఖర్చు చేసిన డబ్బులు ఇంకా రాలేదు. రెండో విడత పూత కొంత మేరకు నిలబడింది. ఆ కాయలు వచ్చే నెలలో కోతకు వస్తాయి. వాటి మీదే ఆశలు పెట్టుకున్నా. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ రెండు సార్లు మందులు కొట్టాను పూత ప్రారంభానికి ముందు, పూత వచి్చన తర్వాత మందులు పిచికారీ చేశాను. ఎకరానికి రూ.30వేల వరకు ఖర్చు చేశాను. అయినా పూత సరిగ్గా నిలువ లేదు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. – కాటిపెల్లి శ్రీపాల్రెడ్డి, వెంకట్రావుపేట, మేడిపల్లి పూత నిలబడలేదు వాతావరణంలో మార్పులు, తెగుళ్ల కారణంగా ఈసారి మామిడి దిగుబడి బాగా తగ్గింది. పంటనష్టం వివరాలు ఇంకా అంచనా వేయలేదు. పూతలు బాగానే వచి్చనా, తేనెమంచు పురుగు, నల్లి, బూడిద తెగుళ్ల కారణంగా పూత నిలవలేదు. – లక్ష్మణ్, ఉద్యానశాఖ అధికారి, కొల్లాపూర్ -
సమ్మర్ స్పెషల్ : మ్యాంగో పులిహోర అదరిపోయేలా!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలు నోరూరిస్తాయి. వగరు.. పులుపు కలయికతో లేత మామిడి తొక్కు పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, మామిడి కాయ పప్పు ఇలా ఒకటేమిటి రకరకాల వంటకాలు ఘుమ ఘుమ లాడి పోవాల్సిందే. అసలు మామిడికాయతో ఏమి చేసినా ఆ రుచే వేరు కదా. మరి సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా! మామిడికాయ పులిహోర చేసిపెడితే. పిల్లలు,పెద్దా అంతా ఇష్టంగా తింటారు. ఇది చదువుతుంటేనే మీకూ నోరు ఊరుతోంది కదా. మరింకెందుకు ఆలస్యం ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. కావల్సి పదార్థాలు: తోలు తీసేసి సన్నగా తురిమిన పచ్చిమామిడికాయ తురుము వేయించి పెట్టుకున్న పల్లీలు, లేదా వేరుశెనగలు నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కరివేపాకు ఎండు మిర్చి, పచ్చి మిర్చి తురిమిన అల్లం ఇంగువ పసుపు ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపలాడే వరకూ వేయించుకోవాలి. ఎండు మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతుండగా, మధ్యకు చీల్చి పెట్టుకన్న పచ్చిముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం వేయాలి. పసుపు ,ఇంగువ వేసి ఇంకొంచెం సేపు వేగించు కోవాలి. పోపు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. అపుడు ముందుగానే తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు, జీడిపప్పు వేయాలి. ముందుగా వండి పెట్టుకొన్న అన్నం పోపులో వేసి, అందులోనే ఉప్పుకూడా వేసి అన్నం చితికి పోకుండా బాగా కలపాలి. పులుపు, ఉప్పు సరిచూసుకుంటే..నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ. బ్రేక్ఫాస్ట్గా గానీ, సాయంత్రం పూటగానీ, లంచ్లోగానీ దీన్ని తీసుకోవచ్చు. -
జుట్టు సౌందర్యానికి మామిడి ఆకులు.. ఈ విషయాలు మీకు తెలుసా?
నోరూరించే మామిడి పళ్లు తినాలంటే వేసవి వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు. అయితే మామిడి ఆకులు కోసుకోవడానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు. అందుకే వివాహాది శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలలో గుమ్మాలకు మామిడాకు తోరణాలు కట్టుకుంటూనే ఉన్నాం. ఇంతేనా? జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి, ఆరోగ్య సంరక్షణకు కూడా మామిడి ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మామిడి ఆకులలో జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఎ, ఇ, సి విటమిన్లు ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మామిడాకులలో పైన చెప్పుకున్న విటమిన్లతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఉపయోగించిన వారికి జుట్టు బాగా పెరుగుతుంది. అంతేకాదు... తలపై మామిడి ఆకులను ఉంచి, వాటిని కప్పుతూ ఏదైనా పలుచని క్లాత్ను కట్టుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. తలలో రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. మామిడి ఆకుల్లో ఉండే సహజ తైలాలు జుట్టు సంరక్షణకు ఉపకరిస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు నెరవకుండా, బలహీనంగా మారకుండా ఉంచుతాయి. మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా జుట్టు నల్లగా, ఒత్తుగా తయారవుతుంది. మామిడి ఆకులలో ఉండే ఫ్లేవనాయిడ్లు జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో , నిగారింపు వచ్చేలా చేయడంలో సహాయపడతాయి. ఎలా ఉపయోగించాలి? ►తాజా మామిడి ఆకులు కొన్ని తీసుకుని కాసిని నీళ్లు చేర్చి మిక్సీలో వేసుకుని లేదా రుబ్బుకుని పేస్ట్లా చేసుకోవాలి. దానికి పెరుగు లేదా ఆలివ్ నూనెను చేర్చాలి. ఈ పేస్ట్ను చివళ్ల నుంచి కుదుళ్ల వరకు పట్టించాలి. ఆరేదాకా ఉంచి, ఆ తరవాత మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ►మామిడి ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. తరువాత పేస్ట్ లా చేసుకుని బ్లాక్ టీని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందటంతో పాటు నల్లగా మారుతుంది. ►మధుమేహంతో బాధపడేవారు కొన్ని మామిడి ఆకులను శుభ్రంగా కడిగి నీళ్లలో ఉడకబెట్టి కషాయంలా కాచుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వడపోసి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
మామిడి టెంకే!.. అని పడేయొద్దు!ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే..
పండ్లలలో రారాజు మామిడికాయ. టెంకే కదా అని తీసిపడేయొద్దు!. దీని వల్ల కలిగే అద్భత ప్రయోజనలు అన్ని ఇన్ని కావు. మామిడి టెంకను బ్యూటి ప్రొడక్ట్గా వాడతారని మీకు తెలుసా! ఇది మీ చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. ఇది అందించే ప్రయోజనాలు ఏంటంటే.. ప్రయోజనాలు ఈ టెంకలోని గింజల పొడిని సేవించినా ఆరోగ్యానికి మంచిదే ఇది అతిసారం, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని నుంచి తయారు చేసిన నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలా ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందంటే.. చుండ్రుకి చెక్పెడుతుంది మాడిగింజల పొడిని ఆవాల నూనెతో కలిపి అప్లై చేస్తే అలోపేసియా, జుట్టు రాలడం, నెరిసిపోవడం, చుండ్రు వంటివి రావు. టూత్ పౌడర్గా మామిడిగింజల పౌడర్ని టూత్ పౌడర్గా ఉపయోగిస్తే మీదంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. విరేచనాలకు ఔషధంగా మామిడి గింజల పొడిని రోజుకు మూడుసార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఈ మామిడిగింజల పొడిని నీడలో ఎండబెట్టి తేనెతో తీసుకుంటే అతిసారం నుంచి సులభంగా బయటపడొచ్చు. ఒబెసిటీకి చక్కటి మందులా.. ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి మందులా ఉపయోగపుడుతుంది. దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి పొందడమే గాక కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్ని కరిగించేస్తుంది రక్తప్రసరణను పెంచి చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో పడిపోయిన చక్కెర స్థాయిలను, సీ రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు.. రోజువారీ ఆహాకంలొ మామిడి గింజలను తక్కువ మొత్తంలో తీసుకుంటే గుండె సమస్యలు, అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డ్రై లిప్స్కి చెక్ పెదాలు హైడ్రేట్ చేయడానికి మామిడి గింజల పొడితో తయారు చేసిన బామ్ని ఉపయోగిస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. చర్మకణాలు పునురజ్జీవింపజేస్తుంది. మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మధుమేహం మామిడి గింజ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రేగు, కాలేయంలలో గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. అలాగే నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది. మొటిమలు మాయం మామిడి గింజలతో మొటిమల స్క్రబ్ని తయారు చేసుకుని వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అంతేగాదు మామిడి గింజలను గ్రైండ్ చేసి టమాట రసంతో కలిపి ముఖానికి అప్లై చేస్తే బ్లాక్హెడ్స్, బ్రేక్ అవుట్లు, మెటిమలు, మచ్చలను నయ చేస్తుంది. ముఖంపై ఏర్పడే రంధ్రాలను తగ్గించి ఎరుపు మారకుండా సంరక్షిస్తుంది. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
ఇక్కడి మామిడి తాండ్రకు 200 ఏళ్ళ చరిత్ర ..
-
టేస్టీ టేస్టీగా మ్యాంగో పూరి ఇలా చేసుకోండి..
మ్యాంగో పూరీకి కావాల్సినవి: మామిడి పండ్లు – 2 (కడిగి, తొక్క, టెంక తొలగించి ముక్కలుగా చేసుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల పంచదార పొడి వేసుకుని జ్యూస్ చేసుకోవాలి) గోధుమ పిండి – 3 లేదా 4 కప్పులు మైదాపిండి – 3 టేబుల్ స్పూన్లు నూనె – సరిపడా మ్యాంగో పూరీ తయారీ ఇలా.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మ్యాంగో జ్యూస్, గోధుమ పిండి, మైదాపిండి, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను పొంగే విధంగా ఇరువైపులా వేయించుకోవాలి. వీటిపై తేనె వేసుకుని తింటే భలే ఉంటాయి. -
మ్యాంగో ఈటింగ్ పోటీలు
-
మామిడిపండుతో టేస్టీ డిజర్ట్ ఇలా తయారుచేసుకోండి..
పండ్లలన్నింటిలో రారాజు మామిడి పండు. వీటిని ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యం లేదు. మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేక రుచి ఉంటుంది. తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా అనేక విటమిన్లు, పోషకాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా మామిడి పండ్లలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం, జింక్ మరియు కార్బోహైడ్రేట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మామిడి పండ్ల సీజన్ పూర్తికాకముందే రుచికరమైన మంగోలీసియస్ డిజర్ట్ను ఇలా తయరుచేసుకోండి. మంగోలీసియస్ డిజర్ట్ తయారికి కావాల్సినవి మామిడి పండ్లు – రెండు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు పిస్తాపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు సేమియా – అరకప్పు పాలు– నాలుగు కప్పులు చక్కెర – పావు కప్పు మంగోలీసియస్ డిజర్ట్ తయారీవిధానం ఇలా.. మామిడి పండు తొక్క, టెంక తీసేసి, ముక్కలుగా తరిగి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. టేబుల్ స్పూను నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే బాణలిలో మిగతా నెయ్యి వేసి సేమియాను దోరగా వేయించాలి. సేమియా వేగాక, పాలు పోసి పదినిమిషాలు కాగనివ్వాలి. పాలు మరిగాక చక్కెర వేసి కరిగేంత వరకు తిప్పి దించేసి చల్లారనివ్వాలి. చల్లారిన పాల మిశ్రమంలో మామిడి పండు ప్యూరీ, డ్రైఫ్రూట్స్ వేసి కలిపి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. అరగంట తరువాత బయటకు తీసి ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. -
Anasuya Bharadwaj : అనసూయని ఎత్తుకున్న భర్త.. మామిడితోటలో అలా! (ఫోటోలు)
-
అతిఖరీదైన మామిడి ధర వింటే షాకవుతారు, కేజీ 2.75 లక్షలు
పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో జరుగుతున్న మ్యాంగో ఫెస్టివల్ 7వ ఎడిషన్ ఇపుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి 'మియాజాకి'ని ఇక్కడ ప్రదర్శించారు. ఒక ప్రదర్శనలో ఉంచి మామిడి పళ్ల ఫోటోలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వీటి ధర వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ‘మియాజాకి’ మామిడి పండ్ల ధర కిలో రూ.2.75 లక్షలు. జూన్ 9న మొదలైన ఈ ఫెస్టివల్లో 262 రకాల మామిడి పండ్లను ప్రదర్శిస్తున్నారు. వీటిలో అతి ఖరీదేన మియాజాకి స్పెషల్గా నిలుస్తోంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో సిలిగురి టైమ్స్ నివేదించిన ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్కు చెందిన రైతు షౌకత్ హుస్సేన్ 10 మియాజాకి మామిడి ముక్కలను ప్రదర్శించారు. ఈ మామిడి పండ్ల ధర కిలో రూ. 2.75 లక్షలు. Siliguri, West Bengal | World's most expensive mango 'Miyazaki' priced at around Rs 2.75 lakh per kg in International market showcased in Siliguri's three days long 7th edition of the Mango Festival. The festival kicked off on June 9 at a mall in Siliguri organised by Modella… pic.twitter.com/GweBPkXons — ANI (@ANI) June 10, 2023 -
దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, విశాఖపట్నం: మార్కెట్ను మామిడి పండ్లు ముంచెత్తుతున్నాయి. నగరంలో రోడ్లు, వీధుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. పైగా చౌకధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. గతం కంటే రుచి, నాణ్యతతో ఉంటున్నాయి. తొలుత వీటి ధర ప్రియంగా ఉండడమే కాదు.. పులుపు, చప్పదనంతో రుచి తక్కువగా ఉండేవి. ఆకర్షణీయమైన రంగుకు ఆకర్షితులైన మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసి పెదవి విరిచే వారు. కానీ పక్షం రోజుల నుంచి మార్కెట్లోకి మంచి రుచి కలిగిన మామిడి పండ్లు వస్తున్నాయి. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటోంది. నెల కిందట కిలో రూ.60–70 ధర పలికిన మామిడి పండ్లు.. ఇప్పుడు రూ.25–30కే దొరుకుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి, సువర్ణరేఖ, రసాలు వంటి పండ్లు మూడు, నాలుగు కిలోలు రూ.100కే లభ్యమవుతున్నాయి. మరికొన్ని రకాలైతే రూ.100కు ఐదారు కిలోలు చొప్పున విక్రయిస్తున్నారు. రోడ్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేసి కొందరు, తోపుడు బండ్లపై మరికొందరు, పోగులుగా పెట్టి ఇంకొందరు ఎక్కడికక్కడే అమ్ముతున్నారు. చౌకగా లభిస్తున్న మామిడి పండ్లను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ఎగుమతులు లేకే.. ఏటా ఈ ప్రాంతంలో పండిన మామిడి పండ్లు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేయగా మిగిలిన పండ్లను స్థానిక మార్కెట్లకు తరలిస్తుంటారు. వాస్తవానికి నిరుడు, ఈ ఏడాది మామిడి పంట ఆశాజనకంగా లేదు. 50 శాతానికి మించి దిగుబడి లేదు. మామిడి దిగుబడి తగ్గిన సంవత్సరం ధరలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాపు తగ్గినా ధర మాత్రం సరసంగానే ఉంటోంది. ఎగుమతులు క్షీణించడం వల్లే ఈ ఏడాది మామిడి ధర తగ్గడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. విశాఖ నగరంలో మామిడి పండ్లను విక్రయించే వారు కాకినాడ జిల్లా తుని, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తదితర ప్రాంతాల నుంచి హోల్సేల్గా కొనుగోలు చేస్తున్నారు. 20 కిలోల మామిడి పండ్లు రూ.150–200 కొని నగరంలో కిలో రూ.20–30కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మామిడి పండ్లు పక్వానికి వచ్చిన కావడం వల్ల రుచిగా ఉంటున్నాయని, ధర కూడా అందుబాటులో ఉండడం వల్ల వీటి విక్రయాలు బాగున్నాయని అక్కయ్యపాలెంలో రాజు అనే అమ్మకందారుడు చెప్పాడు. తాను రోజుకు 400–500 కిలోలు విక్రయిస్తున్నానని, గతంలో కిలో, రెండు కిలోలు తీసుకెళ్లిన వారిప్పుడు రెట్టింపునకు పైగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు. మరికొద్ది రోజుల పాటు చౌక ధరలే కొనసాగుతాయని, నెలాఖరు వరకు మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయని వివరించాడు. -
‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!
సాక్షి, ముంబై: రూ.2 వేల నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటన తరువాత బడా బాబులతోపాటు, సామాన్య ప్రజలు దాకా తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు తమ తమ స్థాయిల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో పెద్ద నోటుదే ప్రస్తుత హవా. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజువారీ నిత్యావసరాలు మొదలు ప్రీమియం బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లదాకా.. మామిడిపండ్ల నుంచి ఖరీదైన వాచీల దాకా రూ.2 వేల నోటుతోనే కొనుగోలు చేస్తున్నారట. రూ.2 వేల నోటు చలామణికి మరో నాలుగు నెలల్లో (సెప్టెంబరు 30) గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లో ఏది కొన్నా చెల్లింపులు మాత్రం రూ.2 వేల నోటుతోనే. దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇపుడు కస్టమర్లు ది బెస్ట్గా భావిస్తున్నారట. ఆన్లైన్లో వేసవి సీజన్లో అత్యధికంగా లభించే మామిడిపళ్ల దగ్గరనుంచి ఖరీదైన వాచీలను, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 8 నుంచి 10 పెద్ద నోట్లు వస్తున్నాయని ముంబైలోని ఓ మామిడి పళ్ల వ్యాపారి చెప్పారు. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) సెంట్రల్ ముంబైలోని రాడో స్టోర్లో స్టోర్ మేనేజర్ మైఖేల్ మార్టిస్ మాట్లాడుతూ తమ స్టోర్లో 2000 రూపాయల నోట్లు 60-70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు తమ వాచ్ అమ్మకాలు గతంలో 1-2 నుండి రోజుకు 3-4కు పెరిగిందని మార్టిస్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కూడా ఎక్కువగా రూ.2 వేల నోటే ఇస్తున్నారని, దీంతో చిల్లర సమస్య ఎదుర్కొంటున్నామని బంకు యజమానులు చెబుతున్నారు. రూ.2 వేల నోటుపై ఆర్బీఐ ప్రకటించింది మొదలు తమకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని జొమాటో ప్రతినిధి తెలిపారు. బంగారం షాపులకు కూడా రద్దీ పుంజుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైన్ రిజర్వేషన్లకు, బస్ టికెట్లకు ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ లావాదేవీ పెద్ద నోటుతోనే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు) కాగా దేశంలోనే అతిపెద్ద డినామినేషన్ నోటు రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ ఈ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్లో మ్యాంగోస్.. పండు కోసం క్లిక్ చేస్తే పైసలు పోతాయ్!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఏ సీజన్ నడిచినా దానిని మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరకు మామిడి పళ్లను సైతం వదలడం లేదు. వేసవి అంటే మామిడి పళ్ల ప్రియులకు పండగే. తాజా తాజా వెరైటీలు రుచిచూడాలని తహతహలాడేవారు బోలెడుమంది. సరిగ్గా ఇదే బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు..మీ ఇంటికే తాజా మామిడి పళ్లు పంపుతామంటూ ఆన్లైన్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందులో నకిలీ వెబ్సైట్ లింకులు పెడుతున్నారు. అవి నమ్మి ఆన్లైన్లో పళ్లు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయతి్నస్తే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. మొదట సగం డబ్బులు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ పంపుతామని, మొత్తం డబ్బులు ముందే తమ ఖాతాకు పంపితే డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఊరిస్తున్నారు. ఇది నమ్మి డబ్బులు పంపిన తర్వాత ఎదురు చూపులే తప్ప..పళ్లు రావడంలేదు. చివరికి తాము మోసపోయామన్న తత్వం బోధపడుతోంది మామిడి ప్రియులకు. ఆన్లైన్ మామిడిపళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో నకిలీ వెబ్సైట్లు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నదని కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంచేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’వెల్లడించింది. ఈ తరహాలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఆన్లైన్లో పళ్ల కొనుగోలులో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసేముందే అది నిజమైన వెబ్సైటా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుగా డబ్బులు పంపకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
ధరల మంట, ఒక్కో మామిడికాయ రూ.10 పైనే.. పచ్చడి మెతుకులు కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ఎండకాలం వచ్చిందంటే ఎవరింటా చూసినా మామిడికాయ పచ్చడి హడావిడి కనిపిస్తోంది. ఏడాదికి సరిపడా నిల్వ ఉండేలా పచ్చడిని తయారు చేసుకోవడం సర్వసాధారణం. అయితే ఈసారి మాత్రం ఏడాదికి తగ్గట్టుగా కొత్త ఆవకాయ పెట్టుకోవాలంటే జేబు చిలుము వదలాల్సిందే! పచ్చడికి ఇదే సీజన్ కావడంతో మామిడి కాయల అమ్మకాలతో మార్కెట్లు సందడిగా మారాయి. కాయలను ముక్కలు మొదలు మసాలా దినుసుల కొనుగోలు వరకు గృహిణులతో రాకతో మార్కెట్ కళకళలాడుతోంది. అయితే పచ్చడికి అవసరమైన సరుకులు ధరలు మాత్రం నింగినంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా రెండింతలయ్యాయి. పచ్చడికి మూలమైన మామిడి కాయ ఒకటి రూ.10 పలికితే.. పెద్ద కాయ అయితే రూ.15–20 పలుకుతోంది. కాపు తక్కువగా ఉండడం వల్ల పచ్చడి కాయలకు డిమాండ్ పెరిగింది. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక మసాలా దినుసుల ధరలు సరేసరి. మిర్చి ధరలు గణనీయంగా పెరగడంతో కారంపొడి నిరుడితో పోలిస్తే రెట్టింపయింది. గతేడాది కిలో రూ.550 ఉండగా.. ఈసారి రూ.800 చేరుకుంది. మసాలాలు, కారమే కాదు అల్లం, వెల్లుల్లి ధరలు మూడింతలు పెరిగాయి. రిటైల్ మార్కెట్లో అల్లం కేజీ రూ. 180–200 కాగా వెల్లుల్లి కేజీ రూ.160 విక్రయిస్తున్నారు. అలాగే బ్రాండెడ్ వేరుశెనగ నూనె లీటర్ ప్యాకెట్ రూ.190–210, నువ్వుల నూనె కిలో రూ.410, మెంతిపొడి కిలో రూ.180, ఆవాలు కిలో 110, జీలకర్ర కిలో 600 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈసారి పెరిగిన ధరలు సామాన్య, పేద తరగతి ప్రజలకు పచ్చడి మెతుకులు కష్టంగానే కనిపిస్తున్నాయి. -
చెట్టు చెట్టుకో వెరైటీ.. అరుదైన మియాజాకీ మామిడి.. కిలో ధర 2.70 లక్షలు
పిఠాపురం (తూర్పు గోదావరి): అరుదైన రకాలు పండించాలన్న ఆ రైతు ఆలోచన మొక్కగా మొదలై.. చెట్టుగా మారింది. అది శాఖోపశాఖలుగా విస్తరించి తోటనిండా అద్భుతాలను పండిస్తోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన ఓదూరు నాగేశ్వరరావు అనే రైతు నాలుగు ఎకరాల మామిడి తోటలో ఎన్నో రకాల మామిడి మొక్కలు నాటారు. తోటంతా కాస్తే వచ్చే ఆదాయాన్ని అందులోని ఒకే ఒక మామిడి చెట్టు తెచ్చిపెడుతోంది. ఆ ఒక్క చెట్టుకు 15 కాయలు కాయగా.. వాటి విలువ అక్షరాల రూ.15 లక్షలకు పైగానే ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కింగ్ ఆఫ్ మేంగో.. ఒక్కో కాయ రూ.లక్ష పైనే జపాన్ దేశంలో మాత్రమే పండే మియాజాకీ రకం మామిడిని ఓదూరు నాగేశ్వరరావు పండిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా గుర్తింపు పొందింది. ఇది బంగారం ధరతో పోటీ పడుతుంది. జపాన్లోని మియాజాకీ ప్రాంతంలో పండటం వల్ల దీనికి మియాజాకీ అనే పేరొచ్చింది. దీనిని సూర్యుడి గుడ్లు (ఎగ్స్ ఆఫ్ సన్) అని కూడా పిలుస్తారు. సువాసనలు వెదజల్లుతూ.. లోపల బంగారు ఛాయతో మెరిసిపోయే ఈ మామిడి పండు అత్యధిక పోషకాలను కలిగి ఉంటుందట. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కేజీ రూ.2.70 లక్షల వరకు పలుకుతుందని.. ఒక్కో కాయ ధర కనీసం రూ.లక్ష వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇది క్యాన్సర్కు మందుగా.. కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధంగా పేరొందడంతో దీనికి విలువ పెరిగింది. నాగేశ్వరరావు తోటలో గత ఏడాది మియాజాకీ రకం పండు మాత్రమే ఒకటి మాత్రమే కాయగా.. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. సుమో.. మామిడి! ఈ రైతు తోటలో ఈ ఏడాది కొత్తగా ఐదు కేజీల మామిడి చెట్లు కాపు మొదలుపెట్టాయి. ఒక్కో మామిడి కాయ బరువు సుమారు ఐదు కేజీలు ఉండటం వీటి ప్రత్యేకం. ప్రస్తుతం ఒక చెట్టుకు రెండు మాత్రమే కాసాయి. ఈ రకాన్ని అఫ్గాన్ దేశానికి చెందిన నూర్జహాన్గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద కాయగా దీనికి గుర్తింపు ఉంది. ఒక్క కాయ రూ.వెయ్యికి పైనే ఉంటుంది. సుమారు అడుగు పొడవు ఉండడం దీని విశేషం. పూత దశలో ఉండగానే దీనికి డిమాండ్ పెరుగుతుంది. మామిడి ప్రియులు వీటిని ముందుగానే బుక్ చేసుకుంటారు. విచిత్ర ఆకారాలు.. చిత్రమైన రంగులు నాగేశ్వరరావు తోటలో అడుగుపెడితే కళ్లు మిరుమిట్లు గొలిపే రంగులు.. చిత్ర విచిత్రమైన ఆకారాల్లో మామిడి కాయలు కనిపిస్తాయి. చూడటానికి తయారు చేసిన కాయల మాదిరిగా కనిపిస్తాయి. ఇక్కడి మామిడి చెట్లకు అరటి పండ్లు వేలాడుతుంటాయి. వాటిని కోస్తే మాత్రం అచ్చమైన మామిడి పండ్లే. వీటిని అరటి పండ్ల మాదిరిగానే వలుచుకు తినేయొచ్చు. అచ్చం యాపిల్ పండ్ల మాదిరిగా ఉండే మామిడి పండ్లు సైతం ఈ తోటలో కాస్తున్నాయి. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు వందకు పైగా అబ్బురపరిచే మామిడి మొక్కలతో ఈ పండ్ల తోట కనువిందు చేస్తోంది. మియాజాకీ 15 కాయలు కాసింది నాలుగేళ్ల క్రితం వివిధ రకాల మామిడి మొక్కలు వేయడం ప్రారంభించాను. గత ఏడాది మియాజాకీ మామిడి పండు ఒకటి కాసింది. ఈ ఏడాది ఏకంగా 15 కాయలు కాసాయి. ఈ రకం మొక్కలు 20 నాటాను. వాటిలో రెండు చెట్లు మాత్రమే కాస్తున్నాయి. ఒక్కో కాయ 380 నుంచి 450 గ్రాముల వరకు బరువు ఉన్నాయి. మొత్తం మామిడి కాయల బరువు సుమారు 6 కేజీల వరకు ఉంటుంది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.15 లక్షల పైమాటే. – ఓదూరి నాగేశ్వరరావు, రైతు, చేబ్రోలు ఇవి చాలా అరుదు మియాజాకీ, నూర్జహాన్ రకాల మామిడి మన ప్రాంతంలో పండటం చాలా అరుదు. ఇవి చాలా విలువైనవి. నాగేశ్వరరావు తోటలో పండించే పంటలు అన్ని రకాలు చాలా అరుదైనవే. వీటిని ఇతర రైతులకు పరిచయం చేయడానికి ప్రయతి్నస్తాం. మొక్కలు నాటినా అవి చాలా వరకు పంటకు రావు. కానీ.. ఆయన అరుదైన రకాలను పండించడం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మియాజాకీ పండించడం మిరాకిల్గానే చెప్పవచ్చు. – అరుణ్కుమార్, ఇన్చార్జ్ ఉద్యాన శాఖాధికారి, గొల్లప్రోలు -
మామిడి మియాజాకిలో అత్యంత పోషక విలువలు
-
మామిడిపళ్లు తినేముందు ఇవి పాటించడం మర్చిపోకండి
మామిడి పండ్లను తినేముందు వాటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలని అమ్మమ్మలు, నానమ్మలు సలహా ఇస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే, మామిడిపండ్లలో ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంటుంది. ఇలా అధికంగా ఉత్పత్తి అయ్యే ఈ యాసిడ్ను తొలగించడానికి నీళ్లలో నానబెట్టాలి. వివిధ కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి వాటిలో ఈ ఫైటికి యాసిడ్ ఉంటుంది. ఇలా నానబెట్టడం వల్ల అది విచ్ఛిన్నమైపోతుంది. ఈ ఫైటిక్ యాసిడ్ అదనపు వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. నీటిలో నానడం వల్ల ఈ అదనపు వేడి తగ్గిపోతుంది. టాక్సిన్లను తొలగిస్తుంది మామిడి పండ్లను తినడానికి ముందు గంటపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి తొక్కపై ఉండే కనిపించని నూనె తొలగిపోతుంది. అది కొందరిలో ఎలర్జీలు కలిగించే అవకాశం ఉంది. అలాగే పాలీఫెనాల్స్, టానిన్లు వంటి సూక్ష్మ పదార్థాల మిశ్రమం తొక్క పైన ఉండే అవకాశం ఉంది. అవి శరీరంలో చేరితే దురద, బొబ్బలు రావడానికి కారణం అవుతుంది. మామిడిపండ్లు నానబెట్టడం వల్ల అవన్నీ తొలగి పండు తినడానికి అనువుగా సురక్షితంగా మారుతుంది. మామిడి పండ్లను ఇలా నీటిలో నానబెట్టడం వల్ల వాటి రుచి కూడా బాగుంటుంది. ప్రత్యేకించి ఆ పండ్లను ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే వాటిని కచ్చితంగా నీళ్ళల్లో నానబెట్టాలి. ఎందుకంటే ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఆ పండులో ఉండే కొన్ని సమ్మేళనాలు పండు వాసనను, రుచిని మార్చేస్తాయి. నీళ్లలో నానబెట్టడం వల్ల వాటి సహజమైన తీపి, సువాసనను తిరిగి పొందవచ్చు. చదవండి: International Jazz Day: జాజ్ జాజిమల్లి -
పోటెత్తిన మామిడి
సాక్షి, హైదరాబాద్: బాటసింగారం పండ్ల మార్కెట్కు మామిడి పోటెత్తింది. ఈ సంవత్సరం పూత నెల రోజులు ఆలస్యంగా రావడంతో మామిడి పండ్లు మార్కెట్కు ఆలస్యంగా వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్కు మామిడి పండ్ల దిగుమతి ఒకేసారి పెరిగింది. సోమవారం ఈ సీజన్లోనే అత్యధికంగా 1800 నుంచి 2 వేల టన్నుల వరకు మామిడి దిగుమతి అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దిగుమతులు పెరగడంతో పండ్ల ధరలు కూడా తగ్గాయి. మొదటి రకం పండ్ల టన్ను ధర రూ. 60 వేలు ఉండగా సాధారణ రకం టన్ను రూ.30 నుంచి రూ.40 వేల మధ్యలో ధర పలుకుతోంది. దీంతో రిటైల్ మార్కెట్లోనూ పండ్ల ధరలు భారీగా తగ్గాయి. గత వారం కిలో రూ. 90 నుంచి 80 ఉన్న మామిడి ధరలు సోమవారం రిటైల్ మార్కెట్లో రూ. 60 లోపే ఉన్నాయి. పెరగనున్న దిగుమతులు ఈ ఏడాది మామిడి సీజన్ కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ త్వరలో దిగుమతులు పెరుగుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మామిడి సీజన్ జూన్ చివరి వరకు కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రోజు 2 వేల టన్నుల కంటే ఎక్కువగా మామిడి దిగుమతి కావచ్చని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ జిల్లాలనుంచే కాకుండా ఏపీ నుంచి కూడా మామిడి దిగుమతి ఎక్కువ దిగుమతి ఎక్కువగానే ఉంటుందన్నారు. దిగుమతులకు తగినట్లుగా ఏర్పాట్లు ఈ ఏడాది సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనా దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్కు వివిధ జిల్లాల నుంచి వచ్చే లారీలు మార్కెట్ నుంచి కాస్తా ఆలస్యంగా వెళ్లినా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేశాం.. మార్కెట్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి చర్యలు తీసుకున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా మార్కెట్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. – చిలుకా నర్సింహా రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి (ఎఫ్ఏసీ). (చదవండి: రైతన్న ఆశలు ఆవిరి) -
మామిడి కాయకు కవర్, రైతుకు ప్రాఫిట్
జిల్లాలోని ఖరీఫ్ ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం. పంట దిగుబడి నాణ్యంగా ఉంటేనే రైతుకు ఆదాయం. ఇందులో భాగంగానే మామిడి పండ్లు రక్షణ కోసం ఫ్రూట్ కవర్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కీటకాలు, పురుగులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. బయట మార్కెట్లో ఒక్కో ఫ్రూట్ కవర్ ధర రూ.2.5 ఉండగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా రూపాయికే రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు:జిల్లాలోని ఉద్యాన పంటల్లో మామి డితే అగ్రస్థానం. ఈ ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. ఇందులో ఎక్కువగా గుజ్జు పరిశ్రమకు ఉపయోగించే తోతాపూరి రకం సాగులో ఉంది. టేబుల్ వైరెటీస్గా పిలవబడే బంగినపల్లి, ఇమామ్ పసంద్, మల్గూబ, రసాలు, మల్లిక వంటి రకాలు సుమారు 40 వేల ఎకరాలలో సాగువుతోంది. గతంలో రసాయనిక ఎరువు లు ఎక్కువగా వాడుతున్నారని యూరోపియన్ దేశా ల వారు మామిడి ఎగుమతులను తిరస్కరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించింది. మామిడిలోనూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టింది. తద్వారా విదేశాల నుంచి కూడా ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి. సబ్సిడీతో రూపాయికే కవర్ మొదటి విడతలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 15.3 లక్షల మ్యాంగో కవర్లు మంజూరు చేసింది. ఇదే కవర్ బయట మార్కెట్లో రూ.2.5 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సి డీతో రూపాయికే రైతుకు కవర్ మంజూరు చేస్తోంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా రైతు భరోసా కేంద్రాల్లోనే కవర్లు అందుబాటులోకి తెచ్చింది. వీటిని సక్రమంగా వాడుకుంటే రెండు సార్లు ఉపయోగించవచ్చని యంత్రాంగం సూచిస్తోంది. నాణ్యమైన దిగుబడి మామిడిలో పూత దశ నుంచి పిందె.. కాయ దశ వరకు అనేక క్రిమికీటకాలు ఆశిస్తుంటాయి. మామిడి కాయలకు మచ్చతెగులు సోకుతుంటుంది. దీనిద్వారా పంట దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన రైతులు మామిడి కాయలకు రక్షణగా కవర్లు కట్టి కాపాడుతున్నారు. వీటి వాడకం వల్ల మామిడి కాయలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని, లోపలికి ఎటువంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కవర్ లోపల భాగం నలుపు రంగులో ఉండడం వల్ల మామిడికాయకు మంచి ఉష్ణోగ్రత కూడా లభిస్తుంది. దీంతో నాణ్యత గల మామిడి దిగుబడి అవుతుంది. ఆశించిన స్థాయిలో మామిడి ధర ఉంటుంది. సలహా మండలి తీర్మానంతో.. మామిడిలో టేబుల్ వైరెటీస్లో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సభ్యులు ఫ్రూట్ కవర్లు కావాలని తీర్మానించారు. ఆమేరకు ప్రభుత్వానికి పంపాము. ప్రభుత్వ అనుమతితో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీతో కూడిన కవర్లు అందజేస్తున్నాం. – పి.రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, చిత్తూరు జిల్లా నాణ్యమైన పంట దిగుబడి జిల్లాలో మొదటి విడతగా 15.3 లక్షల ఫ్రూట్ కవర్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు. రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించవచ్చు. ఇటీవల మామిడిలో భారీ ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి మామిడి కవర్లు అందుబాటులోకి తెచ్చాం. – మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిత్తూరు మామిడి రైతుకు బాసట రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుకు నష్టం వాటిల్ల కూడదని అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించింది. మామిడిలో రక్షణ చర్యలు ప్రారంభించింది. కవర్లు వాడడం వల్ల ఎటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించనవసరం లేదు. ఇలాంటి మామిడి కాయలను ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు. – పి.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు జిల్లా సమాచారం ఉద్యాన పంటలు ఎకరాల్లో మామిడి 58,000 అరటి 1,500 దానిమ్మ 700 బొప్పాయి 400 మంచి లాభదాయకం మామిడికి ఫ్రూట్ కవర్ వాడకం ఎంతో లాభదాయకం. గతంలో ఈ విధానంలో సాగుచేసిన రైతులకు మంచి ధర లభించింది. అందుకే ఈ ఏడాది మేము కూడా ఈ విధానాన్ని అనుసరించాం. కవర్ల వాడకం వల్ల ఎలాంటి క్రిమిసంహారక మందులు కూడా అవసరం లేదు. నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు. – ఈశ్వరబాబు, కొత్తపల్లి, గుడిపాల మండలం అవగాహన పెరిగింది అధికారుల సూచనల మేరకు రైతులకు మామిడి కవర్లను సరఫరా చేశాం. క్షేత్రస్థాయిలో ఈ కవర్లను ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించాం. ఒక రూపాయికే కవర్లు పంపిణీ చేశాం. వీటి వల్ల ఎలాంటి కీటకాలు చేరవు. ఎగుమతులకు ఉపయోగపడే విధంగా మామిడి పంట దిగుబడి చేయవచ్చు. – అఖిల, వ్యవసాయకార్యదర్శి, - చేర్లోపల్లి, చిత్తూరు మండలం కవర్ను ఎలా ఉపయోగించాలంటే.. ఒక పెద్ద నిమ్మకాయ సైజు వచ్చిన మామిడికాయకు ఈ కవర్ను తొడగాలి. ఆపై కాండంకు కవరు మొదటి భాగం వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయకు ఎటువంటి పురుగులు ఆశించవు. ఇలా దిగుబడి అయిన మామిడి పళ్లకు మార్కెట్లో 40 శాతానికిపైగా అధిక ధర లభిస్తుంది. (చదవండి : మామిడి ఎగుమతి షురూ) -
హైదరాబాద్.. సీజన్ పూర్తిగా ప్రారంభం కానే లేదు.. మామిడి పండ్లు మహా ప్రియం
సాక్షి, హైదరాబాద్: వేసవి అనగానే గుర్తొచ్చేది.. నోరూరించేది మామిడి. ఫలాల్లో రారాజుగా చెప్పుకునే ఈ పండ్లు ఈసారి ప్రియం కానున్నాయి. ఆలస్యంగా పూత రావడం.. దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో సీజన్ ప్రారంభం కాలేదు. మార్చి నెలలో మామిడి మార్కెట్కు వస్తుందని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయితే అనుకున్న స్థాయిలో ఇంకా దిగుమతులు జరగలేదు. ఈ నెల ప్రారంభం నుంచి మామిడి దిగుమతులు ఉపందుకున్నప్పటికీ ధర మాత్రం హోల్సేల్ మార్కెట్లోనే మంచి రకం రూ.60–70 పలుకుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన అకాల వర్షాల వల్ల కూడా పూత రాలిపోయి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మామిడి సీజన్ ఏప్రిల్ 20 తర్వాతే ప్రారంభమౌతుందని వ్యాపారులు అంటున్నారు. సోమవారం నుంచి మామిడి మార్కెట్కు పోటెత్తింది. బాటసింగారం మార్కెట్కు సోమవారం 1500–1600 టన్నుల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో మామిడి రూ. 80–100కు లభిస్తోంది. మార్కెట్కు దిగుమతులు పెరిగితే ధరలు కూడా తగ్గుతాయని వ్యాపారులు అంచనా. 19 ఎకరాల్లో ఏర్పాట్లు.. మామిడి క్రయ, విక్రయాల కోసం బాటసింగారం మార్కెట్లో 19.27 ఎకరాల్లో మార్కెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్లో ప్రతి రోజూ 900 నుంచి 1100 వాహనాలు యార్డుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా. ఈ నేపథ్యంలో యార్డు పక్కనే ఉన్న 7 ఎకరాల స్థలాన్ని పార్కింగ్కు కేటాయించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మామిడి సీజన్ కోసం మరో లక్ష ఎస్ఎఫ్టీలో 5 షెడ్లు నిర్మించారు. తాగునీటి కోసం ప్రస్తుతం ఉన్న 5 ట్యాంకులకు అదనంగా మరో 2 ట్యాంకులు ఏర్పాటు చేశారు. విద్యుత్తో పాటు జనరేటర్నూ అందుబాటులో ఉంచారు. రైతులు, వ్యాపారుల కోసం రైతు విశ్రాంతి గదులుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ సీజన్లో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా మామిడి సరుకు యార్డుకు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలు, తెలంగాణలోని కొల్లాపూర్, ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి మామిడి దిగుమతి అవుతుంది. కొల్లాపూర్ మామిడికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంది. బాటసింగారం మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. అయితే ప్రస్తుతం సీజన్ ప్రారంభ దశలో ఉన్నా బాటసింగారం మార్కెట్ యార్డుకు రోజు రోజుకూ మామిడి దిగుమతి పెరుగుతోందని మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. -
విజయవాడ బెంజి సర్కిల్ లో ప్రమాదం
-
ఆవకాయ.. పచ్చడి తయారీ ఇలా! నూనెను మరిగించకుండా పచ్చిగా వేసినా
ఎండాకాలాన్ని వెంటాడుతూ వస్తుంది ఆవకాయ కాలం. మామిడి కాయలు చెట్టుకొమ్మలకు వేళ్లాడుతూ ఆకుల్లోంచి తొంగి చూస్తూ నోరూరిస్తుంటాయి. మామిడి కాయలతో చేసుకునే ఊరగాయలు పచ్చళ్లను చూద్దాం. నీళ్లూరుతున్న జిహ్వను లాలిద్దాం. ఆవకాయ కావలసినవి: ►మామిడికాయ ముక్కలు – 4 కప్పులు ►నూనె– 2 కప్పులు ►ఆవపిండి– కప్పు ►మిరప్పొడి– కప్పు (గుంటూరు కారం రుచికి బాగుంటుంది. కశ్మీరీ కారం వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది) ►ఉప్పు – కప్పు (కల్లుప్పును పొడి చేయాలి, టేబుల్ సాల్ట్ వేయాలనుకుంటే ముప్పావు కప్పు సరిపోతుంది) ►మెంతిపిండి – అర కప్పు ►వెల్లుల్లి రేకలు – అర కప్పు (పొట్టు వలిచినవి) ►ఆవాలు – పావు కప్పు. తయారీ: ►మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. ►సొనపోవడానికి తొడిమలను తొలగించాలి. ►ఆ తర్వాత టెంకతో సహా ముక్కలు చేయాలి. ►మీడియం సైజు కాయను 12 ముక్కలు చేయవచ్చు. ►టెంకలోని గింజను తొలగించి, టెంకకు గింజకు మధ్య ఉండే పొరను కూడా తీసేసి ముక్కలను సిద్ధంగా పెట్టుకోవాలి. ►వెడల్పు పాత్ర తీసుకుని తేమలేకుండా శుభ్రంగా తుడిచి కొద్దిసేపు ఎండలో పెట్టాలి. ►ఆ తర్వాత ఆ పాత్రలో మిరప్పొడి, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేకలు వేసి కలపాలి. ►అందులో మామిడికాయ ముక్కలను వేసి ఆవపిండి మిశ్రమం ముక్కలకు సమంగా పట్టే వరకు తడి లేని గరిటెతో కలపాలి. ►ఆవపిండి కారంలో ఉప్పు చూసుకుని రుచిని బట్టి అవసరమైతే కొద్దిగా కలుపుకోవాలి. ►బాణలిలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ►నూనె బాగా చల్లారిన తర్వాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటెతో కలపాలి. ►ఈ మిశ్రమాన్ని జాడీలో నింపాలి. ►ఆవకాయ మీద నూనె తేలుతూ ఉండాలి. గమనిక: నూనెను మరిగించకుండా పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఆవకాయ, ఇతర ఊరగాయలను నిల్వ చేసే జాడీలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి పది నిమిషాల సేపు ఎండలో ఉంచాలి. ఎండలో నుంచి తీసిన తర్వాత జాడీ వేడి తగ్గిన తరవాత మాత్రమే ఊరగాయలను నింపాలి. -
ఇన్స్టాల్మెంట్లో మామిడి పండ్లు కొనుక్కోవచ్చని మీకు తెలుసా!
ఇంతవరకు ఈఎంఐలో కేవలం ప్రిజ్లు, వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కోవడమే తెలుసు. కానీ ఇక నుంచి పండ్లు కూడా ఈఎంఐలో కొనుక్కునే వెసులు బాటు వచ్చేస్తోంది. దీంతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కావాల్సిన పండ్లు కొనేయొచ్చు, తినేయొచ్చు. వివరాల్లోకెళ్తే.. మామిడి పళ్లలో రారాజుగా అల్ఫోన్సో మామిడి పళ్లను పిలుస్తారు. వీటి ధర కూడా చాలా ఎక్కువ. రిటైల్ మార్కెట్లోనే వీటి ధర డజను రూ. 800 నుంచి రూ. 1300 వరకు పలుకుతుంది. దీంతో బాగా ధనవంతులు తప్ప కామన్మెన్ దీని జోలికే పోనేపోడు. అందుకని అందరు కొనేలా సులభమైన రీతిలో వెసులుబాటు కల్పించాలని ఈ సరికొత్త ఆలోచనకు నాంది పలికాడు పూణెకి చెందిన గౌరవ్సనస్. తన పళ్ల ఉత్పత్తులకు సంబంధించిన గురుకృపా ట్రేడర్స్తో ఈ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల మాదిరిగానే ఈఎంఐలో కొనేయొచ్చు అని చెబుతున్నాడు గౌరవ్. అందుకోసం కస్టమర్ క్రెడిట్ కార్డు ఉపయోగించాలి. ఈ ఈఎంఐని మూడు, ఆరు లేదా 12 నెలల్లో కట్టేయాలి. ఇప్పటి వరకు ఈ విధానంలో నలుగురు వినయోగదారులు ఆ మామిడిపళ్లను కొనుగోలు చేసినట్లు గౌరవ్ తెలిపారు. (చదవండి: సుఖోయ్ విమానంలో విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
మార్కెట్లోకి పళ్ల రారాజు.. వామ్మో! కిలో హాపస్ మామిడి ధర రూ.2000?
వేసవికాలం ప్రారంభమైంది. అంటే మామిడి పండ్ల సీజన్ కూడా వచ్చేసినట్లే. మామిడి పండు రుచికి ఏ పండు సాటిరాదు. అందుకే ఇది పండ్ల రాజు అయింది. ఏటా ఒక్కసారి మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పండ్లను ఎప్పుడు ఎప్పుడు రుచి చుద్దామా.. అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రస్తుతం చెట్ల మీద పండే దశలో ఉన్నాయి.మరో నెల రోజులు ఆగితే ఎన్నో రకాల పండ్లు ప్రతి మార్కెట్లోనూ విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే భారత్లోని పలుప్రాంతాల్లో మామిడి పండ్లు వచ్చేశాయి. ఇతర రాష్ట్రాల నుంచి బిహార్లోని పాట్నా మార్కెట్లోకి అడగుపెట్టాయి. సాధారణంగా మామిడి పండు వెరైటీని బట్టి వాటి ధర ఉంటుంది మనకు తెలిసినంత వరకు కేజీ వంద రూపాయలదాకా ఉంటుంది. కానీ ప్రస్తుతం తక్కువ సంఖ్యలో పండ్లు అందుబాటులో ఉండడంతో కిలో ధర రూ.350 నుంచి రూ.500 పలుకుతున్నాయి. మరి కొన్ని రకాల మామిడికాయలు రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ముంబై, ఒరిస్సా, ఢిల్లీ నుంచి మామిడిపండ్లు వస్తున్నాయి.ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ.. త్వరలో విక్రయాలు పుంజుకుంటాయని పాట్నాలోని ఫ్రూట్ మార్కెట్లో పండ్లు అమ్మే ఓ వ్యక్తి తెలిపారు. ఒడిశాలోని మాల్డా, మహారాష్ట్రకు చెందిన ప్యారీతో సహా గులాబ్ఖాస్ మామిడి అందుబాటులో ఉన్నాయి. ఈ పండ్ల ధర కిలో రూ. 350 నుండి రూ. 500 వరకు ఉంది. అంతేగాక ఈ రకం పండు ఒక్క కాయ ధర ఏకంగా రూ.150-200 వరకు అమ్ముడవుతోంది! అల్ఫోన్సో లేదా హాపస్ అని కూడా పిలువబడే పండు మామిడి పండ్లలోనే అత్యుత్తమ రకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ మామిడి పండ్లను ఇన్కమ్ ట్యాక్స్ గోలంబర్ ప్రాంతంలో డజను రూ.1500 నుంచి రూ.2000 వరకు విక్రయిస్తున్నారు. అల్ఫోన్సో GI ట్యాగ్ కూడా అందుకుంది. ఈ పండ్లకున్న ప్రత్యేక రుచి, సువాసన, తీపి కారణంగా జనాలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. అంతేగాక హాపస్ మామిడి పండిన తర్వాత వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి. ఇవి మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్ పరిసర ప్రాంతాల్లో పండిస్తారు. ఈ రకం పండ్లు అన్ని చోట్లా దొరకవు. కొన్ని ప్రత్యేక స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఇది రాబోయే 10, 20 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. -
మామిడి చెట్టు తెచ్చిన తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని
సాక్షి, హైదరాబాద్: ‘పచ్చని చెట్లు ప్రగతి మెట్లు’ అని నేర్పించాల్సిన టీచర్ బుద్దే వక్రంగా మారింది. ఇంటి మేడ మీద ఆకులు పడుతున్నాయని, చెట్టు వేర్లు గోడ లోపలికి చొచ్చుకుపోతున్నాయని లేనిపోని తగాదాతో తంటాలు తెచ్చుకుంది ఓ రిటైర్డ్ మహిళా టీచర్. చెట్టును కొట్టేయాలని ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించారు. దీంతో మొదలైన గొడవ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే వరకు వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లికాంబ (పేరు మార్చాం) ఎల్బీనగర్లోని ఫతుల్లగూడలో నివాసం ఉంటుంది. ఆమె ఇంటి వెనక ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారి ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మలు, ఆకులు వృద్ధురాలి భవనం మేడ మీద పడుతున్నాయని ప్రతి రోజు అద్దెవాసులతో గొడవ పడేది. దీంతో వారు పలుమార్లు కొమ్మలను కొట్టేశారు. అయినా ఓర్వలేక చెట్టు వేర్లు గోడల్లోపలికి వెళుతున్నాయని మళ్లీ గొడవ పెట్టుకుంది. కిరాయిదారులు వినకపోవడంతో చెట్టును తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోపోవడంతో ఈసారి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. చెట్టుతో తన ఇంటికి నష్టం వాటిళ్లుతోందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. చేసేదిలేక సంబంధిత అధికారులు మామిడి చెట్టును కొట్టేశారు. ఇటీవల అద్దె వసూలు చేసేందుకు ఇంటికి వచ్చిన యజమాని మామిడి చెట్టు కొట్టేసి ఉండటాన్ని గుర్తించి అద్దెవాసులను ప్రశ్నించాడు. వారు అసలు విషయం చెప్పడంతో మల్లికాంబ, ఇంటి యజమాని, అద్దెదారులకు మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పోలీసు స్టేషన్కు చేరడంతో.. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రిటైర్డ్ టీచర్ వాళ్ల మోహం మీదే తలుపులు వేసి లోపలికి వెళ్లిపోయింది. దీంతో ఇరుగుపొరుగును విచారించిన అధికారులకు ఆమె వైఖరి తెలుసుకుని అవాక్కయ్యారు. కాలనీలోని ప్రతి ఒక్కరితోనూ ఆమెకు తగువులాటేనని, ప్రతి చిన్న విషయానికి దూర్భాషలాడుతుందని చెప్పారు. అద్దెదారుల ఫిర్యాదు మేరకు మలికాంబపై ఎస్సీఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని అరెస్టు చేయకుండా 41–ఏ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఎస్సీఎస్టీ కేసులో చార్జిషీటు దాఖలు చేయాలంటే బాధితులు, నిందితులు ఇరువర్గాల కుల ధ్రువీకరణ పత్రం అనివార్యం. దీంతో పోలీసుల సూచన మేరకు ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆమె ఇంటికి వెళ్లగా.. మీరెవరు, ఎందుకు వచ్చారు. వారిపై విరుచుకుపడింది. దీంతో విస్తుపోయిన అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారని, వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనూ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు. -
అదనపు ఆదాయం కావాలా?.. అయితే ఇలా చేయండి..
పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా రైతులు ఓ పంట కాలంలో ఒక పంటను మాత్రమే సాగుచేయడం సాధారణం. కానీ ఏక కాలంలో ఒకే భూమిలో రెండు మూడు పంటలను సాగుచేయడంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అంతర పంటల సాగుతో ఓ పంటలో నష్టం వచ్చినా మరోపంట రైతును ఆదుకుంటోంది. దీంతోపాటు అదనపు ఆదాయం వస్తోంది. మామిడి తోటలున్న రైతులు ఏడాదికోమారు తోట ను విక్రయించి ఆదాయం పొందేవారు. ఇప్పుడు రైతులు కాస్త విభిన్నంగా ఆలోచిస్తున్నారు. మామిడి తోటలోనే ఏడాదికి మూడు రకాల పంటలను పండిస్తూ ఏడాదికొచ్చే మామిడి ఆదాయంతో పాటు అంతకు మూడు రెట్ల ఆదాయాన్ని గడిస్తున్నారు. మామిడి రైతులకెంతో మేలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలుగా ఉంది. ఇందులో నీటి సౌకర్యం ఉన్న తోటలు 80వేల ఎకరాలు. గత మూడేళ్లుగా మామిడి తోటల్లో ఇతర పంటల సాగు క్రమేణా విస్తరిస్తోంది. ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్టు ఉద్యానవన శాఖ తెలిపింది. ఏటా మామిడి ఫలసాయంతోపాటు అంతరపంటల కారణంగా రెట్టింపు ఆదాయం గ్యారెంటీగా దక్కుతుంది. రైతులు మామిడిలో అంతర పంటలుగా బీన్సు, టమాటా, వంగ, బెండ, పసుపు, మిరప లాంటి అంతరపంటలను పండిస్తున్నారు. అలసంద, జీనుగ, పెసర, మునగతో పాటు తక్కువ వ్యవధి పంటలైన ఆకుకూరలను సాగుచేస్తున్నారు. చదవండి: కడుపులో మంట వస్తుందా?.. లైట్ తీసుకోవద్దు.. షాకింగ్ విషయాలు సాగవుతున్న అంతరపంటలు బొప్పాయి తోటలో బీన్సు, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లి, మిరపలో అరటి, టమాటాలో కాకర, దోస, తీగబీన్సు, బీర తదితర పంటలను సాగుచేస్తున్నారు. బంతిపూలలో దోస, కొత్తిమీర, బెండ, బీన్సు, టమాటా, వంగతోటలో బంతి, టమాటలో కాకర లాంటి కాంబినేషన్లు రైతులకు లాభసాటిగా మారాయి. కొందరు రైతులు బొప్పాయిలో బంతి, మిరపలో అరటి, బంతిలో అలసంద, క్యాబేజిలో వెల్లుల్లి, కొత్తిమీర సాలుపంటగా జొన్నలను పండిస్తున్నారు. ఈ విధానాలతో బహుళ లాభాలు పంట సాగుకు అవరసమైన భూసారానికి సేంద్రీయ ఎరువులు, నీటివినియోగం, కూలీలు, క్రిమిసంహారకమందుల ఖర్చు భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా పంటకాలం ఆదా అవుతుంది. కాబట్టి ఏటా మూడు పంటల్లో రెండు, మూడు పంటలను మిశ్రమ, అంతర పంటలుగా సాగుచేసుకోవచ్చు. దీంతో ఓ పంటకు ధర తగ్గినా మరో రెండు పంటలకు ధరలుండే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైతుకు నష్టాలు వచ్చే అవకాశముండదు. టమాటా రైతులకు ఇదోవరం పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో టమాటా ఎక్కువగా సాగవుతోంది. అయితే టమాటా ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ఎకరా పొలంలో టమాటాను సాగుచేసేందుకు దాదాపు రూ.80వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంట దిగుబడి మధ్యలో ఉన్నప్పుడు ఇదే పొలంలో తీగపంటలైన బీన్సు, బీర, కాకర, సొర లాంటి పంటలను సాగుచేస్తే టమాటా పంట అయిపోగానే, అదే కర్రలకు రెండో పంట తీగలను పెట్టుకోవచ్చు. ఫలితంగా పంట పెట్టుబడి తగ్గడంతో పాటు భూమిని కొత్త పంటకు సిద్ధం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. టమాటా ధర లేనప్పుడు, రెండో పంట ఆసరాగా ఉంటుంది. -
ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఆవకాయ పచ్చడి అంటే నోరూరని వారు ఎవరుంటారు. అలాంటి ఆవకాయ పచ్చడి ఒక మహిళను ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. అసలేం జరిగిందంటే....ఇంగ్లాండ్కి చెందిన 57 ఏళ్ల మహిళ ఆవకాయ పచ్చడి వేసుకుని తింటున్నప్పుడూ పొరపాటున ఆవకాయ బద్ద గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె హుటాహుటినా ఇంగ్లాంగ్లోని ఎప్పమ్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులకు అసలు విషయం చెప్పి తాను తినలేకపోతున్నాను, మింగలేకపోతున్నానని వివరించింది. ఐతే వైద్యలు ఒక మెత్తని ఫ్రూట్ ఎలా ఇరుక్కుంటుందని కొట్టిపారేశారు. కానీ ఆ మహిళ తనకు చాలా ఇబ్బందిగా ఉందనడంతో.. ఆమెను పరీక్షించి చొంగకార్చుకునే అలావాటు ఉందని అందువల్ల మింగ లేకపోతుందని తేల్చి చెప్పారు. గొంతులో ఎలాంటిది ఇరుక్కోలేదని, గ్యాస్టిక్ సమస్య ఉన్నా ఇలానే ఉంటుందని అన్నారు వైద్యులు. ఒకవేళ నొప్పి మరింత ఎక్కువగా ఉంటే రమ్మని చెప్పి ఆ మహిళను పంపించేశారు. ఆ తర్వాత సదరు మహిళ కేవలం నాలుగు రోజుల్లో మళ్లీ ఆస్పత్రికి వచ్చి జాయిన్ అయ్యింది. ఈసారి ఆమె మరింత నొప్పితో మాట్లాడలేని స్థితికి చేరుకుంది. దీంతో వైద్యులు వెంటనే సీటీ స్కాన్చేసి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఎందుకంటే స్కానింగ్లో ఆవకాయబద్ద గొంతులో గుచ్చుకోవడంతో అన్నవాహికలో నీరు చేరడం, ఛాతీలో గాలి ఉండటం వైద్యులు గుర్తించారు. దీంతో వెంటనే వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి గొంతులో ఇరుక్కున్న ఆవకాయబద్దను తొలగించారు. ఒక వారంపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండి చికిత్స తీసుకుంది. ఐతే ఆమె ఈ విషయమై ఆస్పత్రి ట్రస్ట్కి ఫిర్యాదు చేసింది. దీంతో ట్రస్ట్ ఎలాంటి పళ్లు తినేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలో వివరంగా ఒక జాబితా ఇవ్వాలని సదరు ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. ఇది చాలా హాస్యస్పదమైన విషయం, ఎందుకంటే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదుగా సంభవించేవి అని డాక్టర్ రిచర్డ్ జెన్నింగ్స్ అన్నారు. సాధారణంగా మాంసం తింటే అందులోని ఎముకలు గట్టిగా ఉంటాయి కాబట్టి గుచ్చుకోవడం లేదా ఇరుక్కునే అవకాశం ఉంటుందని చెప్పగలం గానీ ఫలానా పండు వల్ల ఇలా జరుగుతుందని ఎలా చెప్పగలం అని అన్నారు. (చదవండి: చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష) -
రెండేళ్లలో బిలియన్ డాలర్ బ్రాండ్గా మాజా
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్ఫోలియోలోని మాజా సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్గా ఉంది. -
వైరల్: మామిడి పండ్ల దొంగ.. పోలీసోడే!
కొట్టాయం: కక్కుర్తితో ఎవరూ లేని టైంలో ఓ దుకాణం బయటి నుంచి మామిడి పండ్లను కాజేసిన దొంగను.. పోలీసుగా గుర్తించారు కేరళ అధికారులు. కొట్టాయం కంజిరాపల్లి సెప్టెంబర్ 28న ఓ రోడ్ సైడ్ దుకాణం దగ్గర ఈ దొంగతనం జరిగింది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్లో పని చేసే పీవీ షిహాబ్.. ఓ మామిడి పండ్ల దుకాణం ముందు ఈ చోరీకి పాల్పడ్డాడు. ఎవరూ లేనిది చూసి సుమారు పది కేజీల మామిడి పండ్లను బైక్ ద్వారా తరలించాడతను. అయితే.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ చోరీని గుర్తించాడు ఆ దుకాణం యాజమాని. దొంగ హెల్మెట్, రెయిన్కోట్ ధరించి ఉండడంతో.. తొలుత అతన్ని గుర్తించడం వీలుకాలేదు. అయితే బైక్ నెంబర్ ఆధారంగా.. అతను షిహాబ్గా గుర్తించారు. దీంతో డిపార్ట్మెంట్ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అధికారులు గాలింపు చేపట్టారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. When @TheKeralaPolice was #caughtoncamera stealing mangoes... The incident happened in Kanjirappally, Kottayam. The accused has been identified as PV Shihab, a Civil Police Officer posted at Idukki AR Camp.#CCTV #theft #keralapolice pic.twitter.com/CqT3y8ESID — Bobins Abraham Vayalil (@BobinsAbraham) October 4, 2022 -
Health Tips: షుగర్ పేషెంట్లకు ఈ పండ్లు అస్సలు మంచివి కావు! వీటిని తింటే..
సాధారణంగా పండ్లు ఎవరికైనా మంచిదే. ఎందుకంటే పండ్లలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నోరకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్నిరకాల పండ్లు బొత్తిగా మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండేవి. వీటికి దూరంగా ఉండండి! ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. పైనాపిల్, సీతాఫలం, అరటి, సపోటా, మామిడి పండ్లలో అధికమొత్తంలో చక్కెర ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఇవి దోరగా ఉన్నపుడు తినొచ్చు! జామ, బొప్పాయి, అరటి వంటి వాటిని బాగా పండినవాటికంటే దోరగా ఉన్నవి మంచిది. ఇవి ఎలా తిన్నా ఓకే! నేరేడు పళ్లు, కివీ పండ్లు ఎలా తిన్నా చెరుపు చేయవు. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అలాగే క్యారట్, బీట్రూట్లలోనూ, ఇతర దుంప కూరలలోనూ బీట్రూట్తో పోల్చితే మధుమేహులకు క్యారట్లే మంచిదని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి? -
పునారస్ మామిడికి మంచి గిరాకీ.. వేసవి సీజన్ తర్వాత...
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం జిల్లా): పునారస్ మామిడికి ప్రస్తుతం గిరాకీ వచ్చింది. మామిడి వేసవి సీజన్ పూర్తయిన తరువాత వచ్చే మామిడికాయల రకం ఈ పునారస్.. గతంలో కొద్దిగా వచ్చే ఈ కాయలకు గిరాకీ ఉండడంతో ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఈ చెట్లను అధికంగా నాటారు. దీని కారణంగా ప్రస్తుతం ఈ సీజన్లో పునారస్ మామిడి కాయలు అధికంగా వచ్చాయి. ఉలవపాడు మార్కెట్ నుంచి ఈ కాయలు ప్రస్తుతం భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఉలవపాడు కేంద్రంగా వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఉన్న దళారులు రైతుల నుంచి కాయలను కొనుగోలు చేసి మార్కెట్లో తూకం వేసి బస్తాలు, ట్రేలలో లారీలు, మినీ ట్రక్కులు, ఆటోల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తారు. ఈ ఏడాది మార్కెట్లో దాదాపు 10 కేంద్రాల నుంచి కాయల ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళకు ఈ మామిడికాయలు తరలివెళ్తాయి. పచ్చళ్లకు అధికంగా ఈ కాయలను వినియోగిస్తారు. ఈ ఏడాది రేటు కూడా కాస్త అధికంగానే ఉంది. ఈ వేసవిలో మామిడి కాయలకు పండు ఈగ సోకి కాయల్లో పురుగులు రావడంతో రైతులు నష్టపోయారు. ఈ సమయంలో పునారస్ చెట్లు ఉన్న రైతులు ఈ ఏడాది రేటు అధికంగా ఉండడంతో ఊరట ఇచ్చినట్టయింది. పెరిగిన ఎగుమతులు గత నాలుగేళ్ల క్రితం నుంచి పోలిస్తే ఈ ఏడాది పునారస్ మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగాయి. రైతులు సీజన్ కాని సమయంలో వస్తున్న కాయలు కావడంతో ఇటీవల కాలంలో ఎక్కువగా సాగు చేశారు. ఉలవపాడు ప్రాంతంలో దాదాపు 4000 ఎకరాలకు పైగా ఈ తోటలు ఉన్నాయి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 వేక ఎకరాల్లో పునారస్ తోటలు ఉన్నట్లు సమాచారం. కానీ ప్రతి ఏడాదికి వీటి సాగు శాతం పెరుగుతుంది. ఈ ఏడాది గత నెల నుంచి రోజుకు సుమారు 50 నుంచి 80 టన్నుల కాయలు ఎగుమతులు చేస్తున్నారు. కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు ఈ ఏడాది కేజీ 40 నుంచి రూ.50 వరకు పునారస్ మామిడి రేటు పలుకుతుంది. గతంలో 25 నుంచి చిన్నగా పెరుగుతూ చివరి దశలో రూ.50కు చేరుకునేది. ఈ సారిమాత్రం రూ.40 నుంచి రూ.50 మధ్యనే ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మామిడికాయలు చెన్నై, తిరువనంతపురం, కోయంబేడు, కోయంబత్తూరుకు తరలివెళుతున్నాయి. రోజుకు సుమారు 30 నుంచి 50 లక్షల మధ్య ఉలవపాడు మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది. కేరళ ఓనం పండుగకు ఉలవపాడు పునారస్... కేరళలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వచ్చే నెల 8 వరకు జరిగే ఓనమ్ పండుగకు ఉలవపాడు పునారస్ కాయలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అక్కడ పెట్టే పచ్చడికి దీనిని ఉపయోగిస్తారు. ఈ సమయంలో అంటే సెప్టెంబరులో ఇంకా భారీగా రేట్లు పెరుగుతాయి. ఇక్కడ నుంచి ఓనమ్ పండుగకు ప్రత్యేకంగా గ్రేడ్ చేసిన కాయలను తరలిస్తారు. ఈ ఏడాది రేట్లు బాగున్నాయి గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రేట్లు బాగున్నాయి. కాయలు కూడా నాణ్యత బాగుంది. గతంలో కేజీ రూ.25 నుంచి రూ.35 లోపు ధర ఉండేది. ఈ ఏడాది మాత్రం రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. – ఆర్ కోటేశ్వరరావు, ఉలవపాడు అధికంగా దిగుబడులు ఈ ఏడాది కాయలు అధికంగా కాశాయి. అయినా రేటు తగ్గలేదు. రైతులు ఎక్కువ మంది పునారస్ మామిడి సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. – వింజమూరి సురేష్ బాబు, రైతు ఉలవపాడు మంచి రేటుకే కొంటున్నాము మా ప్రాంతంలో ఈ కాయలకు డిమాండ్ ఉంది. అందుకే ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి లారీల్లో తీసుకుని వెళుతున్నాం. కాయకు మంచి రేటు ఇస్తున్నాము. – రఫీ, కొనుగోలుదారుడు, కోయంబత్తూరు -
కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
పాత చెట్టులో కొత్త పండు ఏంటి అనుకుంటున్నారా? ఔను ఇప్పుడు ఇదే ట్రెండ్. ‘విత్తు ఏదేస్తే అదే చెట్టు వస్తుంది’ అనే సామెతకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు విత్తొకటి.. చెట్టొకటి... పండు ఇంకొకటి అనే స్థాయికి చేరిపోయింది నవీన వ్యవసాయం. కొన్నేళ్ల నాటి మామిడి చెట్లు కొత్త రకం పండ్లు ఎలా ఇస్తాయి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ, కొమ్మ అంటు పద్ధతి ఇప్పుడు సత్ఫలితాలిస్తోంది. దీని ద్వారా పాత చెట్టు అయినప్పటికీ కొమ్మకొమ్మకో కొత్త వెరైటీ పండించుకోవచ్చు. ఇది సాధ్యమని నిరూపిస్తున్నారు చిత్తూరు జిల్లా రైతులు. ఆ టాప్ వర్కింగ్ విధానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పలమనేరు: ఎప్పుడో మన తాతలు నాటిన అప్పటి రకం మామిడి చెట్టుకు అదే రకం కాయలు వస్తున్నాయనే చింత వద్దు. అదే పాత చెట్టులో మనకు కావాల్సిన కొత్త రకం మామిడి పండు వస్తుంది. మామిడి సాగులో ఇప్పుడు కొమ్మ అంటు(టాప్ వర్కింగ్) పద్ధతి ట్రెండింగ్గా మారింది. ఒక రకానికి చెందిన మామిడి చెట్టులో పలు రకాల మామిడికాయలను పండించవచ్చు. దీంతో ఈ కొమ్మ అంటు పద్ధతిపై జిల్లాలోని మామిడి రైతులు మక్కువ చూపుతున్నారు. నాటురకం చెట్లు, పాత తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఇదో వరంలా మారింది. మోడు బారిన పాత మామిడి చెట్లలో ఈ విధానం ద్వారా మేలైన మామిడి రకాలను సృష్టిస్తూ ఆశాజనకమైన ఫలితాలను రాబట్టుకోవచ్చు. టాప్వర్కింగ్ ఎలా చేస్తారంటే.. జిల్లాలో ఎక్కువగా పల్ప్(గుజ్జు) కోసం తోతాపురి రకం మామిడి కొంటారు. దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలకు విక్రయించడం వల్ల గ్యారంటీ మార్కెటింగ్ ఉంటుంది. మరికొందరు రైతులు మార్కెట్లో మంచి ధర పలికే రకాలైన బేనిషా, ఖాదర్, బయ్యగానిపల్లి, మల్లిక లాంటి రకాలను టాప్వర్కింగ్ ద్వారా మార్పు చేసుకున్నారు. ఏటా టాప్ వర్కింగ్ జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతూనే ఉంటుంది. పాతతోటల్లో చెట్లు రోగాలు సోకి దిగుబడులు లేకుండా ఉంటాయి. ఇలాంటి రైతులకు టాప్ వర్కింగ్, గ్రాఫ్టింగ్ లాంటి అంటు పద్ధతులు ప్రత్యామ్నాయంగా మారాయి. వెరైటీ మార్చుకోవాలనుకునే రైతులు మంచి దిగుబడినిస్తున్న బేనిషా చెట్టును(మదర్ప్లాంట్) ఎంపికచేసుకోవాలి. తోటలోని అనవసరమైన రకాల చెట్టు కొమ్మలను 4 అడుగుల ఎత్తులో రంపంతో కోసేస్తారు. నెల రోజుల తర్వాత కట్ చేసిన కొమ్మలు చిగురిస్తాయి. వాటిల్లో దృడంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని తీసేయాలి. ఆ తర్వాత మనం ఎంపిక చేసుకున్న మదర్ ప్లాంట్ నుంచి చిగుర్లను కట్చేసి తడి గుడ్డలో జాగ్రత్తగా ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఎంపిక చేసుకున్న మామిడి చెట్లలో కట్ చేసిన చిగురు వద్ద సేకరించిన మేలు రకం చిగురును అంటు కట్టి ప్లాస్టిక్ ట్యాగ్ను చుట్టాలి. చెట్టులో మనమేదైతే మొక్కలను అంటు కడతామో అవే చిగురిస్తాయి. ఆపై మనం అంటుగట్టిన కాయలు మొదటి సంవత్సరం కాకుండా రెండో ఏడాదినుంచి కోతకొస్తాయి. ఇలా 30 ఏళ్ల వయసున్న పాత మామిడితోటలను పరిశీలిస్తే ఎకరానికి సగటున 50 వృక్షాలుంటాయి. ఒక్కో చెట్టుకు 20 అంట్లు కట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన 1000 అంట్లు అవుతాయి. ఒక్కో అంటుకు రూ.5 లెక్కన రూ.5వేలు అవుతుంది. చిగురుదశలోనే అంటు కట్టాలి ఏటా జూలై, ఆగస్టులోనే టాప్ వర్కింగ్ చేసుకోవాలి. ఆపై మామిడి చిగురిస్తుంది. సెప్టెంబరు నెల వరకు అంటుకట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. సీజన్లో తెలంగాణాలోని ఖమ్మం, మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లాల నుంచి చేయి తిరిగిన అంటుకట్టే కూలీలు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారే తోటలవద్దకొచ్చి ఈ పనులు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని తోటల్లో టాప్వర్కింగ్ జోరుగా సాగుతోంది. (క్లిక్: బొప్పాయి ప్యాకింగ్.. వెరీ స్పెషల్!) కొమ్మకో వెరైటీ టాప్ వర్కింగ్ పద్ధతిలో మనం కోరుకున్న రకాలను పెంచుకోవచ్చు. మోడు బారిన చెట్ల నుంచి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసుకోవచ్చు. పాతతోటల స్థానంలో కాల వ్యవధి లేకుండా త్వరగా కొత్త పంట వస్తుంది. భారీగా పెరిగిన చెట్లు కట్ చేస్తే, చిన్నగా కోతలకు అనుకూలమవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ధర కలిగిన రకాలను వాటిలో పండించుకోవచ్చు.కొమ్మకో వెరైటీ చొప్పున ఒకే చెట్టులో పది రకాలను పెంచవచ్చు. – డా.కోటేశ్వరావు, హార్టికల్చర్ ఏడీ, పలమనేరు మంచి రకాలను పెంచుకోవచ్చు ఎప్పుడో మన తాతల కాలంలో పాత రకాలైన మామిడి చెట్లు నాటుంటారు. వాటి వల్ల ప్రస్తుతం మనకు సరైన దిగుబడిలేక ఆశించిన ధరలేక బాధపడుతుంటాము. అలాంటి పరిస్థితుల్లో ఈ టాప్ వర్కింగ్ విధానం ద్వారా మేలైన మామిడిని రకాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. నేను ఇదే విధానం ద్వారా అంటు కట్టించాను. ఇప్పుడు నాతోట మేలైన తోతాపురి రకంగా మారి ఉత్పత్తి పెరిగింది. నికర ఆదాయాన్ని పొందుతున్నా. మామడి రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తే మంచింది. – సుబ్రమణ్యం నాయుడు, మామిడి రైతు, రామాపురం -
ఒకే ఊరు.. 102 రకాల మామిడి కాయలు.. చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే
మీకు ఎన్ని రకాల మామిడి పండ్లు తెలుసు..? ఐదు, పది, ఇరవై...! ఏకంగా వంద రకాల మామిళ్లను తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఓ గ్రామస్తులు. కేరళలోని కన్నూర్ జిల్లా కన్నపురం వెళ్తే.. మీకు మొత్తానికి మామిడిపండ్ల ఉత్సవమే కళ్ల ముందు నిలబడుతుంది. 207పైగా దేశవాళీ మామిడి రకాలుండగా అందులో 102 రకాలు ఈ ఊళ్లో ఉన్నాయి. కన్నపురంలోని కరువక్కువు ప్రాంతంలో 20 కుటుంబాలు కలిసి.. 300 చదరపు గజాల స్థలంలో 102 రకాల మామిడి చెట్లను పెంచుతున్నారు. స్థానిక పోలీసాఫీసర్ శైజు మచాతి 2016 నుంచి ఈ మామిడి రకాలను సంరక్షించడం మొదలుపెట్టాడు. 200 ఏళ్లనాటి మామిడి చెట్టును కొట్టేస్తున్నారని వ్యవసాయ అధికారి అయిన స్నేహితుడి ద్వారా తెలుసుకుని వెళ్లి, అంటుకట్టి దాన్ని రక్షించాడు. తరువాత 39 వెరైటీలను కలెక్ట్ చేశాడు. ఆయనకు గ్రామస్తుల సాయం తోడైంది.. మొత్తానికి 2020 కళ్లా 102 రకాలను సేకరించి, పెంచగలిగారు. ఏటా మే మొదటి ఆదివారం కన్నపురంలో ‘మ్యాంగో ఫెస్ట్’నిర్వహిస్తారు. జూలై 22 వరల్డ్ మ్యాంగో డే సందర్భంగా.. కేరళ బయోడైవర్సిటీ బోర్డు కరువక్కవును ‘దేశీయ మామిడి వారసత్వ ప్రాంతం’గా ప్రకటించింది. -
విపరీతమైన డిమాండ్.. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం!
చిక్కబళ్లాపురం(బెంగళూరు): పండ్లలో రారాజైన మామిడిలో మల్లిక రకం మామిడికి మార్కెట్లో యమక్రేజ్ ఏర్పడింది. రుచిలో, దిగుబడిలో మేటి అయిన మల్లిక మామిడిని సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఆ రకం మామిడికి నర్సరీల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో రైతులు మామిడి తోటల సాగుపై దృష్టి పెడుతున్నారు. నర్సరీల్లో ఇప్పటికే 20వేలకు పైగా మొక్కలు విక్రయం జరిగినట్లు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. సొప్పళ్లి, శిడ్లఘట్ట తాలూకా చిక్కదాసరహళ్లి, చింతామణి తాలూకా మాడికెరె, గుడిబండ తాలూకా పసుపులోడులో హైబ్రిడ్ మల్లిక మామిడి నారు పెంచుతున్నారు. కాగా మల్లిక రకం మామిడి ఈ ఏడాది మంచి ధర పలికింది. టన్ను మామిడి రూ.60వేలకు విక్రయించారు. మూడేళ్లలో పంట చేతికి వస్తుందని, ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాకాలంలో మామిడి చెట్ల పెంపకానికి మంచి వాతావరణం అని చెబుతున్నారు. గత ఏడాది కరోనా వల్ల నగరాల నుంచి పల్లెబాట పట్టిన యువకులు పండ్లతోటల సాగుపై దృష్టి పెడుతున్నారని, మామిడి, పనస, దానిమ్మ, డ్రాగన్ తదితర పంటలను పెట్టారని, మరో రెండు సంవత్సరాల్లో ఆ పంటలు చేతికందుతాయని అధికారులు తెలిపారు. -
దారుణం.. మామిడిపండు అడిగిందని గొంతుకోసి..
లక్నో: ఉత్తర్ప్రదేశ్ శామ్లీలోని ఖేడా కుర్తార్ గ్రామంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. అన్నం తినే సమయంలో మామిడిపండు అడిగిందనే కారణంతో ఐదేళ్ల మేనకోడల్ని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆమె పదే పదే మామిడిపండు కావాలని అడుగుతుందని చిరాకుపడి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నిందితుడు మొదట చిన్నారి తలపై రాడ్డుతో కొట్టాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. శవాన్ని సంచిలో చుట్టి ఇంట్లోనే దాచాడు. పాప కన్పించకపోయేసరికి గ్రామస్థులంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నిందితుడు కూడా ఏమీ తెలియన్నట్లు వారితో కలిసి పాపను వెతుకుతున్నట్లు నటించాడు. అయితే చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి నిందితుడిపై అనుమానం వచ్చింది. దీంతో అతడు గ్రామం వదిలి పారిపోయాడు. అతని ఇల్లు వెతికిన పోలీసులకు సంచిలో బాలిక మృతదేహం లభించింది. పోలీసులు నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టి గురువారం రాత్రి ఓ అడవి సమీపంలో అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనలో హత్యకు గురైన చిన్నారి పేరు ఖైరు నిషా.. కాగా నిందితుడి పేరు ఉమర్దీన్ అని పోలీసులు తెలిపారు. చదవండి: ఎన్నో కలలు..మరెన్నో ఆశలు.. పెళ్లై ఏడు నెలలు తిరగక ముందే.. -
దిల్ ‘మ్యాంగో’మోర్... సమ్మర్ ఎండ్ పికిల్స్ ట్రెండ్
వేసవి ముగింపుకొచ్చింది. దాంతో పాటే సీజన్లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే సమయం కూడా. ఆవకాయ అంటే ఒక పచ్చడి కాదు కొన్ని పచ్చళ్ల సమ్మేళనం. ఆ కొన్ని పచ్చళ్ల విశేషాలు... ► మామిడి ఆవకాయ తెలియనిదెవరికి?కనీస పదార్థాలతోనే చేసుకునేందుకు, ఎక్కువకాలం నిల్వఉంచుకునే వీలు వల్ల ఇది జాబితాలో అగ్రభాగంలో ఉంటుంది. ► బెల్లం తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... కలిపిందే బెల్లం ఆవకాయ. అయితే బెల్లం నాణ్యత బాగుండాలనేది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మర్చిపోకూడని విషయం. ► నువ్వులతో మామిడి పచ్చడి తయారు చేస్తారు. దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. ► అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్ మేళవింపు మరో రకం పచ్చడి. అయితే అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్ . ► పల్లి ఆవకాయ నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు నాణ్యతతో ఉంటే పచ్చడి మరింతగా నిల్వ ఉంటుంది. ► ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడిని ఎంచుకోవాలి. ఎండబెట్టిన మామిడికాయలతో ఇది తయారు చేస్తారు. ► ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా ఈ సీజన్ లో ట్రై చేయొచ్చు. ‘‘చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు తయారు చేసుకోవడం అంటే కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కూడా. భోజనం సమయంలో ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి వాసన చూస్తేనే ఎక్కడా లేని ఆనందం కలిగేది’’ అని గోల్డ్డ్రాప్ డైరెక్టర్ మితేష్ లోహియా గుర్తు చేసుకున్నారు. -
సమ్మర్ సీజన్: ఫలరాజు భలే క్రేజు
సాక్షి రాయచోటి(కడప): మామిడి పండ్లలో గుర్తింపు పొందిన అనేక రకాల మామిడి కాయలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు జిల్లాలు, రాష్ట్రాలు సరిహద్దులు దాటుతున్నాయి. కచ్చితంగా రెండు నెలలపాటు సీజన్లో కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సారి ఆశించిన మేర దిగుబడి లేకపోగా.. ధర మొదట్లో పెద్దగా లేకపోయినా ప్రస్తుతం బాగానే ఉండటంతో దిగుబడి ఉన్న మేరకు కాయలను విక్రయిస్తున్నారు.ఇక్కడి పండ్లు తియ్యగా ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన కాయలకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు లారీల్లో సరుకు రవాణా అవుతోంది. బెనీషా, నీలం, తోతాపురి, ఇమామ్ పసందు, మలిగుబ్బ లాంటి రకాల మామిడి కాయలకు సంబంధించి పల్ప్ ఫ్యాక్టరీలతోపాటు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు కాయలు రవాణా అవుతున్నాయి. మామిడికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోని అనేక మండలాల్లో విస్తారంగా మామిడి పండిస్తారు. కాబట్టి ఇతర రాష్ట్రాల షేట్లు(వ్యాపారులు) సైతం ఇక్కడే మకాం వేసి ఇక్కడ నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు లారీల ద్వారా పంపిస్తున్నారు. జిల్లాలో సరాసరి 90 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. దిగుబడి ఈసారి ఎకరాకు ఒక టన్ను చొప్పున కంటే లేకపోవడంతో సరాసరిన 90–100 వేల టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు, నవంబర్ నెలల్లో విరివిగా వర్షాలు కురవడం.. పూతకు అవకాశం లేకపోవడంతో దిగుబడి తగ్గినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న దిగుబడికి సంబంధించి లోకల్ మార్కెట్ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కడికక్కడ సరుకు రవాణా అవుతోంది. రాయచోటి, రైల్వేకోడూరు, సుండుపల్లె, వీరబల్లె, కె.వి.పల్లె, చిన్నమండెం, సంబేపల్లె, పీలేరులతోపాటు లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పుల్లంపేట తదితర మండలాల్లో మామిడి విస్తారంగా పండిస్తారు. రైల్వేకోడూరు, వీరబల్లె, కె.వి.పల్లె, సుండుపల్లె, చిన్నమండెం తదితర ప్రాంతాల నుంచి ప్రతి రోజు 40 నుంచి 50లారీలలో సరుకు రవాణా జరుగుతోంది. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూరు, తోతపూరి, బేనీషా, నీలం, ఇమామ్ పసంద్, రుమాని, పులిహార, ఖాదర్, లాల్ బహర్ రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రస్తుతం బేనీషా టన్ను రూ.35వేల నుంచి రూ.45వేల వరకు ఉండగా.. ఇమామ్ పసంద్ టన్ను లక్ష రూపాయలకుపైన, తోతపూరి రూ.16–20 వేలు, నీలం రూ. 30వేల నుంచి రూ. 40వేల వరకు ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడి కాయలను ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ముంబై, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది. అన్నమయ్య జిల్లాలో మామిడి పంట సీజన్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు (షేట్లు) జిల్లాలో మకాం వేస్తారు. కొన్నేళ్లుగా సీజన్లో రావడం, కొనుగోళ్లు చేసి ఆయా రాష్ట్రాలకు లారీల ద్వారా పంపుతుంటారు. రైల్వేకోడూరుతోపాటు రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో70నుంచి 80మంది దాకా షేట్లు ఇక్కడే ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకుని ఉంటారు. లారీలు కూడా దాదాపు 100నుంచి 150 వరకు ప్రతినిత్యం సమీప ప్రాంతాల్లోనే సిద్ధంగా ఉంటాయి. వీటిల్లో సరుకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుంటాం అన్నమయ్య జిల్లాలో ప్రతి ఏడాది వేసవి సీజన్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చి మామిడి కాయల వ్యాపారం నిర్వహిస్తుంటాం. నాతోపాటు చాలామంది వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి మార్కెట్ల నుంచి మహారాష్ట్రకు పంపుతుంటాం. కాయల కొనుగోలుకు లారీలు కూడా ఆయా రాష్ట్రాల నుంచి వస్తాయి. మామిడి కాయలు రుచిగా, నాణ్యతగా ఉండటంతో వీటికి మంచి గిరాకీ ఉంటోంది. – జావేద్, మామిడికాయల వ్యాపారి, మహారాష్ట్ర మామిడి పండ్లకు డిమాండ్ జిల్లాలోని మామిడిపండ్లకు డిమాండ్ ఉంటోంది. ఇక్కడి మామిడి పండు రుచికరంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి ఏడాది సరుకు ఇక్కడ నుంచి పలు రాష్ట్రాలకు వెళుతోంది. అనేక రకాల మామిడి పండ్లు పండిస్తారు. కాకపోతే ఈ ఏడాది చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది. అయినప్పటికీ ఇక్కడి నుంచి డిమాండ్కు అనుగుణంగా జ్యూస్, మార్కెట్లకు, ఇతర రాష్ట్రాలకు మామిడి కాయలు వెళుతున్నాయి. – రవీంద్రనాథరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, అన్నమయ్య జిల్లా -
మామిడి ఒరుగులు: 15 వేల రూపాయలు పెడితే లక్ష ఆదాయం.. అప్పటి నుంచి!
సీజనల్గా ప్రకృతి ఇచ్చే వరాల్లో మామిడి ఒకటి. మామిడి కాయలనే ఉపాధిగా మార్చుకుంది ఖమ్మం జిల్లా మండాలపాడు వాసి రావిలాల అనూష. ఏడేళ్ల క్రితం 15 వేల రూపాయలతో మామిడి ఒరుగుల వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనూష నేడు 30 మంది మహిళలకు ఉపాధి ఇస్తోంది. వేసవిలో రెండు నెలలు మాత్రమే చేసే ఈ తయారీ మార్కెట్ రంగంలో తనకో కొత్త మార్గాన్ని చూపింది అని వివరించింది అనూష. ‘మాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ వరకు చదువుకున్నా. పెళ్లై, ఇద్దరు పిల్లలు. ఎకరంన్నర భూమిలో పత్తి సాగు చేస్తున్నాం. ఏడేళ్ల క్రితం మార్కెట్లో పత్తి అమ్ముతున్నప్పుడు మామిడి ఒరుగుల వ్యాపారం గురించి తెలిసింది. సాధారణంగా ప్రతి వేసవిలో ఇంట్లో మామిడి ఒరుగులను తయారుచేసుకుంటాం. వాటిని వర్షాకాలంలో వంటల్లో వాడుకుంటాం. అలాంటి ఈ ఒరుగులను పొడి చేసి, ఉత్తరభారతదేశంలో పెద్ద మార్కెట్ చేస్తున్నారని తెలిసింది. పులుపుకు బదులుగా వంటల్లో ఆమ్చూర్ పొడిని వాడుతుంటారని, ఈ బిజినెస్లో మంచి లాభాలు చూడవచ్చని తెలుసుకొని, దీని తయారీనే పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం. పదిహేనువేల రూపాయలతో మొదలు మొదటి ఏడాది మావారు రామకృష్ణ నేను కలిసి 15వేల రూపాయలతో మామిడికాయలను కొనుగోలు చేశాం. మా బంధువుల నాలుగు మామిడి చెట్ల నుంచి 2 టన్నుల వరకు మామిడి కాయలు సేకరించి, ముక్కలు కోసి ఎండబెడితే ఏడు సంచులు అయ్యాయి. వాటిని అమ్మాం. ముందు మా కుటుంబమే ఈ పనిలో నిమగ్నమైంది. తర్వాత తర్వాత పనికి తగినట్టు ఇతరులను నియమించుకున్నాం. ఆ యేడాది లక్ష రూపాయల ఆదాయం చూశాం. తర్వాత ఏడాది ఇంకాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, ఇరవై క్వింటాళ్ల ఒరుగులు తయారుచేసి నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేశాం. నష్టం వచ్చినా వదల్లేదు ప్రతి యేటా పనిని పెంచుతూనే వస్తున్నాం. ఐదేళ్లుగా ప్రతియేటా 50 క్వింటాళ్ల ఒరుగులు తయారుచేస్తున్నాం. ఒకసారి లాభం వచ్చిందంటే, మరోసారి తీవ్రమైన నష్టం కూడా చూస్తున్నాం. మామిడికాయ నుంచి ముక్క కట్ చేసి, ఆరబెట్టాక బాగా ఎండాలి. ఏ మాత్రం వర్షం వచ్చినా, ఒరుగులు పాడైపోతాయి. అమ్ముడుపోవు. వాతావరణం మీద ఆధారపడే తయారీ విధానం కాబట్టి, సమస్యలు తప్పవు. మా ఇంటిపైన, ఖాళీగా ఉన్న రోడ్డువారన మామిడి ముక్కలను ఎండబెడుతుంటాం. దాదాపు ఎండల్లోనే పని అంతా ఉంటుంది. రెండు నెలల పాటు టెంట్లు వేసి, ఈ పని చేస్తుంటాం. ఈ పనిలో అంతా మహిళలే పాల్గొంటారు. రోజూ 30 మందికి పైగా పాల్గొనే ఈ పని రెండు నెలల పాటు కొనసాగుతుంది. మా వర్క్ చూసి డీఆర్డీఎ, వి–హబ్ వాళ్లు రుణం ఇచ్చి సాయం చేశారు. కారం, పసుపు మిషన్లను కూడా కొనుగోలు చేశాం. ఒరుగులను పొడి చేసి అమ్మాలనుకున్నాం. ‘కృషి’ పేరుతో లేబుల్ కూడా వచ్చింది. కానీ, ఒరుగులను పొడి చేసే మిషన్లతో పాటు, లేబుల్ ప్రింట్కు, ప్యాకింగ్కి లక్షల్లో ఖర్చు అవుతుంది. వచ్చే ఏడాది ఆమ్చూర్ పొడిని మా సొంత లేబుల్తో అమ్మాలని ప్రయత్నాలు చేస్తున్నాను’ అని వివరించింది అనూష. – నిర్మలారెడ్డి -
Mamidi Tandra: ఎంత తిన్నా.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..
ముంచంగిపుట్టు(అరకులోయ)అల్లూరి సీతారామరాజు జిల్లా: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరుతుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజనులు తయారుచేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిందంటే చాలు. మన్యంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు మైదాన ప్రాంత ప్రజల మనసునూ దోచుకుంటున్నాయి. కొండ, అటవీ ప్రాంతాల్లో లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర.. చాలా రుచిగా ఉంటుంది. గిరిజన మహిళలు తయారు చేసే ఈ తాండ్రకు మన్యంతో పాటు మైదానంలో మంచి గిరాకీ ఉంది. చదవండి: హమ్మ తొండా.. ఎంత పనిచేశావే! ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామాల్లోని చాపలు, ప్లేట్లలో మామిడి తాండ్ర తయారు చేసే పనిలో గిరిజన మహిళలు బిజీగా ఉన్నారు. వారపు సంతలో కిలో తాండ్ర రూ.100 వరకు పలుకుతున్నా.. ఎంతో రుచిగా ఉండడంతో కొనుగోలుదారులు ధరను లెక్క చేయడం లేదు. మామిడి పండ్ల సీజన్ అయిపోయిన తర్వాత కూడా తాండ్రను భద్ర పరుచుకుని తినే అవకాశం ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా మన్యం మహిళలు తాండ్రను తయారు చేస్తున్నారు. తాండ్రను తయారు చేస్తున్న గిరిజన మహిళ సహజసిద్ధంగా తయారీ గిరిజన గ్రామాలకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో మామిడి చెట్లకు కాసే కొండ మామిడి పండ్లను ఇంటిల్లిపాదీ సేకరిస్తారు. వాటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు, బిందెలలో వేసి రోకలితో దంచుతారు. మామిడి రసాన్ని చాటలు, ప్లేట్లు, చాపలపై పలుచగా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలపకుండానే పొరలు, పొరలుగా వేస్తారు. వారం, పది రోజుల పాటు ఆరబెట్టి.. తర్వాత తాండ్రగా ప్యాక్ చేస్తారు. తాండ్ర తయారీకి కొండ మామిడి పండ్లను సేకరిస్తున్న చిన్నారులు తొక్కతో పచ్చడి మామిడి పండ్ల నుంచి వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తుండగా.. మిగిలిన మామిడి తొక్కలు, టెంకలను వేరు చేస్తారు. తొక్కలను కొందరు కారంతో, మరికొందరు బెల్లంతో కలిసి ఎండ బెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. ఏడాది పొడవునా గంజి అన్నంతో పచ్చడి మాదిరిగా వినియోగిస్తారు. కొన్ని గ్రామాల్లో మామిడి టెంకలను ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకుని ఆరగిస్తారు. మామిడి టెంకలతో కూరను కూడా తయారు చేస్తారు. ఈ కూరను లొట్టలేసుకుని మరీ తింటారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. వారపు సంతల్లో విక్రయాలు మన్యంలో గిరిజనులు తయారు చేసే తాండ్రకు మంచి డిమాండ్ ఉంది. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి రసాయనాలు కలపకుండా తయారు చేయడంతో ఇక్కడ తయారైన తాండ్రపై వ్యాపారులు మక్కువ చూపిస్తున్నారు. తాండ్రను ముక్కలుగా చేసి.. ముక్క రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా ఉత్పత్తి ఏటా మామిడితో ఆదాయం సంపాదిస్తున్నాం. మొదట్లో మామిడి తాండ్రను ఇంట్లో వాడకం కోసం మాత్రమే తయారు చేసుకునేవాళ్లం. వారపు సంతల్లో తాండ్రకు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పెంచాం. కొంత మంది వ్యాపారులు ఇంటికి వచ్చి మరీ తాండ్రను కొనుగోలు చేస్తున్నారు. సహజసిద్ధంగా తయారుచేయడం వల్ల రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఆదాయం బాగుంటుంది. –రాధమ్మ, సుజనకోట, ముంచంగిపుట్టు మండలం -
Recipe: పచ్చిమామిడి తురుముతో మ్యాంగో వడ.. తయారీ ఇలా!
పచ్చిమామిడి తురుము, మినప్పిండితో రుచికరమైన మ్యాంగో వడ ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. మ్యాంగో వడ తయారీకి కావలసినవి: ►పచ్చి మామిడి తురుము – 1 కప్పు ►మినప్పిండి – రెండున్నర కప్పులు ►క్యారెట్ తురుము – పావు కప్పు ►శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు ►పెరుగు – పావు కప్పు ►కారం, గరం మసాలా, చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►ఉల్లిపాయ ముక్కలు – 1 టీ స్పూన్ ►పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా ►జీలకర్ర, వాము, నువ్వులు – కొద్దికొద్దిగా ►ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి పరిపడా తయారీ: ముందుగా ఒక పాత్రలో.. ► మినప్పిండి, పచ్చి మామిడి తురుము, క్యారెట్ తురుము ►పెరుగు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, వాము, నువ్వులు వేసుకోవాలి ►తర్వాత తగినంత ఉప్పు కలుపుకుని.. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ►ఆ మిశ్రమాన్ని కాగుతున్న నూనెలో వడల్లా వేసుకుని వేయించాలి. ►వాటిని సాస్లో లేదా చట్నీతో తినొచ్చు లేదా పెరుగులో నాబెట్టుకుని ఆవడల్లా తిన్నా బాగుంటాయి. ఇది కూడా ట్రై చేయండి: Kachalu Chamadumpa Chaat In Telugu: చామదుంపతో.. నోరూరించే కచ్లు చాట్ తయారీ ఇలా! -
టేస్టీ..యమ్మీ!.. విదేశాల్లో మన మామిడికి ఫుల్ డిమాండ్
సాక్షి,జి సిగడాం(శ్రీకాకుళం): సింగపూర్, దుబాయ్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల్లో సిక్కోలు మామిడికి మంచి గిరాకీ ఉందన్న సంగతి తెలుసా..? ఆశ్చర్యంగా అని పించినా ఇదే నిజం. జిల్లాలోని గంగువారి సిగడాం మండలం వెలగాడ పంచాయతీ చంద్రయ్యపేట గ్రామం నుంచి ఏటా మామిడిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఇక్కడ వివిధ రకాల మామిడి కాయలు పండించడంతో ఈ కాయలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హిమాపసల్ అంటే మహా ఇష్టం ఈ గ్రామంలోని తోట నుంచి హిమాపసల్ మామిడి కాయలను సింగపూర్, దుబాయి, స్విట్జర్లాండ్, అ మెరికా దేశాలకు తరచూ ఎగుమతి చేస్తారు. అలాగే మనదేశంలోని తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకూ ఈ మామిడిని తరలిస్తారు. అక్కడ కాయ రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతుంది. వందకాయలు దాదాపు రూ.7వేల వరకు విక్రయిస్తారు. ఈ రకం మామిడి సువాసన కిలోమీటర్ వరకు వ్యాపిస్తుందని చెబుతుంటారు. రుచి కూడా అమోఘం. కాయ సుమారుగా ఐదువందల గ్రాముల బరువు ఉంటుంది. 60 ఎకరాల్లో హిమాపసల్.. ఈ ఏడాది హిమాపసల్ మామిడి కాయ దిగుబడి తగ్గింది. ఉన్న మేర ఎగుమతి చేశాం. ఈ తోటలో 60 ఎకరాల్లో హిమపసల్ చెట్లు ఉన్నాయి. – ఎస్ కృష్ణ, కౌలు రైతు చదవండి: మెట్రో రైలులో యువతి ‘జిగల్’ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్ -
కలర్ఫుల్.. ప్రూట్స్
కడియం: పనస తొనలు తెలుపు లేత గోధుమ లేదా పసుపు రంగులో ఉండటం సహజమే. అవే తొనలు చూడగానే ఆకర్షించేలా ఆరెంజ్ కలర్లో ఉంటే ఆశ్చర్యమే. సీతాఫలాలు పైకి ఆకుపచ్చగా.. లోపల తెల్లటి గుజ్జుతో ఉండటం సహజమే. అవే ఫలాలు పైకి పింక్ కలర్లో కనిపిస్తే ‘ఎంత బాగున్నాయో’ అనిపించక మానదు. సాధారణంగా నేరేడు పండ్లు నల్లగా ఉంటాయి. అవే పండ్లు తెల్లగా ఉంటే..! సహజ సిద్ధంగా లభిస్తున్న ఫండ్లను ఇలా సరికొత్తగా అభివృద్ధి చేస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. సాధారణంగా మనం చూసే పండ్లను భిన్నమైన రంగుల్లో కాసే అనేక రకాల మొక్కలను తమ నర్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మన దేశంలో లభించే వివిధ రకాల పండ్లకు ఉండే సహజ గుణాలకు భిన్నంగా రూపొందిస్తున్న ఈ మొక్కలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగని వీటి తయారీ ప్రకృతి విరుద్ధంగానో లేక జీన్ మోడిఫైడ్గానో చేయడం లేదు. ప్రకృతి సహజంగా లభించే పండ్ల మొక్కల్లో భిన్నమైన లక్షణాలను ముందుగా గుర్తిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక మొక్కలో వచ్చేవిధంగా అంటు కట్టి తయారు చేస్తున్నారు. ఇలా దేశ, విదేశాల్లో విభిన్న రకాలైన పండ్ల మొక్కలను ఇక్కడకు తీసుకువచ్చి, సరికొత్తగా అభివృద్ధి చేసి, కొనుగోలుదార్లకు అందుబాటులో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం.. సాధారణంగా వేరే ప్రదేశం నుంచి ఏదైనా మొక్కను తేవాలంటే ప్లాంట్ క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా పండ్ల మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. విభిన్న రకాల మొక్కలను ఆయా నిబంధనలకు లోబడి ఇక్కడి నర్సరీ రైతులు తీసుకువస్తున్నారు. ముంబై, పుణే, కోల్కతా, కేరళ, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో క్వారంటైన్ లైసెన్సులు ఉన్న పలువురు నర్సరీ రైతులు ఇతర దేశాల నుంచి ఈ రకమైన పండ్ల మొక్కలకు మన దేశానికి తీసుకువస్తున్నారు. వీటిని కడియం ప్రాంత నర్సరీ రైతుల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. కంటికి భిన్నంగా కనిపించినప్పటికీ రుచిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు. తెల్ల నేరేడు, పింక్ జామ, ఎరుపు రంగు తొనలు ఇచ్చే పనస, సీడ్ లెస్ నిమ్మ, పింక్ కలర్ సీతాఫలం, ఎరుపు రంగులో ఉండే గులాబీ జామ, వెరిగేటెడ్ అరటి, స్వీట్ గుమ్మడి, పింక్ కొబ్బరి, వివిధ రంగుల్లో చిలగడదుంప, ఉసిరి, డ్రాగన్ఫ్రూట్, రామాఫలం, ఎర్రని చింత/సీమచింత తదితర రకాల పండ్ల మొక్కలను స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. పింక్ కలర్ గులాబీజామ ,ఆరెంజ్ పనస స్వీట్ గుమ్మడికొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి సాధారణంగా ఉండే పండ్ల కంటే భిన్నంగా కనిపిస్తుండడంతో కొనుగోలుదారులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వీటి అభివృద్ధి శ్రమతో కూడినది. కానీ నాణ్యమైన దిగుబడి ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహిక రైతులు వీటిని నాటి మంచి ఫలసాయం పొందుతున్నారు. ఇవి సహజసిద్ధంగా రూపుదిద్దుకున్నవే. – కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ, బుర్రిలంక సహజమైనవే.. కొన్ని రకాల పండ్లు, పువ్వులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగు, రుచి, వాసన కలిగి ఉంటాయి. మన దేశంలో పనస సాధారణంగా తెలుపు, లేత గోధుమ, పసుపు రంగుల్లో ఉంటుంది. థాయ్లాండ్లో ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన భిన్న లక్షణాలుంటాయి. వీటిని సేకరించి తీసుకువచ్చి, స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. సంబంధిత రకాన్ని అభివృద్ధి చేయడంగానే దీనిని చెప్పవచ్చు. – సుధీర్కుమార్, ఉద్యాన అధికారి, కడియం -
తుని.. మూడు తరాలుగా మామిడికి ప్రసిద్ధి
సాక్షి, తుని: తింటే గారెలే తినాలి అంటారు కానీ.. ఆ కోవలో తుని మామిడి పండ్లు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడా లేని రుచి తుని ప్రాంతంలో పండే మామిడి పండ్లకు ఉంది. 1947కు ముందు నుంచీ మామిడికి తుని ప్రసిద్ధి. తుని పట్టణానికి ఏకంగా “మ్యాంగో సిటీ’ అనే పేరు కూడా ఉంది. తుని డిపో ఆర్టీసీ బస్సులపై ఈ డిపో పేరు రాసినప్పుడు పక్కనే మామిడికాయల బొమ్మలు కూడా ఉండేవంటే.. ఇక్కడి మామిడి ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తునిలో ప్రారంభమైన ఓ జ్యూయలరీ సంస్థ సైతం “మ్యాంగో సిటీ’గా ప్రచారం చేసుకోవడం విశేషం. ఇక్కడి రైతులు మూడు తరాలుగా ఇతర రాష్ట్రాలకు మామిడి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రెండేళ్లుగా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 15,362 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. తుని సబ్ డివిజన్లో మామిడి విస్తీర్ణం 1,700 హెక్టార్లుగా ఉంది. ఇక్కడ పండే బంగినపల్లి, చెరకు రసాలు, తోతాపురి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, కొత్తపల్లి కొబ్బరి, పండూరి మామిడి పండ్లకు ఎంతో డిమాండ్. ఏటా తుని ప్రాంతం నుంచి 60 వేల టన్నుల పండ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం తుని కేంద్రంగా ఏటా రూ.20 కోట్ల మేర మామిడి వ్యాపారం జరుగుతోంది. రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని సమయంలో ఇక్కడి రైతులు, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు రైళ్ల ద్వారా మామిడి ఎగుమతులు చేసేవారు. క్రమేపీ లారీ రవాణా అందుబాటులోకి రావడంతో ఉత్తరాది రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఎగుమతులు చేస్తూ ఇక్కడి వ్యాపారులు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇక ఉద్యాన శాఖ విదేశాలకు ఎగుమతి చేయడానికి 3,500 మంది రైతులతో ఒప్పందం చేసుకుంది. మూడు తరాలుగా ఎగుమతులు మా తాత, నాన్న పప్పు సూర్యారావు నుంచి 80 ఏళ్లుగా మామిడి ఎగుమతులు చేస్తున్నాం. రైతుల నుంచి తోటలు కొని పక్వానికి వచ్చిన పండ్లను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం. తొలి రోజుల్లో వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి రైళ్లలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో తుని మామిడికి ఎంతో డిమాండ్ ఉంది. వేసవి సీజన్లో ఎన్ని పనులున్నా మామిడి ఎగుమతులు ఆపలేదు. ఉద్యాన అధికారులు సహకరించడంతో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా కలిగింది. – పప్పు వెంకట రమణ, వ్యాపారి, వెంకటాపురం నేల స్వభావంతో మంచి రుచి తుని ప్రాంతంలో ఇసుక, గరప (గ్రావెల్) నేలలు కావడంతో ఇక్కడి మామిడి పండు రంగు ఎంతో బాగుంటుంది. రుచి కూడా చాలా మధురంగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు తుని మామిడి పండ్లు రుచి చూడాలని ప్రతి ఒక్కరూ పరితపిస్తారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మంచి రంగు ఉంటుంది. ప్రస్తుతం మేలు రకం పండ్ల ధర టన్నుకు రూ.75 వేలు పలుకుతోంది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – విజయలక్ష్మి, ఉద్యాన అధికారి, తుని -
మామిడితో కాసులు.. ఆర్టీసీకి ఏ దిల్ ‘మ్యాంగో’ మోర్
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీకి మామిడి కాసులు తెచ్చి పెడుతోంది. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు మామిడి కాయలు/పండ్లను పార్శిల్ ద్వారా పంపే వారి సంఖ్య పెరుగుతోంది. ఆర్టీసీ కార్గో, కొరియర్ సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటికి డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పించడంతో మంచి ఆదరణ లభిస్తోంది. పార్శిల్ బుక్ చేసిన 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని నిర్దేశిత ప్రాంతాలకు సరకును అందజేస్తోంది. ఇది వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. చదవండి: కేశినేని కుటుంబంలో కుంపటి! మామిడికి ప్రత్యేక కౌంటర్.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో కార్గో బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం నుంచి మామిడి సీజను మొదలైంది. మామిడిని పార్శిల్ ద్వారా పంపే వారి కోసం ప్రత్యేకంగా పీఎన్ బస్టాండులోని 60వ నంబరు ప్లాట్ఫాం వద్ద కౌంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక ర్యాక్లను కూడా అమర్చారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే మ్యాంగో బాక్సుల డెలివరీకి 57వ నంబరు ప్లాట్ఫాం వద్ద మరో ప్రత్యేక కౌంటర్ను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల కార్గో బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు వేగంగా పార్శిళ్లను బుక్ చేసుకునే వీలుంటోంది. ఇలా ఈ మ్యాంగో బుకింగ్ కౌంటర్లో నెలకు 600 నుంచి 800 వరకు బాక్సులు/పార్శిళ్లు బుక్ అవుతున్నాయి. గతేడాది కంటే మిన్నగా.. గత ఏడాది ఏప్రిల్లో 400 మ్యాంగో పార్శిళ్లు, మే నెలలో 600, జూన్లో 600 చొప్పున పీఎన్ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు బుక్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో 600, మే నెలలో ఇప్పటివరకు 800 వరకు పార్శిళ్లను పంపించారు. అంటే గత ఏడాదికంటే ఈ సీజనులో మామిడి పండ్ల/కాయల పార్శిళ్ల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఆర్టీసీ ఒక్కో బాక్సుకు (5–15 కిలోల బరువు వరకు) రూ.100–120 వరకు రవాణా చార్జీ వసూలు చేస్తోంది. ఈ లెక్కన మామిడి రవాణా ద్వారా ఏప్రిల్లో రూ.60 వేలు, మే నెలలో (ఇప్పటి దాకా) రూ.80 వేల వరకు కార్గో ఆదాయం సమకూరింది. జూన్లోనూ 800 వరకు మ్యాంగో పార్శిళ్లు బుక్ అవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, విశాఖలకు అధికం.. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలకు అధికంగా మ్యాంగో పార్శిళ్లు బుక్ చేస్తున్నారు. ఆ తర్వాత తిరుపతి, రాజమండ్రిలకు బుక్ అవుతున్నాయని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు చెబుతున్నారు. ఒకే వినియోగదారుడు నాలుగైదుసార్లు పార్శిళ్లను పంపుతున్న వారు కూడా ఉంటున్నారని వివరిస్తున్నారు. మామిడి తర్వాత.. విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు కార్గో రవాణాలో మామిడి తర్వాత మందులు, ఫ్యాన్సీ సరుకులు, వ్రస్తాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పుస్తకాలు వంటివి ఉంటున్నాయి. ఇలా వీటి ద్వారా విజయవాడ కార్గో కౌంటర్కు రోజుకు రూ.2.50 నుంచి 3 లక్షల వరకు ఆదాయం సమకూరుతోందని ఆర్టీసీ కార్గో విభాగం డెప్యూటీ సీటీఎం (కమర్షియల్) రాజశేఖర్ ‘సాక్షి’కి చెప్పారు. డోర్ డెలివరీ కూడా.. మరోవైపు పది కిలోమీటర్లలోపు డోర్ డెలివరీకి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ఇది కూడా వినియోగదారులకు వెసులుబాటుగా ఉంటోంది. బుక్ చేసిన సరకును వెళ్లి తీసుకురావడానికి సమయాన్ని వెచ్చించడంతో పాటు ఆటో, బస్సు, వాహన చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. డోర్ డెలివరీ వెసులుబాటు ఉండడం వల్ల వీరికి డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. దీంతో పలువురు ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. విడిపించని సరకులకు నేడు వేలం.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పార్శిళ్లను కొంతమంది విడిపించుకోరు. అలాంటి వాటిని ఆర్టీసీ అధికారులు కొన్నాళ్ల పాటు వేచి చూసి ఎవరూ రాకపోతే వేలం వేస్తుంటారు. ఇలా పీఎన్ బస్టాండులో 2–3 నెలలుగా విడిపించుకోని 80 వరకు పార్శిళ్లు ఉన్నాయి. వీటిలో మందులు, దుస్తులు, స్టేషనరీ, స్పేర్ పార్టులు వంటివి ఉన్నట్టు గుర్తించారు. వీటికి శనివారం ఉదయం 11 గంటల నుంచి వేలం వేస్తామని పార్శిల్ విభాగం అధికారులు తెలిపారు. -
Recipe: ఘుమఘుమలాడే చేపల ఇగురు చేసుకోండిలా!
నోరూరించే చేపల ఇగురు ఇలా సులువుగా తయారు చేసుకోండి. చేపల ఇగురు తయారీకి కావలసినవి: ►పచ్చి చిన్న చేపలు – కేజీ ►కారం – మూడు టీస్పూన్లు ►కరివేపాకు – రెండు రెమ్మలు ►అల్లం – రెండు అంగుళాల ముక్క ►పుల్లటి పచ్చి మామిడి కాయ – ఒకటి ►పచ్చికొబ్బరి తురుము – కప్పు ►పసుపు – చిటికెడు ►పచ్చిమిర్చి – నాలుగు ►ఉప్పు – రుచికి సరిపడా. ►గార్నిష్ కోసం: ఆవాలు – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – రెమ్మ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం.. ►మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి ►చేపలను శుభ్రం చేసి నీచు వాసనలేకుండా ఐదారుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ►అల్లంని తొక్కతీసి పేస్టుచేయాలి ►పచ్చికొబ్బరి తురుములో పసుపువేసి మెత్తగా రుబ్బుకోవాలి ►బాణలిలో మామిడికాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కప్పు నీళ్లుపోసి ఉడికించాలి ∙ ►మామిడికాయ ముక్కలు ఉడికిన తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను వేయాలి ►చేపలు ఉడికిన తరువాత కొబ్బరి పేస్టు వేసి మరో 10 నిమిషాలు ఉడికించి దించేయాలి ►ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి, ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి ►ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి మారాక తాలింపుని ఉడికిన చేపల కూరలో వేసి కలుపుకుంటే చేపల ఇగురు రెడీ. చదవండి👇 Egg Chapati Recipe In Telugu: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా! Recipe: నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! Anapa Ginjala Charu: పాలకూర.. పచ్చిమామిడి ముక్కలతో రుచికరమైన అనపగింజల చారు! -
పేదోడి ఇంట పచ్చడి మెతుకులూ కష్టమే
ఖమ్మం (మధిర) : గ్యాస్, నిత్యావసరాలతో పాటు కూరగాయల ధరలు పెరుగుతుండగా... పచ్చడితోనైనా కడుపు నింపుకుందామని భావించే పేదలకు అది కూడా భారంగా మారుతోంది. దిగుబడి తగ్గడంతో పెరిగిన మామిడి కాయల ధరలకు తోడు, పచ్చడి తయారీకి ఉపయోగించే ఇతర దినుసుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న తరుణాన ఈ ఏడాది పలువురు పచ్చడిపైనే ఆశలు వదిలేసుకున్నారు. దీంతో పేదలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఏటా పెట్టే మామిడికాయ పచ్చడి సువాసన ఈసారి అక్కడక్కడే వస్తోంది. వేసవి వచ్చిందంటే... వేసవికాలం వస్తుందంటే అన్ని వర్గాల ప్రజలు మొదటగా మామిడికాయ పచ్చడిపైనే దృష్టి సారి స్తారు. ఇందుకోసం మేలు రకాల కాయలను ఎంచుకుని పచ్చడి పెట్టడం ఆనవాయితీ. ఇళ్లలో ఉపయోగానికే కాకుండా దూరప్రాంతాల్లో ఉంటున్న బంధువులు, కుటుంబీకులకు పంపించేందుకు గాను అవసరమైన పచ్చడి కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఈసారి మామిడి పూత పెద్దగా రాకపోగా, వచ్చిన పూత కూడా తెగుళ్ల బెడదతో నిలవలేదు. దీంతో మామిడికాయల ధరలు అమాంతకం పైకి వెళ్లాయి. ఫలితంగా పచ్చడి కోసం కాయల కొనుగోలుకు వస్తున్న వారు ధరలు చూసి నిరాశగా వెనుతిరుగుతున్నారు. మటన్ ముక్కలే... చాలా మంది ఇళ్లలో మామిడికాయ పచ్చడి ఇష్టంగా తింటారు. దీనికి తోడు ఉదయం ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వెళ్లే వారి క్యారేజీల్లో పచ్చడి తప్పక కనిపిస్తుంది. కానీ ఈసారి కాయల కొరత, పెరిగిన ధరలతో పచ్చడి పెట్టేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోగా, కొందరు పెడుతున్నా యాభై కాయలకు బదులు పది, ఇరవై కాయలతో సరిపుచ్చుకుంటున్నారు. దీంతో బంధువులకు పంపించడం మాటేమో కానీ ఇంట్లో పెట్టిన పచ్చడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ తినాల్సిందేనని చెబుతున్నారు. ఏపీ నుంచి దిగుమతి సాధారణంగా పచ్చడి తయారీకి చిన్నరసాలు, పెద్దరసాలు, జలాలు, తెల్లగులాబీ, నాటు తదితర రకాలను వినియోగిస్తారు. అయితే, జిల్లాలో 2018 – 19లో 1.20లక్షల ఎకరాలు, 2019 – 20లో 70వేలు, 2020 – 21లో 31,994, 2021 – 22లో 33,861 ఎకరాల్లో మామిడిసాగు విస్తీర్ణం ఉంది. చీడపీడలు ఆశించడం, అధిక వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది రైతులు తోటలను తొలగించారు. అలాగే, ఉన్న తోటల్లోనూ ఈసారి పెద్దగా దిగుబడి లేదు. దీంతో ఆంధ్రా సరిహద్దులో ఉన్న తిరువూరు, నూజివీడు, విస్సన్నపేట, ఎ కొండూరు, చింతలపూడి తదితర ప్రాంతాలనుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా మామిడికాయలకు ధర పెరిగిందని చెబుతున్నారు. ఆ జోలికే వెళ్లలేదు... ప్రతిరోజూ పనులకు వెళ్తుంటాం. ఉదయం వంట చేసుకోలేనందున ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి పెట్టి ఏడాదంతా వాడుకుంటాం. కానీ ఈసారి మామిడికాయలే కాదు నూనె ధర కూడా పెరిగింది. దీంతో ఈ ఏడాది పచ్చడి జోలికే వెళ్లలేదు. యాభై కాయలకు బదులు పది కాయలతో పచ్చడి పెట్టాలన్నా ధైర్యం చేయలేకపోయాం. – ఆదిలక్ష్మి, లడకబజార్, మధిర ఖర్చు ఇలా... మామిడి పచ్చడికి ఎక్కువగా ఉపయోగించే జలాల రకం కాయ ఒక్కొక్కటి రూ.40, చిన్నరసం రూ.30చొప్పున విక్రయిస్తున్నారు. దీనికి తోడు మిర్చి రకానికి అనుగుణంగా కేజీకి 250కు పైగా పలుకుతుండగా నూనె కేజీ ధర రూ.190 వరకు ఉంది. అలాగే, మామిడికాయ ముక్కలు కొట్టించడం, కారం పట్టించే ఖర్చు... ఎల్లిపాయలు, మెంతులు, ఉప్పు ఇలా దినుసుల ధరలు కూడా పెరి గాయి. ఫలితంగా ఈసారి పచ్చడి పెట్టడం భారంగా మారిందని సామాన్యులు వాపోతున్నారు. -
Recipe: పాలకూర.. పచ్చిమామిడి ముక్కలతో రుచికరమైన అనపగింజల చారు!
అనపకాయ చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఐరన్లు, పీచుపదార్థం పుష్కలం. కూర లేదంటే జ్యూస్.. దీనిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. ఇక వేసవిలో లభించే పచ్చిమామిడికాయ ముక్కలతో అనప గింజల చారు పెడితే టేస్ట్ అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం ఇలా ఇంట్లోనే ఈ వంటకాన్ని తయారు చేసుకోండి. కావలసినవి: ►లేత పాలకూర – రెండు కట్టలు ►అనపగింజలు – కప్పు ►కొత్తి మీర – చిన్న కట్ట ►ఉల్లిపాయ – ఒకటి ►టొమాటోలు – రెండు ►పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు ►పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు ►పసుపు – అరటీస్పూను, ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు ►ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను ►ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. ►పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి. ►కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. ►దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి ►మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ►ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ►స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి ►ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Sorakaya Juice: సొరకాయ జ్యూస్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే! చదవండి👉🏾Juicy Chicken: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి! -
పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో
సాక్షి, కరీంనగర్: రామడుగు మండలంలోని గోపాల్రావుపేటకు చెందిన ఇరుకు సాయిప్రియ(28) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సాయిప్రియ–తిరుపతి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సాయిప్రియ బీడీలు చేస్తుండగా తిరుపతి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గురువారం సాయంత్రం మామిడికాయ పచ్చడి విషయంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. సాయిప్రియ క్షణికావేశంలో వంట గదిలోకి వెళ్లి, ఒంటిపైన కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు ఆర్పివేసే క్రమంలో భర్త తిరుపతి, తోటి కోడలికి గాయాలయ్యాయి. సాయిప్రియను కరీంనగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. శుక్రవారం మృతురాలి తండ్రి గంటి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నోరూరించే కొండ మామిడి.. దీని ప్రత్యేకత ఏమిటంటే?
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పు కనుమ అడవుల్లో ఈ కాలంలో ప్రకృతి సిద్ధంగా విరివిగా కనిపించే కొండమామిడి కాయలు అంటే ఇష్టపడని వారుండరు. ఇవి పక్వానికి వచ్చి పండుగా మారేందుకు మరో 20 రోజులు పడుతుంది. రైతులు సాగు చేసే సాధారణ రకాలకు సంబంధించి దిగుబడి గణనీయంగా పడిపోయింది. కలెక్టర్, బంగినపల్లి, రసాల రకాలకు చెంది కాపు ఏటా కన్నా ఈ ఏడాది బాగా తగ్గింది. అక్కడక్కడ కలెక్టర్ రకం కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అటవీప్రాంతంలో మాత్రం అడవి మామిడి చెట్లు మాత్రం విరగ్గాశాయి. పక్వానికి రాగానే వాటికవే చెట్ల పైనుంచి నేలరాలతాయి. మంచి సువాసనతో నోరూరించే ఈ పండ్లను తినేందుకు పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తి చూపుతారు. చదవండి: Viral Video: సెల్ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి.. పండ్లు కాయలు ఆకుపచ్చ రంగులోనే ఉండటం వీటి ప్రత్యేకత. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ మామిడి పండ్లకు స్థానికంగా మంచి గిరాకీ. ఏమాత్రం పచ్చిగా ఉన్నా నోట్లో పెట్టలేనంత పుల్లగా వుంటాయి. పీచు ఎక్కువ. గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. వేసవిలో పిల్లలు ఈ చెట్ల కిందనే ఎక్కువ సమయం గడుపుతారు. మండలంలోని కిమ్మిలిగెడ్డ, అమ్మిరేఖల, కొత్తవీధి, లోదొడ్డి తదితర లోతట్టు ప్రాంతాల్లో కొండమామిడి చెట్లకు కొదవలేదు. కిమ్మిలిగెడ్డ సమీపాన రక్షిత అడవుల్లో ఇవి గుబురు గుబురుగా, ఎత్తుగా పెరిగి కనిపిస్తాయి. ఆవకాయకు బహుబాగు కొండమామిడి కాయలు ఆవకాయకు బాగుంటాయని చెబుతుంటారు. ఈ కాయలకు టెంక పెద్దది, గుజ్జు పీచు కట్టి ఉన్నందున ముక్కలు బాగా వస్తాయని, పులుపు ఎక్కువ కనుక ఆవకాయ పచ్చడికి శ్రేష్టమని గృహిణులు చెబుతారు. సాధారణ మామిడి రకాలు అందుబాటులో లేని కారణంగా ఈ ఏడాది ఇక కొండమామిడి కాయలపైనే ఆధారపడాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. -
తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. రుచికరమైన ఆవకాయ రెసిపీ!
బెల్లం ఆవకాయను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. మరి ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! బెల్లం ఆవకాయ తయారీకి కావలసినవి: ►తోతాపురి మామిడికాయలు – ఐదు ►బెల్లం – అరకేజీ ►నువ్వులనూనె – పావుకేజీ ►ఆవాలు – పావు కేజీ ►కారం – కప్పు, ఉప్పు – కప్పు ►మెంతులు – రెండు టీస్పూన్లు ►పసుపు – రెండు టీస్పూన్లు ►ఇంగువ – అరటీస్పూను ►తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు – కప్పు. బెల్లం ఆవకాయ తయారీ విధానం ►ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి. ►కాయల్లో జీడి తీసేసి ముక్కలు చేసుకోవాలి. టెంకపైన ఉన్న జీడిపొరను తీసేసి శుభ్రంగా తుడవాలి. ►ఆవాలు, మెంతులను గంటపాటు ఎండబెట్టి పొడిచేసుకోవాలి ►ఇప్పుడు పెద్ద గిన్నెతీసుకుని ఆవపొడి, పసుపు, మెంతి పిండి, కారం, ఉప్పు వేసి కలపాలి. ►ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తురిమి వేయాలి. దీనిలో ఇంగువ కూడా వేసి చక్కగా కలపాలి. ►ఇప్పుడు మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో కలపాలి. ►తర్వాత కొద్దిగా ఆయిల్ తీసి పక్కనపెట్టి, మిగతా ఆయిల్ వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పొడి జాడీలో వేసి పైన మిగతా ఆయిల్ వేయాలి. ►మూడు రోజుల తరువాత పచ్చడిని ఒకసారి కలపాలి, జాడీలో నిల్వచేసుకోవాలి. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా రెసిపీ -
Summer: పచ్చిమామిడికాయ ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకుంటే..
Summer Drinks: వేసవి అంటే మామిడి పండ్ల సీజన్. కేవలం పండ్లతోనే కాదు.. పచ్చి మామిడితోనూ ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ►పచ్చిమామిడికాయ ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు బయటకు పోకుండా ఉంటుంది. ►అంతేగాక శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. ►దీనితో తయారు చేసే కచ్చీకేరి షర్బత్ షర్బత్లో పుష్కలంగా సి విటమిన్ ఉండడం వల్ల, సి విటమిన్ లోపం వల్ల వచ్చే స్కర్వి వ్యాధిని ఈ డ్రింక్ నిరోధిస్తుంది. ►వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట రూపంలో చాలా నీరు పోతుంది. ఈ నీటిలో కీలకమైన ఖనిజ పోషకాలు ఐరన్, సోడియం, క్లోరైడ్లు కూడా బయటకు వెళ్లి పోతాయి. ►పచ్చిమామిడి ఈ పోషకాలను బయటకు పోనీయకుండా నియంత్రిస్తుంది. ►అజీర్ణం, డయేరియా వంటి ఉదర సమస్యలు ఈ షర్బత్ తాగితే తగ్గుతాయి. ►పచ్చిమామిడి రక్తహీనత, క్యాన్సర్, అధిక రక్తస్రావాన్ని నిరోధించడంతోపాటు, రోగనిరోధక వ్యవస్థను మరింత దృఢంగా మారుస్తుంది. ►పచ్చిమామిడి కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ►దంతాలు, చిగుళ్లను కూడా రక్షిస్తుంది. ►నోటి నుంచి వెలువడే దుర్వాసనను రానివ్వదు. ►మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న పచ్చి మామిడితో కచ్చీకేరి షర్బత్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! కచ్చీకేరి షర్బత్ తయారీకి కావలసినవి: తొక్కతీసిన పచ్చిమామిడికాయ ముక్కలు – అరకప్పు, పుదీనా ఆకులు – పది, పంచదార – టీస్పూను, వేయించిన జీలకర్ర పొడి – టీస్పూను, రాక్సాల్ట్ – టీస్పూను, నీళ్లు – మూడు కప్పులు, ఐస్క్యూబ్స్ – ఆరు. తయారీ: ►మామిడికాయ ముక్కలు, పంచదార, పుదీనా ఆకులు, జీలకర్ర పొడి , రాక్సాల్ట్ను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి ►ఈ మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్ని గ్లాస్లో తీసుకుని ఐస్క్యూబ్స్ వేసుకుంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన సమ్మర్ డ్రింక్ కచ్చీ కేరి షర్బత్ రెడీ. వేసవిలో ట్రై చేయండి: Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల! -
Recipes: జ్యూసీ చికెన్.. మటన్ మామిడి మసాలా.. ఇలా ఈజీగా వండేయండి!
మార్కెట్లన్నింటిని ఆక్రమించి తెగ సందడి చేస్తోన్న మామిడికాయలతో ఆవకాయ, పులిహోరలేగాక, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్తో కలిపి వండుకుంటే రుచికి రుచితోపాటు, మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. కాస్త పుల్లగా, మసాలా ఘాటుతో జ్యూసీగా ఉండే వెరైటీ వంటకాలను మామిడితో ఎలా వండుకోవచ్చో చూద్దాం.... జ్యూసీ చికెన్ కావలసినవి: చికెన్ ముక్కలు – అరకేజీ, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, యాలుక్కాయలు – ఆరు, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ధనియాలపొడి – టీస్పూను, గరం మసాలా – టీస్పూను ఉల్లిపాయ – ఒకటి ( ముక్కలు తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – రెండు(సన్నగా తరగాలి), టొమాటో ప్యూరీ – పావు కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తొక్కతీసిన పచ్చి మామిడికాయ ముక్కలు – ముప్పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు. మసాలా పేస్టు: ఉల్లిపాయలు – రెండు, వెల్లుల్లి రెబ్బలు – రెండు, కారం – రెండు టీస్పూన్లు, పసుపు – టీస్పూను, ఎండు మిర్చి – పది, సోంపు – రెండు టీస్పూన్లు, పెరుగు – పావు కప్పు. తయారీ.. మసాలా పేస్టుకోసం తీసుకున్న వాటిలో పెరుగు తప్ప, మిగతా వాటన్నింటిని బ్లెండర్లో వేసి పేస్టులా రుబ్బుకోవాలి. తరువాత గ్రైండ్ అయిన మిశ్రమంలో పెరుగు కలపాలి ∙చికెన్ను శుభ్రంగా కడిగి ఈ మసాలా పేస్టు పట్టించి రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి స్టవ్ మీద కూర వండడానికి బాణలి పెట్టుకుని ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తరువత యాలకులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, చికెన్ పట్టించగా మిగిలిన మసాలా పేస్టు, టొమాటో ప్యూరీ వేసి పదినిమిషాలపాటు వేయించాలి ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా, వెల్లుల్లి తురుము వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత నానబెట్టుకున్న చికెన్, మామిడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి సన్నని మంట మీద అరగంట మగ్గనివ్వాలి అరగంట తరువాత కొబ్బరి క్రీమ్, కొత్తిమీర చల్లుకుని ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ మీద నుంచి దించేయాలి. మటన్ మామిడి మసాలా కావలసినవి: మటన్ – అరకేజీ, పచ్చిమామిడికాయ – ఒకటి, ఆయిల్ – పావు కప్పు, పచ్చిమిర్చి – రెండు, ఉల్లిపాయ తరుగు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టేబుల్ స్పూన్లు, కారం – రెండు టేబుల్ స్పూన్లు, గరం మసాలా – టీస్పూను, పసుపు – అరటీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు. తయారీ.. ∙ ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ∙మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరగాలి. ∙స్టవ్ మీద కుకర్ గిన్నెపెట్టి, ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఈ ఆయిల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి దోరగా వేయించాలి ఇవన్నీ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ∙ ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి నాలుగు విజిల్స్ను రానివ్వాలి ∙ మటన్ ముక్క మెత్తగా ఉడికిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి తిప్పి మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తరువాత కూరకు సరిపడా నీళ్లు, మామిడికాయ ముక్కలను వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి మామిడికాయ ముక్కలు మెత్తబడిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. అనప గింజల చారు కావలసినవి: లేత పాలకూర – రెండు కట్టలు, అనపగింజలు – కప్పు, కొత్తి మీర – చిన్న కట్ట, ఉల్లిపాయ – ఒకటి, టొమాటోలు – రెండు, పచ్చిమామిడికాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి – ఐదు, వెల్లుల్లి రెబ్బలు – ఐదు, కరివేపాకు – నాలుగు రెమ్మలు, పసుపు – అరటీస్పూను ధనియాల పొడి – టేబుల్ స్పూను, కారం – ఒకటిన్న టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, మినపప్పు – అరటీస్పూను, జీలకర్ర – టీస్పూను, ఎండు మిర్చి – మూడు, ఇంగువ – పావు టీస్పూను, ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. పాలకూర, కొత్తమీర, ఉల్లిపాయ, టొమాటోలు, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తురుముకోవాలి కుకర్ గిన్నెలో కప్పు నీళ్లుపోసి అనపగింజలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, మామిడి కాయ, వెల్లుల్లి తురుము, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి దీనిలో మరో అరకప్పు నీళ్లుపోసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్ వచ్చాక మూతతీసి పాలకూర, ఉప్పు వేసి మరో రెండు విజిల్స్ రానివ్వాలి ∙ ఇప్పుడు కుకర్ మూత తీసి రసానికి సరిపడా నీళ్లుపోయాలి ∙స్టవ్ మీద తాలింపు కోసం మరో బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఇది వేడెక్కిన తరువాత తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, తరువాత రసంలో వేసి కలుపుకుంటే చారు రెడీ. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా -
Summer Drinks: మ్యాంగో మస్తానీ.. ఇందులోని సెలీనియం వల్ల..
Summer Drinks- Mango Mastani Recipe: మంచి ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక మ్యాంగో మస్తానీ తాగితే దాహం తీరుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మస్తానీ తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఈ ఒక్క జ్యూస్ తాగడం వల్ల.. విటమిన్ ఎ, బి2, బి6, బి12, సి, డి, క్యాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీచుపదార్థం, ఫోలేట్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియంలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. మ్యాంగో మస్తానీ తయారీకి కావాల్సినవి: మామిడి పండు ముక్కలు – కప్పు, చల్లటి క్రీమ్ మిల్క్ – కప్పు, జాజికాయ పొడి – చిటికెడు, ఐస్క్యూబ్స్ – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఐస్క్రీమ్ – రెండు స్కూపులు, చెర్రీ, పిస్తా, బాదం పప్పు, టూటీప్రూటీ, మామిడి ముక్కలు – గార్నిష్కు సరిపడా, ఉప్పు – చిటికెడు. మ్యాంగో మస్తానీ తయారీ విధానం: ►మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►దీనిలో పంచదార, జాజికాయ పొడి, ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. ►ఈ ప్యూరీలో పాలు, ఐస్క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంగుళం గ్యాప్ ఉండేలా గ్లాసులో పోయాలి. ►గ్లాసులో గ్యాప్ ఉన్న దగ్గర ఐస్క్రీమ్, మామిడి పండు ముక్కలు, డ్రైఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే.. -
Recipes: నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా!
అమ్మను, ఆవకాయను ఎప్పటికీ మర్చిపోలేమని తెలుగువారి నోటి నుంచి కామన్గా వినిపించే మాట. వంటల్లో ఏది బోర్ కొట్టినా ఆవకాయ మాత్రం ఎన్నిసార్లు తిన్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అన్నంలో పప్పు, నెయ్యి ఆవకాయ కలుపుకుని తింటే స్వర్గానికి బెత్తెడు దూరమే అన్నట్టు ఉంటుంది. పెరుగన్నంలో ఆవకాయ ముక్కను నంచుకుంటే అమృతంలా అనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లన్నీ నోరూరించే మామిడి కాయలు కళ కళలాడిపోతున్నాయి. మరోవైపు మహిళలంతా జాడీలను సిద్ధం చేసుకుని ఆవకాయ పెట్టడానికి హడావుడి పడుతున్నారు. ఏడాదిపాటు నిల్వ ఉండేలా వివిధ రకాల ఆవకాయలను ఎలా పడతారో చూద్దాం.... నువ్వుల ఆవకాయ కావలసినవి పచ్చిమామిడికాయ ముక్కలు – రెండు కేజీలు, నువ్వుపప్పు నూనె – కేజీ, జీలకర్ర – టేబుల్ స్పూను, మెంతులు – టేబుల్ స్పూను, ఆవాలు – టేబుల్ స్పూను, అల్లం – పావు కేజీ, వెల్లుల్లి – పావుకేజీ, కల్లుప్పు – అరకేజీ, ఆవపిండి – 200 గ్రాములు, నువ్వుపిండి – ఆరకేజీ, జీలకర్ర పొడి – వందగ్రాములు, మెంతిపిండి – రెండు టీస్పూన్లు, పసుపు – రెండు టీస్పూన్లు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – అరకప్పు. తయారీ.. ముందుగా మామిడికాయ ముక్కల టెంక మీద ఉన్న సన్నని పొరను తీసేసి పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకుని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని తొక్క తీసి శుభ్రంగా కడిగి పేస్టుచేసి పక్కనపెట్టుకోవాలి. బాణలిని స్టవ్ మీద పెట్టి వేడెక్కిన తరువాత కేజీ నూనె పోయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించి బాణలిని స్టవ్ మీద నుంచి దించేసి పక్కనపెట్టుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్టు వేసి తిప్పి చల్లారనివ్వాలి. కల్లుప్పుని గంటపాటు ఎండబెట్టి మిక్సీపట్టి మామిడికాయ ముక్కల్లో వేయాలి, దీనిలో ఆవపిండి, నువ్వుపిండి, జీలకర్రపొడి, మెంతిపిండి, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో చక్కగా కలుపుకోవాలి. పొడులన్నీ కలిపాక పూర్తిగా చల్లారిన ఆయిల్ మిశ్రమం వేసి చక్కగా కలుపుకోవాలి. పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ సరిపోనట్లు కనిపిస్తుంది కానీ, మూడు రోజులకు ఆయిల్ పైకి తేలుతుంది. మూడోరోజు మూత తీసి పచ్చడిని మరోమారు కిందినుంచి పైదాకా బాగా కలుపుకోవాలి. ఉప్పు, ఆయిల్ సరిపోకపోతే ఇప్పుడు కలుపుకుని, గాజు లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకోవాలి. తొక్కుడు పచ్చడి కావలసినవి పచ్చిమామిడికాయలు – నాలుగు, ఉప్పు – అరకప్పు, పసుపు – టీస్పూను, ఆవపిండి – రెండు టేబుల్ స్పూన్లు, ఆవపిండి – టీస్పూను, కారం – ముప్పావు కప్పు, పప్పునూనె – ఒకటిన్నర కప్పులు, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, ఆవాలు– పావు టీస్పూను , ఇంగువ – టీస్పూను. తయారీ.. మామిడికాయలను తొక్కతీసి ముక్కలుగా తరిగి మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తురుముని కప్పుతో కొలుచుకోవాలి. ఇది మూడు కప్పులు అవుతుంది. ఈ తురుములో పసుపు, ఉప్పు వేసి కలిపి ఒకరోజంతా పక్కన పెట్టుకోవాలి. మరుసటిరోజు ఊరిన ఊటను వడగట్టి ఊటను వేరు వేరుగా, తురుముని విడివిడిగా ఎండబెట్టాలి. ఎండిన తురుముని ఊటలో వేసి బాగా కలపాలి. నూనెను వేడెక్కిన తరువాత ఆవాలు, వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచుకుని వేయాలి. ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. నూనెను చల్లారనివ్వాలి. ఇప్పుడు ఎండిన తురుములో కారం, ఆవపిండి, మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక చల్లారిన నూనె వేసి కలపాలి. ఉప్పు, నూనె తగ్గితే, కలుపుకొని, జాడీలో నిల్వ చేసుకోవాలి. చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
మ్యాంగో కోకోనట్ కొలడా.. వేసవిలో అదిరిపోయే డ్రింక్
కావలసినవి: మామిడిపండు ముక్కలు – కప్పు, కొబ్బరి నీళ్లు – కప్పు, కొబ్బరి క్రీమ్ – అరకప్పు, తులసి ఆకులు – మూడు, పంచదార – టీస్పూను, ఐస్ క్యూబ్స్ – ఐదు. తయారీ: గ్లాసులో తులసి ఆకులు, పంచదార వేసి పక్కన పెట్టుకోవాలి మామిడిపండు ముక్కలు, ఐస్క్యూబ్స్, కొబ్బరి నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తులసి ఆకులున్న గ్లాసులో పోయాలి ఈ గ్లాసులో కొబ్బరి క్రీమ్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలోæ వెంటనే దాహం తీర్చేవాటిలో మ్యాంగో కోకోనట్ కొలడా ఒకటి. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, మామిడిలోని పొటాషియం స్థాయులు రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. -
రికార్డు స్థాయిలో ధరలు.. ఆమ్చూర్ క్వింటాలుకు రూ.36,900..కారణమిదే!
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్చూర్ ధర రికార్డు స్థాయిలో మంగళవారం క్వింటాలుకు రూ.36,900 పలికింది. మామిడి కాత తక్కువగా ఉండటంతో ఈ ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే ఆమ్చూర్ కొనుగోళ్లు జరుగుతాయి. మార్కెట్ యార్డుకు నల్లగొండ, మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కర్ణాటక రాష్ట్రం ఔరాద్ నుంచి మొత్తం 373 క్వింటాళ్ల ఆమ్చూర్ నిజామాబాద్ మార్కెట్కు వచ్చింది. ఈ నెలాఖరుకు ఆమ్చూర్ క్వింటాలు ధర రూ.40 వేల పైచిలుకు పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో ఇతర దేశాల్లో చింతపండుకు బదులుగా పులుపుకోసం ఆమ్చూర్ను వాడుతారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ -
రైతులే నేరుగా విక్రయించుకునేలా సరికొత్త వెబ్సైట్
Mangoes Doorstep-Delivery: కర్నాటక ప్రభుత్వం ఎటువంటి మధ్యవర్తుల అవసరం లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు మామిడి పండ్లను విక్రయించడానికి సరి కొత్త పోర్టల్ను ప్రారంభించింది. మామిడి అత్యంత రుచికరమైన పండ్లలో ఒకటి. పైగా వేసవిలో విరివిగా లభించేది కూడా. దేశ వ్యాప్తంగా వందలాది మామిడి రకాలు ఉన్నాయి. ఐతే వాటిలో స్థానికంగా ప్రసిద్ధి చెందినవి సేకరించడం కష్టం. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ సమస్యకు చెక్పెట్టేలా సరికొత్త వెబ్సెట్ను ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రంలో పండించే స్థానిక రకాల మామిడి పండ్లను ఆన్లైన్ మాధ్యమం ద్వారా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా కర్ణాటక స్టేట్ మ్యాంగో డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మే 16న మధ్యవర్తులు లేకుండా ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు మార్కెట్ చేయడానికి వెబ్సైట్ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లతో రైతులు నేరుగా కనెక్ట్ అవ్వడమే కాకుండా మంచి తాజా పళ్లను కూడా పొందగలుగుతారు. ఈ ఆన్లైన్ పోర్టల్ కర్ణాటక ట్రేడ్మార్క్ కర్సిరి మాంగోస్ పేరుతో వెళ్తోంది. దీంతో వినియోగదారులు కనిష్ట ధరతో వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడిన రుచికరమైన తాజా మామిడి పళ్లను ఆస్వాదించగలుగుతారు. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
మ్యాంగో మ్యాగీ.. ‘దేవుడా! నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’
Mango Maggi Video: వంటకాలపై ఎప్పటికప్పుడు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కొత్త కొత్త వెరైటీలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని వెరైటీలను చూస్తే మాత్రం ఇదెక్కడి విచిత్రమని అనిపిస్తుంది. ‘ఇలా ఎవరైనా చేస్తారా?’అని అడగాలనిపిస్తుంది. అలాంటి వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరలైంది. అదే ‘మ్యాంగో మ్యాగీ’. మీరు విన్నది నిజమే. మ్యాగీని ముప్పుతిప్పలు పెట్టి చేసిన ఈ వెరైటీ వంటకం గురించి మీరూ తెలుసుకోవాల్సిందే. వీడియోలో ముందుగా.. ఫ్రై చేసే పెనంపై ఓ మహిళ మ్యాగీ నూడుల్స్ను వేసి, నీళ్లు పోసి మ్యాజిక్ మసాలా వేసింది. ఆ తర్వాత మ్యాంగో స్లైస్ బాటిల్ లోంచి జ్యూస్ను ఆ వంట కంలో పోసింది. వంటకమయ్యాక మామిడి ముక్కలను దానిపై చల్లి అందించింది. ఈ మ్యాం గో మ్యాగీ తయారీ వీడియోను ఒకరు పోస్ట్ చేయగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘ఆ లొకేషన్ ఎక్కడో చెప్పరా. ఆ వంటకం చేసిన వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఎవరైనా వెళ్తారు’అని ఒకరు.. ‘మీరు నరకానికి వెళ్తారు’అని మరొకరు, ‘దేవుడా.. నన్ను వేరే గ్రహానికి పంపెయ్యవా’అని ఇంకొకరు కామెంట్లు పెట్టారు. Mango Maggi kha lo doston.🙌🏼 pic.twitter.com/4fY2HWJumV — Professor D (@RetardedHurt) May 13, 2022 -
పూత నిలబడక.. కాత తగ్గి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మామిడి పండ్ల దిగుబడి బాగా పడిపోయింది. పూత ఆలస్యంగా రావడం, ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణం అనుకూలంగా లేకపోవడం, పూత నిలబడకపోవడంతో దిగుబడులు తగ్గాయని ఉద్యాన శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల్లో మామిడి తోట లున్నాయి. సాధారణంగా ఎకరానికి 3.5 టన్నుల నుంచి 4.5 టన్నుల వరకు మామిడి దిగుబడి కావాలి. అంటే 12 లక్షల నుంచి 13 లక్షల టన్నుల వరకు రాష్ట్రంలో మామిడి ఉత్పత్తి అవుతుందని అధికారు లు అంచనా వేశారు. కానీ, ఈసారి ఏడున్నర లక్షల వరకే మామిడి దిగుబడి పరిమితం అవుతుందని ఉద్యాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. రూ.లక్షన్నర నుంచి రూ.62 వేలకు తగ్గిన ధర సహజంగా మామిడి ఉత్పత్తి సగానికిపైగా తగ్గిన నేపథ్యంలో డిమాండ్ ప్రకారం ధరలు పెరగాలి. కానీ రైతుకు ఆ ధరలు అందడంలేదు. గత నెల గడ్డిఅన్నారం మార్కెట్లో టన్నుకు రూ. లక్షన్నర పలికిన మామిడి ధర, శుక్రవారం గరిష్టంగా రూ. 62 వేలకు పడిపోయింది. కనిష్టంగా రూ. 20 వేలు మాత్రమే ఉండటం శోచనీయం. మోడల్ ధర రూ.37 వేలు మాత్రమే ఉంది. వ్యాపారులు అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రకం పావు వంతు ధర కూడా పలకని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితమైతే ఒకానొకసారి అదే గడ్డిఅన్నారం మార్కెట్లో మామిడి ధర టన్నుకు రూ. 1.87 లక్షలు పలికింది. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలు తప్ప మరేమీ మిగలడంలేదు. మరోవైపు వినియోగదారులకు ఏమైనా తగ్గి ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఒకవైపు రైతును, మరోవైపు వినియోగదారులను ఎడాపెడా దోచేస్తున్నారు. ప్రస్తుతం రైతుల నుంచి టన్నుకు సరాసరి రూ.40 వేలకు కొంటున్న వ్యాపారులు, వినియోగదారుల నుంచి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి పండ్లు రూ.40 వరకు ఉండాలి. కానీ, మార్కెట్లో ఏకంగా రూ. 100 పలుకుతోంది. కొన్ని రకాలైతే రూ. 150–200 వరకూ వసూలు చేస్తున్నారు. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తోంది. మార్కెట్లను వారు తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వినియోగదారులు కూడా ఎవరినీ ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడమే ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్నట్లు చెబుతున్నారు. -
నోరూరించే మామిడిపండ్లు.. తీపి వెనుక దాగున్న చేదు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
సాక్షి,ఆమదాలవలస రూరల్: వేసవి సీజన్ కావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా మామిడిపండ్లే. ఎటువంటి మచ్చలు లేకుండా, చూడటానికి ఎంతో నాణ్యంగా ఉన్నా చాలావరకు అవి కృత్రిమంగా మగ్గబెట్టినవే. సహజసిద్ధంగా పండిన ఫలాల్లో మాత్రమే పోషకాలు ఉంటాయని, పక్వానికి రాని పండ్లను కృత్రిమ పద్ధతుల్లో రసాయనాలను వినియోగించి మగ్గబెట్టిన పండ్లను తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు వ్యాపారులు లాభార్జనే ద్యేయంగా ఆరోగ్యానిచ్చే పండ్లలో రసాయనాలు వినియోగించి ప్రజలకు అమ్మేస్తున్నారు. పైకి నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే ఈ పండ్లను కొనుగోలు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజారోగ్యం గురించి కనీసం పట్టించుకోని అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలతోనే అడ్డుకట్ట.. మధురానుభూతిని కలిగించే మధుర ఫలాల వెనుక దాగి ఉన్న చేదు నిజాన్ని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండ్లపై కార్బైడ్ వాడకాన్ని ప్రభు త్వం నిషేధించినా, కోర్టు లు ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో వాటిని అమ లు చేసేవారే లేరు. దీంతో కొందరు వ్యాపా రులు పక్వానికి రాక ముందే పచ్చికాయలు కోసేసి వాటికి రసాయనా లు వినియోగించి పండ్లుగా మారుస్తున్నారు. గదిలో కార్సైడ్ వేసి మగ్గ పెట్టడం లేదా పొగపెట్టి మగ్గపెట్టడం, ఇథనాల్ వంటి రసాయనాల్లో ముంచి పచ్చికాయలను పండ్లుగా మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మామిడి సీజన్ కావడంతో వాటిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తోటల్లోనే కార్బైడ్, ఇథనాల్ వంటి రసాయనాలతో మాగబెట్టి రంగు తేలిన పండ్లను బహిరంగ మార్కెట్లో విచ్చ లవిడిగా విక్రయిస్తు న్నారు. రసాయనాలతో వినియోగించి మాగబెడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నా రు. అధికారులు స్పందించి గోదాములు, తోటల్లోని గదుల్లో తనిఖీలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. రసాయనాలతో మాగబట్టిన పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. స్వచ్ఛమైన పండ్లు తింటే ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి. పండ్లు త్వరగా పక్వానికి రావడం కోసం రకరకాల రసాయనాలను వినియోగిస్తుంటారు. వీటి వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతిని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రసాయనాలు కలిపిన ఎటువంటి పదార్థాలూ తీసుకోకపోవడం ఉత్తమం. – పేడాడ రాజశేఖర్, వైద్యాధికారి, అక్కులపేట పీహెచ్సీ, ఆమదాలవలస మండలం చదవండి: Cholesterol: శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు? -
ఇంటికెళ్లి.. మామిడిపండ్లు అందించి..
నిజాంపేట్: విశ్వసనీయతకు మారుపేరైన టీఎస్ ఆర్టీసీ కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్ సేవలను మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా మొట్టమొదటి మ్యాంగో ప్యాకెట్ను బాచుపల్లి కౌసల్య కాలనీలోని ఎన్జేఆర్ సుఖీ–9లో నివాసముంటున్న మల్లిపూడి కిరణ్రాజ్, హేమలత దంపతుల గృహానికి సజ్జనార్ స్వయంగా వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రారంభించిన కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్ ద్వారా ప్రసిద్ధి చెందిన జగిత్యాల బంగినపల్లి మామిడి పండ్లను అందిస్తున్నామని, కొనుగోలు దారులు 5 కిలోలకు తక్కువ కాకుండా ఆన్లైన్ (tsrtcparcel.in)లో బుక్ చేసుకుంటే 4 రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే కార్గో మ్యాంగో ఎక్స్ప్రెస్లో 12 వేల మంది మామిడి పండ్లను బుక్ చేసుకున్నారని చెప్పారు. -
ఆహా ఏమి రుచి.. ఆత్రేయపురం మామిడి తాండ్ర..
ఆత్రేయపురం(కోనసీమ జిల్లా): రుచికి.. శుచికి.. తియ్యని మామిడి తాండ్రకు కేరాఫ్ అడ్రస్గా ఆత్రేయపురం పేరు గాంచింది. చుట్టూ పచ్చని పొలాలు.. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ గ్రామం తాండ్ర తయారీలో ప్రసిద్ధి పొందింది. అనేక మంది ప్రజలు దీనినే వృత్తిగా మార్చుకుని జీవనోపాధి పొందుతున్నారు. తియ్యని లాభాలు ఆర్జిస్తున్నారు. ఏటా వేసవి వచ్చిందంటే తాండ్ర తయారీలో ప్రజలు నిమగ్నమవుతుంటారు. సుమారు 500 కుటుంబాల వారు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాటి చాపలపై మామిడి తాండ్ర పూస్తుంటారు. ఈ మూడు నెలలూ అనేక మందికి జీవనోపాధి కలి్పస్తుంటారు. ఇప్పుడు తయారు చేసిన తాండ్రను నిల్వ ఉంచి, ఏడాది పొడవునా విక్రయిస్తూంటారు. 60 టన్నులు.. రూ.66 లక్షలు ప్రస్తుత సీజన్లో ఆత్రేయపురం కేంద్రంగా సుమారు రూ.66 లక్షల విలువైన 60 టన్నుల మామిడి తాండ్ర తయారవుతోంది. దీని తయారీకి అవసరమైన మామిడి కాయలను నూజివీడు, సత్తుపల్లి, కోరుకొండ, గోకవరం, తుని, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టర్ రకం మామిడినే తాండ్ర తయారీకి వాడుతుంటారు. ఆత్రేయపురానికి రోజూ రెండు లారీల చొప్పున మామిడి కాయలు తీసుకొస్తుంటారు. దిగుమతి చేసుకున్న మామిడి కాయలను కావు వేసి పండ్లుగా తయారు చేస్తారు. గుజ్జు తీసి.. చక్కెర వేసి.. పండిన మామిడి నుంచి గుజ్జు తీస్తారు. ఆ గుజ్జులో తగు పాళ్లలో పంచదార కలుపుతారు. తర్వాత ఎండలో ఉంచిన తాటి చాపలపై కూలీల సాయంతో ఒక్కో పొరను పూస్తారు. ఇలా రోజుకు ఒక్కో పొర చొప్పున ఐదారు పొరలు పూసిన అనంతరం మామిడి తాండ్ర తయారవుతుంది. మామిడి తాండ్ర పూసిన తాటి చాపలు వారం రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అనంతరం ఆరంగుళాల పొడవు, వెడల్పు ఉండేలా ముక్కలు కోసి తిరిగి ఎండబెట్టి విక్రయాలకు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మామిడి ధరలతో తాండ్ర తయారీ తలకు మించిన భారంగా మారిందని తయారీదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో గుబులు ప్రస్తుతం మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే ఉండటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. టన్ను మామిడి కాయల ధర రూ.18 వేలు, పంచదార క్వింటాల్ రూ.3,800 పలుకుతుండటంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో సామాన్యులు మామిడి తాండ్ర తయారీకి ముందుకు వెళ్లే పరిస్థితులు లేవని తయారీదారుడు కఠారి సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. టన్ను మామిడి కాయలతో 250 కిలోల తాండ్ర తయారవుతుండగా.. ప్రస్తుత ధరల ప్రకారం, కూలీల ఖర్చులతో కలసి సుమారు రూ.25 వేల వరకూ అవుతోంది. ఈ పరిస్థితుల్లో కిలో తాండ్రను రూ.150 నుంచి రూ.200 వరకూ అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడి నుంచి విదేశాలకూ.. ఆత్రేయపురంలో తయారైన మామిడి తాండ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా గ్రామానికి అంతర్జాతీయంగా పేరు తెస్తున్నారు. శ్రమనే దైవంగా నమ్ముకుని ఆత్రేయపురం పరిసర ప్రాంతాల ప్రజలు మామిడి తాండ్ర తయారీలో నిమగ్నమవుతున్నారు. లాభాలు ఆర్జించడంతో పాటు గ్రామానికి గుర్తింపు తీసుకురావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది తక్కువ రేటు మామిడి తాండ్ర పుట్టిన ప్రాంతంగా ఆత్రేయపురం ఖ్యాతికెక్కింది. వేసవిలో టన్నుల కొద్దీ మామిడి కాయలను కొనుగోలు చేసి, తాండ్ర తయారు చేస్తారు. దీనిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది మామిడికాయలు తక్కువ రావడంతో రేటు కూడా ఎక్కువగా ఉంది. తాండ్ర తయారు చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. – కఠారి సురేష్, ఆత్రేయపురం ప్రభుత్వం చేయూతనివ్వాలి ఈ ప్రాంతంలో ఎందరో మహిళలు ఉపాధి పొందుతున్న మామిడి తాండ్ర తయారీకి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలి. అలాగే ఈ ప్రాంతంలో స్టాల్స్ నిర్మించుకోవడానికి, నాణ్యమైన సరుకులు కొనుగోలు చేయడానికి సాయం అందించాలి. -చిలువూరి చిన వెంకట్రాజు, ఆత్రేయపురం -
Beauty Tips: మామిడి, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం!
Beauty Tips In Telugu- Mango Scrub Benefits: వేసవిలో లభించే పండ్లలో దాదాపు అందరికీ ఇష్టమైనది మామిడి. పండ్లలో రారాజైన మామిడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, మామిడిలో కేవలం అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలే కాదు అందాన్ని ఇనుమడింపజేసే లక్షణాలు కూడా ఉన్నాయి. మామిడితో ఈ స్క్రబ్ ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది. మామిడి స్క్రబ్.. ట్యాన్ మాయం! ►నాలుగు టేబుల్ స్పూన్ల మామిడి పండ్ల గుజ్జులో మూడు టేబుల్ స్పూన్ల ఓట్స్, రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడి వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ►ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. ►ముఖం మీద మచ్చలు, ట్యాన్ను ఈ స్క్రబ్ చక్కగా తొలగిస్తుంది. ►మామిడి, ఓట్స్ను కలిపిన ఈ స్క్రబ్ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. ►వారానికి మూడుసార్లు ఈ స్క్రబ్ వాడితే మంచి ఫలితం వస్తుంది. చదవండి👉🏾Vitamin B12: విటమిన్ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే.. చదవండి👉🏾Hair Care Tips: వాల్నట్స్ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్ వల్ల -
అయ్యో రాములు.. గిట్లయితే ఎట్ల! కొమ్మ విరగాల్నా? కాయ రాలాల్నా?
ఈ రైతు రాములు. కోహెడలో 6 ఎకరాల మామిడి తోట ఉండగా మరో ఐదున్నర ఎకరాల తోట లీజుకు తీసుకున్నాడు. లక్షా70వేలు లీజు కాగా అతని తోటకు 2లక్షల వరకు లీజు వస్తుంది. ఈ లెక్కన 3.70లక్షలు లీజుకే ఖర్చు కాగా 5టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. అంటే కిలో రూ.45 లెక్క కట్టగా రూ.2.25లక్షలే వచ్చింది. అంటే లీజు ఖర్చే రాలేదు. మరో టన్ను వరకు వస్తుందనుకున్నా కాత ఈదురుగాలులతో నేలరాలింది. ముందే మంచు తేనె రోగం ముంచగా నష్టం తీవ్రంగా ఉందని ఉద్యానఅధికారులను కలిస్తే వారు చెప్పిన నిబంధనలతో నిరాశగా వెనుదిరిగాడు. కరీంనగర్ అర్బన్: ఇది కేవలం రాములు సమస్యే కాదు జిల్లాలో వేలమంది రైతులది ఇదే పరిస్థితి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది నష్టపరిహారం పరిస్థితి. అసలే మంచు తేనే నిండా ముంచగా వచ్చిన అరకొర మామిడి కాయలను ఈదురుగాలులు నేలపాలుచేశాయి. ఎన్నడూ లేనివిధంగా పూత తగ్గగా దిగుబడిపై దిగులు పడ్డ రైతన్నకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. కనీసం ప్రభుత్వం నుంచి నష్టపరిహారమైనా వస్తుందని ఆశిస్తే నిబంధనలు కొరకరాని కొయ్యగా మారాయి. 33శాతం నష్టం నిబంధన వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. 33శాతం నష్టం జరగాలంటే కొమ్మలు విరగాలట.. కాయలు రాలాలట. అరకొర కాత రాలితే నష్టం జరిగినట్లు కాదట. గతంలో 50శాతం పంట నష్టం జరిగితే పరిహారానికి అర్హులుగా పరిగణించేవారు. ఒక రైతుకు ఎకరం మామిడి తోట ఉంటే అందులో 50శాతం నష్టపోయి ఉండాలి. అంటే కూకటి వేళ్లతో చెట్లు కూలడం, కొమ్మలు విరగడం, కాయలు సగానికి పైగా రాలితే పరిహారం దక్కేది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 50శాతం నుంచి 33శాతానికి తగ్గించింది. అరకొర పండిన పంటను విక్రయించాలంటే ధర కిలో రూ.40–50మాత్రమే పలుకుతోంది. వేయి హెక్టార్లలో దెబ్బతిన్న తోటలు ఇటీవల పలుమార్లు వీచిన బలమైన ఈదురుగాలులు, వడగళ్ల వాన మామిడితోటలను కోలుకోని దెబ్బతీశాయి. జిల్లాలో 2600 హెక్టార్లలో మామిడి తోటలున్నాయి. ఈ సారి అరకొరగా 8,200 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మంచు తేనె తెగులుతో పాటు పూత లేకపోవడం, దిగుబడి చేతికందే సమయంలో ప్రకృతిలో మార్పుల కారణంగా ఈదురుగాలులతో వానతో తోటలు ధ్వంసమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిన బలమైన గాలులతో వేయి హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా గన్నేరువరం, చిగురుమామిడి, మానకొండూర్ మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే చొప్పదండి, రామడుగు, తిమ్మాపూర్, కొత్తపల్లి, గంగాధర, వీణవంక మండలాల్లో తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధికారులు గుర్తించినప్పటికి నిబంధనలు గుదిబండగా మారాయి. ధర అంతంతే కరోనా వైరస్ ప్రభావంతో గత 2020 నుంచి రైతులకు నష్టాలే. 2020కి ముందు కిలో రూ.50–60 పలికిన ధర ప్రస్తుతం రూ.40–50కి మించడం లేదు. కరోనా క్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో పండ్ల వ్యాపారాన్ని నిలిపివేయగా బొమ్మకల్ బైపాస్లో ఏర్పాటు చేశారు. ఈ సారి నుంచే మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాగ్పూర్, మహరాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి తరలించడం జరిగే ప్రక్రియ. కానీ కాత తక్కువగా ఉండటంతో అరకొర వ్యాపారులు వస్తుండగా ధర సగానికే పరిమితమైంది. రైతులకు నష్టం ఎన్నడూ లేనంతగా ఈ సారి మామిడి రైతులకు నష్టం జరిగింది. గతంలో మామిడి కాయలతో మార్కెట్ కళకళలాడేది. గతానికి పోల్చితే పావు వంతు కూడ మార్కెట్ లేదు. ధర ఉన్నా కాయ లేకపోవడం తీరని నష్టం. – నిమ్మకాయల పాషా, వ్యాపారి ప్రభుత్వం ఆదుకోవాలి ఎపుడైనా పూతను బట్టి తోటలను పడుతాం. కానీ ఈ సారి నష్టాలే తప్ప లాభం లేదు. ఇందుర్తిలో రూ.2లక్షలు పెట్టి 6ఎకరాల తోట పట్టిన. 2 టన్నులు కూడ రాలే. రూ.80వేలు వచ్చినయి. ప్రభుత్వమే ఆదుకోవాలి. – గంట సమ్మయ్య, కౌలుదారు, ఇందుర్తి -
Summer Drinks: పైన్ మ్యాంగో జ్యూస్.. పైనాపిల్లోని మాంగనీస్ వల్ల..
Summer Drinks- Pine Mango Juice: వేసవికాలంలో బయటకు వెళ్లేముందు పైన్ మ్యాంగో జ్యూస్ తాగితే దాహం వేయదు. దీనిలో విటమిన్లు, ఖనిజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులోని బీటా కెరోటిన్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీనిలోని పోషకాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక పైనాపిల్లోని మాంగనీస్, జింక్, బీ 6, సీ విటమిన్ శరీరానికి శక్తిని అందిస్తాయి. జింక్ ఫాస్పరస్, క్యాల్షియం, క్లోరిన్, ఐరన్, విటమిన్ ‘కే’లు కండరాల ఎదుగుదల, రోగనిరోధక వ్యస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! పైన్ మ్యాంగో జ్యూస్ తయారీకి కావలసినవి: ►మామిడిపండు ముక్కలు – రెండు కప్పులు ►పైనాపిల్ ముక్కలు – కప్పు ►పంచదార – రెండు టీస్పూన్లు ►నిమ్మరసం – అరటీస్పూను ►ఐస్ ముక్కలు – అరకప్పు ►పుదీనా తరుగు – టీస్పూను. పైన్ మ్యాంగో జ్యూస్ తయారీ విధానం: ►మామిడి, పైనాపిల్ ముక్కలు, పంచదార, పుదీనా, నిమ్మరసం, ఐస్ ముక్కలు, రెండు కప్పుల నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ►మెత్తగా గ్రైండ్ చేసిన జ్యూస్ మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి
సాక్షి, హైదరాబాద్: మేలు రకం బంగినపల్లి మామిడి పండ్లు కావాలా.. అయితే ఆర్టీసీకి ఆర్డరివ్వండి.. మీ ఇంటికే వచ్చేస్తాయి. తెలంగాణలో బంగినపల్లి మామిడికి జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాలు ప్రసిద్ధి. ఆ ప్రాంతంలోని రైతులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి తోటల్లో పండిన మేలు రకం పండ్లను కోరిన వారి ఇంటికి చేర్చే పని ఆర్టీసీ కార్గో విభాగం ప్రారంభించింది. ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో మగ్గించి.. మామిడి పండ్లంటే ఎంతో ఇష్టమున్నా.. కార్బైడ్ లాంటి నిషిద్ధ రసాయనాలతో బలవంతంగా మగ్గించిన పండ్లే ఎక్కువగా మార్కెట్లో అందుబాటులో ఉంటుండటంతో వాటిని తినేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇలాంటి భయాలు లేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో మగ్గించిన బంగినపల్లి మామిడి పండ్లనే సరఫరా చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే కనీసం ఐదు కిలోలకు తగ్గకుండా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. 5, 10, 15, 20 కిలోలు.. ఇలా టన్నుల్లో ఆర్డర్ ఇచ్చినా సరఫరా చేస్తామని కార్గో విభాగం చెప్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ఆర్టీసీపీఏఆర్సీఈఎల్.ఇన్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి సరిపడా నగదు చెల్లిస్తే ఆర్డర్ ఇచ్చిన ఏడో రోజు నాటికి పండ్లతో కూడిన పార్శిల్ బాక్సులను చిరునామాకు తీసుకొచ్చి అందిస్తామని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు పేర్కొంటున్నారు. 5 కిలోలకు రూ.581, 10 కేజీలకు రూ.1,162, 15 కిలోలకు రూ.1,743, 500 కేజీలకు రూ.58,075 చొప్పున ధర చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ కార్గో విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. మధురమైన బంగినపల్లి మామిడిని ఎలాంటి ప్రయాస లేకుండా సులభంగా ఆర్టీసీ కార్గో విభాగం ద్వారా ఇంటికే తెప్పించుకోవాలని, తద్వారా వాటిని పండించే రైతులను ప్రోత్సహించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. కావాల్సిన వారు 040–23450033/ 040–69440000 టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్కు ఫోన్ చేయాలని సూచించారు. -
Health Tips: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇవి తెలిస్తే..
Summer Tips- Mango Top Health Benefits: పండ్లలో రారాజు మామిడి. మరి వేసవి అంటేనే మామిడి పండ్ల సీజన్ కదా! ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా ఈ పండ్లను టేస్ట్ చేస్తారు. అయితే, కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో మామిడి తనకు తానే సాటి. మామిడి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు తెలుసుకుందామా?! 100 గ్రాముల మామిడి పండులో లభించే పోషకాలు ►ప్రొటిన్- 1.4 గ్రాములు ►కార్బోహైడ్రేట్స్-24.7 గ్రాములు ►షుగర్- 22.5 గ్రాములు ►ఫైబర్- 2.6 గ్రాములు ►కేలరీలు 60 ►విటమిన్ సీ- రోజూ ఓ మామిడి పండు తింటే 67 శాతం లభిస్తుంది. ►వీటితో పాటు కాపర్, థయామిన్, మోగ్నీషియం, నియాసిన్, పొటాషియం, రైబోఫ్లావిన్ కూడా ఉంటాయి. మామిడి ఆరోగ్య ప్రయోజనాలు ►మామిడి పండులో విటమిన్ ఏ, విటమిన్ సీతో పాటు కెరోనాయిడ్స్ ఉంటాయి. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి. ►ఇక ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తుంది. ►ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. మహిళలు మామిడి పండ్లు తినడం వల్ల ఐరన్, కాల్షియం తగు పాళ్లలో లభిస్తాయి. ►మామిడిలోని ఎంజైమ్లు ప్రొటిన్ను విచ్ఛిన్నం చేస్తాయి. అధిక ఫైబర్ను కలిగి ఉంటుంది కాబట్టి ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. ►ఇందులో విటమిన్ ఏ పుష్కలం కాబట్టి కంటి సమస్యలు దూరమవుతాయి. పొడిబారిన కళ్లు, రేచీకటిని నివారించడంలో ఇవి తోడ్పడతాయి. ►మామిడిలో ఉండే పోషకాల కారణంగా ఒక్క పండు తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడమే ►కాకుండా అదనపు కేలరీలను కరిగిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. ►ఇందులో టార్టారిక్, మాలిక్ యాసిడ్స్ ఎక్కువ. సిట్రిక్ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంలో సాయం చేస్తాయి. ►ఇక మధుమేహంతో బాధపడే వారు మామిడి ఆకులను తింటే మేలు. ఐదు నుంచి ఆరు ఆకులను నీటిలో వేడిచేసి.. రాత్రంతా నానబెట్టి తెల్లవారుజామున వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. మామిడి గ్లేసెమిక్ ఇండెక్స్ తక్కువ. షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది. ►చెడు కొలెస్ట్రాల్ను నివారిస్తుంది. ►యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. క్వార్సెటిన్(కాన్సర్ కణాలను నశింపజేస్తుంది), ఫిసెటిన్, ఐసోక్వెర్సిటిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్.. ఇవన్నీ కాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి. బ్రెస్ట్ కాన్సర్, కొలన్ కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్, లుకేమియాను నివారించడంలో తోడ్పడతాయి. చదవండి👉🏾 Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
అకాల వర్షం.. అపార నష్టం
రాయచోటి: జిల్లా పరిధిలో ఆదివారం సాయంత్రం అకాలంగా వచ్చిన వర్షం మామిడి, అరటి, ఇతర పండ్లతోటలకు భారీ నష్టాన్ని చేకూర్చింది. ఉన్నట్టుండి ఈదురుగాలులతో కూడిన వర్షం అధికంగా కురవడంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుండుపల్లి, పీలేరు, రైల్వేకోడూరు, కేవీపల్లి మండలాల పరిధిలో మామిడి చెట్లు వేర్లతో సహా పెకలింపబడ్డాయి. రాయచోటి, చిన్నమండెం, వీరబల్లి తదితర మండలాల్లో మామిడి కాయలు భారీగా నేలరాలాయి. రైల్వే కోడూరులో 35 హెక్టార్లకు పైగా అరటి తోటలు దెబ్బతినగా, జిల్లా వ్యాప్తంగా 500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. జరిగిన నష్టంపై సోమవారం ఆయా ప్రాంతాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికల రూపంలో ప్రభుత్వానికి తెలియపరుస్తామన్నారు. రెండు ప్రాంతాల్లో పిడుగు జిల్లా పరిధిలోని వీరబల్లి మండలం ఈడిగ పల్లెలో, సుండుపల్లి ప్రాంతాల్లో టెంకాయచెట్లపై పిడుగు పడి దగ్ధమయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు నేలకూలడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాలంగా కురిసిన వర్షాలకు మామిడి, అరటి తోటల్లో నష్టం అధికం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇప్పటికే 2 నెలలు ఆలస్యం.. మామిడి ప్రియులకు చేదు వార్త
మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి.. వరుస సీజన్లో రైతులకు చేదు అనుభావాలను మిగిల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యంగా కాయలు వస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడి రైతులు తీవ్రనష్టాలు చవిచూసే ప్రమాదం ఏర్పడింది. సాక్షి, నెల్లూరు : జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు, కలిగిరి, సైదాపురం వంటి ప్రాంతాల్లో దాదాపు 12,800 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో ఒక్క ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 7,500 హెక్టార్ల వరకు సాగు ఉంది. ఈ ప్రాంతంలో పండే బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసాలు, బెంగళూరు కాయలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ప్రతి ఏడాది వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. దాదాపు రెండు, మూడు నెలలపాటు సీజన్ జోరుగా సాగుతుంది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సరైన ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపుతోందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతంత మాత్రంగా కాయలు వచ్చిన మామిడిచెట్టు ప్రతికూల వాతావరణంతోనే.. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల పూతరావడం దాదాపు నెల రోజుల ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా సక్రమంగా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30 శాతం పిందె మాత్రమే తోటల్లో వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని తోటల్లో పిందెలు రాని దుస్థితి నెలకొంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా అనుకూలిస్తే ఒక ఎకరా తోటలో నాలుగు టన్నుల వరకు కాయలు వచ్చే అవకాశం ఉంది. కాని ఈ ఏడాది ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల కాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బాగా దిగుబడి వచ్చిందనుకుంటే రెండు టన్నులు మించి రాదని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడిని రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ధరలు ఫర్వాలేదు... రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఈ మేరకు ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి రకం మామిడి టన్ను రూ.70 వేలు మార్కెట్లో పలుకుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. అయితే డిమాండ్కు తగ్గట్లు కాయలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రెండు టన్నుల లెక్కన రైతుకు దిగుబడి తగ్గినా ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు రూ.1.40 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధిక వర్షాలతో పూత సరిగ్గా రాలేదు అధిక వర్షాల వల్ల ఈ ఏడాది మామిడిపూతపై తీవ్ర ప్రభావం పడింది. పూత సరిగ్గా రాలేదు. వచ్చిన పూతలో కూడా కేవలం 30 శాతం మాత్రమే పిందె వచ్చింది. దీని వల్ల దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఒక ఎకరా తోటలో ఒక టన్ను నుంచి టన్నునర కాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రఖ్యాతిగాంచి ఉలవపాడు మామిడి రైతులకు ఇది నష్ట కలిగించే అంశమే. – బ్రహ్మసాయి, ఉద్యానవనశాఖ అధికారి ఎగుమతులపై ప్రభావం కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాల్లో పండే మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. దాదాపు మూడు నెలలపాటు ఉలవపాడు కేంద్రంగా మామిడి వ్యాపారం జోరుగా సాగుతోంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఈ వ్యాపారానికి చాలా కీలకం. కాని ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్లోకి కాయలు రాని పరిస్థితి ఉంది. ఇది ఉలవపాడు నుంచి జరిగే మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది విదేశాలకు దాదాపుగా ఎగుమతులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉదే పరిస్థితి ఉంది. కరోనా ఆంక్షల వల్ల స్లాట్లు దొరక్క విదేశాలకు ఎగుమతులు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం కాయలు లేకపోవడంతో దేశీయంగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది 40 నుంచి 50 వేల టన్నుల వరకు మామిడి దిగుబడి ప్రాంతం నుంచి వస్తే, వీటిలో 10 వేల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతులు ఉండేవని అధికారులు వెల్లడిస్తున్నారు. -
బరువు పెరుగుతామన్న భయం లేదు.. ఈ స్మూతీ హెల్దీగా, రుచిగా..
మ్యాంగో గ్రీన్ స్మూతి.. ఉదయం ఆల్పాహారంగానూ, సాయంత్రాల్లో స్నాక్స్తోపాటు ఈ స్మూతీ తీసుకుంటే రుచిగా హెల్థీగా ఉంటుంది. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తాగడం వల్ల బరువు పెరుగుతామన్న భయం లేదు. మామిడిపండులో ఉన్న విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండులోని పొటాషియం, పీచుపదార్థం, పాలకూరలోని ఐరన్, విటమిన్ కే లు చర్మం, జుట్టుకు పోషణ అందిస్తాయి. మ్యాంగో గ్రీన్ స్మూతి తయారీకి కావలసిన పదార్థాలు: చల్లటి మామిడిపండు ముక్కలు – ఒకటిన్నర కప్పులు, అరటి పండు – ఒకటి, లేత పాలకూర – కప్పు, బాదం పాలు – పావు కప్పు. తయారీ: మామిడి ముక్కలు, తొక్కతీసిన అరటిపండు, పాలకూర, బాదం పాలను మిక్సీజార్లో వేసి మేత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే ఈ స్మూతీని సర్వ్ చేసేకుంటే చాలారుచిగా ఉంటుంది. చదవండి👉🏾 Best Calcium Rich Foods: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
Summer: మామిడి, పుదీనా, నిమ్మరసం.. ఈ లస్సీ ఒక్కసారి తాగితే..
Mango Peppermint Lassi Recipe: పుదీనా, నిమ్మరసం ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇక వేసవిలో లభించే మామిడిపండు కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తాయి. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకెన్నో ఉపయోగాలు. మరి మండే ఎండల్లో మధ్యాహ్నం పూట వీటితో తయారు చేసిన మ్యాంగో పిప్మర్మెంట్ లస్సీ తాగితే దాహార్తి తీరుతుంది. అంతేకాదు ఇందులోని పోషకాలు చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంట్లో ఈ సమ్మర్ డ్రింక్ను ఈజీగా తయారు చేసుకోండి. మ్యాంగో పిప్మర్మెంట్ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడిపండు గుజ్జు – కప్పు, పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – మూడు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – టీస్పూను, నిమ్మరసం – టేబుల్ స్పూను, పెరుగు – నాలుగు కప్పులు, ఐస్ ముక్కలు – కప్పు తయారీ విధానం: బ్లెండర్లో మామిడి పండు గుజ్జు, పుదీనా, పాలు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ గ్రైండ్ అయ్యాక పెరుగు, ఐస్ ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసి సర్వ్చేసుకోవాలి. చదవండి👉🏾Boppayi Banana Smoothie: ఈ స్మూతీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే! -
మామిడికి మంచి రోజులు
కరోనా కారణంగా గత రెండేళ్లుగా నష్టాలు చవిచూసిన మామిడి రైతులకు మంచి రోజులొచ్చాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో మార్కెట్లో మామిడికి డిమాండ్ పెరిగి రెట్టింపు ధర పలుకుతోంది. ఈ సారి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కడప: మామిడి పంటకు మంచికాలం కనిపిస్తోంది. కళ్లెదుటే డిమాండుతోపాటు ధరలూ బాగుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ధర మరింత పెరుగుతూ జూన్ వరకు కొనసాగితే మామిడి రైతును రాజుగా అభివర్ణించవచ్చు. గత ఏడాది చివరిలో వర్షాలు విపరీతంగా పడడంతో ఎక్కడికక్కడ మామిడి పొలాలన్నీ నీటితో తడిసిపోయాయి. పొలంలో తేమశాతం అధికంగా ఉండడంతో ఎక్కువగా చిగుర్లు రావడం..పూత తగ్గడంతో అనుకున్న మేర కాపు రాలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న కాయలకు డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి మామిడి కాయలు వస్తున్నాయి. ఈనెల 10 నుంచి కాయలు బయటి మార్కెట్లోకి వస్తుండగా.. జూన్ చివరి నాటి వరకు మామిడి కాయలు కనిపించనున్నాయి. అన్నమయ్య జిల్లాలో మామిడి పంటను పెద్ద ఎత్తున సాగు చేయడంతోపాటు అనేక రకాల మామిడి కాయలను దిగుబడి తీస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో అనేక రకాలు జిల్లాలో అనేక రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రధానంగా వీరబల్లి బేనీషా, తోతాపురి, అంటుమామిడి, నీలం, మల్లిక, అల్ఫన్స్, బంగినపల్లి, హిమామ్పసంద్ లాంటి రకాలను పండిస్తున్నారు. పంటలు పండించే రైతులు కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ధరలు పలికే మామిడి వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వీరబల్లి బేనీషాకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ప్రతి సీజన్లోనూ ఇక్కడి సరుకును వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్కు సంబంధించి ఇబ్బందులు పడకుండా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రైతులు గ్రూపులుగా ఏర్పడి కొనుగోలు కేంద్రం ఒకచోట ఏర్పాటు చేసుకుంటే దానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. ఆశాజనకంగా మామిడి ధరలు అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట, తంబళ్లపల్లె తదితర ప్రాంతాలతోపాటు మిగిలిన నియోజకవర్గాల్లోనూ మామిడి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 36 వేల హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బంగినపల్లి మామిడికి సంబంధించి టన్ను «ధర రూ. 90 వేల నుంచి లక్ష వరకు పలుకుతోంది. గతేడాది కూడా రూ. 75 వేల పైచిలుకు ధర కనిపించింది. అయితే ప్రస్తుతం ప్రారంభంలోనే టన్ను రూ. లక్ష వరకు ఉండడంతో రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంటు మామిడి, తోతాపురికి సంబంధించి టన్ను రూ. 30–35 వేల మధ్య పలుకుతోంది. ఇతర రాష్ట్రాలకు అన్నమయ్య మామిడి అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ పండించిన అంటు మామిడి కాయలను చిత్తూరులోని జ్యూస్ ఫ్యాక్టరీతోపాటు బెంగళూరుకు కూడా తరలిస్తున్నారు. అంతేకాకుండా బంగినపల్లి మామిడి గుజరాత్, మహరాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. అయితే సాధారణంగా హెక్టారు మామిడి తోటకు సంబంధించి ఐదు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి కేవలం టన్ను నుంచి 1.5 టన్ను మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో డిమాండు కూడా ఎక్కువగా ఉంది. నా పేరు అయూబ్ఖాన్. మాది మండల కేంద్రమైన చిన్నమండెం. మాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. అందులో ప్రస్తుతం దిగుబడి రావడంతో మార్కెట్కు విక్రయిస్తున్నాం. ప్రస్తుతం టన్ను ధర బాగానే పలుకుతోంది. రైతులకు ఉద్యానశాఖ తోడ్పాటు జిల్లాలో మామిడి పంట అధికంగా సాగు చేస్తారు. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉండడంతో ధర కూడా బాగానే ఉంది. రైతులు గ్రూపుగా ఉండి అమ్ముకునేందుకు ఒకచోట ఏర్పాటు చేసుకునే షెల్టర్కు కూడా ఉద్యానశాఖ తోడ్పాటు అందిస్తోంది. – మూలి రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, రాయచోటి -
అంత ధరైతే ఎట్టా! పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుర ఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిల్వ చేసుకోవాలనుకునే వారికి.. అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. కొత్తపేట పండ్ల మార్కెట్కు గతంలో రోజుకు 1000 టన్నుల మామిడి రాగా, ప్రస్తుతం బాటసింగారం మార్కెట్కు 600 టన్నులకు మించి రావడం లేదు. టన్ను ధర (కాయ సైజును బట్టి) రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల క్రితం రికార్డుస్థాయిలో రూ.1.24 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్లరసాలు కిలో రూ.150–200 వరకు విక్రయిస్తుండగా, పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కోటి రూ.15–20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. (చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? ) మార్కెట్కు తగ్గిన సరఫరా బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి సహా ఇతర పండ్లు సరఫరా అవుతుంటాయి. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర శివారు జిల్లాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడికే తెచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుత సీజన్లో ఆయా జిల్లాల నుంచి రోజుకు సగటున వెయ్యి టన్నులకుపైగా మామిడి రావాల్సి ఉండగా, 500 టన్నుల లోపే వస్తోంది. పచ్చడిలో ఉపయోగించే పుల్లటి మామిడి కాయలే కాదు బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణ రేఖ, నీలం రకాల మామిడి పండ్లు కూడా రావడం లేదు. సాధారణంగా మార్చి చివరి నాటికి మార్కెట్లను ముంచెత్తాల్సిన ఫలరాజం ఏప్రిల్ రెండో వారంలోనూ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇటు మామిడి.. అటు నిమ్మ వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. చలికాలంలో భారీ వర్షాలు కురవడం.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మ చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమైంది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా, సైజును బట్టి రిటైల్గా ఒక్కో కాయ రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్లను తయారు చేసుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మామిడి, నిమ్మ కాయల ధరలకు తోడు వంటనూనెలు, మసాల దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మొతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు. (చదవండి: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?) -
Summer Food: మామిడి, ఉల్లి, క్యారట్, నెయ్యి.. ఇవీ ఉపయోగాలు!
Summer Care- Superfoods: కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం ఇంటిని, ఒంటినీ ఆరోగ్యంగా ఉంచుతుందనేది పెద్దల మాట. ఈ మాటను అనుసరించి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మసాలాలు, వేడిచేసే ఆహార పదార్థాలనూ తీసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వేసవిలో తేలిగ్గా జీర్ణమయ్యేవి, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలేమిటో తెలుసుకుందాం. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల శరీరం నిర్జలీకరణ కాకుండా ఉంటుంది. అటువంటి వాటిలో ముఖ్యమైన వాటిని చూద్దాం... పుచ్చకాయ: ఇందులో 80 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అందుకే వేసవి రాగానే ప్రతి ఒక్కరూ పుచ్చకాయలు తింటూ ఉంటారు. తాటిముంజలు: తాటిముంజలు తినడం వల్ల వేసవిలో దాహార్తి తీరుతుంది. చెమట కాయలు రాకుండా ఉంటాయి. మామిడి: పండ్లకు రాజయిన మామిడిలో అధిక శాతం సి విటమిన్, ఏ విటమిన్ ఉంటాయి. కాస్త ధర ఎక్కువయినా ఆల్ఫోన్సో మామిడి మరీ మంచిది. ఇందులో పీచుపదార్థాలు, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడిలో ఉండే పొటాషియం చెడుకొవ్వును తగ్గించి రక ్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఉల్లి, క్యారట్: ఎండలో పడి ఇంటికి రాగానే ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరగాయలను తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధుల నుంచి రక్షిస్తాయి. సలాడ్స్: వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ను తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు. సూప్స్: దోసకాయతో చేసిన సూప్ను భోజనానికి ముందుగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. హోల్ గ్రెయిన్ సలాడ్స్: మొక్కజొన్న, మొలకెత్తిన పెసలు, శనగలు, కూరముక్కలు.. వంటివాటిని కలిపి తీసుకుంటే మంచిది. అలాగే మొలకెత్తిన గింజలు, బీన్స్, తరిగిన కూరముక్కలు, పండ్లతో కలిపి సలాడ్లా తీసుకుంటే కాల్షియం, ప్రొటీన్లు వొంటికి అందుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన కూరలతో కలపడం వల్ల కాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. వేసవి పానీయాలు: సాధారణంగా సమ్మర్లో చాలామంది తియ్యగా, చిక్కగా ఉండే శీతల పానీయాలను, సోడాలను, ఐస్క్రీమ్లను తీసుకుంటూ ఉంటారు. వీటిలో కేలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే.. అందువల్ల మజ్జిగ, లస్సీ వంటి వాటిని తాగాలి. ఇందులో కొవ్వు లేని పాలు శ్రేష్ఠం. ముఖ్యంగా మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, పళ్ల రసాలు మంచిది. వీటన్నింటికంటే నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లు, పండ్ల రసాలు: చిక్కగా ఉండే డెజర్ట్స్కు బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు అందుతాయి. కీరకాయను తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. వేసవిలో లభించే సీజనల్ పండ్లు తప్పకుండా తినాలి. ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటితో పాటు అక్రోట్లను తీసుకోవాలి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. మాంసాహారులైతే చేపలను ఎక్కువగా తినడం మంచిది. ఉదయం పూట ఓట్స్ తినడం వల్ల శరీరానికి పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువ గా అందుతాయి. పొట్టు తీయని పప్పు ధాన్యాలు, గింజలను తీసుకుంటే చాలామంచిది. నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్ఫుడ్, వేపుళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో ఉండే గుమ్మడి, బంగాళాదుంప, చిలగడదుంప, బెల్పెపర్.. వంటివాటిలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు: దాహాన్ని తీర్చడానికి నీటిని మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు గ్లాసుడు మంచినీళ్లు తాగితే మంచిది. మంచినీళ్లు తాగితే శరీరం ఉత్తేజితమవుతుంది. డీహైడ్రేషన్కు దూరంగా ఉండచ్చు. వాల్ నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం వాల్నట్స్లో పుష్కలంగా ఉంటాయి. గింజల రాజుగా పేరొందిన వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వాల్నట్లను తీసుకోవడం వల్ల మనం చెమట ద్వారానూ, వాతావరణంలోని ఇతర మార్పుల మూలంగానూ కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేసి, శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది. నెయ్యి: బరువు పెరుగుతున్నారని పక్కన పెడుతున్నారు కానీ, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే2, విటమిన్ ‘ఈ’ లతోపాటూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్ ఆమ్లాలు ఉన్నాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.. అలాగని అధికంగా తీసుకుంటే దాహం ఎక్కువ కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తగిన మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల వొంటికి తగిన మెరుపు వస్తుంది. తొందరగా అలసట కలగదు. అంజీర( అత్తి పండ్లు): ఆపిల్, ఎండుద్రాక్షల కంటే అంజీరా చాలా మెరుగైనవి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండ్లను తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది. చర్మ సమస్యలు రావు. ముఖ్యంగా వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.. వేసవిలో ఎటువంటి ఆహార పానీయాలు తీసుకోవాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నాం కదా, ఈ సీజన్లో ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యకరమైన వేసవిని ఆస్వాదించవచ్చు. చదవండి: Muskmelon Juice Health Benefits: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో! -
మన మామిడికి.. మంచిరోజులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలిపి ఎగుమతికి తగ్గ నాణ్యమైన మామిడిని ఉత్పత్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకోసం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. వీటిని మామిడి క్లస్టర్ కింద గుర్తించింది. ప్రస్తుతం ఈ జిల్లాల్లో 57,344 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సగటున 2.29 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. కొత్తగా మరో 10 వేల ఎకరాల్లో మామిడి పంటను ప్రోత్సహిస్తారు. మొత్తంగా 67 వేల ఎకరాల్లో ఎగుమతి చేసే స్థాయి కలిగి ఉండే నాణ్యమైన మామిడి ఉత్పత్తి అయ్యేలా చూస్తారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.200 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన సొమ్మును ప్రైవేట్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్ర ఉద్యానశాఖతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ బ్రాండ్ కోసం ప్రత్యేక చర్యలు తెలంగాణలో దాదాపు 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. అంటే 28 లక్షల టన్నుల మామిడి రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. సీజన్ను బట్టి ఒక్కోసారి తక్కువ ఎక్కువ అవుతుంది. అయితే తెలంగాణ మామిడికి దేశంలో మార్కెట్ ఉన్నా, విదేశీ ఎగుమతులు లేకపోవడంతో రైతులకు అవసరమైన గిట్టుబాటు ధర లభించడం లేదు. అయితే ఎగుమతి చేయాలంటే అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకూడదు. ఎక్స్పోర్ట్ క్వాలిటీని పెంచేందుకు ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మిస్తారు. అకాల వర్షాలకు నష్టాలు జరగకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. రైతులకు అత్యంత నాణ్యమైన మామిడి విత్తనాలను అందజేస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు (బ్రాండ్) తీసుకొచ్చేందుకు, తద్వారా రైతులకు ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసింది. అందుకోసం ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. బిడ్డింగ్ ద్వారా ప్రైవేటు సంస్థల ఎంపిక ఈ ప్రాజెక్టుకు చేసే రూ.200 కోట్ల వ్యయంలో మామిడి ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో రూ.79.89 కోట్లు, కోత అనంతరం నిర్వహణ, అదనపు విలువను జోడించేందుకు రూ.80.70 కోట్లు, మార్కెటింగ్, బ్రాండింగ్ కోసం రూ.39.80 కోట్లు ఖర్చు చేస్తారు. మూడేళ్లలో ఈ సొమ్మును ఖర్చు చేయాలి. ప్రాజెక్టు అమలు కోసం రాష్ట్ర ఉద్యానశాఖ, జాతీయ ఉద్యాన మండలి ఒప్పందం చేసుకుంటాయి. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించే ప్రైవేట్ సంస్థలను బిడ్డింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. రైతు ఉత్పత్తి సంస్థలు, సహకార సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ మండళ్లకు భాగస్వామ్యం కల్పిస్తారు. రాష్ట్రంలో పండించే మామిడిని ఢిల్లీకి కిసాన్ రైలు ద్వారా పంపిస్తారు. దళారులదే రాజ్యం: మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తోంది. ప్రస్తుతం రైతుల నుంచి టన్ను మామిడి రూ.40 వేలకు కొంటున్న వ్యాపారులు, వినియోగదారుల నుంచి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో పండ్లు రూ.50 వరకు ఉండాల్సి ఉండగా మార్కెట్లో రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలకైతే రూ.150–200 వసూలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతు ఉన్నాడు. -
నూజివీడు.. మామిడి తోడు
నూజివీడు: ఫలాలకు రాజు.. మామిడి. మధుర మామిడి రసాలను రుచి చూడకుండా ఎవరూ ఉండరు. అలాంటి మామిడికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పేర్గాంచింది మాత్రం నూజివీడు. ఇక్కడ లభ్యమయ్యే బంగినపల్లి, చిన్నరసాలు, మామిడి రసాలంటే ఇష్టపడని వారు ఉండరు. అంతగా నూజివీడు మామిడికి ప్రసిద్ధి. కలెక్టర్ (తోతాపురం) రకం కూడా సాగవుతోంది. ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని నున్న మామిడి మార్కెట్తో పాటు హైదరాబా ద్ మార్కెట్కు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని చెన్నై, ముంబై, ఢిల్లీ, బరోడా, ఇండోర్, నాగపూర్, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతోంది. అలాగే మలేసియా, సింగపూర్లకే కాకుండా పశ్చిమ ఆసియా దేశాలకు సైతం మామిడి ఎగుమతవుతున్నాయి. పురాతన కాలం నుంచి ఈ ప్రాంతంలో మామిడిని రైతులు సాగుచేస్తున్నారు. మామిడి సహజంగా బెట్ట పంట కావడంతో ఒక ఏడాది కాపు ఎక్కువ వస్తే, తరువాత ఏడాది తక్కువ వస్తుంది. జిల్లాలో 52 వేల ఎకరాల్లో.. నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిపి దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అలాగే చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం, ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం మండలాల్లో కలిపి దాదాపు 12 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇప్పటివరకు కృష్ణా జిల్లాలో ఉన్న నూజివీడు ప్రాంతం ఏలూరు జిల్లాలోకి రావడంతో మామిడి సాగు విస్తీర్ణం జిల్లాలో పెరిగినట్లయింది. మామిడి పూర్తిగా వాతావరణాధారిత పంట కావడంతో మామిడి రైతులకు తీపి చేదులు సర్వసాధారణంగా మారింది. మామిడి అభివృద్ధి కోసం రైతులకు సకాలంలో సలహాలు సూచనలు అందించేందుకు నూజివీడులో మామిడి పరిశోధన స్థానం సైతం ఉంది. తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన స్థానం పనిచేస్తుంది. ఇందులో ము గ్గురు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలాగే నూజివీడులోనే మ్యాంగో హబ్ సైతం ఉంది. దీనిలో మామిడికాయలను ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తారు. రైతులకు సరైన సలహాలు, సూచనలను సకాలంలో అందించడంతో పాటు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపడితే మామిడి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వాటి గురించి పిల్లలకు తెలుసా!
ఉగాది సమయం ఆ వేప పూత ఆ మావి వగరు ఆ చింత చిగురు ‘పదిగ్రాముల వేపపూత 200 రూపాయలు’... ఆన్లైన్లో చూసి కొనేంతగా ఎదిగాం. ప్రకృతితో కలిసి చేసేదే పండగ... ఉగాది వేళలో మావిచిగురు కోకిల పాట... గాలికి ఊగే వేపపూత... ఈకాలపు పిల్లలకు తెలియని దూరానికి చేరాం. గతంలో వేప చెట్టు, మావిడి చెట్టు... ప్రతి వీధిలో ఉండేవి. ఇప్పుడు? పండగ హడావిడికి సిద్ధమవుతున్నాం. ప్రకృతి స్తబ్దతను గమనిస్తున్నామా? ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వేపచెట్టు. వేపపువ్వు చేదుకి. మామిడి చెట్టు. మామిడి పిందె వగరుకి. చింతచెట్టు. పులుపు రుచికి. కొన్నిచోట్ల కొబ్బరి కోరు వేస్తారు. అంటే కొబ్బరి చెట్టు. మరికొన్ని చోట్ల బాగా మగ్గిన అరటిపండు ముక్కలు కలుపుతారు. అంటే అరటి చెట్టు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉన్నాయి. పిల్లలు ఎంతమంది వీటిని తాకి చూస్తున్నారు. ఎందరు వీటి నీడలో ఆడుతున్నారు. ఎందరు వీటిని చూశాం అని చెబుతున్నారు. నగరం అయినా.. పట్టణం అయినా.. పల్లె అయినా. ఆ వేప కొమ్మలు... చెట్టు పెంచడం మన ఆచారం. చెట్టుతో పాటు ఇల్లు ఉండాలనుకోవడం మన సంస్కృతి. ప్రతి వీధికి వేప చెట్టు అరుగు ఉండేది. వీధిలోని ఒకటి రెండు ఇళ్ల వాళ్లయినా ముంగిలిలో వేప చెట్టు వేసుకునేవారు. కొన్ని చెట్లు పెరిగి పెద్దవై ప్రహరీగోడను కప్పేసేవి. చెట్ల కొమ్మలు ఇంటి వైపుకు వాలి నీడను పెంచేసేవి. పిల్లలు రాలిన వేప ఆకులు తొక్కుకుంటూ ఆడుకునేవారు. పసుపుపచ్చటి వేపపండ్లు తుంచి వగరు తీపితో ఉండే వాటి రుచిని చూసేవారు. వాటి గింజలను గుజ్జును పారేసి ఖాళీ డిప్పలలో పుల్లను గుచ్చి ఆడుకునేవారు. వేణ్ణీళ్లలో వేపాకులను కలిపి తల్లులు స్నానం చేయిస్తుండేవారు. నెలకు ఒకటి రెండుసార్లు లేత వేపాకులను నూరి చిన్ని ముద్దలను చేసి చక్కెర అద్ది మింగించేవారు. దడుపు చేస్తే, జ్వరం వస్తే వేప మండలు దిష్టి తీసి నెమ్మది కలిగించేవారు. వేపపుల్లతో పళ్లుతోమడం అలవాటు చేసేవారు. వేపబద్దతో నాలిక గీసుకోవడం ఆరోగ్యం. ఉగాది పండగ రోజు వేపపూత పిల్లల చేతే కోయించేవారు. వేప బెరడుకు బంక కారితే పిల్లలు దానిని గిల్లి సీసాల్లో దాచుకునేవారు. వేప కాండంపై పాకే గండు చీమలు, గెంతుతూ వెళ్లే ఉడతలు, కొమ్మల్లో గూడు పెట్టే కాకులు, ఇంట్లో కోళ్లు పెంచుతుంటే గనక అవి ఎరిగి రాత్రిళ్లు ఆ కొమ్మలపైనే తీసే నిద్ర... పండగలో చెట్టును పెట్టింది చెట్టును కాపాడుకోమని. ప్రకృతిని తెలుసుకోమని. ఇవాళ పెద్ద చెట్లు వేస్తున్న ఇళ్లు ఎన్ని? పెద్ద చెట్లకు వీలైన స్థలం ఎక్కడ దొరుకుతోంది? పూల కుండీలు, మిద్దెతోట... సర్దుబాటు జీవనం... రెక్కలు సాచిన విశాలమైన వృక్షాలు గత చరిత్రగా మారాయి. ఆ మామిడి పిందెలు... మామిడి చెట్టు ఉన్న ఇంటికి మర్యాద జాస్తి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వచ్చి మామిడి ఆకులు అడుగుతారు. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ‘ఆ మామిడి చెట్టున్న ఇల్లు’ అని చెబుతారు. మామిడి చెట్లు చాలామటుకు శుభ్రంగా ఉంటుంది. వాటి గుబురు ఆకులను చూస్తే ఆనందం కలుగుతుంది. వచ్చిన బంధువులంతా ‘ఏ మామిడి’ అని ఆరా తీస్తారు. బంగినిపల్లో, బెంగుళూరో, నీలమో, నాటు మామిడో... ఏదో ఒక జవాబు చెప్పాలి. పిల్లలు మామిడి కొమ్మలకు తాళ్లు కట్టి ఊయల ఊగుతారు. చిన్న కొమ్మలపై ఎక్కి కూచుంటారు. వేసవి వస్తే ఒళ్లంతా విరగబూసే మామిడి పూత మీద అందరి కళ్లు పడతాయి. పిందెల వేస్తున్నప్పటి నుంచి దిష్టి తగలకుండా యజమానులు నానా పాట్లు పడతారు. ఉండుండి పాడిగాలి వీచి పిందె రాలితే అదో బాధ. కోతుల దండు ఊడి పడితే వాటిని తరిమికొట్టే వరకూ గాబరా. కాయ గుప్పిటంత పెరిగాక కోసి పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతం. ఉగాది పచ్చడి మన ఇంటి కాయ తెచ్చే రుచి అద్భుతం. చిటారున గుబురులో పండిన కాయ పిల్లలు నిద్ర లేచి చెట్టు కిందకు వెళితే రాలి కనపడుతుంది. కోయిలలు వచ్చి పాట పాడి పిల్లలను బదులివ్వమంటుంది. చిలుకలు పండిన కాయలను సుష్టుగా భోం చేసి ఎర్ర ముక్కులు చూపించి పోతాయి. మామిడి చెట్టు ఉంటే ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే. కాని కారు పార్కింగ్ కోసం ఆ చెట్టును వదిలేసిన ఇళ్లే ఇప్పుడు. పిల్లలూ... మామిడిపండ్లను మీరు మోర్ మార్కెట్స్లోనే చూడక తప్పదు. చింతచెట్టు కథలు జాస్తి... చింతచెట్టు ఇంట్లో పెంచరు. ఆ చెట్టు ఊరిది. ప్రతి ఊళ్లో చింతచెట్టు అరుగు ఉంటుంది. అది మనుషులు కూడా తమ చింతలు మాట్లాడుకునేంత గాఢమైన నీడను కలిగి ఉంటుంది. వేసవి మధ్యాహ్నాలు చింత చెట్టు కింద పట్టే నిద్ర సామాన్యంగా ఉండదు. చింతకాయలు కాస్తే పిల్లలు వాటిని రాళ్లతో రాల్చి నోట పెట్టుకుంటారు. ఆడవాళ్లు దోటీలు పట్టుకుని వచ్చి చింత చిగురు కోసి వండుతారు. ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే చింత చెట్టు ఆరా తీస్తుంది. గూడు లేని వాళ్లకు రాత్రిళ్లు అది ఇల్లు అవుతుంది. కాని చింత చెట్టు అంటే భయం కూడా ఉంటుంది. దెయ్యాలు దానిలో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుని ఉంటాయని పుకార్లు ఉంటాయి. చింతచెట్టు కింద పడుకున్నవారి గుండెల మీద రాత్రుళ్లు దెయ్యం కూచుంటుంది. చింతచెట్టుకు రాత్రిళ్లు కార్బన్ డై ఆక్సైడ్ విడిచే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్లే తగిన ఆక్సిజన్ అందక ఈ భ్రాంతులు. చింతచెట్టు లేని బాల్యం చాలా బోసి. కొంగలు వాలడానికి ఇష్టపడే చెట్టు అది. ఇవాళ ఊళ్లలో ఫ్లెక్సీలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. చింత చెట్టు మాత్రం లేదు. ఆలోచించాలి అందరం... గతంలో ఎన్నో ఇళ్ల పెరళ్లలో అరటి చెట్లు ఉండేవి. చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు వేసేవారు. బాదం చెట్లు పెంచే ఇళ్లకు లెక్క ఉండేది కాదు. చెట్టుకు వదిలాకే కట్టుబడికి స్థలం వదిలేవారు. కట్టేది ఒక ఇల్లయితే చెట్టు నీడ ఒక ఇల్లు అని ఆ కాలంలో తెలుసు. కాని ఇవాళ కాంక్రీట్ ఇళ్లు మాత్రమే కట్టి వేడి పెంచుతున్నాం. ఎండ మండుతోందని అవస్థలు పడుతున్నాం. ఉగాది అంటే చెట్లకు ప్రాభవ సమయాలు ఉన్నట్టు బతుకుకు కూడా ప్రాభవ సమయాలు ఉంటాయని తెలుసుకోవడం. తీపిని ఆస్వాదించడంతో పాటు చేదును మింగాలని తెలుసుకోవడం. తుఫానొచ్చి కొమ్మలు విరిగి పడినా మళ్లీ చిగురించవచ్చని తెలుసుకోవడం. చెట్టుకు పిల్లల్ని దూరం చేయవద్దు. బాల్యాన్ని అరుచితో నింపొద్దు. ఆలోచించండి. కొత్త ఉగాదికి ఆహ్వానం పలకండి. -
పూత నిలవలె..పిందె ఎదగలె
జగిత్యాల అగ్రికల్చర్/ కొల్లాపూర్: ఫలరాజుగా పేరుగాంచిన మామిడి గత రెండేళ్లు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తున్నా.. దిగుబడులు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అధిక వర్షాలతో పూత ఆలస్యం కావడం, అవే వర్షాలు పురుగులు, తెగుళ్లు ఆశించడానికి దోహదపడటంతో..పూత నిలవక, పిందె ఎదగక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 3.5 టన్నుల చొప్పున రావాల్సిన దిగుబడి.. ప్రస్తుతం 1 నుంచి 1.5 టన్నుకు తగ్గిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్లో సైతం దిగుబడి 60 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు తెలంగాణ రాష్ట్రంలో 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జగిత్యాల, మంచిర్యాల, నాగర్కర్నూల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నేలల రకాన్ని బట్టి ఎకరానికి 3.5 టన్నుల చొప్పున 11.10 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల తొలుత అంచనా వేశారు. ఎర్రనేలల్లో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావించారు. అధిక వర్షాలతో తేమ ఆరక.. అయితే మామిడి దిగుబడిపై ఈ ఏడాది అధిక వర్షాలు ప్రభావం చూపాయి. సాధారణంగా జూన్, జూలైలోనే వర్షాలు ప్రారంభమై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కురుస్తాయి. కానీ గత ఏడాది నవంబర్ చివరివరకూ అధిక వర్షాలు కురిశాయి. దీంతో నేలల్లో తేమ శాతం పెరిగింది. తేమ ఆరక, చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి. సాధారణంగా డిసెంబర్, జనవరిలో రావాల్సిన పూత ఆలస్యమైంది. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి..ఇలా నాలుగు దఫాలుగా పూత కాసింది. దీంతో కొన్నిచోట్ల పూత ఉంటే, కొన్నిచోట్ల పిందెలు వచ్చాయి. కొన్నిచోట్ల కాయ దశకు చేరుకున్నాయి. రసం పీల్చిన పురుగులు అధిక వర్షాలతో దున్నడం, ఎండిన కొమ్మలను తొలగించడం వంటి పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో నల్ల తామర, తేనెమంచు పురుగులు పంట కాలానికి ముందు చెట్టు కాండం, కొమ్మల బెరడులో దాక్కుని పూత, పిందె సమయంలో చెట్టు పైకి వచ్చి నష్టం చేశాయి. పురుగులు గుంపులుగా చేరి పూలు, పిందెల నుంచి రసం పీల్చాయి. దీంతో పూత రాలిపోయింది. నల్ల తామర పురుగులు పిందెల దశలో చర్మాన్ని గోకి రసం పీల్చి నష్టం కలిగించాయి. తగ్గనున్న దిగుబడులు.. పురుగులు, తెగుళ్లకు తోడు పోషకాల లోపంతో ఈ ఏడాది మామిడి దిగుబడి ఎకరాకి టన్ను నుంచి 1.5 టన్నుల వరకు పడిపోయే అవకాశం ఉందని ఉద్యాన అధికారులు అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద 5–6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిరోజులుగా 41– 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉన్న పిందెలు, కాయలు కూడా రాలిపోతున్నాయి. కొల్లాపూర్ మామిడికీ కరువే ఉమ్మడి జిల్లాలో భారీగా తగ్గిన దిగుబడులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ మామిడి పండ్లకు బాగా ప్రసిద్ధి. అందులోనూ బేనీషాన్ రకం పండ్లకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండించే మామిడి పండ్లను దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్ మామిడి పండ్లకు ఈసారి కరువొచ్చే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో కొల్లాపూర్ నియోజకవర్గంలోనే అత్యధికంగా 37,670 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చిన్నరసాలు, పెద్దరసాలు, దెసేరీ, నీలిషాన్ తదితరాలతో పాటు ప్రధానంగా బేనీషాన్ రకం మామిడిని రైతులు పండిస్తుంటారు. అయితే ఈసారి 60 శాతం తోటల్లో జనవరి చివర్లో, ఫిబ్రవరి మొదటి వారంలో పూత వచ్చింది. ఇదే సమయంలో వర్షాలు పడడంతో పూతను దెబ్బతీసింది. దీనికితోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి పంటకు సోకే నల్ల తామర పురుగు మామిడి పంటకు సోకి దిగుబడిపై ప్రభావం చూపింది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం కేవలం 40 శాతం తోటల్లోనే మామిడి కాపు కాసింది. టన్ను ధర లక్ష పైచిలుకే.. పంట దిగుబడి బాగా తగ్గడంతో ఈసారి మామిడి కొనుగోళ్లకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్, ముంబై వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.100 నుంచి రూ.120 దాకా చెల్లిస్తున్నారు. అంటే దాదాపుగా టన్ను ధర రూ.లక్ష పైచిలుకు పలుకుతోంది. పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు నాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. ఎకరాకి రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. రెండు, మూడుసార్లు రసాయన మందులు చల్లినా పూత నిలువలేదు. పిందె ఎదగలేదు. కాయలను చూస్తే.. పెట్టుబడి కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. – పడిగెల రవీందర్రెడ్డి, రాయికల్, జగిత్యాల జిల్లా తేనె మంచుతో రాలిన పూత సాధారణంగా నవంబర్ నెలాఖరులో, డిసెంబర్లో మామిడిపూత ప్రారంభం కావాలి. కానీ ఆలస్యంగా ప్రారంభమైన పూత ఈ ఏడాది మార్చి వరకు వస్తూనే ఉంది. ఆ సమయంలోనే తేనె మంచు ఆశించింది. పూత రాలిపోయింది. – ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యాన అధికారి, జగిత్యాల ఒక్క కాయ కూడా తెంచలేదు సొంత భూమి 30 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల మామిడి తోట కౌలు కు తీసుకున్నా. రూ.35 లక్షలు ఖర్చు చేశా. తెగుళ్లు, వాతావరణ మార్పులతో ఒక్క తోటలోనూ పూత నిలబడ లేదు. ఇప్పటివరకు ఒక్క కాయ కూడా తెంచలేదు. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ అధికారులకు నివేదించాం.. మామిడి దిగుబడి ఈసారి 60 శాతం తగ్గింది. సకా లంలో పూత రాకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నల్ల తామర తెగులు సోక డంతో పంట దిగుబడి తగ్గింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. పంటనష్టం, దిగుబడి వివరాలను అధికారులకు చెప్పాం. – లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్ -
ఆంధ్రా మామిడి ‘అదుర్స్’.. రికార్డు స్థాయిలో..
సాక్షి, అమరావతి: మామిడి సీజన్ రైతులకు మంచి ‘ఫలాల’తో మొదలైంది. ప్రభుత్వ చర్యలు, రైతులకు ఇచ్చిన సలహాలతో మంచి నాణ్యత కలిగిన పండ్లు వచ్చాయి. దీంతో రికార్డు స్థాయిలో ధర పెరిగింది. వివిధ రాష్ట్రాల వ్యాపారులు తోటల వద్దకు వచ్చి మరీ కొంటున్నారు. గతేడాది టన్ను రూ.70 వేల నుంచి రూ.లక్ష పలికిన బంగినపల్లి ఈ ఏడాది ప్రారంభంలోనే రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు పలుకుతోంది. కృష్ణాజిల్లాలో రెడ్డిగూడెం, విస్సన్నపేట, మైలవరం ప్రాంతాల్లో పక్వానికి వచ్చిన నాణ్యమైన మామిడి కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. చదవండి: AP: భరోసాపై బురద రాతలు.. అన్నదాతల్లో ఆగ్రహం గత రెండేళ్లూ మామిడి మార్కెట్ను కరోనా దెబ్బ తీసింది. కరోనా ప్రభావం లేకపోవడంతో ఈసారి కాస్త మంచి రేటు వస్తుందని ఆశించారు. కానీ ఊహించని రీతిలో ఆరంభంలోనే రికార్డు స్థాయి ధర పలకడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాష్ట్రంలో పండే బంగినపల్లి , సువర్ణరేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాదు.. విదేశాల్లో సైతం మంచి డిమాండ్ ఉంది. ఎగుమతుల కోసం ఇప్పటికే 18,486 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ ఏడాది 3.35 లక్షల హెక్టార్లలో మామిడి సాగవగా, హెక్టార్కు గరిష్టంగా 12 టన్నుల చొప్పున 40.26 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. సత్ఫలితాలిస్తున్న తోటబడులు ఆర్బీకేల కేంద్రంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ తోట బడుల కార్యక్రమంతో పాటు ఫ్రూట్ కేర్ విధానాల వల్ల దిగు బడుల్లో నాణ్యత పెరిగింది. కాయ రెట్టింపు సైజు వచ్చి, బరువు కూడా పెరిగింది. సాధారణంగా కిలోకి 4, 5 కాయలు తూగుతాయి. ఫ్రూట్కేర్ విధానం వల్ల కిలోకి రెండుకు మించి తూగడంలేదు. బుట్ట కట్టడం వలన తెగుళ్లు సోకడంలేదు. పురుగుల మందులు వాడే అవకాశం లేదు. మచ్చలు లేవు. తద్వారా నాణ్యత పెరుగుతోంది. తెలంగాణ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత బాగుండటంతో రేటు పెంచేందుకు కూడా వెనుకాడటం లేదు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగుంట గ్రామానికి చెందిన రైతు చేబ్రోలు శ్రీనివాసరావుకు 20 ఎకరాల మామిడి తోటలున్నాయి. మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. వైఎస్సార్ తోట బడుల్లో అధికారుల సలహాలు పాటించారు. ఫ్రూట్కేర్ విధానంలో పండ్లకు బుట్టలు కట్టారు. తెగుళ్లు సోకలేదు, మందులు వాడలేదు. ఎకరాకు 4 టన్నుల దిగుబడి వస్తోంది. నాణ్యత పెరగడంతో మంచి ధర పలికింది. తెలంగాణకు చెందిన వ్యాపారులు టన్ను రూ.1.30 లక్షల చొప్పున 2 టన్నులు కొన్నారు. ఢిల్లీ వ్యాపారులు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 6 టన్నులు, ముంబై వ్యాపారులు రూ.1.15 లక్షల చొప్పున 5 టన్నులు కొన్నారు. ఇంత ధర గతంలో లేదని శ్రీనివాసరావు తెలిపారు. టన్ను రూ.1.20 లక్షలకు అమ్మాం మాకు ఆరెకరాల మామిడి తోట ఉంది. ఫ్రూట్కేర్ విధానం వల్ల పండ్ల నాణ్యత పెరిగింది. గతేడాది గరిష్టంగా టన్ను రూ.లక్ష పలికింది. ఈ ఏడాది టన్ను రూ.1.20 లక్షలు పలికింది. ఇటీవలే 5 టన్నులు అమ్మాం. వ్యాపారులు తోటకే వచ్చి పట్టుకెళ్లారు. – సీహెచ్, కృపారాజు, రెడ్డికుంట, కృష్ణా జిల్లా పండ్ల నాణ్యత బాగుంది ఏపీలో ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ఫ్రూట్ కేర్ విధానాలు పాటిస్తుండడం వలన పండ్ల నాణ్యత పెరిగింది. ఏ ఒక్క కాయమీద మచ్చ కన్పించలేదు. మంచి సైజు వస్తోంది. రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున 10 టన్నులు కొన్నాం. మరో 20 టన్నులు రూ.80 వేల నుంచి రూ.లక్ష చొప్పున కొన్నాం. ఢిల్లీ, బిహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలతో పాటు సౌదీ దేశాలకు ఎగుమతి చేస్తాం. – మహ్మద్ అబ్దుల్ అలీమ్, ఆల్ నఫే ఫ్రూట్ కంపెనీ త్వరలో బయ్యర్స్–సెల్లర్స్ మీట్ వైఎస్సార్ తోట బడులు ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు ఇస్తుండటంతో మంచి ఫలితాలొస్తున్నాయి. ఈ ఏడాది ఎక్స్పోర్ట్ క్వాలిటీ దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ ఆహార ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎపెడా) సౌజన్యంతో విజయవాడ, తిరుపతిల్లో బయ్యర్స్– సెల్లర్స్ మీట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యానవన శాఖ -
అబ్బురపరుస్తోన్న మామిడికాయ లాంటి గుడ్డు!
సాక్షి, పిఠాపురం: మామిడికాయ ఆకారంలో ఉన్న కోడి గుడ్డు చూపరులను అబ్బుర పరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన కిరాణా వ్యాపారి బొమ్మిడి సత్తిబాబు తన దుకాణంలో విక్రయించడానికి కోడిగుడ్లు తెప్పించాడు. వాటిలో ఒక కోడి గుడ్డు అచ్చం మామిడికాయలా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. గుడ్డు తెల్లగా ఉన్నప్పటికీ పచ్చి మామిడికాయ ఆకారంలో ఉంది. -
రికార్డులు బ్రేక్.. బుట్ట మామిడి పండ్ల ధర @ 31వేలు.. ఎక్కడో తెలుసా..?
సాక్షి, ముంబై : వేసవి కాలం వస్తోందంటే నోరూరించే వివిధ రకాల మామిడి పండ్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. దీంతో అందరి కళ్లు మామిడి పండ్లపైనే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రకాల మామిడి పండ్లను ప్రత్యేక పేర్లతో పిలుస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రసాలు, బంగినపల్లి మామిడి పండ్లు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. కాగా, ఈ ఏడాది మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైంది. మార్కెట్ కు పండ్ల పెట్టెలు వస్తున్నాయి. దీంతో మార్కెట్ లో మామిడి పండ్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. శుక్రవారం పూణెలోని ఏపీఎంసీ మార్కెట్ కు ఈ సంవత్సరంలో మొదటిసారిగా దేవ్గఢ్ రత్నగిరి నుంచి ప్రసిద్ధి చెందిన హాపస్ మామిడి పండ్లను తీసుకువచ్చారు. ఈ క్రమంలో పండ్ల పెట్టెకు అక్కడి వ్యాపారులు పూల మాల వేసి ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం వేలంలో భాగంగా ఒక్క పెట్టె మామిడి పండ్లకు రికార్డు స్థాయిలో రూ. 31,000 పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా వ్యాపారి యువరాజ్ కాచి మాట్లాడుతూ.. ప్రతీ సీజన్ ప్రారంభంలో మొదటిసారిగా మార్కెట్ కు వచ్చే మామిడి పండ్లను వేలం వేస్తారని తెలిపారు. ఎందుకంటే తర్వాత రోజుల్లో వేలంలో పండ్ల పెట్టెను కొన్న ధర ఆధారంగానే రేటు ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం వేలంలో రూ. 5వేలతో ప్రారంభమైన మామిడి పండ్ల పెట్టె ధర చివరకు రూ. 31వేల బిడ్ ధర పలికిందన్నారు. కాగా, మొదటి పెట్టెకు రూ. 18వేలు, రెండోది రూ. 21వేలు, మూడోది రూ. 22,500, నాల్గొవది రూ. 22,500లకు బిడ్ వేయగా ఐదో పెట్టెకు రూ. 31 వేలు పలికినట్టు వ్యాపారి తెలిపారు. గత 50 ఏళ్ల కాలంలో పూణే మార్కెట్ లో మామిడి పండ్లు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండేళ్లుగా కోవిడ్ కారణంగా వ్యాపారం బాగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్కెట్ బాగా జరగాలని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. -
అమెరికాకు భారత్ మామిడి ఎగుమతులు
న్యూఢిల్లీ: రానున్న సీజన్లో మామిడి కాయలను / పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతి లభించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. అమెరికా వ్యవసాయ శాఖ (యూఎస్డీఏ) ఈ మేరకు అనుమతి మంజూరు చేసినట్టు తెలిపింది. భారత్ నుంచి వచ్చే మామిడిని అమెరికా 2020 నుంచి నియంత్రిస్తోంది. యూఎస్డీఏ అధికారులు భారత్కు వచ్చి ఇర్రేడియం సదుపాయాలను తనిఖీ చేసే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే 2021లో వ్యవసాయ శాఖ, రైతుల సంక్షేమ సంఘం యూఎస్డీఏతో ఒప్పందం చేసుకున్నాయి. దీని కింద భారత్ నుంచి వచ్చే మామిడి, దానిమ్మ ఉత్పత్తులకు.. అమెరికా నుంచి భారత్కు వచ్చే చెర్నీ, అల్ఫల్ఫాకు ఉమ్మడి ఇర్రేడియేషన్ ప్రోటోకాల్ను అనుసరించాల్సి ఉంటుంది. ‘‘ఉమ్మడి ఒప్పందం కింద మార్చి నుంచి ఆల్ఫాన్సో రకం మామిడి కాయలను అమెరికాకు ఎగుమతి చేసుకోవచ్చు’’ అని వాణిజ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వద్దనున్న గణాంకాల ప్రకారం.. 2017–18లో భారత్ 800 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేసింది. 2018–19లో 951 మెట్రిక్ టన్నులు, 2019–20లో 1,095 టన్నుల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రానున్న సీజన్లో 2019–20 కంటే ఎక్కువ ఎగుమతులు సాధ్యమవుతాయని వాణిజ్య శాఖ తెలిపింది. చదవండి: మొదటి 'ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా' కార్డు గ్రహీత మన హైదరాబాదీ! -
ప్రపంచ పటంలో ఉలవపాడు మామిడి....
ఉలవపాడుః ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉంది. ఇక్కడ బంగినపలి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. 16 వ నెంబరు జాతీయరహదారి పై ఒంగోలు –కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో షుమారు 15 వేల ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరిమామిడి, పునారస్, హిమామ్పసంద్ రకాలు సాగు చేస్తారు. ప్రతి ఏడాది మార్చి నుండి జులై వరకు సీజన్సాగుతుంది. ఎకరమునకు 2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బంగినపల్లి రకం అత్యధికంగా టన్ను 30 నుంచి 45 వేల వరకు పలుకుతుంది. మిగిలిన రకాలు తక్కువ రేటు ఉంటుంది. ఏడాదికి సుమారు 90 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు మామిడి ఎగుమతి అవుతుంది. బంగినపల్లి రకం షిప్పులు, విమానాలలో అమెరికా, ఇంగ్లాండ్లకు పంపిస్తారు. బెంగుళూరు రకం మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఎగుమతి చేస్తారు. ఫల రాజుగా పేరొందిన మామిడి కాయలకు ఉలవపాడు ప్రాంతం ఫేమస్ గా చెప్పుకోవచ్చు. -
పొరలు పొరలుగా.. నోరూరించేలా..
సాక్షి, చాగల్లు (పశ్చిమగోదావరి) : మామిడి పండు అంటేనే నోరూరుతుంది. ఇక ఆ మామిడితో చేసే తాండ్రను తింటే మనం ఒక పట్టాన వదిలిపెట్టం. తాండ్రను పొరలు పొరలుగా తీసుకుంటూ తింటూ ఉంటే ఆ రుచే వేరు. పిల్లలు, పెద్దలు అనే తేడా అందరికీ ఇష్టమైన ఈ మామిడి తాండ్ర తయారీ కొంచెం కష్టమైనా రుచిలో మాత్రం అద్భుతం. ఇక ఆ మామిడితాండ్రకు ప్రసిద్ధి చెందిన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామం వెళ్తే సీజన్లో ఎక్కడ చూసినా తాండ్ర తయారు చేస్తూ బిజీగా కనిపిస్తుంటారు. చాపలపై మామిడి రసం పాముతూ తాండ్ర ఎండబెట్టేందుకు శ్రమిస్తుంటారు. వేసవిలో దొరికే మామిడిపళ్ల రుచి అన్ని సీజన్లలోనూ ఆస్వాదించేలా తయారు చేసే మామిడి తాండ్ర సంగతులు తెలుసుకునేందుకు ఒకసారి ఊనగట్ల వెళ్లొద్దాం రండి. ఊనగట్ల గ్రామంలో ఎప్పటి నుంచో ఈ మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. కాలం మారేకొద్దీ తయారీ విధానాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఏటా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తాండ్ర తయారీ ముమ్మరంగా సాగుతుంది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. గతంలో కాయలను రోళ్లలో వేసి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాల సాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలపై పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. తాండ్రను ఆరిన తరువాత ముక్కలుగా కోసి పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడికాయల గుజ్జును తీస్తున్న దృశ్యం ఇటీవల తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలు వినియోగిస్తారు. నిడదవోలు, కొవ్వూరుపాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు, కొరుకొండ, రాజమండ్రి మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. మామిడితాండ్ర కోసం ఒక్కొక్కరూ రోజూ టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. ఇటీవల వాతావరణం అనుకూలించక మామిడి కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గతంలో 50 వరకు ఉండగా, ప్రస్తుతం 15 కేంద్రాలకు తగ్గిపోయాయి. ఏటా వేసవిలో ఉపాధి మామిడి తాండ్ర పెద్ద తయారీ కేంద్రాల్లో 25 నుంచి 30.. చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతుంటారు. సీజన్లో గ్రామంలో సుమారు 500 మందికి పైగా ఉపాధి దొరుకుతుంది. మామిడితాండ్ర తయారీ సమయంలో వ్యవసాయ పనులు లేకపోకపోవడంతో ఈ పరిశ్రమ మహిళలకు ఆదాయ వనరు ఉంటోంది. ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలు కలిగిస్తోంది. గత రెండేళ్లుగా సీజన్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తాండ్ర తయారీ నిర్వాహకులు భయపడ్డారు. భౌతిక దూరం, తగిన జాగ్రత్తలు పాటిస్తూ కూలీలతో పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం భరోసా కల్పించడంతో తయారీ దారులు మామిడి కాయలను దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ పనులు కొనసాగించారు. హైద్రాబాద్, ముంబై, చెన్నైలకు ఎగుమతి తాండ్రను తగిన సైజుల్లో ముక్కలుగా కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.8 వేలు నుంచి రూ.9 వేల వరకు ఉంటుంది. సుమారు రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. హైద్రాబాద్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు తాండ్ర ఎగుమతి చేస్తారు. మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఏడాది పొడవునా అమ్మకాలు ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. తాండ్రను కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచి ఏడాది పొడవునా అమ్మకాలు చేస్తున్నాం. – బి. శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు తయారీవ్యయంతో ఇబ్బందులు పెరుగుతున్న మామిడి ధరలతో పాటు కూలీల కొరత అధికంగా ఉంటుంది. తాండ్రకు గిట్టుబాటు ధరలు అంతంత మాత్రంగా ఉండటంతో ఇటీవల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కొండేపర్తి శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు తాండ్ర తయారీతో మహిళలకు ఉపాధి మామిడితాండ్ర కుటీర పరిశ్రమగా వేసవి కాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పనిని బట్టి రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు కూలీ లభిస్తుంది. ఈ ప్రాంత మహిళల అభివృద్ధి తాండ్ర పరిశ్రమ దోహదం చేస్తుంది. – కె. సీతామహాలక్ష్మి, మామిడితాండ్ర తయారీ కూలీ -
పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? అయితే ఇవి పంపండి
National Mango Day 2021 Special Story సాక్షి, వెబ్డెస్క్: గత వేసవి ఆరంభం... బెంగాల్ ఎన్నికలు... ప్రధానీ మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల మధ్య హోరాహోరీ పోరు. రాజకీయ ఎత్తులు, వ్యక్తిగత విమర్శలతో ఢీ అంటే ఢీ అన్నారు. ఎన్నికలు ముగిశాయి. గతాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీకి బుట్టెడు మామిడి పళ్లు పంపి స్నేహ హస్తం చాచారు మమత. కేంద్ర , రాష్ట్రాల మధ్య సంబంధాలు చక్కదిద్దారు. అవును నోరు తీపి చేయ్యడమే కాదు ఇద్దరి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెరపడంలో కూడా మామిడి పళ్లు కీలకమే, వేల ఏళ్ల క్రితమే క్రీస్తు పూర్వం ఐదు వేల ఏళ్ల కిందట జంబూ ద్వీపంలో విరివిగా కాసిన మామిడి కాయలు ఆ తర్వాత ఇక్కడ కనిపించకుండా పోయాయి. తిరిగి క్రీస్తు శకం ఐదు వందల ఏళ్ల తర్వాత మరోసారి ఇండియాకు చేరుకున్నాయి. అంతే మళ్లీ మాయమయ్యేది లేదన్నట్టుగా దేశమంతటా విస్తరించాయి. వేల రకాలుగా విరగ కాస్తున్నాయి. ప్రతీ ఇంటిని పలకరిస్తూ.. తియ్యటి అనుభూతిని పంచుతున్నాయి. జులై 22న ఇండియాలో అత్యధికంగా కాసే పళ్లలో మామిడి పళ్లది ప్రత్యేక స్థానం. ప్రపంచం మొత్తం కాసే మామిడిలో సగానికి పైగా ఇండియాలోనే కాస్తున్నాయి. అందుకే మామిడి మన జాతీయ ఫలంగా గుర్తింపు పొందింది. ఇండియానే కాదు పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ జాతీయ ఫలం కూడా మామిడినే. మామిడి పళ్ల అనుభూతిని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకునేందుకు 1987లో జులై 22న ఢిల్లీలో నేషనల్ మ్యాంగో డేని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జులై 22న జాతీయ మామిడి పళ్ల దినోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. స్నేహ హస్తం భారతీయ జీవన విధానంలో మామిడి పళ్లకి ప్రత్యేక స్థానం ఉంది. తమ స్నేహాన్ని తెలిపేందుకు బుట్టలో మామిడి పళ్లు పంపడం ఇక్కడ ఆనవాయితీ. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మామిడి పళ్లు పంపారు. అదే విధంగా బంగ్లాదేశ్ ప్రధాని నుంచి ప్రతీ ఏడు భారత్, పాక్ ప్రధానులకు మామిడి పళ్ల బుట్టలు వస్తుంటాయి. మనదగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన ఫామ్హౌజ్లో పండిన మామిడి కాయలను స్నేహితులకు పంపడం రివాజు. మామిడి @ 1000 మామిడి పళ్లకు ఉన్న డిమాండ్ చూసి నేల నలుమూలల వెరైటీ మామిడి పళ్లను పండించే వారు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నూర్జహాన్ మామిడి పళ్లు అయితే ఒక్కొక్కటి వెయ్యి రూపాయలకు పైగానే ధర పలుకుతుంటాయి. మన దగ్గర బంగినపల్లి, తోతాపూరి, ఆల్ఫోన్సో, సింధ్రీ, రసాలు వంటివి ఫేమస్. విటమిన్ సీ కరోనా విపత్తు వచ్చిన తర్వాత విటమిన్ సీ ట్యాబెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ రోజుకు ఓ మామిడి పండు తింటే చాలు మన శరీరానికి అవసరమైన సీ విటమిన్ సహాజ పద్దతిలో శరీరానికి అందుతుంది. లో షుగర్ మ్యాంగో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లోని అల్లాహార్లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే మామిడి రకాలను పండిస్తున్నారు. ఇందులో సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి. నూజివీడు స్పెషల్ నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని టన్ను రూ, 50 వేలకు కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చళ్లు చివరగా మామిడి కాయలు తినడానికే కాదు పచ్చళ్లుగా, ఊరగాయలుగా కూడా ఫేమస్. తెలుగు లోగిళ్లలో మామిడి ఊరగాయ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆంధ్రా అవకాయ అయితే ఎల్లలు దాటి మరీ ఫేమస్ అయిపోయింది. -
బంగ్లాదేశ్ నుంచి మోదీ, దీదీలకు 2,600 కేజీల మామిడి పళ్లు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేమంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు మామాడి పళ్లు పంపించారు. హరిభంగా రకానికి చెందిన సుమారు 2,600 కిలోగ్రాముల మామిడి పండ్లను పంపించారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేబ్కు కూడా ఈ మామిడి పళ్లలో వాటా ఉంది. మామిడిపండ్లు సోమవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్కు చేరుకోగా.. ఆ తర్వాత వాటిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపించారు. మామిడిపండ్లు ఆదివారం బెనపోల్ పెట్రోపోల్ ల్యాండ్ బార్డర్ ద్వారా కోల్కతాకు చేరుకోగా.. ఆ తరువాత రైలు ద్వారా ఢిల్లీకి రవాణా చేయబడ్డాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ మాట్లాడుతూ, "మాకు చాలా తీపి, రుచికరమైన మామిడి పండ్లు ఉన్నాయి. మేము వాటిని పుష్కలంగా ఉత్పత్తి చేస్తాము. మేము మా ఆనందాన్ని మా మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాము. చారిత్రాత్మకమైన ముజిబ్ బోర్షోతో పాటు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాల సందర్భంగా రుచికరమైన మామిడి పండ్లను మా పొరుగువారు, స్నేహితులకు ఇచ్చి.. మా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాము’’ అని తెలిపారు. హరిభంగా మామిడి పళ్లను బంగ్లా వాయువ్య భాగంలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా రంగపూర్ జిల్లా వీటి సాగుకు ప్రధాన కేంద్రంగా ఉంది. గతంలో, పీఎం హసీనా ‘హిల్సా’ చేపలను పంపిన సంగతి తెలిసిందే. భారతదేశం-బంగ్లాదేశ్ మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీ ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాలతో పాటు బంగ్లా జాతిపిత బంగాబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జయంతి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య రవాణా, వాణిజ్యాన్ని పెంచడంపై రెండు దేశాలు దృష్టి సారించాయి. భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్ భూటాన్కు మామిడి పండ్లను పంపింది. అలానే నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాధ్యక్షులు, ప్రధానులకు సరుకులను పంపుతుంది. -
మీకు తెలుసా..? డయాబెటీస్ పేషెంట్లకు ప్రత్యేక మామిడి పండ్లు
మారుతున్న జీవన శైలి కారణంగా మనిషి శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటీస్. దీన్నే మధుమేహం, డయాబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. డయాబెటీస్.. చాపకింద నీరులా సోకే వ్యాధి. ఇక డయాబెటిస్ ఉన్నవారు ఏవైనా పండ్లు తీసుకోవాలనుకుంటే.. ముఖ్యమైన మామిడి పండ్లను తినాలంటే చక్కెర స్థాయి అధికంగా ఉంటుందేమో అని ఆందోళన చెందుతారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మార్కెట్లో చక్కెర స్ఠాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను విక్రయిసున్నారు. ఇస్లామాబాద్: పాకిస్తాన్కి చెందిన మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్ చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను కనుగొన్నారు. పాకిస్తాన్లో 'ఆమ్ ఆద్మీ' కోసం తక్కువ ధరలకు , ముఖ్యంగా డయాబెటీస్ పేషంట్స్ కోసం ఈ మామిడి పండ్లను విక్రయిసున్నారు. ప్రస్తుతం ఈ పండ్లు సోనారో, గ్లెన్, కీట్ పేర్లతో సింధ్ టాండో అల్లాహార్లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు. పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150 ‘‘సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి." అని మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్ తెలిపారు. 300 ఎకరాల పొలంలో 44 రకాలు దీనిపై ఎంహెచ్ పన్వర్ మేనల్లుడు మాట్లాడుతూ.. ‘‘ మామిడి, అరటితో సహా ఇతర పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పన్వర్కు సీతారా-ఇ-ఇమ్తియాజ్ను ప్రదానం చేసంది. అతని మరణం తర్వాత, నేను ఆ పనిని కొనసాగిస్తున్నాను. ఇక ఇక్కడి వాతావరణం, మట్టిని పరీక్షించిన తరువాత వివిధ రకాల మామిడి సండ్లను దిగుమతి చేసుకుని మార్పులు చేశాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకున్నా ప్రాజెక్టును వ్యక్తిగత ప్రాతిపదికన నడుపుతున్నామని, ప్రస్తుతం తమకు ఉన్న 300 ఎకరాల పొలంలో 44 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి.’’ అని తెలిపారు. చదవండి: లాడెన్ అమరవీరుడంటూ నోరు జారిన ఇమ్రాన్.. వరుస వివరణలు పుల్వామాలో ఉగ్రదాడి కలకలం -
ప్రతి పంటకూ మద్దతు ధర కల్పిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పండిన ప్రతి పంటకూ మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రతి రైతుకూ మద్దతు ధర వచ్చేలా చూస్తున్నామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఈ ఏడాది మామిడి సీజన్లో 27 కిసాన్ రైళ్ల ద్వారా 16 వేల మెట్రిక్ టన్నుల మామిడిని ఎగుమతి చేసి రైతులకు మద్దతు ధర కల్పించినట్టు వెల్లడించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్తో కలిసి శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మామిడి కిలోకు సరాసరి ధర రూ.12కు తగ్గకుండా చూస్తున్నామని హామీ ఇచ్చారు. అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రాసెసింగ్ యూనిట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ కమిషనర్ ప్రతి వారం చిత్తూరు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. తప్పుడు ప్రచారంతో మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయొద్దు కొందరు మామిడిపై తప్పుడు ప్రచారంతో మార్కెట్లో సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నారని మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతుల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని అందరినీ కోరుతున్నామన్నారు. దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. మామిడి రైతులకు సరైన ధర రాదు అనే భయాన్ని కల్పించవద్దని కోరారు. ధరల స్థిరీకరణపై ప్రతి రోజూ సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కోవిడ్ రెండో దశ మొదలైనప్పటి నుంచి ఉద్యాన రైతులు పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలోని ఉద్యాన రంగంలో ఉన్న 256 ఎఫ్పీవో (రైతు సంఘాలు)లను వ్యాపారులు, మార్కెట్లతో అనుసంధానం చేసినట్టు తెలిపారు. ఏపీకి ప్రధాన మార్కెట్లయిన ఢిల్లీ, ముంబై, చెన్నైలోని కమిషనర్లు, మార్కెటింగ్ సెక్రటరీలు, పోలీసులతో మాట్లాడి రవాణా, ఎగుమతులకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. మామిడి తోటలన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్లో నమోదయ్యాయని, ఆ డేటాను బట్టి అక్కడి వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు ఏం చేయాలో చెప్పామన్నారు. కరోనా విపత్తు వల్ల పంట కోత సమయాల్లో కర్ఫ్యూ అమల్లో ఉన్నా రైతులు పండించిన పంటలను మార్కెట్కి తరలించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. పండ్ల రవాణాకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చూశామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఇంకా 30 శాతం మామిడి పంట జూలై చివరి నాటికి వస్తుందని తెలిపారు. 2 వేల గోడౌన్లకు 8న సీఎం శంకుస్థాపన వైఎస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా జూలై 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2 వేల గోడౌన్లు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తున్నారని మాలకొండయ్య తెలిపారు. దశలవారీగా రానున్న ఏడాది కాలంలో ప్రతి మేజర్ పంచాయతీలో ఒక గోడౌన్, ప్రతి ఆర్బీకేలో 500 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణాం చేపట్టాలన్నది సీఎం ఆలోచన అని తెలిపారు. వెయ్యి మెట్రిక్ టన్నుల గోడౌన్స్ నిర్మాణానికి కూడా ప్లాన్ చేస్తున్నామని, వీటివల్ల రైతులు వారి ఉత్పత్తులను అక్కడే నిల్వ చేసుకోవచ్చన్నారు. ఉద్యాన పంటల కోసం ప్రతి ఆర్బీకేలో కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియతో పాటు అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. ప్రతి జిల్లాలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, నూజివీడులో మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్, తూర్పుగోదావరిలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. అలా 25 చోట్ల ఫల ఉత్పత్తులకు సంబంధించి సుమారు రూ.2,500 కోట్లతో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. సాగు విస్తీర్ణం పెరిగింది ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని మాలకొండయ్య తెలిపారు. మార్కెట్లో ఉద్యాన శాఖ మార్కెట్ జోక్యం వల్ల రైతులకు భరోసా లభించిందన్నారు. దీనివల్ల ఏడాది కాలంలోనే రైతులు ఇతర పంటల నుంచి సుమారు 65 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటల వైపు మళ్లారని తెలిపారు. ఉద్యాన శాఖలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, డ్రోన్ల ద్వారా ఎరువులు స్ప్రే చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇతర పంటలకూ మంచి ధరలు రాష్ట్రంలోని రైతులు పండించిన ఇతర పంటలకూ మంచి ధరలు లభించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయని మాలకొండయ్య పేర్కొన్నారు. క్వింటాల్ పసుపునకు రూ.6,850, మిరపకు రూ.7 వేలు, బత్తాయికి రూ.1,450, ఉల్లికి రూ.750, అరటికి రూ.800, చిరు ధాన్యాలకు రూ.2,500 ధర కల్పించామన్నారు. వరి పంట కాకుండా ఇతర పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటివరకూ రూ.6 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్రం కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటించని పంటలకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శ్రేణీకృత మద్దతు ధర (గ్రేడెడ్ ఎంఎస్పీ)లను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. వేరుశనగ ఏ గ్రేడ్కు కేంద్రం ఎంఎస్పీ ప్రకటిస్తుందని, బి గ్రేడ్ పండించిన రైతులకునా ధర లభించదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రేడెడ్ ఎంఎస్పీ ప్రకటించారు. పొగాకు బోర్డు గుంటూరులో ఉన్నా కోవిడ్ సమయంలో వాళ్లు ఏమీ చేయలేకపోయారని, సీఎం ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుని రైతులకు మంచి ధర వచ్చేటట్టు చేయగలిగిందని గుర్తు చేశారు. -
7 మామిడి పండ్లకు నలుగురు బాడీగార్డ్స్.. ఎందుకో తెలుసా!
భోపాల్: వేసవికాలం వచ్చిందటే మనకు ముఖ్యంగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు ..ఒకటి మండే ఎండలు..రెండోది మామిడి పండ్లు... మమాలుగా సీజన్ ఉన్నప్పుడు ఒక కేజీ మామిడి పండ్ల రేటు ఎంత ఉంటుంది.. మహా అయితే రూ. 50, అసలు మామిడి పండ్ల దిగుబడి మరి తక్కువగా ఉన్నప్పుడు రూ. 100-150 వరకు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జబల్పూర్ వాసి పండించిన మామిడి పండ్లు ఒక కేజీ ఏకంగా రూ. 2 లక్షల 70వేలు. ఏంటి షాక్ గురవుతున్నారా..! కేజీ మామిడి పండ్లు మరి ఇంతా ధర ఉంటాయాని విస్తుపోతున్నారా.. అవును మీరు చూసింది నిజమే..! ఒక కేజీ మామిడి పండ్ల ధర అక్షరాల రెండు లక్షల డెభైవేలు. ఈ మామిడి పండ్లు ప్రపంచంలోనే చాలా అరుదైనవి. జబల్పూర్కు చెందిన పరిహర్ ఈ మామిడి పండ్లను పండిస్తున్నాడు. ఈ పండ్లు జపాన్కు చెందిన మియాజాకి అనే అరుదైన మామిడి వంగడం. పరిహర్ చెన్నై వెళ్తున్న సమయంలో రైలులో ఉన్న వ్యక్తి తనకు ఈ మామిడి మొక్కను ఇచ్చాడని తెలిపాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధర పలికే జపనీస్ మియాజాకి మామిడి వంగడమని అతనికి తెలియదు. ప్రస్తుతం ఈ చెట్టుకు కాసిన ఏడు మామిడి పండ్లను కాపాడటం కోసం ఏకంగా నలుగురు కాపల సిబ్బందిని, ఆరు కుక్కలను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఒక వ్యాపారవేత్త ఒక మామిడి పండు కోసం ఏకంగా రూ. 21 వేలను వెచ్చించి తీసుకున్నాడు. చదవండి: ఇన్స్టాగ్రామ్లో బగ్ గుర్తించి, ఏకంగా 22 లక్షలు దక్కించుకున్నాడు! -
4,000 కిలోల మామిడి పండ్లు ద్వంసం.. ఎందుకంటే?
చెన్నై: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. అయితే కొందరు వ్యాపారులు వాటిని పండించడానికి పెస్టిసైడ్స్ వినియోగంచడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. తాజాగా తమిళనాడులోని త్రిచి జిల్లాలో కృత్రిమంగా పండించిన ఓ నాలుగువేల కిలోల మామిడి పండ్లను ఆహార భద్రతా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. శనివారం గాంధీ మార్కెట్లో రసాయనాలు పిచికారీ చేసి మామిడి పండ్లను పండించినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో జిల్లాలోని ఆహార భద్రతా విభాగ బృందం ఆఫీసర్ ఆర్ రమేశ్ బాబు నేతృత్వంలో గాంధీ మార్కెట్లోని పది గోడౌన్లపై దాడి చేశారు. పండ్లను కృత్రిమంగా పండించడానికి మూడు గోడౌన్లలో ఇథిలీన్ వాడినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు విక్రేతలను హెచ్చరించారు. చదవండి: ప్రజలు మేకలా.. మంత్రులు తోడేళ్లా! -
మామిడి దౌత్యం.. పాక్కు చైనా సహా 32 దేశాల ఝలక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్కు మామిడి పండ్ల షాక్ తగిలింది. స్నేహపూర్వకంగా పండ్లు పంపిస్తే.. వద్దని తిప్పి పంపించాయి కొన్ని దేశాలు. ఈ లిస్ట్లో మిత్ర దేశం చైనాతో పాటు అమెరికా, కెనెడా, నేపాల్, శ్రీలంక.. ఇలా 32 దేశాలున్నాయి. అయితే ఈ మామిడి పండ్ల దౌత్యాన్ని ఆయా దేశాలు సున్నితంగానే తిరస్కరించాయి. కరోనా వైరస్ క్వారంటైన్ కారణంగా చూపిస్తూ మామిడి పండ్లను వెనక్కి పంపాయి. ఈ మేరకు పాకిస్థాన్ విదేశీ కార్యాలయానికి ఆయా పార్శిళ్లు వెనక్కి వచ్చేశాయి. కాగా, మేలిమి రకాలైన అన్వర్రొట్టోల్, సింధారి రకాలు కరోనా ప్రభావంతో ఈసారి పండించకపోవడంతో.. చౌన్సా రకపు మామిడి పండ్లను పాక్ అధ్యక్షుడు డాక్టర్ అరిఫ్ అల్వి పేరు మీదుగా ఆయా దేశాలకు పంపింది పాక్. గల్ఫ్ దేశాలు టర్కీ, యూకే, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, రష్యా సహా.. అన్ని దేశాలు వద్దని పంపించడం విశేషం. ఇక ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయానికి పంపినట్లు పాక్ చెప్తున్నప్పటికీ.. అవతలి నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, ప్రతీ ఏడాది ఇలా స్నేహ పూర్వక సంబంధాల కోసం పాక్ ఇతర దేశాల నేతలకు మామిడి పండ్లు పంపడం ఆనవాయితీగా వస్తోంది. 2015లో నరేంద్ర మోదీ, ప్రణబ్ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి, సోనియా గాంధీకి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీప్ మామిడి పండ్లు పంపించాడు కూడా. -
ఈ మామిడి పండు ఖరీదు రూ.1000 గురూ.. ఎందుకంటే!
ఇండోర్: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. బంగిన్పల్లి, రసాల్ వంటి రకారకాల పండ్ల ధరలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మధ్యప్రదేశ్కు చెందిన ‘నూర్జాహాన్’ రకం మామిడి పండు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆప్ఘాన్ మూలానికి చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండిస్తారు. అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు పేర్కొంటున్నారు. "నా పండ్ల తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్లు చేసుకుంటారు. అయితే ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉంటుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజీల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది." అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు . (చదవండి: చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు) -
మామిడి కాపు బాగుంది.. కరోనా కాటేసింది
నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా): సముద్ర తీరంలో ఇసుక నేలలో పండే మొగల్తూరు మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. మామిడి రకాల్లో ఈ రకం రుచి మధురంగా ఉండటంతో దీనికోసం ఆహారప్రియులు ఏడాదంతా ఎదురుచూస్తారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. డిమాండ్ అధికంగా ఉండటంతో మొగల్తూరు మామిడి ధరలు అదేస్థాయిలో ఉంటాయి. ధర, ఎగుమతులు బాగుండటంతో సాగు చేసిన రైతులు లాభాలను గడిస్తుంటారు. అయితే రెండేళ్లుగా మొగల్తూరు మామిడి రైతుల పరిస్థితి మారింది. కరోనా ప్రభావంతో కాపు బాగున్నా స్థానికంగా బేరాలు లేక రైతులు నష్టపోతున్నారు. మరోవైపు ఎగుమతులు తగ్గడంతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. మిగిలిన రకాలతో పోలిస్తే ఇవి ఆలస్యంగా కాపు కాస్తారు. ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది దిగుబడి బాగా పెరిగింది. ప్రస్తుతం మొగల్తూరు ప్రాంతంలో మామిడి తోటలు పండ్లతో కళకళలాడుతున్నాయి. గిరాకీ బాగు మొగల్తూరు, పేరుపాలెం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో దాదాపు 600 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. పండ్ల రకాలైన బంగినపల్లి, చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొత్తపల్లి కొబ్బరి, పచ్చళ్ల రకాలైన సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్లు రకాలకు డిమాండ్ ఉంది. ముఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. జిల్లాలోని దూర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి పండ్లు, కాయలు కొంటుంటారు. రైతులే వ్యాపారులై.. సాధారణంగా మామిడి తోటలకు మచ్చతెగులు, మంచు తెగులు వంటి వ్యాధులు సోకి రైతులు ఇబ్బందులు పడతారు. ఈదురుగాలులతో పిందెలు, కాయలు రాలిపోయి ఇబ్బంది పడతారు. అయితే ఈ సీజన్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటారు. ఒక్కో చెట్టును రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకూ విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో ముందుగా రైతులకు, వ్యాపారులకు మధ్య బేరసారాలు పెద్దగా జరగలేదు. దీంతో రైతులే నేరుగా వ్యాపారుల అవతారం ఎత్తి అమ్మకాలు ప్రారంభించారు. ఎగుమతులు లేక.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ మార్కెట్కు మొగల్తూరు మామిడి ఎగుమతి అవుతూ ఉంటుంది. సీజన్లో సుమారు 150 లారీల వరకు సరుకు ఎగుమతి చేస్తుంటారు. సీజన్లో మామిడి పండ్లు పరక (13 కాయలు) రూ.500 ధర పలుకుతాయి. అయితే ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గింది. ప్రస్తుతం పరక కాయలు రూ.200 లోపు ధర పలుకుతున్నాయి. అయినకాడికి అమ్ముకుంటూ.. నాకు ఎకరా మామిడి తోట ఉండగా మరో రెండెకరాలను రూ.2 లక్షలకు కౌలుకు తీసుకున్నాను. ఇప్పుడు ఎగుమతులు లేకపోగా స్థానిక మార్కెట్లు కూడా పెద్దగా సాగడం లేదు. దీంతో అయినకాడికి కాయలు అమ్ముకుంటున్నాం. గతంలో ఇక్కడి బంగినపల్లి కాయ ఒకటి రూ.50 ధర పలకగా ప్రస్తుతం రూ.20 కూడా లేని పరిస్థితి. చాలా మంది నేరుగా తోటల్లోకి వచ్చి కాయలు కొనుక్కుని దూర ప్రాంతాల్లో ఉండే తమ బంధువులకు పంపేవారు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు లేవు. – అయితం నాగేశ్వరరావు, రైతు మొగల్తూరు కాపు బాగా కాసింది ఈ ఏడాది కాపు చాలా బాగుంది. గతంలో కాపు సరిగా లేక, మరోపక్క తెగుళ్లతో ఇబ్బంది పడేవాళ్లం. ఈసారి కాపు బాగుండటంతో తోటలతో ఆదాయం కూడా పెరుగుతుందని అనుకున్నాం. అయితే నిరాశ ఎదురైంది. మొగల్తూరులో రోజువారీ జరిగే మార్కెట్లో కూడా మామిడి పండ్లకు ధర రావడం లేదు. త యారైన పండ్లను చెట్లకు ఉంచలేక వచ్చిన ధరకు అమ్ముతున్నాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. గతంలో మొగల్తూరు మామిడి అంటే జనం ఎగబడేవారు. – వెల్లి సురేష్, రైతు, మొగల్తూరు -
ఉద్దానం మామిడి రుచి చూశారా? యమ టేస్టీ
కవిటి: వాతావరణం సహకరించడంతో ఉద్దానం ప్రాంతంలో మామిడికాయలు విరగకాశాయి. పైగా ఉద్దానం మామిడి రుచిగా ఉంటుండడంతో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు స్థానిక వర్తకులు, దళారీలతో ముందస్తు ఒప్పందం ప్రకారం కాయలను బరంపురం రవాణా చేస్తున్నారు. ఉద్దానంలో పండే కొబ్బరి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు ప్రధాన మర్కెట్ ఒడిశా. కొన్ని దశాబ్దాలుగా ఇదే రీతిలో వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం లాక్డన్ కారణంగా ఒకపూట మాత్రమే లావాదేవీలకు ఆస్కారం ఉండడంతో వ్యాపారాలు పరిమితంగా సాగుతున్నాయి. ఒడిశా అంబోమార్కెట్కు రోజుకు 150 లోడులు టాటామ్యాక్సీ పికప్ వ్యానులలో ఉద్దానం నుంచి మామిడికాయలు వస్తున్నట్టు వర్తకులు చెబుతున్నారు. కలెక్టర్ రకం టన్ను రూ.8000, దేశవాళీ రకం టన్ను రూ.6000, బంగినపల్లి రకం టన్ను రూ.15,000 ధర పలుకుతోందని అంటున్నారు. రైతులు ఎవరైనా కాయలు కోసి తీసుకువస్తామంటే తామే వాహనం పంపిస్తామని, అన్లోడింగ్ అయినవెంటనే డబ్బులు చెల్లిస్తామని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఉద్దానంలో పంట కూడా ఇప్పుడేపక్వానికి వచ్చేదశలో ఉంది. నీలాల రకం ఇప్పటికీ లేత దశలోనే ఉన్నాయి. జగన్నాథ రథయాత్ర సమయానికి కోతకు వస్తాయి. మరో 10 రోజుల్లో అంబామావాస్యా (ఒడిశాలో పేరుగాంచిన పండుగ)కు పనస, మామిడిపళ్లను ఒడిశావాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. తరతరాలుగా ఇదే పంథా.. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పండి కొబ్బరి, మామిడి, పనస పంటలను ఒడిశా ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్దానం పంటను ఒడిశావాసులు ఓ బ్రాండ్ ఇమేజ్గా భావిస్తారు. గత కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. - పాతిన చంద్రశేఖరం, రైతు, ముత్యాలపేట, కవిటి మండలం ముందు శాంపిల్ తీసుకెళతాం చిక్కాఫ్ రైతు సంఘంలో కొంతమంది రైతులు తమ సొంత చెట్లలో పంట కోసి మ్యాక్సివ్యాన్లో లోడ్ చేసి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు లోడు తీసుకువెళ్తుంటారు. అక్కడ ఒప్పందం కుదిరితే మరికొన్ని లోడులు వెళ్తాయి. - ఆరంగి శివాజీ, చిక్కాఫ్ మేనేజింగ్ డైరెక్టర్, కవిటి మండలం -
నోరూరించే ఆవకాయలు.. ఆకాశానికి ధరలు!
సాక్షి, నల్గొండ : వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడికాయ పచ్చడి వైపే ఉంటుంది. ఇటీవల ఎక్కువగా తయారు చేసిన పచ్చళ్లు కొనుక్కునే వాళ్లంతా ప్రస్తుతం లాక్డౌన్ కలిసి రావడంతో సొంతంగా తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంటి పట్టున ఉన్న మహిళలంతా మామిడికాయ పచ్చడి తయారు గురించే ముచ్చటించుకుంటున్నారు. ఇంట్లో పెద్ద వారి సూచనలతో ఇంటిళ్లి పాది ఆవకాయ తయారీలో ఓ చేయి వేస్తున్నారు. చెక్క పచ్చడి, తరుగుడు పచ్చడి, అల్లం వెల్లిపాయ ఆవ, ఉప్పు ఆవ, బెల్లం ఆవ, నువ్వుల పచ్చడి తదితర ఎన్ని పేర్లున్నా అనిర్వనీయమైన రుచి ఆవకాయ సొంతం. అయితే ఇటీవల ఈదురు గాలులకు మామిడి కాయలు దెబ్బతిని కొంత కొరత ఏర్పడటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పచ్చడి మామిడి కాయ ఒక్కటి రూ.10 నుంచి రూ.15 వరకు పలుకుతుంది. పెరిగిన సామగ్రి ధరలు.. పచ్చడి తయారీలో ప్రధానమైన వంట సామగ్రి అయిన నూనె, అల్లం, వెల్లుల్లి, కారం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. పచ్చడి తయారీకి వినియోగించే నువ్వుల నూనె బ్రాండ్ను బట్టి కేజీ రూ.400 వరకు విక్రయిస్తున్నారు. పల్లీ నూనె అయితే కేజీకి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అల్లం కిలో రూ.50, వెల్లుల్లి రూ.80లకు విక్రయించగా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం అల్లం రూ.90, వెల్లుల్లి రూ.120 వరకు పెరిగింది. మామిడికాయ పచ్చళ్లలో ఉపయోగించే మిరప బ్రాండ్ను బట్టి కేజీకి రూ.400 నుంచి రూ.500 వరకు ఉన్నవి. కిలో పచ్చడికి సుమారు రూ.500 వ్యయం.. కిలో పచ్చడి తయారీకి సాధారణంగా పావుకిలో నూనె, పావుకిలో ఉప్పు, 125 గ్రాముల కారం పొడి, అర కిలో అల్లం వెల్లుల్లితో పాటు మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి వినియోగిస్తారు. ఆయా సరుకులతో పాటు మామిడి కాయలు.. అన్నింటి వ్యయం కలిపి కిలోకు రూ.500 ఖర్చవుతోంది. గతంలో ఒక్కో కుటుంబం 100 నుంచి 150 కాయల వరకు పెట్టే వారు. ప్రస్తుతం ఎక్కువగా బీపీ, షుగర్ జబ్బులు వస్తుండడంతో ఉప్పు ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి లేదు. దీంతో 20 నుంచి 50 కాయల వరకే పెడుతున్నామని మహిళలు చెబుతున్నారు. ధరలు బాగా పెరిగాయి గతంలో మామిడికాయలకు అల్లం వెల్లుల్లి, కారం, ఇతర వస్తువులకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు అధికంగా పెరగడంతో ఆర్థిక భారం అవుతోంది. అయినా ప్రతి వేసవిలో మారిగానే.. ఈ సారి కూడా పచ్చడి పెడుతున్నాం. – జి.హేమలత, గృహిణి, తిరుమలగిరి -
Girdling, Ring Barking: పాత చెట్లకు కొత్త ఊపు!
పాత తరం మామిడి చెట్లకు క్రమేణా కాపు తగ్గిపోతుంటుంది. దీంతో, కొందరు రైతులు పాత చెట్లను మొదలంటూ నరికేసి.. కొత్తగా మళ్లీ మొక్కలు నాటుతూ ఉంటారు. కానీ, బాగా పాత చెట్ల కొమ్మల బెరడును కొద్ది మేరకు కత్తిరించి వలిచెయ్యటం ద్వారా ఆ పాత చెట్ల ద్వారా కూడా అధిక మొత్తంలో పండ్ల దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా, పాత చెట్టు కొమ్మను కత్తిరిస్తే.. ఆ మొండి కొమ్మలకే విస్తారంగా కాయలు కాస్తాయి. ఇటువంటి ప్రయోగాలు రైతులు, శాస్త్రవేత్తలకు తెలియనివి కాకపోయినప్పటికీ.. గుజరాత్కు చెందిన రాజేష్ షా, ఈడ్పుగల్లుకు చెందిన శ్రీనివాస్ల అనుభవాలు ఆసక్తిగొలుపుతున్నాయి. 35 ఏళ్లు దాటిన చెట్లకే..! 35–40 ఏళ్ల క్రితం నాటిన పాత మామిడి చెట్ల కాపు తగ్గిపోవటం సహజమే. ఇటువంటి చెట్ల కాండానికి బెజ్జం వెయ్యటం వంటి చిట్కాల ద్వారా పండ్ల దిగుబడిని పెంపొందించుకోవడం చిరపరిచితమైనదే. గుజరాత్కు చెందిన రాజేష్ షా తోటలో 65 ఎకరాల్లో అల్ఫాన్సో, కేసర్ వంటి రకాల మామిడి చెట్లు వందల కొద్దీ ఉన్నాయి. వాళ్ల తాత కాలం నుంచీ ఆ తోట ఉంది. పాత చెట్లకు కాపు ఏటేటా తగ్గిపోతుండటంతో షా ‘గిర్డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్’ చిట్కాను ప్రయోగించడం పాతికేళ్ల క్రితమే ప్రారంభించారు. పాత పండ్ల చెట్టు కాండం లేదా కొమ్మ లేదా రెమ్మలకు చుట్టూ బెరడును కత్తిరించి తీసెయ్యటమే హార్టీకల్చర్ పరిభాషలో ‘గిర్డ్లింగ్ లేదా రింగ్ బార్కింగ్’ అంటే. 15 ఏళ్ల తర్వాత గానీ ఈ పనిలో తనకు పూర్తిస్థాయి నైపుణ్యం చేకూరలేదంటారాయన. ఈ సంవత్సరం 75 కొమ్మలకు గిర్డ్లింగ్ చేశారాయన. రింగ్ బార్కింగ్ చేసేదెలా? శుభ్రమైన, పదునైన చాకుతో అంగుళం వెడల్పున చెట్టు కాండం చుట్టూతా కత్తిరించి, బెరడును తొలగించాలి. ఆ గాయంలో నుంచి చెట్టుకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి క్రిమిసంహారక మందు లేదా స్థానికంగా రైతులు తయారు చేసుకునే పేస్ట్ను పూయాలి. అంతే, చెట్టు ఆ ప్రాంతానికి ముఖ్యమైన పోషకాలను అందించడానికి కత్తిరించిన ప్రాంతంలో కొత్త పొరలను అభివృద్ధి చేస్తుంది. తద్వారా పోషకాలు పుష్కలంగా అంది చెట్టు కాపు పెరుగుతుంది. గాలిలో తేమ 70% మేరకు ఉండే దీపావళి కాలంలో రింగ్ బార్కింగ్ చేయటం వల్ల తమ తోటలో చెట్లకు ఉపయోగపడిందని షా తెలిపారు. 35 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న చెట్లకు, నేల పై నుంచి 15–20 అడుగుల కన్నా ఎత్తున్న కొమ్మలకే రింగ్ బార్కింగ్ టెక్నిక్ సమర్థవంతంగా పని చేస్తోందని షా వివరించారు. అంతేకాదు, కాండం లేదా కొమ్మల చుట్టుకొలత కనీసం 12 (30 సెం.మీ.) అంగుళాల మేరకు ఉంటేనే ఈ చిట్కా బాగా పని చేస్తున్నదని షా వివరించారు. గాటు పెట్టి బెరడు తీసేసిన పై ప్రాంతంలో కొమ్మల్లో కాపు చాలా ఎక్కువగా వస్తుందని, పండ్లు పెద్దగా, తియ్యగా ఉంటాయని ఆయన చెబుతున్నారు. 125, 100, 80 ఏళ్ల క్రితం నాటిన చెట్లకు కూడా ఈ టెక్నిక్ ద్వారా మంచి పండ్ల దిగుబడిని పొందానని సంబరపడుతున్నారాయన. కొమ్మ కత్తిరిస్తే.. గుత్తులు..! 45 ఏళ్ల నాటి మామిడి చెట్టు కొమ్మను కత్తిరిస్తే ఆ మోడుకు ఆశ్చర్యకరంగా గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాస్తున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో దేశవాళీ రకం మామిడి చెట్టుకు వింతగా ఎక్కువ మొత్తంలో కాసిన కాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనా వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఆయన తండ్రి కోటేశ్వరరావు 45 ఏళ్ల క్రితం దేశవాళీ మామిడి విత్తనాన్ని నాటారు. ప్రస్తుతం అది మహా వృక్షంగా మారింది. పీచు లేకుండా, ముదురు పసుపు రంగులో తియ్యని గుజ్జుతో కూడిన ఈ చెట్టు పండ్లు రుచికరంగా ఉన్నాయి. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ చెట్టు కాస్తుందని శ్రీనివాస్ తెలిపారు. ఏ ఎరువూ వెయ్యటం లేదు.. కొమ్మలు బాగా విస్తరించటంతో అడ్డుగా ఉన్న కొమ్మలను రంపంతో రెండేళ్ల క్రితం కత్తిరించారు. అలా కత్తిరించిన ప్రదేశంలో గుత్తులుగా కాయలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మరికొన్ని కొమ్మలను కత్తిరించారు. కత్తిరించిన ప్రతి చోటా గుత్తులు గుత్తులుగా కాయలు కాశాయి. మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉన్న రకం. సేంద్రియ/రసాయనిక ఎరువులు ఏవీ వెయ్యటం లేదు. నీరు పెడుతున్నాం అంతే అన్నారాయన. విషయం తెలుసుకున్న డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. టి. జానకిరాం తదితర ఉద్యాన శాస్త్రవేత్తలు ఇటీవల ఈ దేశవాళీ మామిడి చెట్టు వైభవాన్ని సందర్శించి రైతును ప్రశంసించారు. 45 ఏళ్ల నాటి దేశవాళీ మామిడి చెట్టు జన్యు వనరుల పరంగా ఎంతో విలువైనదని అంటూ మెరుగైన వంగడాల అభివృద్ధి కోసం జరిపే పరిశోధనల్లో ఈ జన్యు వనరును ఉపయోగిస్తామని తెలిపారు. వాణిజ్య దృష్టితో కాకుండా దేశవాళీ రకం పండ్ల రకాలను మక్కువతో పెంచడమే తనకు ఇష్టమని శ్రీనివాస్ (93929 22007) సంతోషంగా చెప్పారు. జామలో కూడా ఈ టెక్నిక్ను ప్రయోగిస్తున్నానన్నారు. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు అధిక పోషకాల నిల్వ వల్లనే..! మామిడి చెట్ల కొమ్మలను డిసెంబర్, జనవరి నెలల్లో పూతకు ముందుగా నరకడం ∙కొన్ని సందర్భాలలో కొమ్మలపైన చిగురు కాకుండా పూత రావడం, పిందె కట్టడం జరుగుతుందని డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. టి.జానకిరామ్ తెలియజేశారు. కార్బోహైడ్రేట్స్ అధిక శాతం నిల్వ వలన, కార్బన్–నత్రజని శాతంలో వ్యత్యాసం వలన నరికిన కొమ్మలకు కాయలు గుత్తులుగా వస్తాయన్నారు. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులోని పర్వతనేని శ్రీనివాస్ తోటలోని దేశవాళీ మామిడి చెట్టుకు కొమ్మలపైన గుత్తులు గుత్తులుగా కాసిన మామిడి పండ్లను ఉపకులపతి డా. టి.జానకిరామ్ పరిశీలించారు. పరిశోధన సంచాలకులు డా. ఆర్విఎస్కె రెడ్డి, నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. శ్రీమతి బి. కనకమహాలక్ష్మి, కంకిపాడు ఉద్యాన అధికారి జి. లక్పతి, రైతులు ఆయన వెంట ఉన్నారు. రైతు శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వివిధ రకాలైన జామ, వాటర్ ఆపిల్, స్టార్ ఫ్రూట్, చెర్రిగోవా, నోని, మాల్టా బత్తాయి, బొప్పాయి మొక్కలను పరిశీలించారు. పరాగ సంపర్కానికి అవసరమైన తేనేటీగలను కూడా పెంచి తోటలలో ఫలదీకరణ శాతం పెరిగి దిగుబడి అధికంగా ఉంటుందని డా.జానకిరామ్ సూచించారు. -
నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు
కత్తివేటుకు ఒరిగిన కొమ్మే పట్టుగొమ్మై ఫలించింది. మామిడికాయలు విరగకాసింది. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులోని ఉపాధ్యాయుడు పర్వతనేని వెంకట శ్రీనివాస్ వ్యవసాయ క్షేత్రం ఈ అద్భుతానికి వేదికైంది. ఇక్కడ 40 ఏళ్ల క్రితం నాటిన దేశవాళీ మామిడి చెట్ల కొమ్మలను కొంతకాలం క్రితం నరికించారు. ప్రస్తుతం ఆ నరికిన కొమ్మకు గుత్తులు గుత్తులుగా మామిడికాయలు విరగకాసి అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఉద్యానవన శాఖాధికారులు, రైతులు ఈ చెట్లను తిలకించారు. –కంకిపాడు -
Mango Exports: తీపి తగ్గిన ‘మామిడి’!
సాక్షి, హైదరాబాద్: పండ్లను అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నా కొనేవారు పెద్దగాలేరు. ఆ పండ్లను తినేవారున్నా వారు కొనలేని పరిస్థితి. ఇదీ కరోనా సృష్టించిన విచిత్ర పరిణామం. ఒకవైపు అకాలవర్షం.. మరోవైపు పడిపోయిన అమ్మకాలు.. ఫలితంగా మామిడి రైతుకు కష్టాలు, నష్టాలు వచ్చిపడ్డాయి. మామిడి అమ్మకాలు పుంజుకోవాల్సిన ఈ సమయంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో స్థానికంగా డిమాండ్ లేదు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే పరిస్థితి లేదు. ధరలు మరింత పతనమై, రైతుల కష్టాలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఏ ఏ రకం.. ఎంతెంత విస్తీర్ణం.. ♦ రాష్ట్రంలో మామిడితోటల పెంపకం 3.07 లక్షల ఎకరాల్లో ఉండగా, వీటిద్వారా 12.34 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి చేస్తున్నారు. ♦ భారీ డిమాండ్ ఉన్న బంగినపల్లి మామిడి రకం విస్తీర్ణం 80–85 శాతం కాగా, హిమాయత్, దసేరి, కేసరి, మల్లికా, రసాలు వంటివి మిగతా విస్తీర్ణంలో సాగవుతున్నాయి. అమ్మకాలెందుకు పడిపోయాయంటే.. ♦ జగిత్యాల మామిడికి, నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మామిడికి విశేష ఆదరణ ♦ గతంలో దేశ విదేశాలకు, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లకు మామిడికాయలను ఎగుమతి చేసేవారు. ♦ ఈ ఏడాది ఏప్రిల్లో ఇరవై ఐదు రోజులపాటు కురిసిన అకాల వర్షాలతో ఉత్పత్తి 8 లక్షల టన్నులకు తగ్గుదల ♦ పండిన కాస్త మామిడిని అమ్ముకుందామనే సమయంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ విధింపు ♦ ఎగుమతులు తగ్గడం, బేకరీలు, స్వీట్ దుకాణాల్లేక జామ్ల తయారీ లేకపోవడం, మామిడి తాండ్ర పరిశ్రమలు మూతబడటంతో నిలిచిన మామిడి కొనుగోళ్లు ♦ వ్యాపారం పెద్దగా లేక హోల్సేల్ వ్యాపారులెవ రూ వీటి కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు ధరలు.. దిగుబడి ఇలా.. గత మే నెలలో మామిడి క్వింటాల్కు రూ.6 వేల నుంచి రూ.7 వేల ధర పలకగా, ఈసారి అది రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్యే ఉంది. రెండ్రోజుల కింద లాక్డౌన్ విధించడంతో రూ.3 వేలకు పడిపోయింది. మే నెలలో సాధారణంగా కొత్తపేట పండ్ల మార్కెట్కు రోజూ 1,700–1,800 టన్నుల మేర మామిడిపండ్లు వచ్చేవి. ఈ సీజన్లో 1,400–1,500 టన్నులకు పడిపోగా, గురువారం కేవలం 500 టన్నులు మాత్రమే వచ్చాయి. ప్రతిరోజు ఉదయం 10 తర్వాత మార్కెట్లు మూసివేయడం, బయట జన సంచారానికి అనుమతివ్వకపోవడంతో రిటైల్ వ్యాపారం సాగడం లేదు. ఇళ్ల వద్దకు చేరవేసే చర్యలేవీ? గత ఏడాది ఇదే మాదిరి ఇబ్బందులు తలెత్తిన సమయంలో ఉద్యాన శాఖ ఫోన్, ఆన్లైన్ బుకింగ్ల ద్వారా ఆర్డర్లు తీసుకొని పోస్టల్ శాఖ ద్వారా జంట నగరాల్లోని వినియోగదారుల ఇంటివద్దకే మామిడి పండ్లను చేరవేసింది. గేటెడ్ కమ్యూనిటీ, కాలనీ వాసులకు బల్క్ ఆర్డర్లపైనా మామిడిపండ్లను సరఫరా చేసింది. మే నెలలో రోజుకు వెయ్యి ఆర్డర్ల వరకు వచ్చినా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. దీంతోపాటు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్, జీడిమెట్ల ప్రాంతాల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొబైల్ వాహనాల ద్వారా సైతం అమ్మకాలు చేపట్టింది. అయితే, ఈ ఏడాది అలాంటి చర్యలేవీ లేకపోవడంతో మామిడి రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. -
పండ్లల్లో కాలకూట విషం
-
Mango Trees Marriage: మామిడి చెట్లకు పెళ్లి
రామడుగు (చొప్పదండి): మామిడి చెట్లు తొలికాత కాయడంతో ఓ రైతు గురువారం వాటికి కల్యాణం జరిపించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన కడారి వీరయ్య మూడేళ్ల క్రితం మూడెకరాలలో మామిడి మొక్కలు నాటాడు. ఈ ఏడాది అవి కాపునకు రావడంతో వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. -
ప్రతి రోజూ ‘పండు’గే.. ఏడాది పొడవునా మామిడి
సాక్షి, రాజస్థాన్: పండ్ల రారాజు మామిడి పండును ఆస్వాదించాలంటే వేసవికాలం కోసం ఎదురుచూడాల్సిన పనిలేదంటున్నారు రాజస్థాన్కు చెందిన శ్రీకిషన్ సుమన్. ఏడాది పొడవునా మామిడి పండు అందు బాటులో ఉంటుందని చెబుతున్నారు ఈ రైతు. రాజస్థాన్లోని కోటకు చెందిన శ్రీకిషన్ వినూత్న రకం మామిడిని అభివృద్ధి చేశారు. దీనికి సాధారణ మామిడిలో ఉన్న రోగ నిరోధక సామర్థ్యంతోపాటు ప్రధానమైన వ్యాధులను నిరోధించే శక్తి ఉందంటున్నారు. తియ్యటి ఈ మామిడిని అధిక సాంద్రత ఉన్న తోటల పెంపకంతో పాటు ఇంట్లో కుండల్లో సాగు చేయొచ్చని చెబుతున్నారు. మామిడి గుజ్జులో తక్కువ పీచుపదార్థం ఉంటుందని పోషకాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. రెండో తరగతి తర్వాత పాఠశాలకు స్వస్తి చెప్పిన సుమన్ కుటుంబ వృత్తి అయిన తోటపనిలో నిమగ్నమయ్యారు. కుటుంబ సభ్యులు గోధుమలు, వరి పండించడంపై ఆసక్తి చూపుతుంటే సుమన్ పూల పెంపకంపై దృష్టిపెట్టారు. గోధుమలు, వరిపై వర్షాలు, జంతువుల దాడి ప్రభావం ఉంటుందని, లాభాలు తక్కువగా ఉంటాయని సుమన్ గ్రహించారు. భిన్న రకాల రోజా పూల పెంపకంపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత మామిడిపైనా ఆయన దృష్టి మళ్లింది. 2000 ఏడాదిలో పండ్ల తోటలో ముదురు ఆకుపచ్చ రంగు ఆకులున్న ఓ మామిడి ఏడాదంతా పూతరావడం గుర్తించారు. దీంతో ఆ చెట్టు నుంచి ఐదు అంటు మొక్కలు వేసి సంరక్షణ ప్రారంభించారు. ‘సదా బహార్’ అని పిలిచే ఈ రకాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సుమన్కు ఏకంగా 15 సంవత్సరాలు పట్టింది. ఈ క్రమంలో అంటు మొక్కలు రెండేళ్లలో దిగుబడి ఇచ్చాయి. కొత్త రకాలను గుర్తించే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) సదాబహార్ను పరిశీలించి ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీ, ఫార్మర్స్ రైట్ యాక్ట్, ఐకార్-నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనటిక్ రీసోర్స్(ఎన్బీపీజీఆర్)లో రిజిస్టర్కు అనుమతించింది. రాష్ట్రపతి భవనంలోని మొఘల్ గార్డెన్లో ఈ మొక్కను నాటేలా చర్యలు తీసుకుంది. ‘ఎవర్ గ్రీన్’రకాన్ని అభివృద్ధి చేసిన శ్రీకిషన్ను ఎన్ఐఎఫ్.. తొమ్మిదో నేషనల్ గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్, ట్రెడిషినల్ నాలెడ్జ్ అవార్డుతో సత్కరించింది. దేశ విదేశాల నుంచి 2017-20 మధ్య ఏకంగా 8,000 ఆర్డర్లు వచ్చాయని సుమన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, గోవా, బిహార్, చత్తీస్గఢ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఛండీగఢ్ రాష్ట్రాల రైతులకు 2018-20 మధ్య సుమారు 6వేల మొక్కలు సరఫరా చేశానన్నారు. క్రిషి విజ్ఞాన్ కేంద్రాల్లో 500 మొక్కలుపైగా నాటామని, రాజస్థాన్, మధ్యప్రదేశ్ల్లోని పరిశోధన సంస్థలకు అందజేశానని సుమన్ తెలిపారు. చదవండి: కోళ్ల పెంపకంతో వేల ఆదాయం -
మామిడి కోసం క్యూ
-
ఇద్దరు చిన్నారులపై అమానుషం
-
పిందెలు తెంపారని.. పేడ తినిపించారు!
తొర్రూరు: తెలిసీతెలియక మామిడి పిందెలు తెంపడంతో ఆగ్రహించిన తోట కాపలాదారులు.. ఇద్దరు చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించారు. చేతులు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. పశువుల పేడ తినిపించి పైశాచికానందం పొందారు. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల శివారులోని బొత్తల తండాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోతు యాకూబ్, బానోతు రాములు శివారులోని మామిడి తోటకు కాపలాదారుగా ఉంటున్నారు. గురువారం తొర్రూరుకు చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మాపురంలో బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో మామిడి తోట వద్ద ఆగి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారు యాకూబ్ పరుగున వచ్చి చిన్నారుల చేతులు కట్టేసి చితకబాదాడు. అంతటితో ఆగకుండా పేడ నోట్లో కుక్కి మృగాడిలా వ్యవహరించాడు. దీనికి సంబంధించి తోట పక్క నుంచి వెళ్తున్న తండా వాసి ఒకరు తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సీహెచ్.నగేశ్ తెలిపారు. -
టన్ను బంగినపల్లె రూ.లక్ష..!
ప్రకాశం, ఉలవపాడు: చివరి దశ..మూడు ఎకరాల్లో బంగినపల్లె కాయలు టన్ను లక్ష రూపాయల రేటు పలికింది. ఉలవపాడు ఉద్యాన శాఖ పరిధిలో మామిడి కాయల సీజన్ పూర్తయింది. బంగినపల్లె కాయలు పూర్తయిపోయాయి. ప్రస్తుతం కేవలం బెంగళూరు, నీలం కాయలు మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ సోమవారం బంగినపల్లె కాయలు చివరలో పూసిన పూతకు వచ్చిన కాయలు టన్ను లక్ష రూపాయలకు కోశారు. గత పదేళ్లలో ఇదే బంగినపల్లె కాయలకు అత్యధిక రేటు. ఎన్నడూ లేని విధంగా కరోనా కష్టకాలంలో మామిడి కాయల రైతులు లాభాల బాట పట్టారు. టన్ను రూ.65 వేల వరకు బంగినపల్లె ఎగుమతులు జరిగాయి. చివరలో టన్ను లక్ష పలకడం విశేషం. -
కరోనా కాలంలో ఈ పండ్లు తింటే బేఫికర్!
పానీపూరీలు ఎప్పుడైనా తినొచ్చు.. ప్రస్తుతానికి నాలుగు నేరేడు పండ్లు పొట్టలోకి పంపుదాం. నూడుల్స్ రుచి తర్వాతైనా ఆస్వాదించవచ్చు.. ఇప్పటికి బత్తాయిల పని పడదాం. చాట్లు, బజ్జీలు చలికాలంలో తినొచ్చులే.. ఈ రోజుకు ద్రాక్ష, ఖర్జూరాలతో జిహ్వను ఊరుకోబెడదాం. సూపు బదులు నిమ్మరసం, సాధారణ టీ బదులు హెర్బల్ టీ.. కుండలో నీరు బదులు కాస్తంత అల్లం కలిపిన వేడినీరు. ఇలా చిన్న చిన్న మార్పులతో కరోనా కాలంలో వ్యాధి నిరోధక శక్తిని ఎంతో పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు సైతం ఫలాలతో ప్రతిఫలాలెన్నో అంటూ సామాజిక మాధ్యమాల్లో వివరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఏ పండులో ఏముందో తెలుసుకుందాం.. నేరేడు పండ్లు గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా లభించే పండ్ల జాతుల్లో నేరేడు పండ్లది అగ్రస్థానం. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి, శుభ్రపరచడానికి ఇవి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్న సమయంలో ధనియాలు రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడురసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపితీసుకోవాలి. నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్. జింక్, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. బొప్పాయి.. బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్లు మరే పండ్లలో లేవని వైద్యులు అంటారు. విటమిన్ ఎ, బీ, సీ, డీలు తగిన మోతాదులో ఉంటాయి. తరచూ బొప్పాయిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్పిన్ అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేస్తుంది. బొప్పాయి తినడం ద్వారా శరీరం ఉల్లాసంగా కూడా కనిపిస్తుంది. ఖర్జూరం.. ఏ పండైనా పండుగానే బాగుంటుంది. ఖర్జూరం మాత్రం ఎండినా రుచే. నట్గా మారిన ఎండు ఖర్జూరంలో నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది. సంప్రదాయ ఫలంగా కూడా ఖర్జూరానికి చాలా మంచి పేరుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేషం లాంటి వాటికి ఈ పండు గుజ్జు, సిరప్ మంచి ప్రయోజనకారి. పుచ్చ(వాటర్ మిలన్) వాటర్మిలన్(పుచ్చ) చాలా మందికి ఇష్టమైన పండ్ల జాతి. వేసవిలో వీటి వినియోగం ఎక్కువ. ఎండలో దాహార్తిని తీర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చేది పుచ్చకాయలే. వీటిని కాయలే అని అంటున్నప్పటికీ పండు మాత్రమే తినేందుకు ఉపయోగపడుతుంది. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. పనస పండ్ల జాతిలో అతి పెద్ద ఫలాలు ఇచ్చేది పనస చెట్టు మాత్రమే. ఒక పనసపండు 36 కిలోలు వరకూ కూడా ఉంటుంది. వైద్యపరంగా జీర్ణశక్తిని పనస పండు మెరుగుపరుచుతుంది. మలబద్దకం నివారిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గిస్తుంది. విటమిన్ సి ఉన్నందున వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ నివారణకు ఎంతో సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పైటో న్యూట్రియంట్స్ క్యాన్సర్ వ్యాధిని నివారిస్తాయి. కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, పాస్పరస్, మెగ్నిషీయం, మాంగనీస్, జింక్ వంటి ఖనిజాలు పనసలో పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ దానిమ్మ పండ్ల ద్వారా శరీరానికి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. సంతాన సౌఫల్యతను పెంచే శక్తి దానిమ్మపండ్లలో ఉంది. నారింజ నారింజ పండ్లలో రెండు రకాలు ఉన్నాయి. పుల్ల నారింజ, తీపి నారింజ, పుల్ల నారింజకాయలో నీరు అధికంగా ఉంటుంది. నారింజలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కరోనా కట్టడికి బాగా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలో దోహదపడుతుంది. గుండె బాగా పని చేసేటట్లు చేస్తుంది. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. నారింజలో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. మామిడి.. మామిడిని పండ్ల రాజు అంటారు. మామిడిలో 15 శాతం చక్కెర, ఒక శాతం మాంసకృత్తులు, తగిన శాతంలో విటమిన్ ఎ, బి, సి లతో పాటు కాల్షియం ఉంటుంది. మామిడి పండ్ల తినడం ద్వారా రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టవచ్చు. మామిడిపండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్లు నిపుణులు తెలిపారు. యాపిల్ పెక్టిన్ దండిగా ఉండే యాపిల్ పండ్లను తినడం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య వృద్ధి చెందుతుంది. యాపిల్లో కొవ్వు పదార్థాలు అత్యల్పంగా ఉంటాయి. పొటాషియం అధికంగా, విటమిన్ సి అధికంగా ఉంటుంది. పైనాపిల్.. సీతంపేట: జిల్లాలో అత్యధికంగా దొరికే ఫలాల్లో ఒకటి పైనాపిల్. మనకు చాలా సులభంగా దొరికే ఈ పండ్లతో ఎన్నో లాభాలుంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పైనాపిల్లో ఉండే పొటాషియం, సోడియం నిల్వలు ఒత్తిడి, ఆందోళనల నుంచి రక్షణ ఇస్తాయి. మలబద్దకం, పచ్చకామెర్ల వంటి వ్యాధులకు పైనాపిల్ దివ్యమైన ఔషధం. ఇందులో నీరు 87.8 గ్రాములు, ప్రొటీన్లు 0.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రాములు, పిండి పదార్థం 10.8 గ్రాములు, కాల్షియం 20 మిల్లీగ్రాములు, పాస్పరస్ 9 మిల్లీగ్రాములు, ఇనుము 2.4 మిల్లీగ్రాములు, సోడియం 34.7 మిల్లీగ్రాములు, పొటాషియం 37 మిల్లీగ్రాములు, మాంగనీస్ 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయని సీతంపేట వైద్యాధికారి నరేష్కుమార్ తెలిపారు. అరటిపండ్లు అరటి పండ్లలో 74 శాతం కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23 శాతం కార్బో హైడ్రేట్లు, 1 శాతం ప్రోటీనులు, 2.6 శాతం పైబరు ఉంటుంది. అరటి చాలా శక్తిదాయకమైనది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా మంచిది. శరీరంలో విష పదార్థాలను అరటిపండు తినడం ద్వారా తొలగించుకోవచ్చు. ద్రాక్ష.. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో కూడా ద్రాక్ష సాగు ఉంది. ఇండ్లపై వీటిని పెంచుతున్నారు. వీటి వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల్లబద్దకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. విటమిన్ సి, కే ఎక్కువ. కిస్మిస్లు కూడా అంతులేని ఖనిజాలను అందిస్తాయి. -
మధుర ఫలం.. చైనా విషం!
సాక్షి, సిటీబ్యూరో: మామిడి పండ్ల రుచి మధురాతి మధురం. అన్ని వర్గాల ప్రజలూ దీని రుచి ఆస్వాదించేందుకు మక్కువ చూపుతుంటారు. కానీ.. వ్యాపారుల అత్యాశ కారణంగా ఈ మధుర ఫలం విషతుల్యంగా మారుతోంది. త్వరగా పండించి విక్రయించేందుకు రసాయనాలు వినియోగిస్తున్నారు. ఫలితంగా పైకి నిగనిగలాడుతున్న పండ్లు ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్నాయి. కరోనా ప్రభావంతో పండ్ల మార్కెట్లో మామిడి కాయలను కేవలం లారీల్లోనే ఉంచి విక్రయించడానికి అధికారులు అనుమతిస్తే వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఎల్బీనగర్ తదితర ప్రాంతాల ఫంక్షన్ హాళ్లు, కోహెడ వెళ్లే దారిలో ఉన్న గోడౌన్లను అద్దెకు తీసుకొని కాయలను మగ్గించడానికి విషపూరితమైన చైనా పౌడర్ను వాడుతున్నారు. మార్కెట్ల అనుమతులు లేకపోవడంతో స్థానికంగా, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ఇక్కడే మామిడి కాయలను ప్యాకింగ్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ప్యాకింగ్ ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. కాలుష్య కార్బైడ్ నిషేధం.. చైనా పౌడర్లో కార్బైడ్ ఉందని విషయం గతంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో వెల్లడైంది. కార్బైడ్ ద్వారా మిగ్గించిన పండ్లను తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కార్బైడ్ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి ప్రియులు సంబరపడ్డారు. వ్యాపారులు రూట్ మార్చి కార్బైడ్కు బదులుగా చైనా పౌడర్తో మగ్గిస్తున్నారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడిన వ్యాపారులు త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈథలిన్ పౌడర్ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్తో కాయలను కొన్ని గంటల్లోనే పండ్లగా మార్చి విక్రయిస్తున్నారు. మామిడి కాయల్ని మగ్గించడానికి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ప్యాకింగ్ చేయడంలేదు.. మార్కెట్లో కేవలం మామిడి కాయల లారీల్లో ఉంచి విక్రయించడానికి అనుమతి ఉంది. అయితే.. మామిడికాయలను మార్కెట్ యార్డ్లో ప్యాకింగ్ చేయడం లేదు. వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు కొనుగోలు చేసిన కాయలను ఎల్బీనగర్తో పాటు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆహారభద్రత శాఖ నిబంధనల మేరకే కాయలను మగ్గించాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ -
ఈసారి పవన్ కళ్యాణ్ వాటిని పంపించలేదు
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ స్నేహానికి మంచి పేరుంది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. సినిమాల్లోనూ వాళ్లిద్దరూ ఒకే సీన్లో కనిపించారంటే కామెడీ పంట పండినట్టే. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. గతేడాది ఎన్నికల సమయంలోనూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్లో ఇంటిపట్టునే ఉంటున్న అలీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. పవన్ తనకు ప్రతి ఏడాది మామిడి పండ్లు పంపేవారని పేర్కొన్నారు. కానీ ఈసారి మాత్రం తనకు మామిడి పండ్లు అందలేదని కాస్త నిరాశకు లోనయ్యారు. (అలీ @ కలామ్) పాలిటిక్స్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది పంపించలేదేమోనని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదైనా వాటిని పంపుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రతి సంవత్సరం చిరంజీవి ఇంటి దగ్గర నుంచి ఆవకాయ పచ్చడి వచ్చేదన్నారు. కాగా పవన్ కళ్యాణ్తో కలిసి అలీ చివరిసారిగా కాటమరాయుడు సినిమాలో కనిపించారు. ఇదిలా వుండగా దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితం ఆధారంగా హాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో 'కలామ్' పాత్రను అలీ పోషిస్తున్నారు (నాగబాబు అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదు) -
నూజివీడు టు లండన్
సాక్షి, అమరావతి బ్యూరో: నూజివీడు మామిడి తొలిసారిగా లండన్ పయనమైంది. 16 టన్నుల నాణ్యమైన బంగినపల్లి మామిడి పండ్లను శనివారం వేకువజామున నూజివీడు నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు చేర్చారు. అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా నౌకలో లండన్ చేరుకుంటాయి. కృష్ణా జిల్లా నూజివీడుతో పాటు ప్రకాశం జిల్లా ఉలవపాడు ఏరియాలో పండిన బంగినపల్లి మామిడిని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపెడా) ద్వారా విజయనగరానికి చెందిన ఓ ఎగుమతి దారు కొనుగోలు చేశారు. ఈ మామిడిని నూజివీడు లోని ఇంటిగ్రెటెడ్ ప్యాక్ హౌస్లో గ్రేడింగ్ చేశారు. నాణ్యతకు అవసరమైన ప్రక్రియను అక్కడ ఉన్న వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పూర్తయ్యాక 5 కిలోల చొప్పున అట్టపెట్టెల్లో వీటిని ప్యాక్ చేసి కంటైనర్లో పేర్చారు. ఏసీ కంటైనర్ ద్వారా.. మామిడి పండ్లను రైతులు, ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో శనివారం వేకువజామున కంటైనర్లో విశాఖపట్నం పోర్టుకు పంపారు. అక్కడ నుంచి నౌకలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ కంటైనర్లో లండన్కు పంపుతారు. విశాఖపట్నం నుంచి లండన్కు నౌక చేరుకోవడానికి 28 రోజుల సమయం పడుతుంది. 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచడడం వల్ల మామిడి పాడవదు. ఇన్ని రోజులు సరకు పాడవకుండా ఉండేందుకు ప్యాక్ హౌస్లో ముందుగానే పెస్టిసైడ్ ట్రీట్మెంట్ కూడా చేశారు. 16 టన్నుల మామిడిని విశాఖ నుంచి లండన్ చేరవేసేందుకు నౌక యాజమాన్యం 2,500 డాలర్లు వసూలు చేస్తోంది. -
'రసం'లో విషం!
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మామిడి పండ్లు మధురం కాదు విషం. అవును మీరు విన్నది నిజమే. ఫల రాజుకు కార్భైడ్ సెగ తప్పడం లేదు. వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లు విషపూరితంగా మారిపోయాయి. మామిడి కాయలు పక్వానికి రాకముందే తెంపి కారై్బడ్తో మాగ పెట్టడంతో కేవలం ఒక రోజులోనే పండుగా మారుతున్నాయి. దీంతో పండ్లను తినాలనుకుంటున్న ప్రజలు డబ్బులుచెల్లించి మరీ రోగాలను కొని తెచ్చుకుంటున్నట్లుఅవుతోంది. కార్బైడ్ వాడితే కఠిన చర్యలు మామిడి పండ్లు పండించడం కోసం ఎవరూనా కార్బైడ్ వాడితే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. వీటితో పాటుగా ఇతర పండ్లను మాగపెట్టడానికి కార్బైడ్ వాడరాదు. వీటిని విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఈ కార్బైడ్తో శరీరంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. అందువలన పండ్లను విక్రయించే వారు ఈ కార్బైడ్ను వాడకుండా సాధారణ పద్ధతుల్లో పండ్లను మాగపెట్టాలి. –రవీందర్రావు, జిల్లా ఆహార భద్రత అధికారి, సిద్దిపేట మామిడి కాయలను చెట్ల పైనే పక్వానికి వచ్చే వరకు ఉంచినట్లయితే ఆ పండ్లు మధురంగా ఉంటుంది. అలా కాకుండా గడ్డిలో మాగ పెట్టినా కుడా ఆపండ్లు రూచిగానే ఉంటాయి. కానీ గడ్డిలో పెట్టి పండించాలంటే 3–5రోజుల సమయం పడుతుంది. దీంతో రైతులతో నాటుగా తోటలను గుత్తకు తీసుకున్న వ్యాపారస్తులు జిలాల్లోని మామిడి తోటల నుంచి, ఇతర జిల్లాల నుంచి కుడా మామిడి కాయలను దిగుమతి చేసుకుంటూ రసాయానాలతో మాగపెడుతున్నారు. దీంతో వేసవి ప్రారంభం నుంచే విషమున్న మామిడి పండ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కార్భైడ్ వాడకాన్ని నిషేధించింది. దీనికి బదులుగా ఇథిలీన్ గ్యాస్తో మామిడి పండ్లను మాగపెట్టవచ్చు. ఈ ఇథిలీన్తో మాగ పెట్టిన పండ్లు, సహజసిద్ధంగా గడ్డిలో మాగపెట్టిన పండ్లలాగే నాణ్యమైనవి. కార్బైడ్ పండ్లు వలన కలిగే నష్టాలు... కార్బైడ్తో పండించిన పండ్లతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్సర్, కాలేయం, క్యాన్సర్, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల బలహీనతలతో పాటుగా దీర్ఘకాలిక‡ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో సహజసిద్ధంగా మాగపెట్టిన మామిడి పండ్లను తినడం మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. మామిడి పండ్లను కార్బైడ్తో కాకుండా ఇథిలీన్ గ్యాస్ సహాయంతో కుడా మాగపెట్టవచ్చు. కానీ దీని నిర్వహణ ఖర్చుతో కుడుకున్నవి. దీంతో వ్యాపారస్థులు తక్కువ ఖర్చు ఉన్నటువంటి కార్బైడ్ వైపు మొగ్గుచూపుతున్నారు. అనారోగ్యాలకు తలుపులు తెరుస్తున్నారు. కార్బైడ్ పండ్లను ఇలా గుర్తించవచ్చు...... కార్బైడ్తో పండిన పండ్లు చాలా శుభ్రంగా చుడగానే నాణ్యమైనవిగా నిగనిగలాడుతూ కనపడుతాయి. వీటిపై ఆకుపచ్చని మచ్చలుంటాయి. అధికంగా పసుసు పచ్చని రంగును కలిగి ఉంటాయి. ఈ పండ్లు తినేటప్పుడు నోట్లో కొంచెం దురదగా(మంటగా) ఉంటుంది. ఈ పండ్లలో రసం తక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ కార్బైడ్ మామిడి పండ్లను తినేటపుడు వాటి తోలును మాత్రం అసలు తినకుడదు. ఈ కార్బై›డ్ మామిడి పండ్లు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు తినడం వలన వారికి అనేక అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తోంది. గడ్డిలో మాగపెట్టినా, ఇథిలీన్ గ్యాస్తో మాగపెట్టినా సహజ సిద్ధమైన మామిడి పండ్లు అకుపచ్చ, పసుపుపచ్చ రంగులు కలగలసి ఉన్నట్లు ఉంటాయి. ఈ పండ్లల్లో రసం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యకరం. -
పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని పళ్ల వ్యాపారి ఫూల్ మియా చోటూ మరోసారి తన కళ్లను తానే నమ్మలేకపోతున్నాడు. దాదాపు రూ.30వేల విలువైన తన మామిడి పళ్లను దోచుకుపోయారని కన్నీటి పర్యంతమైన అతడు ఇపుడు ఆనందంతో కంటతడి పెట్టాడు. దోచేసే మనుషులతో పాటు, సాయం చేసే మహానుభావులు కూడా ఉన్నారని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. (సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!) వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జగత్పురి ప్రాంతంలో చోటూ బండి మీద పళ్లు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన దిగ్బ్రాంతికర ఉదంతంలో జనాలు మామిడి పళ్లను అందినకాడికి దోచుకుని వెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలా మంది దాతలు మానవత్వంతో స్పందించారు. దీంతో అతని బ్యాంకు ఖాతాలో దాదాపు రూ. 8లక్షలు జమ అయ్యాయి. దీనిపై చోటు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా వుంది. ఇపుడిక సంతోషంగా ఈద్ పండుగ జరుపుకుంటాను.. బిడ్డలని చూసుకుంటా’నని చోటూ చెప్పాడు. అంతేకాదు తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపాడు. కొంతమంది కాని పనిచేసినా, చాలామంది మానవత్వంతో స్పందించడం ఆనందంగా వుందన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) (కరోనా : భారీ సంపదనార్జించిన బిలియనీర్లు) -
ఆ హైదరాబాద్ వంటకం ఎంతో ఇష్టం
దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక కొంతమంది వంట చేయటం నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నారు. మరికొంత మంది రకరకాల వెరైటీ వంటలు ట్రై చేస్తూ కుటుంబ సభ్యులను సంతోషపెడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకునే సినీ సెలబ్రిటీల్లో హీరోయిన్ శృతి హాసన్ ముందు వరసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ తనకు ఎంతో ఇష్టమైన హైదరాబాద్ తెలుగు వంటకం ‘మామిడికాయ పప్పు’ను చేశారు. (తారక్కు బిగ్బాస్ హౌస్మేట్స్ స్పెషల్ విషెస్..) View this post on Instagram The EASIEST mango pappu!! I love this so much I had it for the first time when I visited Hyderabad as a kid and feel in love ❤️ it’s super easy to make hits make sure the raw mango turns translucent so you know it’s done ! Add spice according to your Taste but I keep it mild so I can proper taste the mango :) yummy 😋 A post shared by @ shrutzhaasan on May 19, 2020 at 2:28am PDT అదేవిధంగా తాను స్వయంగా చేసిన ‘మామిడికాయ పప్పు’ వీడియాను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు శృతి హాసన్. ‘చాలా సులభంగా చేసే మామిడికాయ పప్పు నాకు చాలా ఇష్టం. నేను చిన్నతనంలో హైదరాబాద్కి మొదటిసారి వచ్చినప్పుడు ఈ మామిడికాయ పప్పును తిన్నాను. ఇక ఈ వంట చేయటం చాలా సులభం. మీ రుచికి తగినట్లు మసాలా వేస్తే చాలా బాగుంటుంది. నేను మాత్రం చాలా తక్కువగా మసాలాను వేస్తాను. ఎందుకంటే సహజమైన మామిడికాయ రుచిని ఆస్వాదించాలి’ అంటూ కామెంట్ జత చేశారు శృతి హాసన్. ఇక తాను లాక్డౌన్ సమయంలో సెల్ఫ్ క్వారంటైన్లో భాగంగా ఇంటికే పరిమితయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. -
‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటే ఇదే..!
ఫల రాజం మామిడి పండును ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారేమో. వేసవి వచ్చిందంటే చాలు పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు మామిడి పళ్ల కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తుంటారు. అయితే మామిడి పళ్ల రుచి మనకే కాదండోయ్.. జంతువులు కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా ఏనుగు. అవును అంత పెద్ద ఏనుగు సైతం మామిడి పండు రుచికి ఫిదా అయిపోయింది. అందుకే ఏకంగా చెట్టు నుంచి మామిడి పళ్లను రాల్చి మరి వాటిని ఆస్వాదిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుసాంత నంద ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ‘ఇది మామిడి సమయం. గజరాజు సైతం ఫల రాజానికి ఫిదా అయ్యాడు. చెట్టు నుంచి పళ్లను రాల్చుకుని మరి ఇలా తన తీపి చిరుతిండిని ఆస్వాదిస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. 18 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించడమే కాక ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అంటూ ప్రశంసిస్తున్నారు. It’s mango time. How can the giant be denied to have the taste of king of fruits😊 It shakes gently the tree to enjoy a sweet snack.... pic.twitter.com/yd98WolRnh — Susanta Nanda IFS (@susantananda3) May 12, 2020 -
మెగా డాటర్ ఆవకాయ పచ్చడి.. నోరు ఊరిపోవాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. సామాన్యులు మొదలు సెలబ్రిటీలు, క్రీడాకారులు మొదలు రాజకీయ నాయకుల వరకు అంతా ఇంట్లోనే గడుపుతున్నారు. కొంత మంది అయితేపుస్తకాలు చదవడం.. చిన్న పిల్లలు ఉంటే వారితో గడపడం ఇలా కాలక్షేపం చేస్తున్నారు. మరికొంత మంది సెలబ్రిటీలు కొత్త కొత్త వంటకాలు చేస్తూ కుటుంబ సభ్యులమొత్తానికి వడ్డిస్తున్నారు. (చదవండి : మరో తమిళ సినిమాకి ఓకే చెప్పిన నిహారిక) ఇక ‘మెగా’ ఫ్యామిలి మాత్రం ఆవకాయ పచ్చడి పెట్టే పనిలో నిమగ్నమైపోయింది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆవకాయ పచ్చడి చేసే విధానాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను తన ట్వీటర్లో పోస్ట్ చేయగా, తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంట్లో స్పెషల్గా ఆవకాయ పచ్చడి పెడుతూ.. బిజీ అయిపోయింది. మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిహారిక. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిహారిక చేసిన ఆవకాయ పచ్చడి మెగా ఫ్యాన్స్ నోళ్లలో నీళ్లురూరించేలా ఉంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
మీరు గర్భవతా? దీపికాకు నెటిజన్ల ప్రశ్నలు
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రటీలు ఎప్పటికప్పడు అభిమానులతో టచ్లో ఉంటూ పలు విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మామిడి కాయలపై తనకున్న ప్రేమను వ్యక్త పరుస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇప్పటివరకు నేను కలుసుకున్న వాటిలో ది బెస్ట్ ఇదే అంటూ షేర్ చేశారు. దీంతో కొందరు నెటిజన్లు దీపికా..మీరు గర్భవతా? త్వరలో శుభవార్త చెబుతున్నారా? అంటూ దీపికాను ప్రశ్నించారు. (అయ్యో ! రణ్వీర్ ఎంత పని జరిగే..) 2018 డిసెంబర్లో దీపిక, రణ్వీర్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పట్నుంచి దీపిక ప్రెగ్నెన్సీపై పలు పుకార్లు షికార్లు చేశాయి. వీటిలో నిజం లేదంటూ దీపిక స్పష్టతనిచ్చింది. ఇక లాక్డౌన్ సమయంలో దీపిక కొత్త కొత్త వంటలు ప్రయోగిస్తూ అభిమానులతో పంచుకుంటుంది. భర్త రణ్వీర్ను ఆటపట్టిస్తూ కరోనా సమయాన్ని సరదాగా గడుపుతుంది. View this post on Instagram You're simply the best, better than all the rest Better than anyone, anyone I ever met...🤤 A post shared by Deepika Padukone (@deepikapadukone) on May 3, 2020 at 12:08am PDT -
చెట్టులెక్కగలను
లాక్ డౌన్ సమయాన్ని కూతురితో సరదాగా గడుపుతున్నారు మంచు లక్ష్మి. ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు ఎక్కిన వీడియోను పోస్ట్ చేశారామె. ‘‘నా చిన్నప్పటి నుంచి ఈ మామిడి చెట్టు మా ఇంటి ముందే ఉంది. కానీ ఎప్పుడూ హాయ్ చెప్పి, మా పరిసరాలను చల్లగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ చెప్పే వీలు దొరకలేదు. ఈ లాక్ డౌన్ లో ఆ చాన్స్ దొరికింది. ఇన్ని రోజులూ మన చుట్టూ ఉన్నా మనం పట్టించుకోకుండా ఉన్నవాటికి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు లక్ష్మి. సరదాగా చెట్టు ఎక్కి, కుమార్తె విద్యా నిర్వాణకు మామిడికాయలు కోసిపెట్టారామె. ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ అని ‘చెంచులక్ష్మి’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుని అంజలీదేవి అడిగితే... ‘చెట్టులెక్కగలనే ఓ చెంచిత..’ అంటారాయన. లక్ష్మి కూడా చెట్టులెక్కగలను అని నిరూపించుకున్నారు. -
కొహెడలో మామిడి మార్కెట్
కొహెడ: మామిడికాయల మార్కెట్ను కొత్తపేట నుంచి తరలించి తాత్కాలికంగా కొహెడలోని మార్కెట్ స్థలంలో ఏర్పాటు చేయనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తెలిపారు. కొహెడ మార్కెట్లోకి ప్రవేశించడానికి రోడ్డు సౌకర్యంపై దేవాదాయ శాఖ, హెచ్ఎండీఏ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఆయన సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ హరీష్తో కలిసి కొహెడలోని మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మామిడి సీజన్లో కొత్తపేటకు రోజుకు 400 నుంచి 600 వరకు లారీలు మామిడికాయల లోడ్తో వస్తాయని, రైతులు,కొనుగోలుదారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారని అన్నారు. వారంతా ఒకేచోట గుమిగూడితే ఇబ్బందులు వస్తాయని మార్కెట్ను కొహెడకు తరలిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో పనులు పూర్తిచేసి మామిడికాయల మార్కెట్ను కొహెడలో ప్రారంభిస్తామన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ను పూర్తి స్థాయిలో కొహెడకు తరలిస్తామన్నారు. సుమారు 180 ఎకరాల్లో మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి, అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ వీరమళ్ల రాంనర్సింహగౌడ్,డైరెక్టర్లు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ధన్రాజ్, సిద్దాల్ల జ్యోతి, బాలరాజ్ పాల్గొన్నారు. -
ముందే వచ్చిన మధురఫలం
పశ్చిమగోదావరి ,కాళ్ల: మే నెలలో రావాల్సిన మామిడి పళ్లు ముందుగానే వచ్చేశాయి. సాధారణంగా మామిడి పళ్లు ఇష్టపడని వారుండరు. అయితే సీజన్కన్నా ముందు రావడంతో వాటిని కొనేందుకు మామిడి పళ్ల ప్రియులు ఎగబడుతున్నారు. మండలంలోని సీసలి గ్రామంలో రోడ్డును ఆనుకుని మామిడి పళ్లు విక్రయిస్తున్నారు. గ్రామానికి చెందిన నాగిశెట్టి సుబ్బారావు మామిడి పళ్లను విక్రయిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ముందుగా మండలంలో మామిడి కాయలు ప్రత్యక్షమవ్వడంతో రేటు వెచ్చించైనా కొనేందుకు మామిడి కాయ ప్రియులు ఇష్టపడుతున్నారు. నూజివీడు నుంచి ముందు కాపు కాయలు చిన్నరసాలు దిగుమతి చేసినట్లు వ్యాపారి చెబుతున్నాడు. చిన్న రసాలు డజను రూ.400 నుంచి రూ.500 వరకూ విక్రయిస్తున్నట్లు పేర్కొన్నాడు. అదే విధంగా పెద్ద రసాలు పచ్చళ్లు పెట్టుకునేందుకు డజను రూ.150 నుంచి రూ.250 వరకూ విక్రయిస్తున్నట్లు చెప్పాడు. నూజివీడు రసాలంటే మన ప్రాంతలో ప్రత్యేకత ఉంది. వీటిని కొనేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. -
పిందె విందు
వేసవికాలం వస్తోందంటే ఎండలు మండుతుంటాయి... ఒక పక్క నుంచి వడగాడ్పులు ... మరో పక్కనుంచి మామిడి గాలులు వీస్తాయి కాయలు పెద్దవయ్యే వరకు ఊరుకోగలమా... చెట్టు కింద రాలిన పిందెలను ఏరి ఏదో ఒకటి చేసేయొద్దు... పిందే కదా అని ఏరి పారేయద్దు... అందులోనూ రుచి ఉంది... తిని చూడండి... మీకు నచ్చి తీరుతుంది... కావాలంటే ఈ పిందె మీద ఒట్టు... పిందె విందు చేసుకు తిందాం... వడు మాంగా కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు; (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు. పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కాసేపు నీడలో ఆరబెట్టాలి ∙ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల నూనె అన్ని మామిడి పిందెలకు పడుతుంది) ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చాక, పొడికి జత చేసి మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ∙రోజుకి మూడు నాలుగుసార్ల చొప్పున అలా సుమారు మూడు రోజులు కలపాలి ∙మామిడిపిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతుంది. మామిడి ఔషధం వేసవి వస్తోందనే సమాచారాన్ని మామిడి కాయలు మోసుకొస్తాయి. ఆ సమాచారంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లు, మినరల్స్నూ తీసుకొస్తాయి. మండు వేసవి రాక ముందే అందరినీ నోరూరించే మామిడి కాయల వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది ∙మామిడిలో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది ∙క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది ∙కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గిస్తుంది ∙మామిడిలో అధిక మొత్తంలో ఉండే పెక్టిన్, పీచు పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. పెక్టిన్.. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉంచుతుంది ∙బరువు పెరగడానికి సహాయపడుతుంది ∙రక్త హీనతను తగ్గిస్తుంది ∙మామిడిలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల, గర్భధారణ సమయంలో గర్భిణీలకు అవసరమైన ఇనుము వీటి ద్వారా పుష్కలంగా లభిస్తుంది ∙మొటిమల నివారణకు మామడి చక్కని ఔషధం. చర్మానికి అడ్డు పడే రంధ్రాలు తెరుచుకోవటం వల్ల మొటిమలు ఏర్పడటాన్ని నివారిస్తుంది ∙వృద్ధాప్యాన్ని నివారిస్తుంది ∙మామిడికాయలో ఉండే ఏ, సి విటమిన్లు శరీరంలో అధికమొత్తం కొల్లాజెన్ ప్రోటీన్ ఉత్పత్తి చేయడానికి సహాయం చేస్తాయి ∙మామిడికాయలో అధికంగా ఉండే విటమిన్ బి 6 మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తి పెంచుతుంది ∙మామిడిలో అధిక పరిమాణంలో ఉండే బీటా కెరొటిన్ అనే కెరొటినాయిడ్ వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ∙కంటి ఆరోగ్యానికి మామిడి చక్కని ఔషధం. మామిడికాయ ముక్కలు ప్రతిరోజూ తీసుకుంటే విటమిన్ ఏ లభిస్తుంది. తద్వారా రేచీకటి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు దూరమై, కంటి చూపు మెరుగుపడుతుంది ∙పచ్చి మామిడికాయ రసంలో నీళ్లు, కొంచెం పంచదార కలిపి తాగితే శరీరం చల్లగా మారి, వేసవిలో వడదెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది ∙సూర్యుని వేడి వల్ల మన శరీర వేడి తగ్గక పోతే, మూత్రవిసర్జన ఆగి, మూత్రపిండాలు విషపదార్థాలతో నిండే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికి మామిడికాయ ఎంతో ఉపయోగపడుతుంది. కన్ని మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి). తయారీ: ∙ముందుగా మామిడిపిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, ముచికలు కట్ చేయాలి ∙తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ∙ఒక పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ∙నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ∙ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి ∙ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి. కడు మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్స్పూన్లు. తయారీ: ∙మామిడిపిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ∙పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ∙చివరగా మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ∙మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక, గాలిచొరని సీసాలోకి తీసుకోవాలి ∙(ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుమును ఎండబెట్టి కలుపుకోవచ్చు) -
నూజివీడులో 7న మ్యాంగో మీట్
సాక్షి, అమరావతి బ్యూరో: మామిడి రైతులకు మంచి ధర లభించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాంగో మీట్ను నిర్వహించనుంది. ఈనెల 7న రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు కృష్ణాజిల్లా నూజివీడులోని వేపర్ హీట్ ట్రీట్మెంట్ సెంటర్ వేదిక కానుంది. విదేశాలకు మామిడిని ఎగుమతి చేసే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది ప్రముఖ ఎగుమతిదారులు, ఎగుమతికి వీలుగా ఉండే నాణ్యమైన మామిడిని పండించే రాష్ట్రంలోని సుమారు వంద మంది రైతులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. సదస్సు రోజు రైతులు తమతమ మామిడి శాంపిళ్లను ప్రదర్శిస్తారు. ఎగుమతికి అనువైన రకాలను ఎగుమతిదారులు ఎంచుకుని అక్కడికక్కడే రైతులతో కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటారు. ఈ మ్యాంగో మీట్ ద్వారా రైతులకు మంచి ధర లభిస్తుందని.. ఫలితంగా రైతుల్లో మామిడి సాగుపై ఆసక్తి పెరుగుతుందని ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఫ్రూట్స్) పీవీ రమణ ‘సాక్షి’కి చెప్పారు. రైతులకు మేలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ మీట్ను నిర్వహిస్తోందని తెలిపారు. ఎగుమతిదారులు చుట్టుపక్కల మామిడి తోటలను కూడా సందర్శిస్తారు. బంగినపల్లిదే అగ్రస్థానం.. రాష్ట్రంలో విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో 3.82 లక్షల హెక్టార్లలో దిగుబడినిచ్చే మామిడి తోటలున్నాయి. వీటి నుంచి సగటున 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. అత్యధికంగా బంగినపల్లి రకం 1,70,048 హెక్టార్లలో సాగవుతోంది. వీటి దిగుబడి 21,25,600 టన్నులు ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో తోతాపురి (కలెక్టర్) 1.02 లక్షల హెక్టార్లలో సాగవుతూ 12,24,350 టన్నుల దిగుబడినిస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసం, సువర్ణరేఖ వంటివి ఉన్నాయి. విదేశాలకు ఎగుమతయ్యే రకాలు.. మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా బంగినపల్లి, చిన్న రసాలు, చెరుకు రసాలు, సువర్ణరేఖ రకాలు ఎగుమతి అవుతాయి. జర్మనీ, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, రష్యా, మధ్య ఈశాన్య దేశాలకు ఏటా సగటున 1,200 మెట్రిక్ టన్నుల మామిడిని ఎగుమతి చేస్తుంటారు. -
నోరూరించే... భీమాళి తాండ్ర
సాక్షి, లక్కవరపుకోట : మామిడి తాండ్ర.. ఆ పేరు వింటేనే నోరూరుతోంది కదూ. లక్కవరపుకోట మండలం భీమాళి ఈ తాండ్ర తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే ఈ పదార్థానికి దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయుకులు తమ పనులు చేయించుకోవాలంటే భీమాళి తాండ్రను తాయిలంగా ఇచ్చేవారట. ఏడాది పొడవునా ఇక్కడ తాండ్ర చెక్కుచెదరని రుచితో లభిస్తుంది. దాదాపు 350 కుటుంబాల వారు ఈ తాండ్ర తయారీపైనే ఆధారపడుతూ జీవిస్తున్నారు. మండు వేసవి వచ్చిందంటే గ్రామస్తులంతా వీటి తయారీతో బిజీ అయిపోతారు. మామిడి పండ్ల రసంతో దీనిని తయారు చేస్తారు. కోలంగోవ, కలెక్టర్ వంటి రకాలను వీటికి వాడుతారు. బాగా పండిన మామిడి పండ్ల రసాలను ప్రత్యేంగా మహిళలు తీసి సమపాళ్లలో చక్కెర కలిపి వెదురు చాపలపై పొరలు పొరలుగా వేసి ప్రకృతి సిద్ధంగా ఎండలో ఆరబెడతారు. ఇలా ఒక రెండు ఇంచీల మందం వరకు వేసి పూర్తిగా ఎండిన తరువాత కేజీకి ఒక ముక్క చొప్పున కట్ చేసి పెకింగ్ చేసి అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుతం తాండ్ర కిలో ధర రూ.120లకు అమ్ముతున్నారు. -
మామిడిపండ్లు దొంగిలించాడని దేశ బహిష్కరణ
దుబాయ్ : మామిడిపండ్లు దొంగతనం చేసినందుకు ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. సదరు వ్యక్తి వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. భారత్కు చెందిన 27 ఏళ్ల వ్యక్తి దుబాయి ఎయిర్పోర్టులో పనిచేసేవాడు. ప్రయాణికుల లగేజీలను కంటెయినర్ నుంచి కన్వేయర్ బెల్ట్లోకి ఎక్కించడం.. అక్కడి నుంచి కిందకు దించడం అతడి పని. 2017 ఆగస్టు 11న ఎయిర్పోర్టులో విధులు నిర్వహిస్తోన్న సమయంలో అతడికి బాగా దాహం వేయడంతో ఒక ప్రయాణికుడికి చెందిన బాక్సు నుంచి రెండు మామిడిపండ్లను దొంగలించాడు. ఈ విషయం కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. తాను ఎయిర్పోర్ట్లో విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆకలి వేసిందని, దాంతో పాటు బాగా దాహం వేయడంతో రెండు మామిడి పండ్లు దొంగతనం చేశానని చెప్పడంతో పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు. కాగా సోమవారం ఈ కేసును దుబాయ్కు చెందిన పస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు విచారించి తమ తుది తీర్పును వెల్లడించింది. అతనికి 5000 దిర్హామ్ల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ విధించింది. కాగా, ఈ తీర్పుపై 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం అతడికి ఉంటుంది. -
ఆకట్టుకుంటున్న మోదీ మ్యాంగో
లక్నో : మోదీ శారీస్, మోదీ జాకెట్స్ తర్వాత ఇప్పుడు మోదీ మ్యాంగోలు ప్రజలకి తీపిపంచేందుకు ముందుకొచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు వినూత్న పోకడలను అనుసరిస్తున్నారు. లక్నోలో జరుగుతున్న మ్యాంగో ఫెస్టివల్కు వ్యాపారులు రాజకీయ రంగులద్దారు. దాదాపు 700కు పైగా ప్రముఖ మ్యాంగో వెరైటీలను అందుబాటులోకి తెచ్చిన వ్యాపారులు ఈ ఫెస్టివల్లో 450 గ్రాముల బరువుండే మోదీ మ్యాంగోతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని తనకు మామిడి పండ్లు అంటే ఇష్టమని చెప్పడంతో పలువురు మామిడి రైతులు తమ దిగుబడులకు మోదీ పేరు పెట్టుకుని వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. మోదీజీ తరహాలోనే మోదీ మ్యాంగో కూడా విశేష ఆదరణను సొంతం చేసుకుందని, ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీలాగానే ఈ మ్యాంగో సైజ్ కూడా ప్రత్యేకమని, అందుకే ఈ మామిడికి మోదీ మ్యాంగో అని పేరుపెట్టామని మ్యాంగో కమిటీ ప్రధాన కార్యదర్శి ఉపేంద్ర కుమార్ సింగ్ చెప్పుకొచ్చారు. మోదీ మ్యాంగోను తాము పేటెంట్ కూడా తీసుకున్నామని సింగ్ తెలిపారు. -
రాజ ఫలం.. ధర ఘనం
భీమవరం (ప్రకాశం చౌక్): పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి పండు కొనాలంటే సామాన్యుడికి భారంగా మారింది. ఏటా వేసవిలో మాత్రమే లభించే మామిడి పండ్లను అంతా ఇష్టపడుతుం టారు. అలాంటి మామిడి పండ్ల ధర భారీగా పెరగడంతో మామిడి పండ్లను సామాన్యుడు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నాడు. కాపు తగ్గడంతో పెరిగిన ధర గతేడాదితో పోల్చుకుంటే ఈఏడాది మామిడి కాపు చాలా ఘననీయంగా తగ్గింది. దాంతో మామిడి పండ్లకు డిమాండ్ ఏర్పడింది. రైతు చెట్టు వద్ద వ్యాపారులకు కాయలను అధిక ధరకు విక్రయిస్తుంటే వ్యాపారులు వారి ఖర్చులు అన్నీ కలుపుకుని మరింత ధర పెంచి అమ్మడం వల్ల మామిడి కాయలను సామాన్యుడు రుచిచూసే భాగ్యం లేకుండాపోతోంది. గతేడాది కాపు బాగా ఉండడం వల్ల మామిడి పండ్ల ధర అందుబాటులో ఉంది. గతేడాదితో పోలిస్తే ఏఈడాది పరక (13 కాయలు) రూ.100 నుంచి రూ.150 అధికంగా ఉంది. మొగల్తూరు పండ్లకు డిమాండ్ జిల్లాలో మామిడి పండ్లకు మొగల్తూరు ప్రాంతం పెట్టింది పేరు. పచ్చళ్లకు కూడా మొగల్తూరు చుట్టుపక్కల ప్రాంతాల కాయలకు బాగా గిరాకీ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ల్లోకి మొగల్తూరు మామిడి పండ్లు రావడంతో డిమాండ్ మరింత పెరిగింది. అయితే వీటి ధరలు చూసి జనం కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. -
తినాలని ఉంది..కానీ
సాక్షి సిటీబ్యూరో: మామిడి పండు చేదెక్కింది. తినాలని ఉన్నా వాటి ధర చూసి వెనక్కు తగ్గాల్సి వస్తోంది. వేసవిలో వచ్చే మామిడిపండ్లను తినాలని ప్రతి ఒక్కరూ ఆశ పడుతుంటారు. మధుర ఫలం కోసం వేసవి వరకు ఎదురు చూసి తీరా వచ్చిన తరువాత వాటి ధర కారణంగా నామమాత్రంగా తింటున్నారు. ఈఏడాది సాధారణ రకం మామిడి పండ్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏరకం మామిడి పండ్లను చూసినా సామాన్యుడికి అందుబాటులో లేవు. దీంతో మధుర ఫలాన్ని కొనేందుకు అవస్థలు పడుతున్నారు. కరువుకు తోడు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన మామిడి రకాలు అక్కడి అవసరాలకే వినియోగిస్తుండటంతో నగర మార్కెట్లకు వచ్చే మామిడి సరఫరా అనూహ్యంగా పడిపోయింది. గత సంవత్సరం ఇదే సమయంలో మార్కెట్లన్నీ మామిడి దిగుమతులతో ముంచెత్తగా ఈ సారి మాత్రం వాటి సరఫరా తగ్గిపోయింది. అక్కడక్కడా వస్తున్న మేలు రలకాలను ఢిల్లీ, లక్నో వ్యాపారులు డైరక్టుగా కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఏడాది కంటే ధరలు ఎక్కువ దీంతో సాధారణ మార్కెట్లో మామిడి పండ్ల ధర గత సంవత్సరంతో పోలిస్తే రెండింతలు అయ్యింది. హోల్ సేల్ మార్కెట్లో క్వింటాల్ గత సంవత్సరం రూ. 5 వేలు మోడల్ ధర కాగా అది ఈ సంవత్సరం రూ. 7 వేలకు చేరింది. రిటైల్ మార్కెట్లో కిలో మామిడి కాయలు ( సైజు బట్టి మూడు నుంచి నాలుగు మాత్రమే వస్తాయి) రూ. 90 నుంచి 150 వరకు పలుకుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి నుం చి జులై వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మామిడి రకాలు ఇక్కడే లభ్యం అయ్యేవి. అయితే ప్రస్తుతం అన్ని రకాలు అందుబాటులో లేవు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కేవలం కొన్ని రకాల మామిడి మాత్రమే నగర మార్కెట్లో లభిస్తున్నాయి. గడిచిన ఏడాది వరకు బెనీషా,ఆలంపూర్, తొతపూరి, బంగినపల్లి, ఆల్ఫోన్సో, హిమసాగర్, తదితర రకాలు అందుబాటులో వుండగా ఈ ఏడాది మాత్రం బెనీషా, రకం ఒక్కటే మార్కెట్లోకి అధికంగా వస్తోంది. గత సంవత్సర మార్చి ,ఏప్రిల్, మేమాసాల్లో గడ్డి అన్నారం మార్కెట్కు 92,40,239 క్వింటాళ్ళ మామిడి రాగా ఈ సంవత్సరం మాత్రం 74, 406 క్వింటాళ్ళు మాత్రమే రావడాన్ని బట్టి చూస్తే మామిడి సరఫరా తగ్గిపోయిందడానికి నిదర్శనం. -
మధుర ఫలం.. విషతుల్యం
సాక్షి, సిటీబ్యూరో: వ్యాపారుల అత్యాశ కారణంగా మధుర ఫలం విషతుల్యంగా మారుతోంది. మామిడి పండ్లు త్వరగా మాగడానికి ఇథలిన్ను యథేచ్ఛగా వాడటంతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. పండ్లు పైకి నిగనిగా కనిపిస్తున్నా.. లోన మాత్రం ఎంతో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. కార్బైడ్ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మామిడి పండ్ల ప్రియులు సంబరపడినా.. అది ఎంతో కాలం నిలవలేదు. వ్యాపారులు రూట్ మార్చి కార్బైడ్కు బదులుగా మరో రసాయన పౌడర్ బాట పట్టారు. సహజసిద్ధంగా కాకుండా కృత్రిమ పద్ధతికి అలవాటు పడ్డారు. త్వరితగతిన పండ్లను మగ్గించేందుకు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఇథలిన్ పౌడర్ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్తో కాయలను కొన్ని గంటల్లోనే పండ్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కోర్టు ఉత్తర్వులు బేఖాతర్.. ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలను, రసాయన పౌడర్లను వినియోగించి పండ్లను మగ్గించవద్దని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులు మార్కెట్లలో హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోయారు. ప్రలోభాలకు తలొగ్గిన అధికారులు వ్యాపారులు యథే చ్ఛగా రసాయన పౌడర్లను వినియోగిస్తున్నా చేష్టలుడిగి చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. చైనా నుంచి దిగుమతి.. కాలుష్య కార్బైడ్కు ప్రత్యామ్నాయంగా చైనా, కొరియాల నుంచి ఇథలిన్ పౌడర్ను దిగుమతి చేసుకుంటున్నారు. దీనికి అనుమతి లేకపోయినప్పటికీ కాయలను 24 గంటల్లో నిగనిగలాడే పండ్లుగా మార్చేందుకు పౌడర్ను దొడ్డిదారిన వినియోగిస్తున్నారు. పౌడర్ను 5 ఎంఎల్ ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కో బాక్స్ (15 నుంచి 35 కిలోల మామిడికాయల పెట్టె)లో మూడు నుంచి ఐదు ప్యాకెట్లు వేస్తున్నారు. వ్యాపారులు మాత్రం ఇథలిన్ ప్యాకెట్ల ద్వారా మగ్గబెట్టేందుకు అనుమతి ఉందనడం గమనార్హం. పౌడర్ విక్రయాల్లోనూ బ్లాక్ దందా.. ఇథలిన్ పౌడర్ ప్యాకెట్ల విక్రయంలోనూ మార్కెట్లో బ్లాంక్ దందా చేస్తున్నారు. పౌడర్ ఒక్కో ప్యాకెట్ రూ.1.72కు కొనుగోలు చేస్తున్న ఓ కమిషన్ ఏజెంట్ ఆ ప్యాకెట్ను ఒక్కొక్కటి రూ.5కు బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. రోజుకు వేలాది ప్యాకెట్లను మార్కెట్లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇలా నాలుగు రోజులు.. అలా 48 గంటల్లోపే.. సహజసిద్ధంగా గడ్డిలో పెట్టి మగ్గించిన మామిడికాయలు ఆరోగ్యానికి మంచివి. ఇలా మగ్గించాలంటే కనీసం 90 నుంచి 96 గంటల సమయం పడుతుంది. ఇంత సమయం దాకా ఆగలేని వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇథలిన్ పౌడర్లాంటి మార్గాలను అనుసరిస్తున్నారు. వీటి ద్వారా 24 నుంచి 48 గంటల్లోపే కాయలు పండ్లుగా మారుస్తున్నారు. గడ్డిఅన్నారం మార్కెట్లో సుమారు 200 నుంచి 300 మంది మహిళలు, బాల కార్మికులు, హమాలీలు ఇథలిన్ పౌడర్ ప్యాకింగ్ పని చేస్తుండటం గమనార్హం. ఆరోగ్య సమస్యలు.. రుచిలో తేడాలు గతంలో మామిడి కాయలను సహజసిద్ధంగా బట్టీలలో పక్వానికి తెచ్చే పద్ధతులు పాటించేవారు. మామిడి మధుర తీపి ప్రజలు రుచి చూసేవారు. నేడు కృత్రిమ పద్ధతులు, రసాయనాలతో మగ్గించడం వల్ల రుచిలో తేడాలొస్తున్నాయి. ఈ పండ్లను తినడం మూలంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాడుల ఊసే లేదు.. మార్కెటింగ్ శాఖ అధికారులు, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఏటా మార్కెట్లో తనిఖీలు చేపట్టేవారు. దీంతో కొద్ది మేరైనా కల్తీని అరికట్టే అవకాశం ఉండేది. ఈ ఏడాది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పండ్ల మార్కెట్లో వ్యాపారులు నిషేధిత రసాయనాలను వినియోగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మార్కెట్ యార్డులో పదుల సంఖ్యలో సూపర్వైజర్లు, గ్రేడ్2, గ్రేడ్3 కార్యదర్శుల ద్వారా రోజూ వేలం పాటలు నిర్వహిస్తున్న అధికారులకు ఇథలిన్ పౌడర్ ప్యాకింగ్లు కనిపించడం లే దా.. అన్నది ఉన్నతాధికారులు ఆలోచించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు ఆహార భద్రతా శాఖ నిబంధనల మేరకు మాత్రమే కాయలను మగ్గించాలి. దీని కోసం మార్కెట్లో ఉన్న చాంబర్లను సద్వినియోగం చేసుకోవాలి. నిషేధిత రసాయనాలను వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు. ఈ సంవత్సరం ఇప్పటికే మామిడి వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి రసాయన పౌడర్లను వినియోగించవద్దని చెప్పాం. ఇథలిన్ వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశం, ఉన్నత శ్రేణి కార్యదర్శి,గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్