అలోక్ మాదసానికి పరామర్శ
హ్యూస్టన్: అమెరికాలో జాతివివక్ష దాడికి గురైన అలోక్ మాదసానిని శుక్రవారం హ్యూస్టన్లో భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి పరామర్శించారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం అలోక్ కోలుకుంటున్నాడని, ప్రమాదమేమీ లేదని కాన్సుల్ జనరల్ జనరల్ అనుపమ్ రే వెల్లడించారు.
కన్సాస్ రాష్ట్రం ఒలాతేలో బుధవారం రాత్రి ఓ బార్లో చోటుచేసుకున్న కాల్పుల్లో శ్రీనివాస్ కూచిబొట్ల మృతిచెందగా.. అలోక్ గాయపడిన విషయం తెలిసిందే. జాతివివక్షత నేపథ్యంలో జరిగిన ఈ కాల్పుల ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.