-
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ కీ విడుదల
సాక్షి, గుంటూరు: ఏపీపీఎస్సీ గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. గ్రూప్-2 కింద 897 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 4,63,517 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా.. 4,04,037 (87.17%) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక ప్రాథమిక కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలని సూచించింది. పోస్టు/వాట్సప్/ఎస్ఎంఎస్/ఫోన్/వ్యక్తిగతంగా సమర్పిస్తే పరిగణనలోకి తీసుకోబోమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది. స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను ఐదు నుంచి ఎనిమిది వారాల్లో ప్రకటించే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ -2 మెయిన్ పరీక్షను జూన్/జులైలో నిర్వహించే అవకాశం ఉంది. -
గ్రూప్-2 గెట్ రెడీ.. ఏపీలో పది రోజుల్లో నోటిఫికేషన్కు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: విజయ దశమి వేళ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమేరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వతేదీన 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తద్వారా గ్రూప్–2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. మరో పది రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్ కమిషన్ యోచిస్తోంది. యువత వినతిపై స్పందించిన సీఎం గ్రూప్స్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పలు సందర్భాల్లో అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో అనుమతినిచ్చిన పోస్టులతో పాటు వీలైనంత ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని స్పష్టం చేయడంతో తాజాగా గ్రూప్ 2 విభాగంలో 212 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆయా శాఖల నుంచి పోస్టుల ఖాళీలను నిర్దారించుకున్న వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వీస్ కమిషన్కు ఉత్తర్వుల్లో సూచించారు. రోస్టర్ పాయింట్లతో పాటు విద్యార్హతల ఆధారంగా నిబంధనల మేరకు ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖ కోరింది. గ్రూప్స్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. నోటిఫికేషన్ నాటికి ఆయా శాఖల్లో ఉన్న మరిన్ని ఖాళీలను సైతం కలపనున్నారు. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ‘స్క్రీనింగ్’తో అదనపు ఒత్తిడి!
ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. అయితే తొలిసారిగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. దీని నుంచి ప్రధాన పరీక్షకు 1:12 - 1:15 మధ్య అభ్యర్థులను ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన జీవో కోసం కమిషన్ ఎదురుచూస్తోంది. అయితే అభ్యర్థులు ఈ పరీక్షతో మరింత ఒత్తిడికి గురవుతామని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు స్క్రీనింగ్ టెస్ట్ అవసరం ఉందా? అభ్యర్థులు, పోటీ పరీక్షల నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 మినహా ఇతర ఏ పరీక్షకూ స్క్రీనింగ్ టెస్ట్ లేదు. సంస్కరణలు, ఈ-గవర్నెన్స్, నియామకాల్లో పారదర్శకత పేరుతో గ్రూప్-2కు కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించడం నిరుద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఐదేళ్లుగా గ్రూప్-1, గ్రూప్-2 స్థాయిలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఈ క్రమంలో ఏపీపీఎస్సీ నుంచి ప్రకటన వస్తే దరఖాస్తుల సంఖ్య పది లక్షల వరకు ఉండొచ్చని అంచనా. ఇంతమందికి పరీక్ష నిర్వహణ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. నాన్-సీరియస్ అభ్యర్థులను వడపోసి.. సీరియస్ అభ్యర్థులను గుర్తించేందుకు కమిషన్.. స్క్రీనింగ్ టెస్ట్ను సాధనంగా చేసుకుంది. సిలబస్ అదే.. మరి ‘స్క్రీనింగ్’ ఎందుకు? పరీక్ష.. పేపర్-పెన్ విధానంలో ఉంటుంది. మూడు సెక్షన్లకు 50 చొప్పున 150 మార్కులు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లోని అంశాలు.. దాదాపు ప్రధాన పరీక్ష సిలబస్ నుంచే ఉన్నాయని.. అలాంటప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకని అభ్యర్థులు, పోటీపరీక్షల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నందున అభ్యర్థులపై అదనపు భారం తప్ప మరే ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. నాన్-సీరియస్ అభ్యర్థుల వడపోతకు, ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు అవకాశముంటుందనే భావనతో ఇప్పటికిప్పుడు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అంటున్నారు. స్క్రీనింగ్ టు మెయిన్.. 1:12 -1:15 కొద్ది రోజుల్లో 750 ఉద్యోగాలతో గ్రూప్-2 నోటిఫికేషన్ను విడుదల చేస్తామని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభ ఆధారంగా సామాజిక వర్గాల వారీగా ప్రధాన పరీక్షకు 1:12 - 1:15 మధ్య అభ్యర్థులను ఎంపిక చేయడానికి సంబంధించిన ప్రభుత్వ జీవో కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిపరేషన్పై ప్రభావం ఏపీపీఎస్సీ పేర్కొన్న ప్రకారం దరఖాస్తు గడువు తేదీ నుంచి ప్రధాన పరీక్షకు మధ్యలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే అప్లికేషన్ గడువు తేదీకి, మెయిన్ టెస్ట్కు మధ్య వ్యవధి స్వల్పంగా ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ తేదీ కూడా మరింత ముందుకు జరుగుతుందని, ఇది తమ ప్రిపరేషన్పై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మారథాన్’ అభ్యర్థుల్లో మరింత ఆందోళన స్క్రీనింగ్ టెస్ట్ విషయంలో మరింత ఆందోళన చెందుతున్న వర్గం.. మారథాన్ పరుగు పందెం తరహాలో ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు. మారథాన్లో పోటీదారులు తొలుత నెమ్మదిగా పరుగు ప్రారంభించి తర్వాత వేగం పుంజుకుంటారు. పోటీ పరీక్షల ప్రిపరేషన్లోనూ ఇలాంటి అభ్యర్థులు ఉంటారు. వీరు ప్రిపరేషన్ను నెమ్మదిగా ప్రారంభించి తర్వాత వేగం పెంచుతారు. ఈ అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్లో మెరుగైన ప్రదర్శన చూపడంలో ఇబ్బందికి గురవుతారని ఒక ప్రముఖ శిక్షణ కేంద్రం నిపుణుడు పేర్కొన్నారు. స్క్రీనింగ్ సిలబస్లోని అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించడం కష్టమని అభిప్రాయపడ్డారు. గ్రామీణ విద్యార్థులకు మరింత ఇబ్బంది ప్రధాన పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలన్న కమిషన్ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ సర్వీస్లు అందుబాటులో లేని పరిస్థితి. బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసినా, కంప్యూటర్ వినియోగంపై చాలామందికి సరైన అవగాహన లేదు. దీంతో దరఖాస్తుదారుల్లో దాదాపు సగం మందిపై ఆన్లైన్ టెస్ట్ విధానం ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. సహజంగానే ఇంజనీరింగ్, అర్బన్ నేపథ్యం ఉన్నవారికి సానుకూలంగా మారే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. ఆప్టిట్యూడ్ను పరీక్షించేలా ఉంటే మంచిది అభ్యర్థుల పరిపాలనా దక్షతను పరిశీలించే విధంగా ఆప్టిట్యూడ్ను పరీక్షించేలా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తే బాగుంటుంది. ప్రధాన పరీక్షకు నిర్దేశించిన సిలబస్లోని అంశాల నుంచే ప్రశ్నలు అడగడం వల్ల ప్రయోజనం ఉండదు. అభ్యర్థులు అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్-3 వేలంలో వాళ్లు సైతం!
లవ్ మ్యారేజ్.. పిల్లలెప్పుడని ఒత్తిడి తెచ్చారు.. ఎనిమిదేళ్లకు..
వైఎస్సార్సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్ పోల్స్పై సజ్జల కీలక వ్యాఖ్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (01-06-2024)
బ్రిటీష్ కాలేజ్లో.. భారతీయ ఆయుర్వేదం
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
T20 WC: బంగ్లాతో మ్యాచ్.. కోహ్లి లేకుండానే! ఓపెనర్గా సంజూ విఫలం
వెంటనే ఫోటో డిలీట్ చేయండి: ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్బీఐ
డూప్ లేకుండా కాజల్ యాక్షన్.. భయపడ్డాం: దర్శకుడు సుమన్
Advertisement