checked
-
ఒడిశా సీఎం హెలికాప్టర్ తనిఖీ
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ను ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ చేశారు. మంగళవారం రూర్కెలాలో రోడ్ షో కోసం పట్నాయక్ వచ్చినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హెలికాప్టర్ను, అందులోని ఇతర సామగ్రిని తనిఖీ చేయాల్సి ఉందని కోరారని పట్నాయక్ భద్రతాధికారి చెప్పారు. మోదీ హెలికాప్టర్లోనూ సోదాలు ఒడిశాలోని సంబాల్పూర్లో మంగళవారం ఎన్నికలర్యాలీ వేళ ప్రధాని మోదీ హెలికాప్టర్ను అధికారులు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం ఎస్పీజీ రక్షణ కలిగిన వారి హెలికాప్టర్ సోదా చేయొద్దు. దీంతో సోదా చేసిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి మోహిన్సన్ను ఈసీ బుధవారం సస్పెండ్ చేసింది. -
ఖమ్మంలో పలు ఆస్పత్రిలో ఆధికారులు తనిఖీలు
-
జగన్ సభను జయప్రదం చేయండి
ఏలూరు(ఆర్ఆర్పేట) : ద్వారకాతిరుమలలో ఈ నెల 29న వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. శుక్రవారం ఏలూరులోని తన నివాసంలో నాని విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన వైపే ప్రజలూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గళం బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో జరగనున్న ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సభలో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, దివంగత కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్బాబు జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారని, పార్టీ శ్రేణులు ఆయనకు సాదర స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జగన్మోహన్రెడ్డి రాజమండ్రి చేరుకుంటారని, అక్కడి నుంచి 3.30 గంటలకు ద్వారకాతిరుమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రంలో జరిగిన పరిణామాలను చూసి ఐదు కోట్ల మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్క పార్టీకో చెందింది కాదని, రాష్ట్ర ప్రజలే ఈ ఉద్యమానికి సారథులని, తమ పార్టీ అధినేత వారికి అండగా నిలిచి మద్దతు తెలుపుతున్నారని, వారి గళాన్ని బలంగా వినిపిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలపై ప్రజలందరూ మండిపడుతున్నారని వివరించారు. ఒక ప్రతిపక్ష నాయకుని గంటలపాటు ఎయిర్పోర్టులో నిర్భంధించడం అనాగరికమన్నారు. ఎన్ని త్యాగాలకోర్చి అయినా ప్రత్యేక హోదా సాధించి తీరతామన్నారు. టీడీపీ నాయకులు ఇటీవల అవాకులు, చవాకులు పేలడం పరిపాటిగా మారిందని, వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవడం ఉత్తమమని నాని హితవు పలికారు. హోదా ఉద్యమంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల సమయంలో తిరుపతి సభలో మోదీ రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా ప్రకటించారో తెలుసుకోవాలని హితవు పలికారు. కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనలో అనుభవం లేదని, కేవలం రాజకీయాలు చేయడంలోనే అనుభవం గడించారని ఎద్దేవా చేశారు. గాలివాటంగా గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలంతా మద్దతుగా ఉన్నారని భ్రమ పడుతున్నారని, ఆ భ్రమలు త్వరలోనే తొలగిపోతాయన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు తెల్లం బాలరాజు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, దయాల నవీన్బాబు, మధ్యాహ్నపు బలరామ్ పాల్గొన్నారు. -
జగన్ సభను జయప్రదం చేయండి
ఏలూరు(ఆర్ఆర్పేట) : ద్వారకాతిరుమలలో ఈ నెల 29న వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించతలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. శుక్రవారం ఏలూరులోని తన నివాసంలో నాని విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయన వైపే ప్రజలూ చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గళం బలంగా వినిపిస్తున్న ప్రస్తుత తరుణంలో జరగనున్న ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని నాని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సభలో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు, దివంగత కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్బాబు జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారని, పార్టీ శ్రేణులు ఆయనకు సాదర స్వాగతం పలకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జగన్మోహన్రెడ్డి రాజమండ్రి చేరుకుంటారని, అక్కడి నుంచి 3.30 గంటలకు ద్వారకాతిరుమల చేరుకుని స్వామిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్రంలో జరిగిన పరిణామాలను చూసి ఐదు కోట్ల మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఏ ఒక్క పార్టీకో చెందింది కాదని, రాష్ట్ర ప్రజలే ఈ ఉద్యమానికి సారథులని, తమ పార్టీ అధినేత వారికి అండగా నిలిచి మద్దతు తెలుపుతున్నారని, వారి గళాన్ని బలంగా వినిపిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలపై ప్రజలందరూ మండిపడుతున్నారని వివరించారు. ఒక ప్రతిపక్ష నాయకుని గంటలపాటు ఎయిర్పోర్టులో నిర్భంధించడం అనాగరికమన్నారు. ఎన్ని త్యాగాలకోర్చి అయినా ప్రత్యేక హోదా సాధించి తీరతామన్నారు. టీడీపీ నాయకులు ఇటీవల అవాకులు, చవాకులు పేలడం పరిపాటిగా మారిందని, వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవడం ఉత్తమమని నాని హితవు పలికారు. హోదా ఉద్యమంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, గత ఎన్నికల సమయంలో తిరుపతి సభలో మోదీ రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని ఎలా ప్రకటించారో తెలుసుకోవాలని హితవు పలికారు. కోటగిరి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాలనలో అనుభవం లేదని, కేవలం రాజకీయాలు చేయడంలోనే అనుభవం గడించారని ఎద్దేవా చేశారు. గాలివాటంగా గెలిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలంతా మద్దతుగా ఉన్నారని భ్రమ పడుతున్నారని, ఆ భ్రమలు త్వరలోనే తొలగిపోతాయన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు తెల్లం బాలరాజు, కొఠారు రామచంద్రరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, దయాల నవీన్బాబు, మధ్యాహ్నపు బలరామ్ పాల్గొన్నారు. -
మినిగురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
చివ్వెంల: మండల కేంద్రంలోని మినిగురుల పాఠశాలను జిల్లా విద్యాధికారి చంద్రమోహన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల వసతులను, హజరుపట్టికను పరిశీలించారు. సిబ్బంది వివరాలను ప్రిన్సిపల్ సుజాతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందిచాలని, క్రమతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. మూత్రశాలలలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ ఫౌడర్తో శుభ్రం చేయాలని సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి కట్టా యల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
త్రిష అయితేనేం
ఎంత సెలబ్రెటీస్ అయినా ఒక్కోసారి అనూహ్య సంఘటనలను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాంటి వాటిని సీరియస్గా తీసుకుంటేనే అశాంతికి గురి కావలసి వస్తుంది. నటి త్రిషకు శనివారం చెన్నై ఎయిర్పోర్టులో ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఈ చెన్నై చిన్నది దశాబ్దం పైగా హీరోయిన్గా వెలుగొందుతున్నారు. బాలీవుడ్ ప్రవేశం కూడా చేశారు. అలాంటి పాపులర్ హీరోయిన్ త్రిషను చెన్నై విమానాశ్రయ రక్షణాధికారులు గుర్తించకపోవడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. త్రిష హైదరాబాద్ వెళ్లడం కోసం శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. ప్యాంట్, షర్టు, కూలింగ్ గ్లాస్ ధరించిన త్రిషపై అక్కడి సెక్యూరిటీ అధికారులకు సందేహం కలిగింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు చూపించమని అడిగారు. చిరు వాగ్వాదం తరువాత త్రిష తన గుర్తింపుకార్డు చూపించారు. దీంతో ఆమెను సెక్యూరిటీ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతించారు. దీన్ని లైట్గా తీసుకున్న త్రిష మాట్లాడుతూ విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులు తన గుర్తింపు కార్డును చూపించమని అడగటంలో తప్పు లేదన్నారు. కొన్ని అసాంఘిక సంఘటనలు జరుగుతున్న కారణంగా వారు భద్రత ఏర్పాట్లపై శ్రద్ద వహిస్తున్నారని త్రిష పేర్కొన్నారు.