Breaking News
-
యూపీ: బాగ్పత్లో ఘోర ప్రమాదం
-
వెబ్ సిరీస్ నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్
-
పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశం
-
Breaking News: మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ
-
తెలుగు రాష్ట్రాల్లో కంపించిన భూమి.. 20 ఏళ్ల తర్వాత భూ ప్రకంపనలు (ఫొటోలు)
-
పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు
-
ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి
జకర్తా: ఇండోనేషియాలో అగ్ని పర్వతం పేలింది. ఇక్కడి ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విపత్తులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, ఆరుగురు మృతి చెందారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మీడియాకు తెలిపింది.ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా బూడిద దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. సమీపంలోని గ్రామాన్ని వేడి బూడిద చుట్టుముట్టింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఈ పర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో కూలిన ఇళ్ల కింద కొందరు సమాధి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.వులాంగిటాంగ్ జిల్లాలో సంభవించిన ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సమీపంలోని పులులారా, నవోకోటే, హోకెంగ్ జయ, క్లాటన్లో, బోరు కెడాంగ్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో గత రెండు వారాల్లో ఇది రెండవ అగ్నిపర్వత విస్ఫోటనం. అక్టోబర్ 27న జరిగిన విస్ఫోటనంలో దట్టమైన బూడిద ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా
-
హన్మకొండ జిల్లా కాజీపేటలో కారు ఆక్సిడెంట్..మహిళ అక్కడిక్కడే..!
-
ప్రధాన వార్తలు @9 October 2023 @ 5:00 PM
-
ఇందిరాపార్కు వద్ద ANMల ఉద్రిక్తత
-
ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు
-
మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు ఈ కేసును చాలా సీరియస్ గా పరిగణించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ నమోదైన రెండోరోజునే సీబీఐ ఈ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. మహిళలపై అమానుష వైఖరిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈ కేసును సీబీఐకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేసు సీబీఐకి అప్పగించి నిర్ణీత గడువులో విచారణ పూర్తయ్యేలా చూడాలని కోరింది. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరగాల్సిన ఉండగా ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా ట్రయల్ సాధ్యపడలేదు. అంతకుముందు జులై 20న జస్టిస్ చంద్ర చూడ్, పీఎస్ నారసింహ, మనోజ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సంఘటన విచారణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పురోగతి సాధించాయన్న దానిపై వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రోద్బలంతో సిబిఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం కేసు విచారణలో ప్రాధాన్యత సంతరించుకుంది. Central Bureau of Investigation registers FIR in Manipur viral video case: CBI official pic.twitter.com/a1WdwYydyF — ANI (@ANI) July 29, 2023 మణిపూర్ అల్లర్లలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తాలూకు వీడియో క్షణాల వ్యవధిలో అంతర్జాల మాధ్యమంలో దావానలంలా వ్యాపించి దేశమంతా కార్చిచ్చు రగిలించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగి ఉక్కిరిబిక్కిరి కావడంతో ఈ కేసును సీబిఐకి బదలాయించడం హర్షణీయం. ఈ కేసులో ఇప్పటికే మణిపూర్ పోలీస్ శాఖ ఏడుగురిని అరెస్టు చేసి రేప్, మర్డర్ అభియోగాయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూత
SP Hinduja: హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా కన్నుమూశారు. 87 ఏళ్ల వయసున్న ఎస్పీ హిందూజా అనారోగ్యం కారణంగా లండన్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘హిందూజా కుటుంబ పెద్ద, హిందూజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందూజా బుధవారం (మే17) మృతి చెందారని తెలియజేస్తున్నందుకు చింతిస్తున్నాం’ అని హిందూజా కుటుంబ ప్రతినిధి అధికారికంగా తెలియజేశారు. ‘దివంగత పీడీ హిందూజా వ్యవస్థాపక సూత్రాలు, విలువలను కొనసాగించి ఎస్పీ హిందూజా మా కుటుంబానికి మార్గదర్శకుడిగా నిలిచారు. తాను ఉంటున్న యూకే, స్వదేశమైన భారత్ల మధ్య బలమైన సంబంధాన్ని నిర్మించడంలో తన సోదరులతో కలిసి చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు’ అని హిందూజా కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. సిరిచంద్ పరమానంద్ హిందూజా.. నలుగురు హిందూజా బ్రదర్స్లో పెద్దవాడు. హిందూజా గ్రూప్ సంస్థలకు చైర్మన్గా ఉన్న ఆయన లండన్లో ఉంటూ బ్రిటిష్ పౌరసత్వం పొందారు. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్ను తీసుకొచ్చిన జొమాటో.. -
పొంగులేటి,జూపల్లికి బిగ్ షాక్.. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్
-
Evening Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ను అరెస్టు చేసిన ఈడీ శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. రాష్ట్రపతి అంటే మర్యాద లేకుండా మాట్లాడారు.. స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి అంటే గౌరవం లేకుండా ఆమె మాట్లాడారని ఆరోపించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. లోన్ యాప్స్ ఆగడాలపై పూర్తి స్థాయిలో నిఘా: ఏపీ డీజీపీ లోన్ యాప్స్ ఆగడాలపై లోతుగా విచారణ చేస్తున్నామని.. వీటిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అమెరికాలో మంకీపాక్స్ కలకలం... అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. ఈ మేరకు అమెరికాలోని న్యూయార్క్ నగరం మంకీపాక్స్ వ్యాప్తికి కేంద్రంగా ఉందని, దాదాపు లక్ష మందికి పైగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మీరు ప్రాణాలతో ఉన్నారంటే ప్రధాని మోదీనే కారణం.. పాకిస్థాన్ పరిస్థితి చూడండి.. ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తారు బిహార్ మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్. ప్రజలు ఇప్పుడు బతికున్నారంటే అది మోదీ చలవే అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు అందించి అందరి ప్రాణాలను ప్రధాని కాపాడారని పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కోహ్లిని ఆసియాకప్కు ఎంపిక చేయకపోవచ్చు: పాక్ మాజీ ఆటగాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గత కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లి సెంచరీ సాధించి మూడేళ్ల దాటిపోయింది. ఐపీఎల్లో నిరాశపరిచిన కోహ్లి.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అనసూయ స్థానంలో కొత్త యాంకర్, ఎవరో తెలుసా? అనసూయ.. డేరింగ్ అండ్ డాషింగ్ యాంకర్.. అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు బుల్లితెరపైనా పలు షోలతో అలరిస్తోంది. తనకు నచ్చినట్లుగా రెడీ అవుతూ ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లిందీ ముద్దుగుమ్మ. అయితే కొన్నేళ్లుగా యాంకర్గా కొనసాగుతున్న ఓ కామెడీ షోకు అనసూయ ఇటీవలే గుడ్బై చెప్పేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పిట్ట రెట్టలతోనూ ప్రమాదమే.. జర భద్రం..! గాలిలో, వాతావరణంలో, పరిసరాల్లో వ్యాపించే మనకు సరిపడని అనేక రేణువులూ, వాసనలూ, వస్తువులతో వచ్చే ఊపిరితిత్తుల సమస్యే ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’. తాజాగా ఇప్పుడు తొలకరి కూడా మొదలైంది. దాంతో గడ్డి తడిసి ఒకరకమైన వాసన వచ్చే ఈ సీజన్లో ఈ ముప్పు మరింత ఎక్కువ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Viral Video: వీల్చైర్లో ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు అధికమవ్వడంతో డెలివరీ బాయ్లు కూడా పెరిగిపోయారు. చాలా మంది యువత పార్ట్టైం జాబ్ కింద డెలివరీబాయ్లా పనిచేస్తూ ఆదాయాన్ని సృష్టించుకుంటున్నారు. తాజాగా వీల్చైర్లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేస్తున్న ఓ దివ్యాంగుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. మంకీపాక్స్పై కేంద్రం అలర్ట్.. ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమావేశం దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జరనల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ జరిగింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్: జైరాం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్. బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా.. శనివారం ఓ జాతీయ ఛానల్లో మాట్లాడుతూ సోనియా గాంధీపై పరుషపదజాలన్ని ఉపయోగించడంపై మండిపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నీరజ్ చోప్రాకు సీఎం జగన్ అభినందనలు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్-2022లో అద్వితీయ ప్రదర్శన కనబరిచి సిల్వర్ మెడల్ సాధించిన భారత జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నోయువర్ కస్టమర్) తప్పని సరి అయింది. ఈ ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘అప్పుడు అవహేళన చేశారు.. ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు’ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో నెల్లూరు కస్తూరిబా కళాక్షేత్రంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఒప్పందం చేసుకున్న మరుసటి రోజే ఒడెస్సా పోర్ట్పై రష్యా దాడులు ఆహార సంక్షోభాన్ని అడ్డుకునేందుకు నల్ల సముద్రం మీదుగా ఆహార ధాన్యాలను చేరవేసేలా రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అయితే.. ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఆ మరుసటి రోజే ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టుపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మగ బిడ్డకు జన్మనిచ్చిన కృనాల్ పాండ్యా భార్య పంఖురి శర్మ టీమిండియా ఆల్రౌండర్, హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా తండ్రి అయ్యాడు. కృనాల్ భార్య పంఖురి శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ ఇవాళ (జులై 24) మధ్యాహ్నం ట్విటర్ వేదికగా రివీల్ చేశాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. నగ్నంగా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) సినిమాల మాట ఎలా ఉన్నా తన డ్రెస్సింగ్ స్టైల్తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. ఇప్పటికే అతను వేసుకున్న డ్రెస్లపై నెటిజన్లు ఘోరమైన కామెంట్లు మీమ్స్ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ప్రమాద ఘటనలో కుట్ర కోణం.. పోలీసులను ప్లాన్ ప్రకారమే చంపేశారా? పూతలపట్టు మండలం పి.కొత్తపేట రైల్వే అండర్ బిడ్జి వద్ద జరిగిన ప్రమాద ఘటనలో కుట్ర కోణం ఉందా?. స్కెచ్ ప్రకారం డ్రగ్స్ నిందితులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఎస్ఐ అవినాష్, కానిస్టేబుల్ అనిల్, డ్రైవర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వింత పెళ్లి సంప్రదాయాలు మీకోసం.. అయ్యో.. తప్పుగా అనుకోకండి. దక్షిణ కొరియాలోని పెళ్లి కొడుక్కి తప్పకుండా చేయాల్సిన మర్యాద ఇది. అంటే వధువు చెప్పుతో వరుడిని కొట్టడం కాదండీ! కట్టుకున్న భార్యను తనతోపాటు తీసుకెళ్లాలంటే వరుడు తన కాళ్లకున్న చెప్పులు తీసి.. అతని కుటుంబమో.. లేక అతని స్నేహితులతోనో తన అరికాళ్ల మీద కొట్టించుకోవాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన విద్యను అందించేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్న డిజిటల్ డిస్ప్లేలకు సంబంధించి వివిధ కంపెనీలు ఉపకరణాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలుగు సినిమాలకు అవార్డుల పంట కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్కు షాక్.. లిజ్ ట్రస్కే జై కొడుతున్న టోరీ సభ్యులు! బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంత్ రావు వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’ వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. తెలంగాణలో కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్రెడ్డి! తెలంగాణలో కాంగ్రెస్కు భారీ షాక్ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్లో క్రికెట్ గ్రౌండ్కు టీమిండియా దిగ్గజం పేరు.. చరిత్రలో తొలిసారి టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్లోని లీస్టర్షైర్ క్రికెట్ గ్రౌండ్కు 'గవాస్కర్ గ్రౌండ్'గా నామకరణం చేశారు. రిపోర్ట్స్ ప్రకారం ఇంగ్లండ్ లేదా యూరప్ గడ్డపై ఉన్న క్రికెట్ గ్రౌండ్కు ఒక ఇండియన్ క్రికెటర్ పేరు పెట్టడం ఇదే తొలిసారి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘కలర్ ఫోటో’కు జాతీయ అవార్డు.. హీరో సుహాస్ ఏమన్నాడంటే.. కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటాయి. మూడు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. నాట్యం సినిమాకు రెండు, కలర్ ఫోటో, అల వైకుంఠపురం సినిమాకు ఒక్కో అవార్డు లభించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. మోస్ట్ పవర్ఫుల్ హోండా 2023 సివిక్ టైప్-ఆర్ ఆవిష్కారం హోండా కొత్త సివిక్ వాహనాన్ని లాస్ ఏంజిల్స్లో గ్లోబల్గా ఆవిష్కరించింది. ‘హెండా సివిక్ టైప్-ఆర్ 2023’ను పరిచయం చేసింది. త్వరలోనే వీటి ధరలు, ఫీచర్లు వెలుగులోకి రానున్నాయి. 30 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత శక్తివంతమైన ఆర్ బ్రాండెడ్ మోడల్ అని హోండా వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1. పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్కు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ కోరినట్లు తెలిపిన కేంద్ర గిరిజన సంక్షేమం, జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. కాళేశ్వరానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదని, అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని పేర్కొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విష ప్రచారం.. బురద జల్లడమే ‘ఈనాడు’ పని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేరుస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ముగిసిన ఎంపీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జో బైడెన్కు క్యాన్సరా? పొరపాటున నోరు జారారా లేక నిజమా? వైట్ హౌస్ క్లారిటీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో చూసి అమెరికన్లు షాక్ అయ్యారు. ఆయన చెప్పింది నిజమా, లేక ఎప్పటిలాగే పొరపాటుగా నోరుజారారా? అని తెగ చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై శ్వేతసౌధం క్లారిటీ ఇచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ నేతలకు మమత వార్నింగ్.. ‘ఇక్కడకు రావొద్దు రాయల్ బెంగాల్ టైగర్ ఉంది’ 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. అరంగేట్రంలోనే అదుర్స్! 5 వికెట్లు.. ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! కానీ.. టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పారిశుధ్య కార్మికులకు భారీ డిమాండ్..కిటికీ అద్దాలు తుడిస్తే చాలు ఏడాదికి కోటి రూపాయిల జీతం! శానిటైజేషన్ వర్క్ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Netflix: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్ల పెళ్లి వీడియో నయనతార, విఘ్నేశ్ శివన్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ షాకిచ్చిందని, వారి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుందంటూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు. అంతేకాదు నెట్ఫ్లిక్స్ తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నయన్ దంపతులకు నోటీసులు కూడా ఇచ్చిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది నెట్ఫ్లిక్స్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆఫ్రికా నుంచి వచ్చిన భర్త.. ప్రియుడి మోజులో భార్య.. దూరంగా ఉండలేమని.. విశాఖలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడి కోసం ఓ మహిళ.. భర్తనే చంపేసింది. 18 ఏళ్ల వయసున్న ప్రియుడితో కలిసి కుక్కర్తో కొట్టి హత్య చేసింది. విశాఖలోని మధురవాడలో బుడుమూరు మురళి కుటుంబం నివాసం ఉంటుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సాక్షి స్పీడ్ న్యూస్ @08:00 PM 20 జూలై 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @07:30 PM 17 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @04:30 PM 17 జూలై 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @07:30 PM 16 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @12:30 PM 14 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @7:30 AM 14 జూలై 2022
-
టాప్ 60 న్యూస్ @7:00 AM 14 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @4:30 PM 12 జూలై 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @08:30 PM 10 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @4:30 PM 10 జూలై 2022
-
టాప్ హెడ్ లైన్స్ @7:00 PM 09 జూలై 2022
-
టాప్ హెడ్ లైన్స్ @6:00 PM 09 July 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @08:00 PM 08 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @8:00 PM 07 జూలై 2022
-
టాప్ 25 న్యూస్ @4:30 PM 07 జూలై 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @07:00 PM 23 June 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @07:00 PM 22 June 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @07:00 PM 21 June 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్@08:30 PM 19 June 2022
-
టాప్ 25 న్యూస్ @4:30 PM 19 June 2022
-
సాక్షి జాతీయ వార్తలు @4:00 PM 19 June 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్@08:00 PM 18 June 2022
-
టాప్ 25 న్యూస్ @5:00 PM 18 June 2022
-
టాప్ 25 న్యూస్ @04:30 PM 12 June 2022
-
టాప్ 25 న్యూస్ @4:30 PM 09 జూన్ 2022
-
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
టాప్ 25 న్యూస్ @12:30 PM 04 జూన్ 2022
-
టాప్ 25 న్యూస్ @7:30 AM 04 జూన్ 2022
-
Top 60 News @7:00 AM 04 June 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @8:00 PM 02 జూన్ 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @5:30 PM 02 జూన్ 2022
-
సాక్షి స్పీడ్ న్యూస్ @8:30 PM 01 జూన్ 2022
-
అంతులేని నిర్లక్ష్యం: తీరని విషాదం!
-
Big Breaking News: నిర్మాత బెల్లంకొండ సురేష్ పై చీటింగ్ కేసు
-
షేన్ వార్న్ హఠాన్మరణం అసలేం జరిగింది ??
-
Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం
-
ఏపీ,టీఎస్ స్పీడ్ న్యూస్@5:30 PM - 20 ఫిబ్రవరి 2022
-
తెలంగాణ ,స్పీడ్ న్యూస్ 30 August 2021
-
5 నిమిషాలు.. 25 వార్తలు@4PM
-
బ్రేకింగ్ న్యూస్ ఏంటి?
ముంబైలోని బ్రేకింగ్ న్యూస్లన్నీ తనకే ముందు తెలియాలనుకుంటున్నారు కృతీసనన్. ఎందుకంటే తన తర్వాతి చిత్రంలో మీడియా ప్రొఫెషనలిస్ట్గా నటించబోతున్నారామె. ‘పరజానియా’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ ధోలాకియా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ వర్క్షాప్స్తో పాల్గొంటున్నారు కృతీసనన్. ‘‘ఒక మంచి ఫిమేల్ డ్రివెన్ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. రాహుల్గారు మంచి స్క్రిప్ట్ సమకూర్చారు. నా నెక్ట్స్ చిత్రంలో నేను మీడియా ప్రొఫెషనలిస్ట్గా నటించబోతున్నాను.ఆగస్టులో ఈ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని కృతీ పేర్కొన్నారు. ఎక్కువభాగం ముంబైలో ఈ సినిమా షూటింగ్ను ప్లాన్ చేశారు. ఈ సినిమాకు సౌత్ కొరియాకు చెందిన ఓ సంస్థ గ్రాఫిక్ వర్క్ చేయనుందట. ప్రస్తుతం ‘అర్జున్ పటియాలా, హౌస్ఫుల్4, పానిపట్’ సినిమాలతో ఫుల్బిజీగా ఉన్నారు కృతీ. అన్నట్లు ‘అర్జున్ పటియాలా’లో కూడా కృతీ న్యూస్ రిపోర్టరే కావడం విశేషం. -
హాహా హూహూ
‘‘మిత్రమా నీకో బ్రేకింగ్ న్యూస్ చెబుతాను’’ అంటూ ఇలా మొదలు పెట్టాడు భేతాళుడు...ఒకరోజున ఉదయం లండన్లో ట్రెఫాల్గర్ స్క్వేర్ వద్ద జనం గుంపులు గుంపులుగా మూగియున్నారు. వారొక విచిత్రమైన జంతువు వంక చూస్తున్నారు. ఆ జంతువు వారినన్ని విధాల ఆకర్షిస్తుంది. ఆ జంతువు దేహప్రమాణం చాలా పెద్దది. చచ్చిపోయినదో, మూర్ఛలో ఉన్నదో తెలియదు. ఇది జంతువా? మనుష్యుడో తెలియదు... ‘‘బ్రేకింగ్ న్యూస్ చెబుతానంటూ విశ్వనాథ వారి హాహా హూహూ నవల స్టార్టింగ్ పార్ట్ చెబుతున్నావేమిటయ్యా బాబూ’’ అని విసుక్కుంటూ ఆ భుజం మీద ఉన్న శవాన్ని ఈ భుజం వైపుకి మార్చుకున్నాడు విక్రమార్కుడు. ‘‘పుస్తకంలో రాసినది బయట జరగకూడదని ఎక్కడైనా ఉన్నదా?’’ అంటూ మళ్లీ మొదలుపెట్టాడు భేతాళుడు.... మెడవరకు మనిషి...తల మాత్రం నక్క తల. చేతి పదివేళ్లకూ పది రత్నపుటుంగరాలు ఉన్నాయి. భుజాల మీద భుజకీర్తులున్నాయి. శిరస్సున మెరిసే కిరీటం ఉన్నది. ఇది జంతువా? మనిషా? తెలియడం లేదు. ట్రాఫిక్ జామ్ అయినది. ఆఫీసులకు వెళ్లే వారు ఆఫీసుమానుకుని అక్కడే నిల్చొని చూస్తున్నారు. ఫంక్షన్లకు వెళ్లే వాళ్లు ఫంక్షన్లు మానుకొని అక్కడే నిల్చొని చూస్తున్నారు. కడుపు చెదిరి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసే వాళ్లు...ఆ పరుగాపి, తాము ఎందుకు పరుగెడుతున్నది కూడా మరిచి నిమ్మకు నీరెత్తినట్లు అక్కడ నిలబడి ఆ విచిత్ర జంతువును చూస్తున్నారు. ‘ఇది జంతువు అయినా దీనికి బట్టలెక్కడి నుంచి వచ్చినవి? నగలెక్కడివి?’ అని ఒకరు అన్నారు.‘ఎందుకైనా మంచిది’ అనే కాన్సెప్ట్లో భాగంగా ఆ జంతువు చుట్టూ ముళ్ల కంచె నిర్మించారు.విషయం తెలిసి ప్రపంచ ప్రసిద్ధ జంతుశాస్త్రవేత్తలందరూ ఈ కంచె దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. తాళపత్ర గ్రంథాల నుంచి డిజిటల్ గ్రం«థాల వరకు ఒకటే తిరిగేస్తున్నారు. ఏవో రాసుకుంటున్నారు. తమలో తామేమాట్లాడుకుంటున్నారు. చేతివేళ్లతో తలను సాలోచనగా కొట్టుకుంటున్నారు.‘‘ఎన్ని రోజులని ఇలా రోడ్డు మీద వదిలేస్తారు? జూకో పోలీస్స్టేషన్కో తరలించండి’’ అన్నాడు ఒక పెద్దమనిషి.‘‘అది మనిషి అయితే పోలిస్టేషన్కు తరలించవచ్చు. జంతువును ఎలా తరలిస్తామండీ’’ జారుతున్న ప్యాంట్ సర్దుకుంటూ పాయింట్ లేవదీశాడు పోలీసాయన.‘‘నేను మనిషిని కాదు జంతువును అని అదేమైనా మీ చెవిలో చెప్పిందా? జంతువని మీరెలా డిసైడ్ చేస్తారు? జూకు తీసుకెళ్లే ప్రసక్తే లేదు. ఉన్న జంతువులకే దిక్కులేదు. ఇదొకటా మా ప్రాణానికి!’’ అని శాంతస్వరంతో అరిచాడు జూఆయన.ఒకరినొకరు భీకరంగా తిట్టుకున్న తరువాత కేసు కోర్టుకెక్కింది. ఆరోజు కోర్టులో...‘‘నా కెరీర్లో ఎన్నో జటిలమైన కేసులు చూశానుగాని ఇంత జటిలమైన కేసును ఎప్పుడూ చూడలేదు...అని నేనంటాననిమీరు అనుకుంటున్నారేమో...’’ కళ్లద్దాలను పైకి సవరిస్తూ అన్నాడు ఫేమస్ జడ్జి ఆండ్రూ లాంగ్మోర్.‘‘మేమేమీ అనుకోవడం లేదండి. ఉత్తపుణ్యానికి మీరే అనుకుంటున్నారు’’ అని పళ్లికిలించాడు కొత్త న్యాయవాది.‘షటప్’ అని ఆ న్యాయవాదిపై కళ్లెర్ర చేసి టేబుల్పై సుత్తితో రెండు సార్లు బాది ఇలా అన్నాడు జడ్జి...‘‘జడ్జి అంటే సినిమాల్లో చూపినట్లు, తగిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట... అని డైలాగు చెప్పేవాడు మాత్రమే కాదు.... క్లూ అందించే వాడు... సమస్యను పరిష్కరించేవాడు కూడా. ఆ విచిత్ర జంతువు లేదా విచిత్ర మనిషిని జూకు తరలించాలా? పోలీస్స్టేషన్కు తరిలించాలా? అనే తీర్పు ఇచ్చేముందు అసలు అదేమిటో తెలుసుకోవాలి. దీనికి జుట్టు పీక్కోనక్కర్లేదు. సింపుల్...ఆ విచిత్రజీవికి ఒకవైపు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల పులుసు,రొయ్యల ఫ్రై మరోవైపు పచ్చగడ్డి, చొప్ప, చెట్ల ఆకులు, జొన్నలు పెట్టండి. ఆకలితో ఉన్న ఈ జీవి ఏది ముడుతుందో చూసి అప్పుడు తీర్పు చెబుతాను’’ అన్నాడు జడ్జి. జడ్జిగారి తెలివికి ముచ్చటపడుతూ ఆయన చెప్పినట్లే చేశారు. ‘‘ఏది ముడతాడు?’’ అనే ఆసక్తి ఆకాశాన్ని అంటింది. ఆ విచిత్రజీవి మాత్రం అటు నాన్వెజ్ ఐటమ్లు ఇటు గడ్డిగాదం ఐటమ్స్ సుష్ఠుగా లాగించేసి బ్రే...వ్ అన్నాడు!! సమస్య మళ్లీ మొదటికొచ్చింది.దీంతో ఇంగ్లండ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది...‘మా దేశంలో ఒక విచిత్రమైన జీవి కనిపించింది. ఇది మనిషా, జంతువా? అని చెప్పిన వాళ్లకు బకింగ్హామ్ ప్యాలెస్ బహుమతిగా ఇవ్వబడుతుంది’‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అని...అమెరికా నుంచి ‘నాసా’ వాళ్లు, చైనా నుంచి సీయన్యస్ఏ శాస్త్రవేత్తలు,రష్యా నుంచి జూనియర్లు మొదలు సీనియర్ శాస్త్రవేత్తల వరకు వచ్చారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు వెనక్కి వెళ్లిపోయారు. ప్రపంచం నలుమూలాల నుంచి ‘నేను పక్షి శాస్త్రవేత్తను’ ‘నేను జంతు శాస్త్రవేత్తను’ అనో ఇంకేదో అనో ఎవరో ఒకరు లండన్కు వస్తూనే ఉన్నారు. ఏదీ తేల్చకుండా జుట్టు పీక్కుంటూ వచ్చిన దారినే వెనక్కి వెళుతూనే ఉన్నారు. ఈలోపు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్కు ఒక డౌటు వచ్చింది.‘‘పెద్ద దేశం అమెరికా నుంచి చిన్న దేశం మాల్టా వరకు రోజూ ఎవరో ఒకరొస్తూనే ఉన్నారు. ఇండియాలాంటి పెద్ద దేశం నుంచి ఎవరూ రాకపోవడం విచిత్రంగా ఉంది’’ అని చార్లెస్ అంటున్నాడో లేదో...‘‘ఎక్స్క్యూజ్మీ సార్... ఐయామ్ ఫ్రమ్ ఇండియా’’ అని ఒక గొంతు వినిపించింది.‘‘మీరేం చేస్తుంటారు?’’ జుట్టు సవరించుకుంటూ అడిగింది బ్రిటన్ ప్రధాని.‘‘నేను ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తుంటాను’’ అన్నాడు ఆ వ్యక్తి.‘‘ఇది మనిషా జంతువా? అనేది పెద్ద పెద్ద సైంటిస్టులే చెప్పలేకపోతున్నారు. ఎకనామిక్స్ తప్పా ఏమీ తెలియని మీరెలా చెప్పగలరు?’’ అడిగాడు లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్.‘‘ఈ జీవి గురించి చెప్పడానికి సైన్స్ తెలియనక్కర్లేదు. ఆర్బీఐ గవర్నర్ అయితే చాలు’’ అన్నాడు ఆయన చిన్నగా నవ్వుతూ.‘‘భలే చిత్రంగా మాట్లాడుతున్నావే...ఇంతకీ ఈ జీవి మనిషా? జంతువా?’’ అడిగాడు చార్లెస్.‘‘ఏదీ కాదు’’ అన్నాడు ఆయన నిమ్మళంగా.‘‘మరేమిటి?’’ అని కళ్లు పెద్దవి చేస్తూ అడిగారు అక్కడున్నవాళ్లు.‘‘ఈ జీవి పేరు విజయ్మాల్యా’’ అసలు విషయం చెప్పాడు ఆర్బీఐ గవర్నర్. – యాకుబ్ పాషా -
గ్రహాంతరవాసులకూ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1న ఫూల్స్డే సందర్భంగా ప్రధాని మోదీ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. బ్రేకింగ్ న్యూస్ పేరిట 70 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో ‘నోట్ల రద్దుతో దేశంలో అవినీతి అంతమైంది. స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ను ఊడ్చేశారు. మోదీ 200 కోట్ల ఉద్యోగాలను సృష్టించారు. దీంతో ప్రస్తుతం అరుణగ్రహంపై ఉన్న గ్రహాంతరవాసులూ భారత్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కేంద్రం కట్టిన స్మార్ట్ నగరాలను శుభ్రం చేయడానికి ఇప్పుడు రోబోలనే ఉపయోగిస్తున్నారు. గంగా నదీ ఎంత స్వచ్ఛంగా మారిందంటే అందులోకి తొంగిచూస్తే మీకు మోదీ ముఖం కన్పిస్తుంది’ అని వెటకారమాడింది. ప్రతి భారతీయుని బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ అయినా.. నగదు మాత్రం సున్నాగా కన్పిస్తోందని ఎద్దేవా చేసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని తిప్పికొట్టిన బీజేపీ ఫూల్స్ డేను పప్పూ దివస్గా అభివర్ణించింది. -
బ్రేకింగ్ న్యూస్ బిజినెస్ న్యూస్గా మారాయి
-
బ్రేకింగ్ న్యూస్ బిజినెస్ న్యూస్గా మారాయి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు ప్రధాన న్యూస్చానల్స్లో ప్రసారమవుతున్న బ్రేకింగ్ న్యూస్.. బిజినెస్ న్యూస్గా మారాయని, జర్నలిస్టులు బిజినెస్ ట్రేడర్స్గా మారారని సీనియర్ జర్నలిస్ట్, ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ అన్నా రు. ఆదివారం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో లిటరరీ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘మీడియా ఇన్ ది ఏజ్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్’అన్న అంశంపై జరిగిన సదస్సులో రాజ్దీప్ సర్దేశాయ్ ప్రసంగించారు. దేశంలో ప్రస్తుతం 397 న్యూస్, కరెంట్ అఫైర్స్ చానల్స్ ఉన్నాయని.. ఇవన్నీ రాజకీయ నాయకులు, పార్టీ లు, బిల్డర్ల చేతిలోనే ఉన్నాయని, వీరంతా తమ వాణిజ్య, రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం చానల్స్ నడుపుతున్నారన్నారు. క్రమేణా నైతిక విలువలు కనుమరుగవుతుండటంతో ప్రస్తుతం మీడియా విశ్వసనీయత కోల్పోతోందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లోని 25 ప్రధాన న్యూస్ చానల్స్ రాజకీయ పార్టీల చేతిలోనే ఉన్నాయని గుర్తుచేశారు. పలు ప్రధాన చానల్స్లో ప్రసారమవుతున్న వార్తల్లో వాస్తవికత ఉండట్లేదని, టీవీ స్టూడియోల్లో అర్థవంతమైన చర్చలకు బదులు అనవసర వివాదాలు జరుగుతూండటం దురదృష్టకరమన్నారు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ అపరిమితమని.. కానీ బాధ్యత శూన్యంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు స్వేచ్ఛా గొంతుక వినిపించేందుకు బెటర్ మీడియా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ న్యూస్ కాపిటల్స్గా మారాయన్నారు. -
బ్రేకింగ్ న్యూస్లో...
‘‘వరుణ్లో మంచి నటుడున్నాడు. ‘మనలో ఒకడు’లో దిలీప్ పాత్రకు న్యాయం చేశాడు. హీరోగా వరుణ్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘మనలో ఒకడు’, ఆ తర్వాత ‘లజ్జ’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన వరుణ్ ఆలేటి హీరోగా నటించిన ‘బుడ్డా రెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ వచ్చే నెలలో విడుదల సిద్ధమవుతోంది. వరుణ్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు నరసింహ నందిగారు ‘..బ్రేకింగ్ న్యూస్’లో నటనకు ఆస్కారమున్న పాత్రను ఇచ్చారు. విలేజ్ లవర్బాయ్గా కనిపిస్తా. ‘మనలో ఒకడు’లో నాజర్ తనయుడిగా నటించడం మర్చిపోలేని అనుభూతి. ప్రస్తుతం ‘ఈనాడు’లో ఓ హీరోగా నటిస్తున్నా. నటుడిగా మంచి పేరొచ్చే పాత్రల్లో నటించాలని నా ఆశ’’ అన్నారు. నటుడు సందేశ్ పాల్గొన్నారు. -
బ్రేకింగ్ న్యూస్.. అనర్థాల రేస్
డేట్లైన్ హైదరాబాద్ మీడియా మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. కేంద్ర మంత్రయినా, గవర్నరయినా, పేద పత్తి రైతైనా... వారి విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందే. కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛల పట్ల పలుపురి వైఖరి, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది. రాష్ర్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గత ఆదివారం నాడు ఒక సభలో మాట్లాడుతూ మీడియా పోకడల మీద కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆయన మాటల్లోని ఆవేదననూ, ధర్మాగ్రహాన్ని మీడియాతో సహా ఎవరూ కాదనలేరు. తన సోదరుడి మృతి విషయంలోనే మీడియా వ్యవహరించిన తీరును ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాలలో ఉదహరించారు. నరసింహన్ సోదరుడు ఐఏఎస్ అధికారిగా అస్సాంలో పని చేస్తుండగా ఉగ్రవాదుల మందుపాతర పేలుడుకు బలైపోయారు. ఆ విషాద సంద ర్భంలో ఆయన ముఖం మీద మైకు పెట్టి, ఎలా అనిపిస్తుంది? అని అడగడం కంటే దుర్మార్గం ఉంటుందా? 30 ఏళ్ల క్రితమే, మండల్ కమిషన్ సిఫార సులకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలోనే మీడియా అమానవీయతపై పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. అప్పటికింకా 24 గంటల వార్తా చానళ్లూ లేవు, ఇంత పోటీ, ఉరుకులుపరుగులూ లేవు. 1985లో, ఆ ఉద్యమం సాగుతుండగా రాజీవ్ గోస్వామి అనే యువకుడు వందలాది మంది సమక్షంలో వంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాన్ని మరుసటి వారం ఒక ప్రముఖ ఇంగ్లిష్ వారపత్రిక రంగుల ముఖ చిత్రంగా ప్రచురించి సభ్యసమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ఆత్మాహుతికి పాల్పడుతున్న వ్యక్తిని అడ్డు కుని, రక్షించాల్సిందిపోయి, ఆ పత్రిక ఫొటోగ్రాఫర్ ముఖచిత్రం కోసం ఆరాటపడటం ఏమిటని అంతా విమర్శించారు. అనారోగ్యకర పోటీ ఈ మూడు దశాబ్దాలలో మీడియా ఇటువంటి విషయాలలో ఏమీ మారలేదు సరికదా మరింత అమానవీయంగా తయారయింది. 24 గంటల న్యూస్ చానళ్లు వచ్చిన తరువాత అయితే పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. నరసింహన్ గారు చెప్పినట్టు ధ్యాస అంతా బ్రేకింగ్ న్యూస్ మీదే అయ్యేసరికి మిగతా విలువలన్నీ వెనుకబడి పోతున్నాయి. గవర్నరే అన్నట్టు దీనికి ప్రధాన కారణం ‘రాట్ రేస్’ (విపత్కర పోటీ). అందరికన్నా ముందున్నామని చెప్పు కోడానికి పెడుతున్న అనారోగ్యకరమైన పరుగు. ఫలితంగా చాలా సంద ర్భాల్లో వాస్తవాలు తెరమరుగయ్యే ప్రమాదం ఉంటుంది. రెండు రోజుల క్రితమే జరిగిన సంగతి చూడండి. 800 ఏళ్ల తరువాత ఒక హిందూ పాలకుడు దేశాన్ని పాలించబోతున్నాడని సార్వత్రిక ఎన్నికల విజయానంతరం నేటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ వ్యాఖ్యానించారని, లోక్సభలో మార్క్సిస్ట్ సభ్యుడు సలీం అన్నారు. ఒక ప్రఖ్యాత ఆంగ్ల పత్రికపై ఉన్న నమ్మకంతో ఆ పత్రిక చేసిన వ్యాఖ్యనే ఆయన ఉదహరించారు. చాలా సీనియర్ మార్క్సిస్ట్ నాయకుడైన సలీం వ్యాఖ్యలు లోక్సభను కుదిపేశాయి. రాజ్నాథ్, తానా వ్యాఖ్యలు చెయ్యలేదని ఖండించారు, సలీం క్షమాపణ చెప్పాలని పట్టు బట్టారు. మార్క్సిస్ట్ నాయకులు ససేమిరా అన్నారు. ఇంత రాద్ధాంతానికి కారణమైన ఆ పత్రిక ‘‘అయ్యా క్షమించాలి. ఆ మాటలు అన్నది రాజ్నాథ్ కాదు, స్వర్గీయ అశోక్ సింఘాల్. మా పొరపాటును సవరించుకుంటున్నాం, మా పత్రిక ఆన్ లైన్ ఎడిషన్లో మార్చేశాం’’ అని ట్వీట్టర్లో సవరణ జారీ చేసింది. చిన్నదీ చితకదీ కాని ఆ పత్రికను నమ్మిన ఆ ప్రముఖ నేతకూ, ఆయన విమర్శకు గురైన మంత్రికి కూడా బాధ కలిగింది, నష్టం జరిగింది. మీడియా నుంచి జరిగే ఇలాంటి తప్పులు పెద్దవైనా చిన్నవైనా హానికరమైనవి. అనారోగ్యకర పోటీతో సాగిస్తున్న ఈ ఉరుకులుపరుగుల వల్ల ఇలాంటి ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. కొద్ది కాలం క్రితం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఓ రైతు కలెక్టర్ కార్యాలయం మెట్ల మీద పురుగుల మందు తాగి, ఆత్మహత్యాయత్నం చేశాడు. జనం ఆ రైతును ఆస్పత్రికి తరలించే హడావుడిలో ఉంటే, మీడియా మిత్రులు మాత్రం ఆ రైతు ముఖం మీద మైకులు పెట్టి ప్రశ్నలు గుప్పించారు. ఇటీవలే ఒక వార్తా చానల్, పత్రిక, ఒక వ్యక్తి సెల్ టవర్ మీద నుంచి దూకదాన్ని దశలవారీగా చిత్రించి ప్రసా రంచేసి, ప్రచురించి సంబరపడింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నయినా చెప్పొచ్చు. మీడియా... అవి పత్రికలే కావొచ్చు, వార్తా చానళ్లే కావొచ్చు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలన్న విషయంలో ఎవరికీ విభేదం లేదు. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని మీడియా పెద్దలే నిత్యమూ ఘోషిస్తున్నారు. కేంద్ర హోంమంత్రే అయినా, రాష్ర్ట గవర్నర్ అయినా, పేద పత్తి రైతయినా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించా ల్సిందే. మీడియాను వృత్తిగా స్వీకరించే వారికి అలాంటి శిక్షణ తప్పక ఉండాల్సిందేననడంలోనూ భిన్నాభిప్రాయం లేదు. తెలుగు ఏలికల రాజకీయ అసహనం కాకపోతే అదే స్వరంలో మీడియా మీద జరుగుతున్న ముప్పేట దాడిని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎంత సేపూ మీడియా స్వీయ నియంత్రణ గురించే మాట్లాడే వారు సమాజంలో పెచ్చుపెరుగుతున్న అసహనాన్ని గురించి కూడా మాట్లాడితే, దానికి నివారణ మార్గం చూపితే బాగుంటుంది. మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మీడియాకు వెలుపల ఉన్న పలుపురి వైఖరి.. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్టుగా ఉంటోంది. గత ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా మీడియా మీద, విలేకరుల మీద ఆందో ళనకరమైన రీతిలో దాడులు జరుగుతున్నాయి. అందుకు కారణం కారణం రాజకీయ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరే. ప్రస్తుతం ఎక్కడ చూసినా అస హనంపై చర్చే వినవస్తోంది. ఇక్కడ ప్రస్తావిస్తున్నది అవార్డు వాపసీలపై ప్రద ర్శిస్తున్న అసహనం గురించి కాదు. అటువంటి విషయాలను వార్తలుగా మలిచి ప్రజలకు చేరవేస్త్తున్న మీడియా పట్ల రాజకీయ వర్గాల్లో పెరిగిపోతున్న అసహనం గురించి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు, దేశ వ్యాప్తంగానే ఉంది. గత జూన్లో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జగేంద్రసింగ్ అనే జర్నలిస్ట్ను స్థానిక రాజకీయ నాయకుడి ప్రాపకంలోని గూండాలూ, పోలీసులు కలిసి తగులబెట్టి చంపారు. అదే నెలలో మధ్య ప్రదేశ్లో మరో జర్నలిస్ట్ను ఇలాగే హతమార్చారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి మరో పది వరకు దాడుల్లో పలువురు జర్నలిస్టులు ఆస్పత్రుల పాలయ్యారు. ఈ ఘటనలన్నింటికీ రాజకీయ నాయకత్వం అసహనమే కారణం. తమకు నచ్చని లేదా తమ ప్రయోజనాలను దెబ్బతీసే వార్తలు రాసినందుకే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీడియాపై ముప్పేట దాడి గవర్నర్ నరసింహన్ ఏలుబడిలోనే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ కీయ నాయకత్వం అసహనాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన వెంటనే అక్కడి ప్రభుత్వం ప్రదర్శించిన అసహనాన్ని ప్రపంచమంతా చూసింది. అది గవర్నర్ దృష్టికి రాలేదనుకోగలమా? అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను అనుమతించని విషయం, వర్కింగ్ జర్నలిస్ట్ల ఉద్య మం నిరసన అనంతరం ఆ నిర్ణయాన్ని మార్చుకోవడం కూడా అందరికీ తెలుసు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలను వెలువరిస్తున్నాయంటూ, నిన్నగాక మొన్న ఏపీ ముఖ్యమంత్రి సాక్షి దిన పత్రిక చదవొద్దని, సాక్షి టీవీ చూడొద్దనీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో తప్పులు జరిగితే, ప్రజాధనం దుర్వి నియోగమైతే వాటిని వెలుగులోకి తేకుండా ఉండాలనే కోరిక పాలకులకు ఉండొచ్చు. కానీ, ఆయన పిలుపు మేరకు ఎవరైనా వాటిని చదవడం, చూడ టం మానేస్తే అది వారి ఇష్టం. కానీ, కొన్నేళ్లుగా అధికార పార్టీ కార్యాల యంలోకి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధుల ప్రవేశాన్ని నిషేధించడం ప్రజాస్వామ్యంలో సరైన చర్యేనా? అని గవర్నర్ ఆలోచించాలి. తన ఏలు బడిలోనే జరుగుతున్న ఈ అప్రజాస్వామిక చర్యను గురించి గవర్నర్ మాట్లాడకపోయినా, సరిచేస్తే బాగుండేది. చివరగా, తెలుగుదేశం పార్టీ నాయకుల అసహనం. దానికి పరాకాష్ట ఆ పార్టీ తెలంగాణ రాష్ర్ట కార్యా ద్యక్షుడు రేవంత్రెడ్డి గత బుధవారం విలేకరుల గోష్టిలో చేసిన వ్యాఖ్యలు. వరంగల్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ... రేవంత్రెడ్డిని వెంట పెట్ట్టుకుని ప్రచారం చెయ్యడం ఏమిటని రాసినందుకు ఆయన ఈ కాలమిస్ట్ మీద విరుచుకుపడ్డారు. నిజమే కదా, అంతకు కొద్ది నెలల క్రితమే శాసన మండలి ఎన్నికల్లో అవతల పార్టీ శాసనసభ్యుడికి రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపి ఏసీబీకి దొరికిపోయి, జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటున్న వ్యక్తిని వెంట పెట్టుకుని ప్రచారానికి పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో, అందునా వరంగల్ వంటి చోట ఎక్కువ ఓట్లెలావొస్తాయి? ఆ మాట అన్నందుకు అసహనం, అవాకులు చవా కులూ పేలడమా? ఈ తరహా రాజకీయ నాయకులను ఎవరు కట్టడి చెయ్యాలి? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
త్వరలో ఫేస్బుక్ నుంచి ‘బ్రేకింగ్ న్యూస్ అలర్ట్’
వాషింగ్టన్: ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో వార్తలను చూసేవారు రోజురోజూకీ ఎక్కువైపోతున్నారు. అందుకే వివిధ వార్తాసంస్థలు మొబైల్ యాప్లు రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వీటికి పోటీగా ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్వర్కింగ్సైట్లు కూడా మొబైల్ న్యూస్ యాప్లను రూపొందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ట్విటర్ మొబైల్ న్యూస్ ట్యాబ్ను రూపొందించి తాజా వార్తలను వినియోగదారులకు అందిస్తోంది. ఫేస్బుక్ కూడా త్వరలో ఆ బాటలోనే నడవనుంది. మొబైల్ వినియోగదారులకు ఫేస్బుక్ ద్వారా తాజావార్తలను అందించేందుకు మొబైల్ ఫేస్బుక్ యాప్లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఆ ప్రయోగం పరీక్ష దశలోనే ఉంది. త్వరలోనే ఫేస్బుక్ బ్రేకింగ్ న్యూస్ అలర్ట్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలపారు. -
తెగబడిన ఉన్మాదం
మాట పెగలని బరువైన క్షణాలివి. నా హృదయం ఓ తల్లిగా, ఓ స్త్రీగా కాదు సాటి మనిషిగా రోదిస్తోంది. మానవత్వం హత్యకు గురైంది. హంతకుడూ మనిషే !! టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ నా ఆలోచనలకు కళ్లెం వేసింది. రక్తమోడుతున్న చిన్నారులను మూటల్లా మోసుకెళ్తుంటే నా మెదడు మొద్దుబారిపోయింది. ఏ మనిషీ, ఏ జాతి, ఏ మతమూ సహించలేని ఘాతుకం మన పొరుగు దేశంలో జరిగింది. ఇది నేను రాస్తున్న సమయానికి 140కి పైగా పసిమొగ్గలు రాలిపోయాయి. మీరు చదివే సమయానికి మరెన్ని ప్రాణాలు ఆవిరి అయిపోతాయో అని భయంగా ఉంది. ఈ భయం సృష్టించాలనే కదా మారణహోమం చేస్తోంది ఉగ్రవాదం. ఈ భయానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నిటి దగ్గరా ఉన్న ఆయుధం ధైర్యం. ఏకే47లు, కలష్నికోవ్లు, ట్యాంకర్లు, బంకర్లు, బాంబులు, మిసైల్స్ ఇవి సైన్యం దగ్గర మాత్రమే ఉండే రోజులు కావివి. మనం ఇప్పుడు భయపడాల్సింది, ఉగ్రవాదుల చెంతనున్న ఆయుధ బలం చూసి కాదు, ప్రాణాలను సైతం లెక్క చేయనంతగా యువత మనసులను ప్రభావితం చేస్తున్న ఛాందస భావజాలం చూసి. తమ ప్రాణాలనే లెక్క చేయని కరడుగట్టిన ఉన్మాదులకు పసిపిల్లల ప్రాణం విలువ ఏం అర్థమవుతుంది. అందుకే విచక్షణ రహితంగా కాల్చారు, పేల్చారు, తగులబెట్టారు. వాళ్లు రగిల్చిన చిచ్చు చూసేందుకు వాళ్లు ఎలాగూ మిగిలి ఉండరు. కానీ, ఈ వినాశనం ఓ భయంకరమైన దృశ్యంగా బతికి ఉన్న పిల్లలను వెంటాడుతూనే ఉంటుంది. తెర వెనుక మత రాజకీయాలకు ఆజ్యం పోసే వ్యవస్థలకూ ఇది పీడకలలా వేధిస్తూనే ఉంటుంది. మానవత్వానికి మచ్చగా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రభుత్వాలు, అగ్రరాజ్యాలు ఇప్పుడు ఏం చేస్తాయో వేచి చూడాలి. సోమవారం సిడ్నీలోని చాక్లెట్ కెఫేలో ఒక్క దుండగుడు సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం తేరుకోకముందే మంగళవారం పాకిస్థాన్లో ఈ దారుణం జరిగింది. రేపు మళ్లీ ఏ మూల నుంచి పంజా విసురుతారో అనే భయం అందరి మనసుల్లోనూ ఉంది. పరాకు చేటుగా.. గోకుల్ చాట్, దిల్సుఖ్నగర్ పేలుళ్లు మన మనసుల నుంచి ఇప్పుడిప్పుడే మాయమవుతున్నాయి. అంతా సాధారణంగా నడిచిపోతోంది అని మన భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నాం. భద్రత మన హక్కు అయితే అప్రమత్తంగా ఉండటం మన బాధ్యత. హైఅలర్ట్ ప్రకటిస్తేనే తనిఖీలు మొదలవుతాయి, మెటల్ డిటెక్టర్లు మోగుతాయి. మామూలు రోజుల్లో తనిఖీ అంటే మనకు అవమానం, మెటల్ డిటెక్టర్లు మనకు టైమ్ వేస్ట్. మాల్స్లో సెక్యూరిటీ తనిఖీలను పెద్ద ఫార్స్లా మార్చిన ఘనత మనకే చెందుతుంది. మనకు క్యూలో నిల్చోవడమే సరిగ్గా రాదు.. ఇక మాక్ డ్రిల్స్, ఎమెర్జెన్సీ ప్రాక్టీస్లు ఏం తెలుస్తాయి. అవగాహన మనమూ పెంచుకోవాలి. పొరుగింట్లో ఎవరుంటారో వారి కార్యకలాపాలు, భావజాలం ఇవన్నీ తెలుసుకోవడం మన బాధ్యత. ఇవి తెలుసుకోవాలంటే కనీసం వారితో మాట్లాడటం అవసరం. నిఘాతో పాటుగా.. ఇక భద్రతావిభాగాల సంసిద్ధత మరో కోణం. మన బలగాల బల ప్రదర్శన అవసరం రాకూడదనే కోరుకుందాం. కానీ ఒకవేళ అలాంటి సమయమే వస్తే.. ఆస్ట్రేలియా సిడ్నీ కెఫే ఉదంతంలో సైనిక చర్య మనకు ఉదాహరణగా నిలవాలి. మనదీ ఉగ్రవాద పిరికిపంద చర్యలు చూసిన దేశమే. మనదీ ఈ దాడులను తిప్పికొట్టగల సామర్థ్యం ఉన్న ఇంటెలిజెన్సే. నిఘా వర్గాలను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాళ్లున్నారు.. బాధ్యత కేవలం వారిదే అనుకుని కళ్లు మూసుకుని చల్లగా ఉండటం మనకు తగదు. కళ్లు తెరవండి. నిఘా నేత్రాలకు మీ అప్రమత్తతను జోడించండి. తనిఖీలు సరిగ్గా జరిగేలా సహకరిద్దాం. చేయని పక్షంలో డిమాండ్ చేసి మరీ తనిఖీలు చేయిద్దాం. బ్రేక్ఫాస్ట్లో బ్రేకింగ్ న్యూస్ ఉంటే కానీ తోచని మొద్దు చర్మం సమాజంలా తయారవ్వొద్దు మనం. వేయి మలాలాల దీటుగా.. కళ్ల ముందు మాంసపు ముద్దల్లా పసికందులు కనిపిస్తుంటే చలించని హృదయం లేదు. ఆ కుటుంబాలను మాత్రమే కాదు ఈ నష్టం, ఆ దేశం అంతటికీ కోలుకోలేని నష్టం ఈ ఉగ్రపర్వం. భయానకమైన ఈ సంఘటన నుంచి బయటపడిన పిల్లలు ద్వేషం, భయం, కోపం, పగ వంటి ఎమోషనల్ డిస్ట్రబెన్స్లో పెరగకుండా చూడాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న మన సమాజానిదే. మలాలాపై దాడి జరిగిన వాయవ్య పాకిస్థాన్లోనే ఈ స్కూల్ దాడి కూడా జరిగింది. వేల మంది బాలికల విద్య కోసం గొంతువిప్పిన మలాలా లాగ నేల రాలిన వంద మంది చిన్నారుల నుంచి రేపు వేల మంది మలాలాలు జనించాలి. హక్కుల గళం వినిపించాలి. ఈ రోజు భయంతో కాదు బాధతో నిద్రపట్టదు. రేపు ఉదయం భయంతో కాదు బాధ్యతతో లేస్తాను. వేయి మలాలాల సూర్యోదయం కోసం ఎదురు చూస్తాను. -
జగమంత సంబరం
ఇది ముందే వచ్చిన జన ‘విజయ’ దశమి.. అశేషాంధ్రుల ఆకాంక్ష నెరవేరేలా.. కుత్సితాలను, కుతంత్రాలను చీల్చుకునిజనప్రియనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి బయటకు రానున్న రోజు.. జన నేతకు బెయిల్ లభించిందన్న ‘బ్రేకింగ్ న్యూస్’ సోమవారం సాయంత్రం వెలువడిన వెంటనే అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా వెలుగులతో ఆకాశం నిండిపోయింది. వాడవాడలా జై జగన్ అన్న నినాదం మార్మోగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలే కాకుండా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు.. అన్ని వర్గాల ప్రజలు స్వీట్లతో నోరు తీపిచేసుకున్నారు. తమ అభిమాన నేత ఇన్ని రోజులకు జనంలోకి రానున్నారన్న సంతోషంతో పలువురు జగన్ ప్లకార్డులు, వైఎస్సార్ సీపీ పతాకాలు చేతబూని వీధివీధినా కలియతిరుగుతూ ఉత్సాహభరితంగా ర్యాలీలు నిర్వహించారు. విభజన వేడితో అగ్నిగుండంలా మారిన జిల్లాకు వైఎస్సార్సీపీ అధినేత బెయిల్ వార్త వాసంత సమీరమైంది. ఆంధ్రులనందరినీ ఒక్కటిగా నిలిపే బాధ్యతను భుజాలకెత్తుకునే ఒకే ఒక్కడు జగనన్నే అన్న నిశ్చితాభిప్రాయం ఎల్లెడలా వ్యక్తమయింది. -
5pm Express News 19th July 2013
-
షిర్డీలో ప్రమాదం.. నరసరావుపేట వాసుల మృతి
-
ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి కార్యకర్తా కృషిచేయాలి : ఎంపీ మేకపాటి
-
రిలయన్స్ ఇండస్ట్రీస్కు కేంద్ర ప్రభుత్వం లొంగిపోయింది : నారాయణ
-
ఎంపీ పాల్వాయి గోవర్థన్రెడ్డి మీడియా సమావేశం
-
కేంద్ర హోం మంత్రి షిండేతో దిగ్విజయ్ సింగ్ భేటీ
-
Sakshi Cinema 5th July 2013
-
AP23 సాక్షి న్యూస్ 30th June 2013
-
సాక్షి న్యూస్ వీక్ 30th June 2013
-
భూమన కరుణాకర్ రెడ్డితో సాక్షి న్యూస్ మేకర్
-
Sakshi Sports 28th June 2013