Bengaluru Man
-
లక్షన్నర జీతం.. రూ.15 వేలు కూడా మిగల్లేదు!
బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అధిక జీతాలు ఉన్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా నెలాఖరుకు పెద్దగా పొదుపు మిగలకపోవడం చాలా మంది ఉద్యోగుల వాస్తవ పరిస్థితిగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్టు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపించింది.తన బంధువు అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ఓ యూజర్ పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రుడైన అతని బంధువు మొదటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం కోసం నెలకు రూ.1.5 లక్షల జీతంతో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అతను పెద్ద విజయాన్ని సాధించాడని భావించినప్పటికీ, కొన్ని నెలల తర్వాత నగర జీవన వ్యయం ఎంత భారంగా ఉంటుందో అతనికి అర్థమైంది.వచ్చే జీతంలో దేనికి ఎంత ఖర్చు అవుతోందన్నది ఆయన వివరంగా తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంటి అద్దె: ఆఫీస్కు సమీపంలోని చిన్న అపార్ట్మెంట్కు సుమారు రూ.36,000కిరాణా సామాగ్రి: రూ.13,000 – రూ.15,000ప్రయాణ ఖర్చులు: ట్రాఫిక్ కారణంగా క్యాబ్లు, ఆటోల కోసం రూ.6,000 – రూ.8,000ఇతర ఖర్చులు: ఆన్లైన్ ఫుడ్, కాఫీ, వీకెండ్ విహారాలు కోసం రూ.10,000 – రూ.12,000ఇవి కాకుండా సబ్స్క్రిప్షన్లు, వైద్య ఖర్చులు, అనుకోని బిల్లులు, అలాగే ఇంటికి డబ్బు పంపడం వంటి ఖర్చులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అన్ని ఖర్చుల తర్వాత నెలాఖరుకు అతనికి కేవలం రూ.15,000 నుంచి రూ.20,000 వరకు మాత్రమే పొదుపు మిగులుతుందని తెలిపారు.ఈ అనుభవం ద్వారా అతను ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడని పోస్టులో పేర్కొన్నారు. “సొంతూరులో నెలకు రూ.1 లక్షకుపైగా జీతం చాలా పెద్దదిగా అనిపిస్తుంది. కానీ బెంగళూరు వంటి మెట్రో నగరంలో అదే జీతం కేవలం ప్రారంభ స్థాయి మాత్రమే” అని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వేలల్లో వ్యూస్, వందలాది లైక్లను సాధించింది. చాలా మంది నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. “సొంతూరులో అదే జీతంతో ఎక్కువగా పొదుపు చేయవచ్చు”, “పెద్ద నగరాలు మీకు తెలియకుండానే డబ్బును వేగంగా ఖర్చు చేయిస్తాయి” అని కొందరు వ్యాఖ్యానించగా “సరైన ఎంపికలు చేస్తే ఖర్చులను నియంత్రించుకోవచ్చు” అని మరో యూజర్ కామెంట్ చేశారు. -
బ్యాంకులో 14 ఏళ్లు ఎక్స్పీరియన్స్.. రోడ్డుపై బిచ్చగాడిలా..
పైన ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తికి బ్యాంకింగ్ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉందట. కానీ ప్రస్తుతం నిలువ నీడ లేకుండా, చేతిలో చిల్ల గవ్వ లేకుండా రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్నాడు. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇది జాబ్ మార్కెట్, సామాజిక పరిస్థితులపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న ఆ వ్యక్తి ఫొటోలను షేర్ చేస్తూ, ఒక రెడ్డిటర్ ఇలా రాసుకొచ్చారు..‘ఈ వ్యక్తిని ఒక ప్రముఖ బెంగళూరు సిగ్నల్ వద్ద చూశాను. ఆయనను చూస్తే ఎంతో హృదయవిదారకంగా ఉంది. ఇది సమాజ వైఫల్యమా లేక వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను.’రెడ్డిటర్ షేర్ చేసిన ఫొటోల్లో మొదటి దాంట్లో ఆ వ్యక్తిని రోడ్డు పక్కన ఫుట్పాత్పై బిచ్చగాడిలా కనిపించారు. రెండో ఫొటోలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న నోట్ను చూపించారు. అందులో 'నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, దయచేసి సహాయం చేయండి. నాకు బ్యాంకింగ్ లో 14 ఏళ్ల అనుభవం ఉంది’ అని రాసిఉంది.ఈ పోస్ట్పై రెడ్డిటర్స్ మధ్య చర్చ సాగింది. బెంగళూరు వంటి నగరంలో నిరుద్యోగం ఏంటి అని కొందరు ప్రశ్నించారు. అయితే అతని శారీరక వైకల్యం ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 'శారీరకంగా సామర్థ్యం ఉంటే డెలివరీ లేదా డ్రైవింగ్ వంటి ఏదో ఒక పని చేసుకోవచ్చని చాలా మంది చెబుతుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉంటే, మానసికంగా విచ్ఛిన్నమై, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. -
Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..
ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్టాప్లో వర్క్ కాల్లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది. పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్టాప్లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్టాప్ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైరల్గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు. Bengaluru is not for beginners 😂 (🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW — Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024 -
ఎప్పుడూ ల్యాప్టాపేనా?.. స్కూటర్పైన వెళ్తూ కూడా అవసరమా!!
కర్ణాటక: బెంగళూరు ఫ్లై ఓవర్ మీద స్కూటర్లో వెళ్తూ ల్యాప్టాప్ చూస్తున్న వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. హర్షమిత్సింగ్ అనే వ్యక్తి ఫోటో తీసి పోస్ట్ చేయడంతో నెటిజన్లు తలోరకంగా స్పందించారు. పని లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే తప్పదని కొందరు, నగరరోడ్లపై ఇలాంటి రిస్క్ చేయడం శ్రేయస్కరం కాదని మరికొందరు పేర్కొన్నారు. -
నిజానిజాల కోసం 23 ఏటీఎంలు తిరిగాడు!
నల్లధనంపై పోరాటం కోసమంటూ.. దేశంలో మార్పు కోసమంటూ ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవైపు ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు కష్టాలు పడుతుండగా.. మరోవైపు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. క్యూలో నిలబడి నిలబడి ప్రజలు కొంతమంది ప్రాణాలు విడుస్తుండగా.. ఏకంగా పార్లమెంటులోని ఏటీఎంలోనూ డబ్బులు అయిపోయి.. ఔవటాఫ్ సర్వీస్ మోడ్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన టిను చెరియర్ అబ్రహం సొంతంగా నిజానిజాలు తెలుసుకోవడానికి బయలుదేరాడు. నగరంలోని ఏటీఎంలు నిజంగా పనిచేయడం లేదా? లేక మీడియానే కావాలని కథనాలు వండి వారుస్తున్నదా? అన్నది చెరియన్ సందేహం. అందుకే మీడియా కథనాల్లోని నిజానిజాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు అతను బెంగళూరులోని 23 ఏటీఎంలను సందర్శించాడు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇలా దాదాపు నగరంలోని అన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలను చెక్ చేశాడు. మీడియా కథనాలు ఏమో కానీ అతనికి నిజాలు ప్రత్యక్షంగా చూసి బిత్తరపోయినంత పని అయింది. అతను తిరిగిన ఏటీఎంలన్నీ మూతబడి ఉన్నాయి. గతంలో ఎన్నడూ మూతపడి ఎరుగని ఏటీఎంలు సైతం ఇప్పుడు మూతపడ్డాయని అతను వరుస ట్వీట్లలో తెలిపాడు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన నగదు కష్టాలను ఈ ట్వీట్లు చాటుతున్నాయని, పరిస్థితిని ఇప్పటికైనా మార్చాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటర్వ్యూ లేకుండా ‘జీక్యూ’ జాబ్ కొట్టాడు!
బెంగళూరు: ఇంటర్వ్యూ కూడా లేకుండా రెజ్యూమెతోనే ఏకంగా జాబ్ కొడితే ఎలా ఉంటుంది? బెంగళూరుకు చెందిన సుముఖ్ మెహతా విషయంలో అదే జరిగింది. లండన్ కేంద్రంగా పనిచేసే ‘జీక్యూ’ మేగజీన్ ఉద్యోగాల భర్తీ కోసం ఔత్సాహికుల నుంచి తొలుత రెజ్యూమెలను ఆహ్వానించింది. వాటిని వడపోసి ఎంపికైన వారిని ఇంటర్య్వూకు పిలవాలనుకుంది. సుముఖ్ తన రెజ్యూమె కూడా అందరిలా ఉంటే కిక్కు ఏం ఉంటుంది అనుకున్నాడో ఏమో? తన రెజ్యూమెను ఏకంగా జీక్యూ మేగజీన్ లాగానే డిజైన్ చేసి పంపాడు. ఇంకేముంది దాన్ని చూసిన మేగజీన్ ఎడిటర్ డైలన్ జోన్స్ అతని సృజనాత్మకతకు ఫిదా అయిపోయి ఇంటర్వ్యూ కూడా లేకుండానే లండన్లోని హెడ్డాఫీసులో కొలువిచ్చాడు.


