
తెలుగులో హీరోయిన్ అయ్యే బ్యూటీస్ లేరని చాలామంది అనుకుంటూ ఉంటారు.

కానీ సరైన అవకాశాలు రాకపోవడం వల్లే తెలుగమ్మాయిలు పక్క భాషల్లో నటిస్తుంటారు.

అలా ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాలతోనైనా.. తమిళంలో బాగా గుర్తింపు తెచ్చుకుంది మధుశాలిని.

మధుశాలిని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్.

హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఈమె.. చిరంజీవి 'అందరివాడు' మూవీతో నటిగా మారింది.

అల్లరి నరేశ్ 'కితకితలు' చిత్రంలో హీరోయిన్ తరహా రోల్ చేసింది. కానీ ఏం లాభం.

ఆ తర్వాత కింగ్, గోపాల గోపాల, జగడం, గూఢచారి తదితర సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా పేమ్ రాలేదు.

కెరీర్ ప్రారంభంలో తెలుగు మూవీస్ చేసింది గానీ తర్వాత తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది.

కమల్ హాసన్, విశాల్ తదితర హీరోల చిత్రాల్లో నటించింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది.

హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ ఎందుకో మధుశాలిని సరైన ఫేమ్ రాలేదని చెప్పొచ్చు.

ఇకపోతే 2022లో మలయాళ నటుడు గోకుల్ ఆనంద్ని పెళ్లి చేసుకుంది. తర్వాత యాక్టింగ్ పక్కనపెట్టేసింది.

ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మధుశాలిని.. చివరగా '9 అవర్స్' తెలుగు సిరీస్లో కనిపించింది.















