Auto Expo 2025
-
కమర్షియల్ టైర్ విభాగంలోకి రాల్సన్ టైర్స్
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రముఖ టైర్ల తయారీ సంస్థ 'రాల్సన్ టైర్స్' (Ralson Tyres) హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్లను లాంచ్ చేసింది. సైకిల్ టైర్లతో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ.. దేశీయ విఫణిలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కమర్షియల్ టైర్ల విభాగంలోకి కూడా అడుగుపెట్టింది.టైర్ల విభాగంలో 50 ఏళ్ల చరిత్ర ఉన్న రాల్సన్ టైర్స్.. ఇప్పుడు తన కమర్షియల్ టైర్లను ఇండోర్లోని తయారీ కేంద్రంలో తయారు చేయనుంది. ఇప్పటి వరకు చిన్న టైర్లు మాత్రమే తయారైన ఈ ప్లాంట్లో పూర్తి స్థాయిలో పెద్ద టైర్ల ఉత్పత్తి జరగనుంది. ఈ టైర్లను భారతదేశంలో విక్రయించడంతో పాటు.. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.భారతదేశంలో టైర్ ఎగుమతి విలువను 2030 నాటికి ఐదు బిలియన్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇండోర్ ఫెసిలిటీలో తయారు చేసిన టైర్లను ఇప్పటికే 170 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు కమర్షియల్ విభాగంలో కూడా కంపెనీ తన హవా చాటుకోవడానికి సిద్ధమైంది.భారత వాణిజ్య టైర్ల మార్కెట్ గణనీయమైన వృద్ధి చెందుతోంది. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని రాల్సన్ టైర్స్ పెద్ద టైర్లను తయారు చేయడానికి పూనుకుంది. ఈ విభాగంలో కూడా కంపెనీ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ.. కస్టమర్లకు ప్రయోజనాలను చేకూర్చుతూ ముందుకు సాగే అవకాశం ఉందని భావిస్తున్నాము.హై-పెర్ఫార్మెన్స్ కమర్షియల్ టైర్లను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ 'మంజుల్ పహ్వా' (Manjul Pahwa) మాట్లాడుతూ.. మా ప్రీమియం శ్రేణి వాణిజ్య టైర్లను భారత మార్కెట్కు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ టైర్లు అత్యుత్తమ నాణ్యత, మన్నికతో.. వినియోగదారులకు ప్రయోజనాలను అందిస్తాయని అన్నారు. -
హోండా యాక్టివా ఈ vs సుజుకి ఈ యాక్సెస్: ఏది బెస్ట్?
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 వేదికగా హోండా మోటార్సైకిల్ కంపెనీ తన 'యాక్టివా ఈ' స్కూటర్ లాంచ్ చేసింది. సుజుకి మోటార్సైకిల్ కంపెనీ ఈ-యాక్సెస్ పేరుతో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఇది త్వరలోనే దేశీయ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య తేడా ఏంటి?.. రేంజ్ ఎంత, బ్యాటరీ కెపాసిటీ ఏమిటనే వివరాలను వివరంగా తెలుసుకుందాం.ఫీచర్స్హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, రివర్స్ మోడ్, ఆటో బ్రైట్నెస్ అడ్జస్టేబుల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, స్మార్ట్ కీ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. యాక్టివా ఈ స్కూటర్ టచ్స్క్రీన్ కూడా పొందుతుంది. దీని ద్వారా రైడర్ బ్యాటరీ స్టేటస్, టైమ్ మొదలైనవన్నీ తెలుసుకోవచ్చు.సుజుకి ఈ యాక్సెస్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT క్లస్టర్ పొందుతుంది. దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ నోటిఫికేషన్స్ పొందవచ్చు. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ అలర్ట్ సిస్టమ్తో కూడిన స్మార్ట్ కీ కూడా లభిస్తుంది.బ్యాటరీ, రేంజ్ & పర్ఫామెన్స్హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5 కిలోవాట్ కెపాసిటీ కలిగిన రెండు రిమూవబుల్ బ్యాటరీలు పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్పై 102 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 3.07 కిలోవాట్ లిథియం ఐరన్ బ్యాటరీ ద్వారా.. 95 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.పర్ఫమెన్స్ విషయానికి వస్తే.. యాక్టివా ఈ స్కూటర్ 6 kW పవర్, 22 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. కాగా .. ఇది ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. ఈ-యాక్సెస్ స్కూటర్ 4.1 kW పవర్, 15 Nm టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 71 కిమీ. ఇది కూడా మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. -
భారత్కు చెందిన మొదటి సోలార్ ఈవీ
పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) వైవే ఈవాను భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. రూ.3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీతో ఈవీ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.ఫీచర్లు, స్పెసిఫికేషన్లువైవే ఈవా పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇది రోజుకు 10 కిలోమీటర్ల పరిధిని పెంచుతుంది. ఈ ఫీచర్ సాంప్రదాయ ఛార్జింగ్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వాహనం ప్రత్యేకమైన బ్యాటరీ రెంటల్ ప్లాన్ను అందిస్తుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు అవుతుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. నోవా (9 కిలోవాట్ బ్యాటరీ), స్టెల్లా (12 కిలోవాట్ బ్యాటరీ), వెగా (18 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్లు ఉన్నాయి. ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్ను బట్టి ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటాయి. వైవే ఈవా గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 5 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపదవైవే ఎవా డెలివరీలు 2026 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతాయని వైవ్ మొబిలిటీ ప్రకటించింది. మొదటి 25,000 మంది కస్టమర్లకు పొడిగించిన బ్యాటరీ వారంటీ, మూడు సంవత్సరాల కాంప్లిమెంటరీ వెహికల్ కనెక్టివిటీతో సహా అదనపు ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తున్నట్లు ప్రకటించింది. -
భారత్లో మొదటి ఎయిర్ ట్యాక్సీ 'శూన్య': దీని గురించి తెలుసా?
బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సరళా ఏవియేషన్' భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో2025లో తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ 'శూన్య'ను ఆవిష్కరించింది. కంపెనీ దీనిని 2028 నాటికి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.శూన్యా ఎయిర్ ట్యాక్సీ.. 20 కిమీ నుంచి 30 కిమీ దూరాల ప్రయాణాలు కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 680 కేజీలు బరువు మోయగల ఈ ఎయిర్ టాక్సీలో ఆరుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. మార్కెట్లో అత్యధిక పేలోడ్ మోయగల కెపాసిటీ ఉన్న ఎయిర్ టాక్సీగా రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ధరలను అధికారికంగా వెల్లడించలేదు.శూన్య ఎయిర్ ట్యాక్సీ.. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ రద్దీ నుంచి ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చడానికి మాత్రమే కాకుండా.. కాలుష్యం వంటి సవాళ్లను పరిష్కరించడానికి కూడా సహరిస్తుందని సరళ ఏవియేషన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ 'అడ్రియన్ ష్మిత్' పేర్కొన్నారు.సరళ ఏవియేషన్ను.. అడ్రియన్ ష్మిత్, రాకేష్ గాంకర్, శివమ్ చౌహాన్ అనే ముగ్గురు అక్టోబర్ 2023లో స్థాపించారు. ఈ స్టార్టప్ ఇటీవలే ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్, జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ భాగస్వామ్యంతో Accel నేతృత్వంలోని సిరీస్ A ఫండింగ్లో 10 మిలియన్లను సేకరించింది. కాబట్టి ఈ కంపెనీ త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది.సరళ ఏవియేషన్ను కంపెనీ తన ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను.. బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణె సహా ఇతర నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రయాణీకుల రవాణాతో పాటు, పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించాలని సరళ ఏవియేషన్ యోచిస్తున్నట్లు సమాచారం.ఎయిర్ ట్యాక్సీల అభివృద్ధికి కేంద్రంనగరాలు అభివృద్ధి చెందుతున్నాయి, ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిపోయింది. రోజువారీ ట్రాఫిక్ ఎలా ఉన్నా.. వర్షాకాలంలో మాత్రం ట్రాఫిక్లో చిక్కుకుంటే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని కంపెనీలు గత కొంత కాలంగా ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా రోడ్మ్యాప్ సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టంభారతదేశంలో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి, రోడ్మ్యాప్ను రూపొందించడానికి.. ఇండియా ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్ 2026 నాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగుళూరు వంటి ప్రధాన పట్టణ కేంద్రాలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం.ప్రయాణ ఖర్చు తక్కువే..ఇండిగో పేరెంట్ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు 'ఆర్చర్ ఏవియేషన్'తో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే పనిని ప్రారంభించింది. ఎయిర్ టాక్సీ అందుబాటులో వచ్చిన తరువాత.. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికుడికి అయ్యే ఖర్చు ఉబర్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. -
ఆటో ఎక్స్పో.. స్పందన అదరహో
దేశ రాజధానిలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ ఫేవరెట్ కొత్త కార్లు, బైక్లను చూసేందుకు వాహన ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం నుంచి సాధారణ ప్రజానీకాన్ని కూడా అనుమతిస్తుండటంతో ఎంట్రీ పాయింట్లు, సెక్యురిటీ చెక్ పాయింట్ల దగ్గర ప్రజలు బారులు తీరారు. సమీప ప్రాంతాల నుంచి కూడా వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ జన సందోహాన్ని ఊహించిన కంపెనీలు కూడా డిస్ప్లే ఏరియాల్లో మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాయి. పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు వాహనాల తయారీ సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో సత్వరం స్పందించేందుకు పెద్ద ఎత్తున ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లు, వైద్య సదుపాయాలు మొదలైనవి ఏర్పాటు చేసినట్లు వివరించారు. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఆటో ఎక్స్పోలో తొలి రెండు రోజులు మీడియా, వ్యాపార వర్గాలకు కేటాయించగా.. మిగతా రోజుల్లో సందర్శకులను అనుమతిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు తొలి రెండు రోజుల్లో 90 పైచిలుకు కొత్త వాహనాలను ఆవిష్కరించాయి. పలు కాన్సెప్ట్లు, సరికొత్త ఆటోమోటివ్ టెక్నాలజీల మొదలైన వాటిని కూడా ప్రదర్శిస్తున్నాయి.ఇదీ చదవండి: స్మాల్క్యాప్ ఫండ్ పరిమాణం పెరిగితే..?భారత్లో తయారీకి సిద్ధం: బీవైడీఅన్నీ కలిసి వస్తే భారత్లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనాకి చెందిన బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగం హెడ్ రాజీవ్ చౌహాన్ తెలిపారు. ప్రణాళికలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వివరించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ ప్రీమియం ఎలక్ట్రికి ఎస్యూవీ సీలయన్7ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్లో తమకు ప్రస్తుతం ఏ కంపెనీతోనూ తయారీ కాంట్రాక్టులు లేవని ఆయన చెప్పారు. దేశీయంగా కంపెనీ కార్యకలాపాలు సాగించడానికి సంబంధించి చైనీయులపై భారత్ వీసా ఆంక్షల ప్రభావమేదేనా ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని చౌహన్ చెప్పారు. -
దిగ్గజ కంపెనీలన్నీ ఒకేచోట: అబ్బురపరుస్తున్న కొత్త వెహికల్స్ (ఫోటోలు)
-
రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్ ఇదే
ఖరీదైన బైకులను తయారు చేసే బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన 'ఆర్ 1300 జీఎస్ఏ' (R 1300 GSA) లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 22.95 లక్షలు. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా 12 కేజీలు తక్కువ బరువును కలిగి ఉంది.సుమారు 30 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ 1300 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7750 rpm వద్ద 145 హార్స్ పవర్, 6500 rpm వద్ద 149 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆటోమేటెడ్ షిఫ్ట్ అసిస్టెంట్ కలిగిన ఈ బైక్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.ఇదీ చదవండి: సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ఏ బైక్.. ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ, ఆప్షన్ 719 కారాకోరం అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. కంపెనీ ఇందులోనే మరో కొత్త వేరియంట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.Unleash your potential with the all-new BMW R 1300 GS Adventure.Starting at an introductory ex-showroom price of INR 22.95 Lakhs*.To know more, head over to the link below 👇 https://t.co/gsXc9UFriJ#BMWR1300GSAdventure #BMWMotorradIndia #R1300GSAdventure #PriceLaunch pic.twitter.com/oU0WWBuRNF— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) January 18, 2025 -
సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) తన నాల్గవ తరం ఎక్స్3 (X3)ని ఆటో ఎక్స్పో 2025లో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 75.80 లక్షలు, రూ. 77.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్లో ప్రారంభమవుతాయి.2025 బీఎండబ్ల్యూ ఎక్స్3 రెండు మోడల్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. పెట్రోల్ మోడల్ 190 హార్స్ పవర్, 310 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వెర్షన్ 197 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్3 కారు.. స్లిమ్ హెడ్లైట్స్, కిడ్నీ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్స్క్రీన్, 14.9 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉంటాయి. హీటెడ్ స్పోర్ట్స్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, పార్క్ అసిస్ట్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేషన్ ఫంక్షన్తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రిక్లైనింగ్ రియర్ బెంచ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. -
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్తో కూడిన డిజిటల్ కాక్పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్డ్ గ్లాస్ సన్రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025 -
Auto Expo 2025: ఒక్క వేదిక.. ఎన్నో వెహికల్స్
రెండేళ్లకు ఒకసారి జరిగే 'ఆటో ఎక్స్పో 2025' (Auto Expo 2025) కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' (Narendra Modi) ప్రారంభించారు. ఈ ఈవెంట్కు దిగ్గజ వాహన తయారీ సంస్థలు హాజరవుతాయి. ఇది ఈ రోజు (జనవరి 17) నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. కాగా ఆటో ఎక్స్పో మొదటిరోజు లాంచ్ అయిన టూ వీలర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.హోండా యాక్టివా ఈ (Honda Activa e)హోండా మోటార్సైకిల్ కంపెనీ గత ఏడాది మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త 'యాక్టివా ఈ' (Activa e) ధరలను 'భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025' వేదికపై ప్రకటించింది. ఈ స్కూటర్ 1.17 లక్షల నుంచి రూ. 1.52 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ 1.5 కిలోవాట్ స్వాపబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం. కాగా ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హోండా క్యూసీ1 (Honda QC1)ఆటో ఎక్స్పోలో కనిపించిన టూ వీలర్లలో హోండా క్యూసీ1 కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 90,000. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీ 80 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కిమీ/గం. ఈ స్కూటర్ 330 వాట్స్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6:50 గంటలు. ఇది 9.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 (TVS RTX 300)టీవీఎస్ కంపెనీ కూడా భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025లో ఆర్టీఎక్స్ 30 బైకును ఆవిష్కరించింది. పలుమార్లు ఈ బైకును టెస్ట్ చేసిన తరువాత ఈ రోజు (జనవరి 17) అధికారికంగా ప్రదర్శించింది. ఇది బ్రాండ్ మొట్టమొదటి అడ్వెంచర్ బైక్. ఇందులోని 299 సీసీ ఇంజిన్ 35 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంటీవీఎస్ జుపీటర్ సీఎన్జీ (Bajaj Jupiter CNG)టీవీఎస్ కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన జుపీటర్ సీఎన్జీ ప్రదర్శించింది. ఈ స్కూటర్ ఫ్రీడమ్ 125 బైక్ మాదిరిగానే పెట్రోల్, సీఎన్జీతో పనిచేస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందించడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుందని సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.10 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.టీవీఎస్, బజాజ్ బ్రాండ్ వెహికల్స్ మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ కొత్త వాహనాలను, రాబోయే వాహనాలను ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.