Commissioner transfer
-
మేయర్పై మంత్రి గుర్రు
► సీడీఎంఏకు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా కమిషనర్ వెంకటేశ్వర్లుకు ఆదేశాలు ►వాయువేగంతో జీఓ విడుదల నెల్లూరు : మేయర్ అజీజ్ వ్యవహారం మంత్రి నారాయణకు ఆగ్రహం తెచ్చింది. కార్పొరేషన్ కమిషనర్ కరణం వెంకటేశ్వర్లును తాను సొంత నిర్ణయం ద్వారా బదిలీ చేయించిన అనంతరం అజీజ్ చిన్నబాబు లోకేష్ను సంప్రదించడంతో మంత్రి అసహనంగా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో మేయర్ అజీజ్ తన పంతాన్ని నెగ్గించుకున్నట్లు, కమిషనర్ బదిలీ నిలిచిపోయిందని మేయర్ వర్గీయులు ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం పలు పత్రికల్లో మేయర్ అజీజ్ ప్రయత్నాలు ఫలించాయని కథనాలు రావడంతో మంత్రి నారాయణకు కోపం వచ్చింది. తాను బదిలీ చేసిన తర్వాత కూడా మేయర్ అజీజ్ తన నిర్ణయానికి వ్యతిరేకంగా పావులు కదపడంతో తనకు పార్టీలో చులకనభావం వస్తుందనే ఉద్దేశంతో కమిషనర్ బదిలీని యథావిధిగా చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. జీఓ జారీ గత నెల 29వ తేదీ రాత్రి కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేయర్ అజీజ్ కమిషనర్ బదిలీని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వారం రోజుల పాటు నడిచిన నాటకీయ పరిణామాలకు సోమవారం ఫుల్స్టాప్ పడింది. సీడీఎంఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికలా వల్లవన్కు వెంటనే కమిషనర్ సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించినట్లు సమాచారం. దీంతో సోమవారం మధ్యాహ్నం హుటాహుటిన కమిషనర్ వెంకటేశ్వర్లును సీడీఎంఏకు రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా కార్పొరేషన్కు ఉత్తర్వులిచ్చారు. అయితే ప్రస్తుతం కమిషనర్ సెలవులో ఉన్నారు. ఇన్చార్జి కమిషనర్గా జేసీ ఇంతియాజ్ కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ అవడంతో, నూతన కమిషనర్ హరీష్ బాధ్యతలను స్వీకరించేంత వరకు జాయింట్కలెక్టర్ ఇంతియాజ్ ఇన్చార్జి కమిషనర్గా వ్యవహరించనున్నారు. సీడీఎంఏ నుంచి వచ్చిన జీఓలో ఈ మేరకు పేర్కొన్నారు. మరోవైపు మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ మధ్య వార్ ఇంతటితో ఆగుతుందా, లేక కొనసాగుతుందాననే అంశం అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. -
నెల్లూరులో గురుశిష్యుల వార్!
► కమిషనర్ బదిలీ ఆపడానికి మేయర్ అజీజ్ ప్రయత్నం ► ససేమిరా అంటున్న మంత్రి నారాయణ నెల్లూరు : కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు బదిలీ వ్యవహారంలో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ల మధ్య ఏర్పడిన అభిప్రాయబేధాలు తీవ్రమయ్యాయి. కమిషనర్ బదిలీని నిలుపు చేయించాలని మేయర్ రంగంలోకి దిగారు. కార్పొరేషన్ను ప్రక్షాళన చేయడంలో భాగంగా కమిషనర్ను సాగనంపాల్సిందేనని మంత్రి పట్టుదలతో ఉన్నారు. దీంతో గురుశిష్యుల మధ్య వార్ మొదలైంది. కార్పొరేషన్ పరిపాలన వ్యవహారాలు, అభివృద్ధి పనులను వేగంగా నడిపించడంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విఫలమయ్యారని మంత్రి నారాయణ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. సొంత జిల్లాలోని సొంత కార్పొరేషన్నే గాడిలో పెట్టలేకపోతే మున్సిపల్శాఖ మంత్రిగా రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను ఎలా గాడిలో పెట్టగలనని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ వ్యవహారంలో మంత్రి నేరుగా జోక్యం చేసుకున్నారు. కార్పొరేషన్లో తనకు తెలియకుండా ఏ పని జరగరాదని అధికారులను ఆదేశించారు. అధికారపార్టీకి చెందిన మేయర్గా తానుండగా మంత్రి నేరుగా జోక్యం చేసుకోవడం పట్ల మేయర్ అజీజ్ అసహనంతో ఉన్నారు. ఇటీవల జరిగిన రొట్టెల పండగ వివాదాన్ని కారణంగా చూపి మంత్రి నారాయణ కమిషనర్ను బదిలీ చేయించారు. సొంత పార్టీకి చెందిన తనకు ముందుగా చెప్పకుండా ఉన్నఫళంగా కమిషనర్ను బదిలీ చేయడంపట్ల మేయర్ లోలోన రగిలిపోతున్నారు. రొట్టెల పండగ సందర్భంగా చేసిన కొన్ని పనులకు సంబంధించిన బిల్లులు, ఎస్సీ సబ్ప్లాన్ టెండర్లకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టడం కోసం కొంత కాలంపాటు కమిషనర్ కొనసాగాల్సిందేనని మేయర్ పట్టుబట్టారు. సొంతపార్టీకి చెందిన కార్పొరేటర్లు, పార్టీకి సంబంధించి డివిజన్ ఇన్చార్జ ల మంచి కోసమే తాను ఈ డిమాండ్ చేస్తున్నట్లు అజీజ్ తన మద్దతుదారుల వద్ద చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన రెవెన్యూ అధికారి హరీష్ను కమిషనర్గా నియమిస్తే తమ మాట చెల్లుబాటు కాదనే అభిప్రాయం మేయర్తో పాటు అధికారపార్టీకి కార్పొరేటర్లలో కూడా ఉంది. ఈ కారణంతోనే మేయర్ అజీజ్ కమిషనర్ బదిలీని ఎలాగైనా నిలపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వారా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నారాయణకు అత్యంత సన్నిహితంగా ఉండే వారి ద్వారా మంత్రితో రాయబారాలు కూడా సాగించారు. అయితే కమిషనర్ బదిలీని నిలుపుదల చేయడానికి మంత్రి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ బదిలీ తాత్కాలికంగా ఆగుతుందా.. లేక నేడో రేపో కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించేందుకు అనుగుణంగా రెవెన్యూశాఖ నుంచి ఆయనను రిలీవ్ చేస్తారా అనే అంశం కార్పొరేషన్ వర్గాల్లోనూ, తెలుగుదేశంపా ర్టీ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. -
ప్రొద్దుటూరు కమిషనర్ బదిలీ
ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను ప్రకాశం జిల్లా ఒంగోలుకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 జనవరి 30వ తేదీన నరసరావుపేట మున్సిపాలిటీ నుంచి బదిలీపై ప్రొద్దుటూరుకు వెంకటకృష్ణ కమిషనర్గా వచ్చారు. ప్రస్తుతం ప్రొద్దుటూరుకు కృష్ణాజిల్లా గుడివాడ కమిషనర్ ప్రమోద్కుమార్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే పులివెందుల కమిషనర్ రంగారావును గుంటూరు జిల్లా మంగళగిరికి, మంగళగిరి కమిషనర్ ఎన్.నాగేశ్వరరావు పులివెందులకు, జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్రాజును చిత్తూరు జిల్లా మదనపల్లికి, నంద్యాల ఆర్ఓ నహీం అహ్మద్ను జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మున్సిపల్ ఉద్యోగుల బదిలీ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళుతున్నారు. మున్సిపల్ చైర్మన్ సీసీ అశ్వర్థనారాయణను ధర్మవరం మున్సిపాలిటీకి, ఆర్ఐలు సబ్దార్ను ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి, షఫిని జమ్మలమడుగు మున్సిపాలిటీకి, ఈ2 భక్తుడును మైదుకూరు మున్సిపాలిటీకి, టౌన్ప్లానింగ్ సెక్షన్లోని షప్తుల్లాను పులివెందుల మున్సిపాలిటీకి బదిలీ చేశారు.