Balapur ganesh
-
లంబో‘ధర’ లడ్డూ!
సాక్షి, హైదరాబాద్/బడంగ్పేట్: భాగ్యనగరంలో గణేశ్ ప్రసాదం లడ్డూ వేలం పాట కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గణపతి ప్రసాదం సొంతం చేసుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో వేలాది మంది భక్తులు వేలం పాటలో పాల్గొన్నారు. రూ.లక్షలు దాటి రూ.కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నారు. రిచ్మండ్ విల్లాస్లో గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.1.25 కోట్లకు లడ్డూ వేలం పాట జరగగా, ఈ ఏడాది అదే విల్లాస్లో ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ఆర్వీ దియా ట్రస్ట్ రూ.1.87 కోట్లకు లడ్డూను వేలంలో దక్కించుకుంది. బాలాపూర్ లడ్డూ ప్రధానికి బహూకరిస్తా.. ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ లడ్డూను బీజేపీ నేత, సింగిల్ విండో మాజీ చైర్మన్ కొలన్ శంకర్రెడ్డి దక్కించుకున్నారు. మంగళవారం ఉదయం మండపం నుంచి కదిలిన విఘ్నేశ్వరుడు గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకున్న అనంతరం లడ్డూకు వేలం పాట నిర్వహించారు. లింగాల దశరథ్గౌడ్, సామ ప్రణీత్రెడ్డి, గీతాదేవి, కొలన్ శంకర్రెడ్డి మధ్య హోరాహోరీ పాట నడిచింది. చివరకు రూ.30,01,000 కొలన్ శంకర్రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. కాగా, బాలాపూర్ గణనాథుని లడ్డూను వేలంలో దక్కించుకోవడం సంతోషంగా ఉందని, ఈ లడ్డూని ప్రధాని మోదీకి బహూకరిస్తానని శంకర్రెడ్డి తెలిపారు. లక్షల్లో వేలం పాటలు.. ⇒ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చబండ వినాయకుని లడ్డూను రూ.16.03 లక్షలకు పీఏసీఎస్ స్థానిక చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, సమత దంపతులు దక్కించుకున్నారు. ⇒ బడంగ్పేట్లోని వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను రూ.11.90 లక్షలకు స్థానిక రైతు గౌర సత్తయ్య, అతని కుమారులు వీరయ్య, చంద్ర య్య, సురేశ్ కైవసం చేసుకున్నారు. ⇒ అత్తాపూర్ పోచమ్మ ఆలయం న్యూస్టార్స్ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని లడ్డూను ఏనుగుల సుభా‹Ùరెడ్డి రూ.11.16 లక్షలకు దక్కించుకున్నారు. ⇒ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి శ్రీ వీరాంజనేయ భక్త సమాజం హనుమాన్ టెంపుల్ లడ్డూను పోరెడ్డి శ్రీకాంత్రెడ్డి రూ.10 లక్షలకు కైవసం చేసుకున్నారు. ⇒ ఉప్పరపల్లి రెడ్డిబస్తీలో బొక్క ప్రశాంత్రెడ్డి రూ. 7.01 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ⇒ విజయపురి కాలనీ ఫేజ్–2లో త్రినేత్ర ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర లడ్డూను రూ.6.5 లక్షలకు ఒర్సు రాజు సొంతం చేసుకున్నారు. ⇒ కూకట్పల్లి వినాయక భక్త బృందం బీజేపీ ఆఫీస్ దగ్గర లడ్డువేలం వేయగా రూ.5.65 లక్షలకు రంభప్పగారి సందీప్రావు దక్కించుకున్నాడు.సమాజ సేవలో రిచ్మండ్⇒ ఏటా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట⇒ ఈ ఏడాది 1.87 కోట్లతో రికార్డు⇒ సామాజిక సేవలకు 48 ఎన్జీవోలతో ఒప్పందం..⇒ క్రికెటర్ కపిల్దేవ్ సైతం ప్రశంసలుసాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత రెండు, మూడేళ్లుగా రికార్డు స్థాయిలో లడ్డూ వేలం పాట పాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది రిచ్మండ్ విల్లాస్కు చెందిన ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్టు. ఈ ఏడాది 1.87 కోట్లకు వేలం పాట పాడి రికార్డు నెలకొల్పింది. అసలు ఇంత మొత్తం డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. ఈ నిధులను ఏం చేస్తారనే ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం.. దాతల నుంచి సేకరించి.. సాధారణంగా వేలం పాట అంటే ఎవరో ఒక వ్యక్తి పాడి ఆ లడ్డూని దక్కించుకుంటారు. కాకపోతే రిచ్మండ్ అపార్ట్మెంట్కు చెందిన వారంతా నాలుగు గ్రూపులుగా విడిపోయి వేలం పాట పాడుతుంటారు. ఎక్కువ మొత్తం పాడిన ఒక గ్రూపు వాళ్లు వేలంలో గెలిచినట్టు ప్రకటిస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మిగిలిన గ్రూపుల వాళ్లు పాడిన మొత్తం కూడా వేలంలో కలిపేస్తారు. దీంతో భారీ మొత్తం సమకూరుతోంది. ఇక అపార్ట్మెంట్కు చెందిన వారితో పాటు విదేశాల్లో ఉన్న ట్రస్టు సభ్యుల స్నేహితులు, కుటుంబసభ్యులు కూడా ఈ వేలం పాటకు డబ్బులు ఇస్తారు. 2016 నుంచి.. 2016లో రిచ్మండ్ విల్లాస్లో లడ్డూ వేలం ప్రారంభమైంది. అపార్ట్మెంట్లో పనిచేసే వారి పిల్లలను చదివించాలనే ఉద్దేశంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించి లడ్డూ వేలం ప్రారంభించారు. తొలిసారి రూ.25 వేలు పలికిన లడ్డూ.. ప్రతియేడూ పెరుగుతూ ఈ ఏడాది 1.87 కోట్లకు చేరింది. గతేడాది 1.2 కోట్లు సమకూరాయి. వేలం ద్వారా వచి్చన మొత్తం డబ్బును ట్రస్టు సభ్యులు సామాజిక సేవకే వినియోగిస్తున్నారు. ఈ ఏడాది 48 ఎన్జీవోలతో ఒప్పందం కుదుర్చుకుని, వారి ద్వారా అవసరాల్లో ఉన్న వారికి విద్య, వైద్యం అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.చాలా గొప్ప పని: కపిల్దేవ్ ఆర్వీ దియా ట్రస్ట్ అద్భుతమైన పని చేస్తోందని ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కితాబిచ్చారు. తాను నేరుగా వచ్చి కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొంటూ ఆయన ఓ వీడియో సందేశం పంపారు. ఒకరోజు కచి్చతంగా వచ్చి నేరుగా ట్రస్ట్ సభ్యులను కలుస్తానంటూ ఆయన చెప్పారు.ఒక్క రూపాయి తీసుకోం.. లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోం. ప్రతి రూపాయి సామాజిక సేవ చేసేందుకే వినియోగిస్తాం. పేద వారికి చదువు, వైద్యం, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గత ఎనిమిదేళ్లుగా నిరి్వరామంగా కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. – జీవన్రెడ్డి, ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్టు -
బాలాపూర్ లడ్డూ వేలం.. మరోసారి రికార్డు ధర
బాలాపూర్ గణేష్ నిమజ్జనం.. 👉బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా లడ్డూ రికార్డు స్థాయిలో వేలం జరిగింది. రూ.30లక్షల ఒక వేయ్యి పలికిన లడ్డూ. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. 👉 మరికాసేపట్లో ప్రారంభం కానున్న బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట👉బాలాపూర్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. నేడు నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ వినాయకుడు ఉద్వాసన పూజలు అందుకున్నాడు. అనంతరం, వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది. 👉బాలాపూర్ వీధుల్లో గణపతిని ఊరిగేస్తుండగా వీధులన్నీ భక్తుల జన సందోహంతో నిండిపోయాయి. 👉బాలాపూర్ నిమజ్జనం నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.👉ఇక, ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియలో ఆరుగురు భక్తులు పాల్గొననున్నారు.👉ఇప్పటికే గత సంవత్సరం వేలంపాటలో పలికిన 27 లక్షల రూపాయలను ఆరుగురు భక్తులు డిపాజిట్ చేశారు. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటకు 30 ఏళ్లు పూర్తివేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ తాజాగా కొత్త నిబంధన పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేయాలని నిర్ణయంగ్రామస్తుల నుంచి వేలంపాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన1994లో తొలిసారి బాలాపూర్లో లడ్డూ వేలం పాటమొదట రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో బాలాపుర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు2023లో లడ్డూను దక్కించుకున్న స్థానికేతరుడైన దాసరి దయానంద్రెడ్డి ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనాబాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీ -
బాలాపూర్ లడ్డు స్పెషల్.. వెండి గిన్నెలో 21 KGల లడ్డు..
-
ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు
-
రూ. 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
-
బాలాపూర్ గణేష్ శోభా యాత్ర
-
బాలాపూర్ లడ్డు ప్రత్యేకత..పోటా పోటీ..
-
రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, రంగారెడ్డి: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం. ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డూ. ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట ముగియడంతో కాసేపట్లో నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు. బాలాపూర్ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే.. ► 1994లో కొలను మోహన్రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000 ►2000లో కల్లెం ప్రతాప్రెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,10,000 ►2010లో కొడాలి శ్రీధర్బాబు..రూ.5,35,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు... ►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్రెడ్డి... రూ. 18,90,000 ► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి ► 2023లో 27 లక్షలు దాసరి దయానంద్రెడ్డి -
బాలాపూర్ లడ్డు వేలం 2023
-
బాలాపూర్ గణనాథుడు.. ఈసారి స్పెషల్ ఇదే
బాలాపూర్ గణనాథుని వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏటా గణేశుడి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వామి వారి చేతిలోని లడ్డూకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. ఈసారి ఐదు తలల నాగరాజు పడగల కింద స్వామివారిని సుందరంగా రూపొందించారు. విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనాలో మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. కోల్కతాకు చెందిన కళాకారులు 11 రోజులుగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. 18 ఫీట్ల ఎత్తుతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్రెడ్డి తెలిపారు. -
బాలాపూర్ గణేష్ లడ్డు వేలం (ఫొటోలు)
-
ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర
-
24 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ వేలం
-
రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ వేలం
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణేష్ లడ్డూ శుక్రవారం జరిగిన వేలం పాటలో రికార్డు బ్రేక్ చేసింది. వేలంలో రూ. 24.60 లక్షలు పలికింది. లడ్డూను బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ. 18.90 లక్షలు పలకగా.. అప్పటి కంటే ఈసారి లడ్డూ ధర 5.70 లక్షలు అధికంగా పలికింది. కాగా ఈ సంవత్సరం బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటల 13 మంది పాత సభ్యులు, 8 మంది కొత్తవారు పాల్గొన్నారు. రాజకీయ ప్రముఖులు లడ్డూ వేలంలో పాటకు హాజరయ్యారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం హాజరయ్యారు. వేలం పాట అనంతరం బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. మదీనా, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్ మీదుగా శోభాయాత్ర సాగనుంది. -
కాసేపట్లో బాలాపూర్ గణేశుడి ఊరేగింపు
-
బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
-
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. నిమజ్జనోత్సవానికి మూడు కమిషనరేట్ల పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, గణనాథుడు సాగరానికి చేరేందుకు వీలుగా మార్గం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బాలాపూర్ నుంచి సౌత్ జోన్ మీదుగా చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుగుతుందని వెల్లడించారు. మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని అన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చదవండి: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం జరగనున్నట్లు రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జానానికి ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ జోన్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, భక్తులు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ వినాయకుడు మద్యాహ్నం తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రేపు సెలవు గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం(సెప్టెంబర్ 9) సెలవు ప్రకటించింది. తిరిగి సెప్టెంబర్ 12న వర్కింగ్ డేగా ప్రకటించింది. -
రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా విశిష్టమైన చరిత్ర కలిగి ఉన్న బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికింది. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ ఈసారి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. గత 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా బాలాపూర్ గణేష్ లడ్డూవేలం ప్రతిష్టాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూకు పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన వేలం పాటలో 35 మంది పాల్గొన్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర బాలాపూర్ గణేషుడి లడ్డూ ప్రతి ఏడాది 21కిలోల బరువుతో తయారు చేస్తారు. బాలాపూర్ లడ్డూ సంప్రదాయం 1980లో ప్రారంభమవ్వగా.. వేలం మాత్రం 1994లో మొదలైంది. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఈ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులతోపాలు ప్రముఖులు సైతం పోటీపడతారు. ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా ప్రభావంతో రద్దు చేశారు. ఉత్సవసమితి సభ్యులు సీఎం కేసీఆర్కు ఆ లడ్డూను అందజేశారు. 2019లో బాలాపూర్ లడ్డూ రికార్డుస్థాయిలో 17లక్షల 60 వేల రూపాయలు పలికింది. నిమజ్జన వేడుకలు 41 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ఆదివారం తెల్లవారు జామునే ప్రారంభమయ్యాయి. ఉదయం అయిదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో చివరిపూజలందుకున్న గణేషుడు ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ.. సన్నాయి మేళాల నడుమ ఊరేగింపు సాగుతోంది. ట్యాంక్బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంపాటలు ► 1994లో కొలను మోహన్రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం ప్రతాప్రెడ్డి.. రూ. 65,000 ►2000లో కల్లెం అంజిరెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత శేఖర్రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,15,000 ►2010లో కొడాలి శ్రీధర్బాబు..రూ.5,25,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 ---- ---- ►2021లో మర్రి శశాంక్రెడ్డి... రూ. 18,90,000 -
బాలాపూర్లో ఆరు అడుగుల వినాయకుడు
సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ బాలాపూర్ గణేశున్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. మంత్రికి గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. గణేశునికి సబితా ఇంద్రారెడ్డి తొలి రోజు(శనివారం) పూజ చేశారు. ఆమెతో పాటు మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు పూజలో పాల్గొన్నారు. ఆరు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి పూజ చేసిన మంత్రి సబితా రెడ్డి.. ప్రజలందరిని కరోనా నుండి కాపాడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి నిర్వాహకులు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లడ్డూ వేలం రద్దు చేశారు. -
ఖైరతాబాద్, బాలాపూర్ విగ్రహాలకే నిమజ్జన భాగ్యం?
సాక్షి, సిటీబ్యూరో: జై గణేశ్ నినాదాలు ఈ సంవత్సరం ఇళ్లకే పరిమితం కానున్నాయి. కోవిడ్ వైరస్ నేపథ్యంలో ఆడంబరాలు, అన్నదానాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సామూహిక ప్రార్థనలకు అవకాశంఇవ్వకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి గణేశ్ ఉత్సవసమితులు కూడా సరే చెప్పాయి. అయితే వీటి నుంచి ఖైరతాబాద్, బాలాపూర్ తదితర వినాయకులకుమినహాయింపు లభించే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఆయా భక్త మండళ్లు విగ్రహాలు నెలకొల్పినా సామూహిక పూజలు, ఇతర కార్యక్రమాలునిర్వహించకుండా చూడనున్నారు. సోమవారం రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, నగర అధికారులు, ఉత్సవ సమితిలతోనిర్వహించిన సమావేశంలో పరిస్థితి సమీక్షించి, ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాల్లోని వినాయక దేవాలయాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వం తరపునే పూజలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ యేడు కూడా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో మట్టివిగ్రహాలను ఉచితంగా పంచుతామని ప్రకటించారు. ఆన్లైన్లోనే..మహాగణపతి దర్శనం తొమ్మిది అడుగుల ఎత్తులో మట్టిరూపంలో రూపుదిద్దుకుంటున్న ఖైరతాబాద్ మహాగణపతి ఈ మారు ఆన్లైన్లోనే దర్శనమివ్వనున్నాడు. కోవిడ్ నిబంధనలకులోబడి శిల్పి నగేష్ ఆధ్వర్యంలో 22 మంది కోల్కతా నుంచి వచ్చిన కార్మికులు గంగానది మట్టితో వినాయక విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఉత్సవ కమిటీకి మాత్రమే పూజలు చేసే అవకాశం కల్పించి, మిగిలిన భక్తులందరికి ఆన్లైన్లో దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు. ఇదిలా ఉంటే నిమజ్జన శోభాయాత్రను కూడా బాహాటంగా అనుమతించే విషయంలో ఒకింత సందిగ్ధత నెలకొంది. ఒక వేళ అన్ని విగ్రహాలను శోభాయాత్రకు అనుమతించకపోతే బాలాపూర్, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాల వరకైనా అనుమతించాలని నిర్వహణ కమిటీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
‘ఈ ఏడాది లడ్డూ వేలం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ గణపతి ఉత్సవాల కోసం పలు నిర్ణయాలను తీసుకుంది. ఈ ఏడాది గణపతి ఉత్సవాల్లో భాగంగా కేవలం ఆరు అడుగుల వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఉత్సవ కమిటీ పేర్కొంది. అదే విధంగా అత్యంత ఆసక్తికరంగా నిర్వహించే వినాయకుడి లడ్డూ వేలంపాట ఏడాది నిర్వహించబోమని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల దర్శనం నిలిపివేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. -
డీజేలు,డ్యాన్స్లు మన సంస్కృతి కాదు..
సాక్షి, హైదరాబాద్: గణేష్ మండలపాల వద్ద డీజేలు, సినిమా పాటలు, డ్యాన్స్లు మన సంస్కృతి కాదని..ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు పిలుపునిచ్చారు. దేశ,దైవ భక్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలు దోహదపడాలని ఆకాంక్షించారు. అనంత చతుర్దశి రోజున మాత్రమే గణేష్ నిమజ్జనం చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. చిన్నారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఆరోగ్యకరమైన పోటీలు నిర్వహించాలన్నారు. మనమంతా ఒక్కటి కావాలనే సందేశం ఇవ్వడం కోసం జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని గణేష్ ఉత్సవాల్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరారు. ప్లాస్టిక్ రహిత,స్వచ్ఛత,శుభ్రత గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గంగా హారతి ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరమని తెలిపారు. 10న రవీంద్రభారతీలో భజన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు.. ఈ నెల 12న జరిగే 40వ సామూహిక గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని భగవంతరావు తెలిపారు.8 గంటలకు లడ్డూ వేలం అనంతరం బాలాపూర్ గణేష్ శోభా యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, స్వామి ప్రజ్ఞనంద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. -
'అర్థరాత్రిలోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం'
హైదరాబాద్: వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ అనురాగ శర్మ పేర్కొన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనుకున్న టైంలోనే పూర్తి చేశామని చెప్పారు. బాలాపూర్ గణేష్ శోభయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అర్థరాత్రి లోపు బాలాపూర్ గణనాథుడిని నిమజ్జనం చేస్తామని డీజీపీ వెల్లడించారు. కాగా, వినాయక నిమజ్జనాలపై హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏరియల్ సర్వేలో నాయిని వెంట డీజీపీ అనురాగ్శర్మ, సీపీ మహేందర్రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరిగింది. 6 గంటల్లో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం రికార్డు సమయంలో పూర్తి అయింది. బాలాపూర్ గణేష్ శోభాయత్ర ఇంకా కొనసాగుతోంది. చార్మినర్ మీదుగా బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర ఎమ్జే మార్కెట్ వైపుగా కొనసాగుతోంది. అయితే ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రూ. 14.65 లక్షలు పలికింది. గతంలో కంటే రూ. 4.33 లక్షలు ఎక్కువ పలికింది. వేలం పాటలో బడంగ్పేట గణేష్ లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది. -
చార్మినార్ను దాటిన బాలాపూర్ గణేషుడు
-
బాలాపూర్ లడ్డూ వేలంపాట ప్రారంభం