aswathama reddy
-
TSRTC: ఉద్యోగుల జీతాలు కట్.. ఈసీని కలిసిన టీఎస్ఆర్టీసీ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీఎస్ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్ను కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడంపై ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం..‘తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై టీఎస్ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్ను కలిశారు. ఈ సందర్భంగా అశ్వథ్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అక్రమంగా జీవో ఇచ్చారు. హరిత నిధి పేరుతో కార్మికుల జీతాల నుంచి రూ.300 కట్ చేస్తున్నారు. అక్రమంగా జీవో ఇచ్చి జీతాలు కట్ చేయడం చట్టరీత్యా నేరం. జీవో రద్దు చేయాలని కమిషన్ను కోరాం’ అని తెలిపారు. మరోవైపు.. అశ్వథ్థామ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పంపినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఇంకా పార్టీలు మారుతూనే ఉన్నారు. -
'అశ్వత్థామరెడ్డి మమ్మల్ని బెదిరించలేదు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డిని కొనసాగించడం పట్ల థామస్ రెడ్డి సోమవారం నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మిక సంఘంలో ఏకపక్షంగా తీర్మానాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అశ్వత్థామరెడ్డి టీఎంయూ నుంచి తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరు బాధ్యతలు చేపడుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అశ్వత్థామరెడ్డినే ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ తీర్మానం చేశారు. తాజాగా థామస్రెడ్డి వ్యవహారతీరుపై మండిపడుతూ టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డే కొనసాగనున్నట్లు ఆర్టీసీ కేంద్ర కమిటీ మరోసారి పత్రికా ప్రకటనను విడుదల చేసింది. (చదవండి : రెండుగా చీలిన ఆర్టీసీ కార్మిక సంఘం) ' రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామ రెడ్డి కొనసాగాలని (ఆదివారం 27) రోజున కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా తిర్మానించడం జరిగింది. ఈ కేంద్ర కమిటీ కి గ్రేటర్ హైదరాబాద్ జోనల్ అధ్యక్షుడు.బి. వెంకటేష్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.పి.రెడ్డి, హైదరాబాద్ రీజినల్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, ఎస్.యచ్.కె.రెడ్డి, సికింద్రాబాద్ రీజినల్ కార్యదర్శి నర్సింహులు హాజరై అశ్వత్థామ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పూర్తి మద్దతు తెలపడం జరిగింది. కాని నిన్న థామస్ రెడ్డి పదవి కాంక్షతో అశ్వత్థామరెడ్డిపై చేసిన తప్పుడు ఆరోపణలను గ్రేటర్ హైదరాబాద్ జోనల్, రీజినల్ నాయకులుగా తాము ముక్త కంఠంతో ఖండిస్తూన్నాం. థామస్ రెడ్డి ఆరోపించినట్టుగా అశ్వత్థామరెడ్డి మమ్మల్ని ఎవరిని బెదిరించలేదు. మేము అతని నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది.'అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి : అశ్వత్థామరెడ్డిపై పూర్తివిశ్వాసం ఉంది) -
'అమాయకులను సీఎం మీటింగ్కు పంపిస్తున్నారు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 53 రోజుల పాటు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సహకరించిన రాజకీయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలకు ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.రేపు ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని కార్మికులను ఆదుకోవాలని పేర్కొన్నారు. డిపోల నుంచి అమాయకులను ఏంచుకొని సీఎం మీటింగ్కు పంపిస్తున్నారని ఆరోపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణం లో ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించాలని కోరారు. రాజ్యాంగం ప్రకారమే కార్మిక సంఘాలు నడుస్తున్నాయి. సెక్షన్ 19 కింద ఎవరైనా ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరినా యాజమాన్య దమనకాండ ఇంకా కొనసాగుతోందని విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం కోర్టు నిబంధనల ప్రకారం నడుచుకుంటే మంచిదని పేర్కొన్నారు. -
సమ్మె విరమించి విధుల్లో చేరుతాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అత్యంత సుదీర్ఘంగా 52 రోజులపాటు చేపట్టిన సమ్మెను ఆర్టీసీ జేఏసీ ఎట్టకేలకు విరమించింది. అక్టోబర్ 5న ప్రారంభించిన సమ్మెను ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి విరమించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. మంగళవారం ఉదయం 6 గంటలకు తొలిషిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు కార్మికులంతా డిపోలకు వెళ్లాల్సిందిగా పిలుపునిచ్చింది. సోమవారం మధ్యాహ్నం అఖిలపక్ష నేతలతో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో భేటీ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ తదితరులు ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు. ‘ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఈ ఉద్యమంలో నైతిక విజయం కార్మికులదే. ప్రజలు, కార్మికుల కోణంలో ఆలోచించి సమ్మెను విరమించాలని నిర్ణయించాం. కానీ ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమం మాత్రం ఆగదు. దశలవారీగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం కార్మికులు విధులకు హాజరు కావాలి. ఇంతకాలం బస్సులు నడిపిన తాత్కాలిక సిబ్బంది ఇక విధుల నుంచి తప్పుకొని సహకరించాలి. వారిపై మాకేమీ కోపం లేదు. సమ్మెను విరమించినంత మాత్రాన కార్మికులు ఓడినట్టు కాదు.. ప్రభుత్వం గెలిచినట్టు కాదు. సంస్థలో ఉంటూ సంస్థ ప్రైవేటీకరణ కాకుండా పోరాటానికి నాంది పలుకుతున్నాం. కార్మికులు ఆందోళన చెందొద్దు... ‘52 రోజుల సుదీర్ఘ శాంతియుత పోరాటంలో భాగస్వాములైన కార్మికులు, అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయ, బ్యాంకు, ఇన్సూరెన్స్, రిటైరైన ఉద్యోగులు, మీడియా సిబ్బంది, పోలీసులు... అందరికీ ధన్యవాదాలు. లేబర్ కోర్టులో కార్మికులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. కార్మికులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమ్మెకాలంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం. సమ్మె విరమించినా పోరాటం చేయాల్సి ఉన్నందున జేఏసీ కొనసాగుతుంది. కార్మికులంతా ఇన్ని రోజులూ ఐకమత్యంతో ఉండటం ఉద్యమస్పూర్తికి పునాది. వారి పోరాటం వృథాగా పోదు. సమ్మె ఉద్దేశం సమస్యల పరిష్కారమే తప్ప విధులను విడిచిపెట్టడం కాదు. కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాం. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తాం, విరమించగానే విధుల్లోకి వెళ్తాం. విధులకు అడ్డుచెప్పొద్దు. కొన్ని రోజులుగా పోలీసులు, రెవెన్యూ, రవాణాశాఖ అధికారులు అసలు పనులు వదిలి ఆర్టీసీపై పడ్డారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగాం’అని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు థామస్రెడ్డి, తిరుపతి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సమావేశంలో అఖిలపక్ష నేతలు కోదండరాం, వి.హన్మంతరావు, వినోద్రెడ్డి, జితేందర్రెడ్డి, మోహన్రెడ్డి, తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు, ఎల్.రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, చెరుకు సుధాకర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. విరమణ లేఖలు కార్యాలయాలకు.. సమ్మె విరమణకు సంబంధించిన లేఖలను జేఏసీ నేతలు అధికారుల కార్యాలయాలకు అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ, బస్భవన్.. ఇలా ప్రధాన కార్యాలయాలకు వెళ్లి అక్కడి సిబ్బందికి అందజేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6,448 బస్సులు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 1,838 అద్దె బస్సులు కూడా ఉన్నాయని వివరించారు. 4,608 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,448 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరైనట్లు చెప్పారు. 6,332 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడామని, 94 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు. పోలీసు పహారాలో డిపోలు... అన్ని చోట్లా సీసీ కెమెరాల ఏర్పాటు సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించిన జేఏసీ, ఉదయం ఆరుకల్లా కార్మికులంతా డ్యూటీలకు వెళ్లాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని డిపోలను వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు సాయంత్రమే పోలీసు భద్రతను కోరారు. ఈ నేపథ్యంలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమ్మె ఉధృతమైన సమయంలో కొన్ని డిపోల్లో ఏర్పాటు చేయగా, మిగతావాటిలో తాజాగా ఏర్పాటు చేశారు. విధుల్లోకి తీసుకోకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం: అశ్వత్థామరెడ్డి ‘సమ్మె విషయంలో లేబర్ కోర్టులో మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. ఇప్పుడు కేసును లేబర్ కోర్టుకు ప్రభుత్వం రిఫర్ చేయాల్సి ఉంది. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లగలిగాం. ఈ విషయంలో నైతిక విజయం సాధించాం. హైకోర్టు సూచనలను మేం గౌరవిస్తూ ముందుకు సాగుతున్నాం. సమ్మె విరమణ కూడా అందులో భాగమే. సమ్మె విరమించినందున మేం విధుల్లో చేరాల్సి ఉంది, ఆర్టీసీ చేర్చుకోవాలి.. కానీ ఎండీ అందుకు ఒప్పుకోనంటున్నారు. ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం. గతంలో సుప్రీంకోర్టు చెప్పిన మాటలకు భిన్నమైన వ్యవహారం. ఇది ఓ రకంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. మంగళవారం ఉదయం విధుల్లోకి రాకుండా మమ్మల్ని నిరోధిస్తే మేం హైకోర్టు తలుపు తడతాం. ఇప్పటివరకు వేరే వాళ్లు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో మేం ఇంప్లీడ్ అయ్యాం. కానీ ఇప్పుడు నేరుగా మేమే కేసు దాఖలు చేస్తాం. మంగళవారం విధుల్లోకి తీసుకోకుంటే మరోసారి అఖిలపక్ష నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎవరికి చెప్పి సమ్మె చేశారన్నట్లుగా ఇన్చార్జి ఎండీ మాట్లాడుతున్నారు. సమ్మె ఎవరికో చెప్పి చేయాల్సిన అవసరం లేదు. కార్మికుల సమస్యలపై కార్మికులతో మాట్లాడి సమ్మె చేస్తాం. ఈ విషయంలో కార్మికులు అధైర్య పడాల్సిన పనిలేదు. ఆర్టీసీ ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం చేసే హడావుడిని చూసి కూడా కార్మికులు ఆందోళన చెందాల్సిన పని లేదు’’అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఐదు రోజులుగా జేఏసీ మల్లగుల్లాలు... వాస్తవానికి గత ఐదు రోజులుగా సమ్మె విరమణపై ఆర్టీసీ జేఏసీ మల్లగుల్లాలు పడుతోంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ గత బుధవారం జేఏసీ ప్రకటించింది. అప్పట్లోనే సమ్మెను విరమించాలన్న అభిప్రాయాన్ని సింహభాగం కార్మికులు వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంత డోలాయమానంలో ఉన్న జేఏసీ నేతలు... విరమణ అంశాన్ని తీవ్రంగానే పరిశీలించారు. అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిశ్చితాభిప్రాయానికి వచ్చే ప్రయత్నం చేశారు. సోమవారం అఖిలపక్ష భేటీలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా వారు కూడా అదే మంచి నిర్ణయమని మద్దతు తెలిపారు. సమ్మె విరమణపై జేఏసీ ప్రకటన చేసే సమయంలో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో రాజ్భవన్లో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆర్టీసీకి సంబంధించిన కీలక అంశాలపైనే చర్చ జరుగుతోందన్న వార్తలు రావడంతో జేఏసీ నేతలు అఖిలపక్ష నేతలతో సమావేశమై సమ్మె విరమణ నిర్ణయం తీసుకోవడం గమానార్హం. మెట్టు దిగుతూ వచ్చిన జేఏసీ... బెట్టు వీడని ప్రభుత్వం డిమాండ్ల సాథనకు ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఉధృతంగా కొనసాగిస్తామని తొలుత భీష్మించుకొని కూర్చున్న కార్మిక సంఘాల జేఏసీ... ఆ తర్వాత పరిస్థితినిబట్టి మెట్టు దిగుతూ వచ్చింది. సమస్య జటిలమై చివరకు కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితి రావొద్దన్న ఉద్దేశంతో పట్టు వీడింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమనే ప్రధాన డిమాండ్ను సైతం తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత గత బుధవారం ఏకంగా సమ్మె విరమణ అంశాన్ని ప్రస్తావించింది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. సడక్ బంద్ను కూడా విరమించింది. ఈ రెండు సందర్భాల్లో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని జేఏసీ ఆశించింది. కానీ కార్మిక సంఘాలు మెట్టు దిగినా ప్రభుత్వం మాత్రం బెట్టు వీడలేదు. ఇప్పుడు ఏకంగా సమ్మెనే విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోగా విధుల్లోకి తీసుకోవడం సాధ్యం కాదంటూ ఎండీ పేరిట ప్రకటన విడుదల కావడం గమనార్హం. 32 మంది మృత్యువాత సమ్మె ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు సంబంధించి 32 మంది మృతి చెందారు. వారిలో 28 వరకు కార్మికులు ఉండగా మిగతావారు వారి కుటుంబ సభ్యులున్నారు. ఆర్టీసీలో ఉద్యోగం పోయిందనే ఆవేదనతో ఎక్కువ మంది గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డారు. నలుగురు కార్మికులు మాత్రం బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో ఖమ్మంకు చెందిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఒంటికి నిప్పంటించుకొని ఇంట్లోనే మరణించడం అందరినీ కలచివేసింది. మృత్యువుతో పోరాడుతూ కూడా ఆయన... కార్మికులు బాధలో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో సమ్మె ఒక్కసారిగా ఉధృతరూపం దాల్చింది. ఆ తర్వాత రాణిగంజ్ డిపో కండక్టర్ సురేందర్గౌడ్ ఉరేసుకుని చనిపోయారు. ఆయన అంతిమయాత్రలో కార్మికులు, విపక్ష నేతలు, కార్యకర్తలు, భారీగా పాల్గొనడంతో సమ్మె మరింత ఉధృతమైంది. ఆ తర్వాత సత్తుపల్లి డిపో కండక్టర్ నీరజ, మహబూబాబాద్ డిపో డ్రైవర్ నరేశ్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. సమ్మె ప్రారంభం: అక్టోబర్ 5 సమ్మె ముగింపు: నవంబర్ 25 సమ్మె జరిగిన రోజులు: 52 సమ్మె కాలంలో మరణించిన కార్మికులు, వారి కుటుంబీకులు: 32 -
నేడు డిపోల వద్ద ర్యాలీలు: జేఏసీ
సాక్షి, హైదరాబాద్: బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటం సరికాదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం సీఎం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించినా, విధుల్లోకి తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం దారుణమని పేర్కొంది. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నేతలు శుక్రవారం సమావేశమై దీనిపై చర్చించారు. తర్వాత శనివా రం నుంచి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయనున్నట్టు చెప్పారు. అన్ని డిపోల వద్ద నిరసన ర్యాలీలు నిర్వహించాలని కార్మికులకు సూచించా రు. మరోవైపు శుక్రవారం కూడా చాలామంది కార్మికులు విధుల్లో చేరేందుకు డిపోల వద్దకు వచ్చారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికారులనే కలిసి మాట్లాడుకోవాలంటూ డిపో మేనేజర్లు తిప్పి పంపారు. -
బేషరతుగా విధుల్లోకి తీసుకోండి..సమ్మె విరమిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. సమ్మె వ్యవహారాన్ని కార్మిక న్యాయస్థానమే తేల్చాలని, దీనికి రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ హైకోర్టు కార్మిక శాఖ కమిషనర్కు సూచించిన నేపథ్యంలో... ఈ వ్యవహారం ఇప్పుడు కార్మిక శాఖకు చేరింది. దీంతో కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని జేఏసీ బుధవారం వెల్లడించింది. విషయం కార్మిక న్యాయస్థానం పరిధిలోకి వెళ్లే అవకాశం ఉన్నందున... ప్రజలు, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే, సమ్మెలో ఉన్న కార్మికుల ఆత్మగౌరవం కాపాడాలని, సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితి కల్పించి వారిని విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి సానుకూలత వ్యక్తమైతే సమ్మె విరమిస్తామని పేర్కొంది. లేని పక్షంలో యథాతథంగా సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. సమ్మె విషయంలో హైకోర్టులో ఊరట లభిస్తుందని ముందు నుంచి ఊహించిన కార్మికులకు.. అనుకూల నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవటంతో సమ్మె కొనసాగించే విషయంలో పునరాలోచనలో పడ్డారు. విషయం కార్మిక శాఖ పరిధిలోకి వెళ్లటం, అక్కడి నుంచి కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు కనీసం రెండు వారాల సమయం పట్టడం, ఆ తర్వాత తీర్పు రావటానికి మరికొంత సమయం పడుతుండటంతో సమ్మె విరమించాలంటూ జేఏసీపై ఒత్తిడి వచ్చింది. అదే సమయంలో సమ్మెను మరింత ఉధృతం చేయాలన్న ఒత్తిడి కూడా ప్రారంభమైంది. దీంతో మెజార్టీ కార్మికుల అభిప్రాయానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో మంగళవారం డిపోల స్థాయి నేతలతో జేఏసీలోని నాలుగు సంఘాలు విడివిడిగా సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే. ఇందులో సమ్మె విరమించాలనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమైనా, దానికి భిన్నమైన వాదన కూడా వచ్చింది. ఆ తర్వాత జేఏసీ భేటీ అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కార్మిక శాఖ ఎలా వ్యవహరించే అవకాశం ఉంది.. కార్మిక న్యాయస్థానానికి కేసు బదిలీ అయితే ఏం జరిగే అవకాశం ఉంది... తదితరాలపై న్యాయవాదుల సలహా తీసుకున్నాక తుది నిర్ణయం వెల్లడించాలని నిర్ణయించింది. హైకోర్టు పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి ప్రతి ఆధారంగా బుధవారం న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించి చివరకు సమ్మె విరమణకే మొగ్గు చూపింది. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో వివరాలను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. కో–కన్వీనర్లు రాజిరెడ్డి, సుధ, లింగమూర్తి, థామస్రెడ్డితోపాటు తిరుపతి, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. సానుకూల స్పందన వస్తుందా?.. సమ్మె విరమించాక కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే పరిస్థితి గందరగోళంగా మారే ప్రమాదం ఉన్నందున ముందుగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావాల్సి ఉంటుందని నిర్ణయించి, కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే తమ ప్రధాన డిమాండ్ అంటూ పేర్కొన్నా, దాన్ని తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు 10 రోజుల క్రితమే ప్రకటించి ఓ మెట్టు దిగింది. ఇప్పుడు... 47 రోజుల పాటు ఉధృతంగా నిర్వహించిన సమ్మెనే విరమించుకునేందుకు సిద్ధమని పేర్కొంది. దీంతో మెట్టు దిగకుండా భీష్మించుకుని కూర్చున్న ప్రభుత్వం నిర్ణయంపై ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది. సమ్మె ప్రారంభమయ్యాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు దాదాపు డజన్ పర్యాయాలు అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కోర్టులో వ్యవహరించాల్సిన తీరు, ఆర్టీసీ ప్రైవేటీకరణ, ప్రైవేటు బస్సులకు పర్మిట్ల కేటాయింపు... తదితర అంశాలపై చర్చించారు. ఈ నిర్ణయాల ప్రకారమే ఆర్టీసీ, రవాణాశాఖ నడుచుకుంది. ఇప్పుడు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంలో కూడా ఆర్టీసీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సీఎం స్థాయిలోనే దీనిపై నిర్ణయం జరగాల్సి ఉంది. దీంతో ఆయన దీనిపై ఎప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకుంటారోనని 49,500 మంది కార్మికుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రెండు రోజులుగా డిపోలకు ‘ఆదేశం’.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోమవారమే సమ్మె విరమణపై కొందరు కార్మికులు ఆసక్తి చూపుతున్నారన్న మాట వినిపించింది. కార్మికులు వస్తే ఏం చెప్పాలంటూ చాలా చోట్ల డిపో మేనేజర్లు ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో నేరుగా డిపోలకు వచ్చే కార్మికుల నుంచి ఎలాంటి లేఖలు తీసుకోవద్దని, విధుల్లో చేరే విషయంలో వారితో అసలు మాట్లాడొద్దంటూ అన్ని డిపోలకు మౌఖిక ఆదేశాలందినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఫోన్లు చేసి మరీ హెచ్చరించారు. బుధవారం కూడా ఉన్నతాధికారులు మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. డ్యూటీ చార్టు, హాజరు పట్టికలో తప్ప ఎక్కడా సంతకం చేయం... ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి బుధవారం మహాత్మాగాంధీ బస్ స్టేషన్ విభాగం ప్రతినిధులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విద్యానగర్లోని టీఎంయూ కార్యాలయానికి తరలివెళ్లారు. సాయంత్రం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కార్మిక న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు ఉంది. హైకోర్టు సూచనలను రెండు పక్షాలు గౌరవించాలి. కోర్టు చెప్పినట్లుగా వెంటనే విషయాన్ని లేబర్కోర్టుకు రిఫర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలపై కూడా ఆ కోర్టులో ప్రస్తావిస్తాం. ఇప్పుడు సమ్మెలో ఉన్న కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి ఆహ్వానించాలి. ఇందులో ఎలాంటి షరతులు విధించొద్దు. కార్మికులు డ్యూటీ చార్టు, హాజరు పట్టికలపై తప్ప ఎలాంటి షరతుల ప్రతులపై సంతకాలు చేయరు. కార్మికుల ఆత్మగౌరవం నిలిచేలా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అక్టోబర్ 4న (సమ్మెకు పూర్వం) ఉన్న పరిస్థితులను కల్పించాలి. కోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందించలేదు, ముందుగా మేమే స్పందించి సమ్మె విరమణ అంశాన్ని పేర్కొంటున్నాం. మా సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధం. లేని పక్షంలో సమ్మె కొనసాగిస్తాం.’’ -
అశ్వత్ధామరెడ్డి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
-
చర్చలు జరిపితే సమ్మె విరమిస్తాం: జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపితే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎం డెడ్లైన్ విధించినా ఎవరూ విధుల్లో చేరరని, చర్చలు జరిపితేనే సమ్మెను విరమిస్తామని అన్నారు. అలాగే సమ్మె కొనసాగించాలని 97 డిపోల కార్మికులు అభిప్రాయపడ్డట్లు ఆయన వెల్లడించారు. కార్మికులపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం అన్ని డిపోల ఎదుట మానవహారాలు చేపడుతున్నట్లు తెలిపారు. సమ్మెపై సీఎం సమీక్ష.. మరోవైపు ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష చేపట్టారు. సీఎం పిలుపుమేరకు రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరిక, తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లేఖ రాయలన్న ఆలోచనలో కూడా సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 31 శాతం ఉండటంతో వారి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. -
మాది చట్టబద్ధమైన ఉద్యమం
-
విధుల్లో చేరం.. సమ్మె ఆపం
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పేర్కొంది. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టువిడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోపు కార్మికులు విధుల్లోకి రావాలని, రాని వారికి ఇక ఆర్టీసీతో సంబంధం ఉండదన్న ముఖ్య మంత్రి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ డెడ్లైన్ను కార్మికులు పట్టించుకోరని తేల్చిచెప్పింది. తమ డిమాండ్లకు పరిష్కారం రానంతవరకు సమ్మెను ఆపబోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్కు కేటాయిం చటం, ఐదో తేదీ నాటికి విధుల్లో చేరని కార్మికులను ఇక తీసుకోబోమంటూ డెడ్లైన్ విధింపు, ఐదు వేల బస్సులకే ఆర్టీసీ పరిమితం... తదితర విషయాలపై శనివారం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఆర్టీసీ జేఏసీ ఆదివారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో–కన్వీనర్ రాజి రెడ్డి, సుధ తదితరులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లపై చర్చలకు సిద్ధమై, వాటికి పరిష్కార మార్గాలు చూపనంతవరకు సమ్మెను ఆపబోమని నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బెదిరింపులకు కార్మికులెవరూ భయపడొద్దని, 49 వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ఎవరికీ లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారు చేసిన సమ్మె కార్యాచరణ అలాగే కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులను బిడ్డలుగా భావిస్తున్నానని అన్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నామని, కానీ ఆయన ఒకవైపు బిడ్డలు అంటూనే మరోవైపు కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏదో ఓ కమిటీ వేసి తమ డిమాండ్లపై చర్చించాలని పేర్కొన్నారు. మేం అన్ని డిమాండ్లపై పట్టుపట్టి కూర్చోమని, చర్చల్లో పట్టువిడుపులకు అవకాశం ఉంటుందన్నారు. తమది సీఎం చెబుతున్నట్లుగా చట్ట విరుద్ధ సమ్మె కాదని, చట్టబద్ధమైందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో లీగల్ లేదు ఇల్లీగల్ లేదు, సమ్మె సమ్మెనే అన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక సమ్మె విషయంలో మాటమార్చడం సబబు కాదన్నారు. ఆర్టీసీకి బకాయిలు లేవు అనటం కూడా సరికాదని, దానిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. 23 వేల మందికి కూర్చోబెట్టి జీతాలిస్తారా?.. కేవలం 5 వేల బస్సులే ఆర్టీసీలో ఉంటాయన్న ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం 28 వేల మంది కార్మికులు సరిపోతారని, మరి మిగిలిన 23 వేల మందికి పని ఉండదని, వారిని కూర్చోబెట్టి జీతాలిస్తారా అని ప్రశ్నించారు. 97 డిపోలకు గాను 48 డిపోలే సరిపోతాయని, మిగిలిన డిపోల డీఎంల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డీఎంల నుంచి ఈడీల వరకు బయటకొచ్చి తమతో కలసి సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రిజర్వేషన్ రోస్టర్ అమలు ఆర్టీసీలో పక్కాగా జరుగుతోందని, సగం రూట్లను ప్రైవేటీకరించాక వచ్చే ప్రైవేటు సంస్థలు వాటిని అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. అప్పుడు రిజర్వేషన్ల పద్ధతికే విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ల నుంచి కార్మికులను దూరం చేసేలా ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దాన్ని కార్మికులు గుర్తించాలని కోరారు. ఆర్టీసీలో రూ.650 కోట్ల డిప్రిసియేషన్ ఫండ్ ఉంటుందని, అది ఎక్కడుందో తేల్చి దానితో కొత్త బస్సులు కొనాలని సూచించారు. ఆర్టీసీ నష్టాలు కేంద్రం భరించే అవకాశం ఉండదన్నారు. జీతాలివ్వకుంటే పరిస్థితేంటి?... కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలంటున్నారని, రేపు జీతాలకు డబ్బులేదు ఇవ్వలేమంటే అప్పుడు వారు ఏం చేయాలని ప్రశ్నించారు. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తామని సీఎం అన్నారని, కానీ నష్టాలొచ్చే రూట్లు తీసుకునేందుకు వారు పిచ్చివాళ్లా అని ప్రశ్నించారు. అందుకే కార్మికులు వాస్తవాలు గుర్తించి సమస్య పరిష్కారమయ్యేవరకు సమ్మెలో ఉండాలని, ఆత్మద్రోహం చేసుకుని పిరికివారిలా పారిపోవద్దని సూచించారు. గతంలో ముఖ్యమంత్రి ఇలాగే డెడ్లైన్లు విధించారని, ఎవరూ చలించలేదని, ఇప్పుడు కూడా ఒకటి రెండు శాతం మంది విధుల్లో చేరినా మిగతావారు సమ్మెలోనే ఉంటారన్నారు. చాలా ప్రాంతాల నుంచి కార్మికులు తమకు ఫోన్ చేసి సమ్మెను కొనసాగించాలని పేర్కొంటున్నారని, ఆపితే ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. రోడ్డు దిగ్బంధం వాయిదా ఐదో తేదీన రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని, ఆ రోజు న్యాయస్థానాలకు సంబంధించిన పోస్టుల భర్తీ పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. -
త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్
-
ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఎసి
-
నిర్బంధంగా చర్చల ప్రక్రియ కొనసాగింది
-
ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
-
తెలంగాణ బంద్; అందరికీ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. బంద్లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంద్కు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు బంద్కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయిందన్నారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్ చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరగాలి : భట్టి పోలీసులతో బంద్ను అణచివేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రజానికం మొత్తం అండగా ఉందన్నారు. శనివారం ఆయన ఆర్టీసీ కార్మికులతో కలిసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మెల్కొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు ఎందుకు మాట్లాడడం లేదు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్.. 48 గంటల అధికారులతో చర్చించేబదులు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. ఉద్యమంలో ఉన్న మంత్రులు హరీశ్రావు, ఈటెల రాజేందర్ సమ్మెపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్, బీజేపీ నేతల అరెస్ట్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో అబిడ్స్ లో జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. ఆందోళకారులతో పాటు వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను గోషామహల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ మండిపడ్డారు. ఇది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరు అని.. ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒయూలో ఆందోళనలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్సీసీ గేటు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను విద్యార్థి సంఘం నేతలు దగ్ధం చేశారు. ఎన్సీసీ గేటు నుంచి బయటకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంపాల రాజేశ్ రాజేశ్ నేతృత్వంలో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్ఎస్) సభ్యులు ఆర్ట్స్ కాలేజీ ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఓయూ ఉద్యోగుల సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించి బంద్లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆందోళన చేపట్టిన వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ్మినేని వీరభద్రం విమలక్క, చెరుకు సుధాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు నిరసనలు, పోలీసులు అరెస్ట్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైవర్ను చితకబాదారు హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు బస్సు డీజిల్ ట్యాంకర్కు, టైర్లకు మేకులు కొట్టారు. ఓ ప్రైవేటు డ్రైవర్ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. పోలీసులు వారిని అడ్డుకుని ప్రైవేటు డ్రైవర్ను కాపాడారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏడుగురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గరా కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుపై రాళ్ల దాడి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సుపై రాళ్లతో ఆందోళనకారులు దాడి చేయడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈ బస్సును బందోబస్తు మధ్య ఆర్మూర్ పోలీసులు దాటించారు. బంద్ నేపథ్యంలో ఆర్మూర్లో డిపోకే బస్సులు పరిమితయ్యాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రయాణికులు లేక బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. పరకాలలో అరెస్ట్ల పర్వం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. పరకాల పట్టణం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక పరకాల బస్టాండ్ వెలవెలబోతోంది. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు విధులకు హాజరు రాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ప్రాంగణంలో భారీగా పోలీసులను మొహరించారు. పరకాల ఆర్టీసీ జేఏసీకి చెందిన 20 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం 5 గంటల నుండే ఇండ్లలోకి పోయి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల పర్యవేక్షణలో... ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను అధికారులు బయటకు పంపుతున్నారు. ప్రతీ బస్సులో పోలీస్ సిబ్బంది ఉన్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాగానే ఆర్టీసీ కార్మిక నేతలు, కార్మికులు వాటిని అడ్డుకుంటున్నారు. పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోలు, బస్టాండ్లు, వాటి పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలను మొహరించారు. ఆర్టీసీ బంద్కు వాణిజ్య, వర్తక సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల వద్ద భారీగా పోలీస్ బలగాలన మొహరించారు. బీజేపీ, వామపక్షాల నేతల అరెస్ట్ రాష్ట్ర బంద్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 14 మంది బీజేపీ, సీపీఐ, ఆర్టీసీ నాయకులను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ బస్ డిపో ముందు ఎస్పీ శశిధర్ రాజు పర్యవేక్షణలో పోలీసులు మొహరించారు. ఆసిఫాబాద్ బస్సు డిపో ముందు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మతో ఎక్కడికక్కడే బస్సు లు నిలిచిపోయాయి. భారీగా పోలీసుల మొహరింపు నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో 6 డిపోల పరిధిలో 670 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డు ఎక్కని బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. బోధన్ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానించాలి’
-
‘ప్రభుత్వం చర్చలకు పిలుస్తే మేము సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె, రాష్ట్ర పరిస్థితిపై సోమవారం గవర్నర్ తమిళిసైకు వినతి పత్రం అందించారు. గవర్నర్ను కలిసిన అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ...మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ.. కార్మికులను రెచ్చకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో దహనకాండపై గవర్నర్కు వివరించామని, తమ వినతులపై ఆమె సానుకూలంగా స్పందించారన్నారు. టీఎన్జీయూ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అశ్వత్థామరెడ్డి అభిప్రాయపడ్డారు. కేకే మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వనం పలకాలని సూచించారు. ‘ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్ను కలవడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఉద్యోగ సంఘాలతో నిన్న భేటీ కావాలని అనుకున్నాం. అయితే డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి మరణంతో కలవడం కుదరలేదు’ అని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో త్వరలో భేటీ అవుతామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన సంఘం ఆర్టీసీ అని, తమకు ఏ రాజకీయ నాయకులతో ఒప్పందాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజీ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కార్మికులు ఎవ్వరూ సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అంతేగాక కేకే రాసిన లేఖపై తాము ఓపెన్గా ఉన్నామని అన్నారు. -
‘సమస్యల కంటే రాజకీయం ముఖ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజు విజయవంతంగా సాగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. శుక్రవారం అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను కలుస్తున్నామని, బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ను కలిసి మద్దతు అడిగినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బతికితేనే ప్రజా రవాణా అందరికి అందుబాటులో ఉంటుందని, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. శనివారం జరగబోయే మౌన దీక్షలో కార్మిక సంఘాల కుటుంబాలు సైతం పాల్గొంటాయని అన్నారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్, విద్యుత్ సెక్టార్ల నుంచి మద్దతు కూడగడతామని, అన్ని ప్రభుత్వ సంఘాలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. రూ. 60, 70 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో తన భేటీకీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలవడానికి తాను బీజేపీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. కార్మికుల ఉద్యమానికి అన్ని పార్టీలు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, దీనికి రాజకీయ పార్టీలు తోడైతే ప్రభుత్వం దిగివస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల కంటే రాజకీయం ముఖ్యం కాదని కోదండరాం పేర్కొన్నారు. . దీనికి లక్ష్మణ్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పారన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు హరీశ్ మద్దతు!
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మంత్రి హరీశ్ రావు మద్దతు పలుకుతున్నారట! ఈ విషయాన్ని స్వయంగా కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల్లో బుధవారం నుంచి.. అంటే నాలుగు రోజులుగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలకు హరీశ్ రావు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో.. ఆయన మద్దతు కార్మికులకే ఉంటుందని, అంటే.. సమ్మెకు హరీశ్ మద్దతు పలుకుతున్నట్లేనని టీఎంయూ నాయకుడు అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అన్ని వర్గాల్లో ఆసక్తిని కలిగించాయి. ఒకవైపు మామ కేసీఆర్ సమ్మెను అణిచేయాలని చూస్తేంటే అల్లుడు హరీశ్ రావు సమ్మెకు మద్దతుగా ఉన్నారంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. -
'ఆర్టీసీ సమ్మెకు మంత్రి హరీష్రావు మద్దతు'