connectivity
-
‘అంతరిక్ష అనుసంధానత’ను పరీక్షించనున్న ఇస్రో
న్యూఢిల్లీ: అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానత (డాకింగ్), విడదీత (అన్డాకింగ్) ప్రక్రియలను విజయవంతంగా పరీక్షించేందుకు ఇస్రో రంగం సిద్ధంచేస్తోంది. ఇందుకోసం ఉపయోగించే రెండు ఉపగ్రహాలను నేడు నింగిలోకి పంపనుంది. దీనికి శ్రీహరికోటలోని ప్రయోగవేదిక సిద్ధమైంది. సోమవారం రాత్రి ఎస్డీఎక్స్01, ఎస్డీఎక్స్02 శాటిలైట్లను పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. అంతరిక్షంలో 476 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో డాకింగ్, అన్డాకింగ్ ప్రక్రియలను జనవరి తొలివారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పర్మెంట్(స్పేడెక్స్)ను చేపడతామని ఇస్రో అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ సాంకేతికతను సాధించాయి. చంద్రమండలం నుంచి చంద్రశిలల సేకరణ, భారతీయ అంతరక్ష స్టేషన్ ఏర్పాటు, చందమామపై భారత వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు ఈ స్పేడెక్స్ మిషన్ తొలి సోపానంగా మారనుందని ఇస్రో పేర్కొంది. -
Hyderabad: ఫ్లైట్.. రైట్ రైట్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్లైట్ కనెక్టివిటీ విస్తరిస్తోంది. హైదరాబాద్ నుంచి మరిన్ని కొత్త నగరాలకు విమాన సరీ్వసులు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి 7 ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ నగరాలకు సైతం కనెక్టివిటీ క్రమంగా పెరుగుతోంది. దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ముఖ ద్వారం కావడంతో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎప్పటికప్పు డు ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్త నగరాలకు సరీ్వసులను విస్తరించేందుకు పలు ఎయిర్లైన్స్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 10 రోజుల్లోనే 7 కొత్త సరీ్వసులు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన సరీ్వసులు అందుబాటులో ఉన్నాయి. గత నెలలో కేవలం 10 రోజుల్లో 7 కొత్త సరీ్వసులను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రాజ్కోట్, అగర్తలా, జమ్మూ, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్రాజ్, ఆగ్రా నగరాలకు సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి. కొత్త సర్వీసుల్లో ఆక్యుపెన్సీ సైతం సంతృప్తికరంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. రాజ్కోట్కు ప్రతిరోజూ ఫ్లైట్ సర్వీసును ఏర్పాటు చేశారు. అగర్తలాకు వారానికి 3 సర్వీసులు నడుస్తున్నాయి. జమ్మూ కశీ్మర్కు ప్రారంభించిన విమాన సర్వీసులకు పర్యాటకుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి జమ్మూకు వారానికి మూడు సర్వీసుల చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ కనెక్టివిటీ 69 నుంచి 76 నగరాలకు పెరిగినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. నిత్యం 60 వేల మంది ప్రయాణం.. 👉 ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 60 వేల మంది దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగిస్తుండగా.. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కోల్కతా నగరాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. 👉 గోవా, విశాఖ, కొచ్చిన్, తిరుపతి, అహ్మదాబాద్ నగరాలకు సైతం హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయోధ్యకు పెరిగిన భక్తులు.. బాలరాముడు కొలువుదీరిన అయోధ్య రామజన్మభూమి ఆలయానికి నేరుగా రాకపోకలు సాగించేందుకు విమాన సరీ్వసులు లేకపోవడంతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లలో రద్దీ, సుదీర్ఘమైన ప్రయాణ సమయంతో ఒక్క అయోధ్య పర్యటనకే కనీసం మూడు నాలుగు రోజుల పాటు కేటాయించాల్సి వచ్చేది. మందిరం ప్రారంభించిన తర్వాత అన్ని వైపుల నుంచి భక్తుల రద్దీ పోటెత్తింది. కానీ ఇందుకనుగుణంగా ప్రయాణసదుపాయాలు మాత్రం విస్తరించలేదు. గత నెల 27వ తేదీ నుంచి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. అయోధ్యతో పాటు భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రయాగ్రాజ్కు కూడా గత నెలలోనే విమాన సరీ్వసులు ప్రారంభమయ్యాయి. పర్యాటకుల డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆగ్రాకు సైతం గత నెల 28 నుంచి సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ విస్తరణ..హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రస్తుతం 18 అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 15 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా జర్మనీకి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ సర్వీసులు వారానికి 5 చొప్పున హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే బ్యాంకాక్, రియాద్, జెడ్డా, తదితర నగరాలకు సర్వీసులు పెరిగాయి. ఈ ఏడాది చివరి వరకు మరిన్ని నగరాలకు కొత్తగా సరీ్వసులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, డల్లాస్, మెల్బోర్న్, సిడ్నీ, పారిస్, ఆమ్స్టర్డ్యామ్ తదితర నగరాలకు కొత్తగా సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం దుబాయ్, సింగపూర్, అబుదాబి, లండన్ నగరాలకు ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం: నితిన్ గడ్కరీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు రూ.20వేల కోట్లు కేటాయిస్తామని గడ్కరీ తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోందని వివరించారు. పర్యావరణహిత వాహనాలదే భవిష్యత్ అని స్పష్టంచేశారు. కాలుష్యాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని సూచించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఏపీకీ సంపూర్ణ సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పారు. దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. అంబానీ కీలక ప్రకటన -
తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్తో పాటూ షాద్నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, షామీర్పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్ను పాడుచేశారని పేర్కొన్నారు. ► నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్ను చేపట్టే ఆర్థ్ధిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటు కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్ను పరిశీలించకుండా, తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేయవద్దు. -
భారత్లో పెట్టుబడులు పెట్టండి
అబుదాబి: పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, ఇన్వెస్ట్ చేయడానికి భారత్లో అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. కనెక్టివిటీ, కృత్రిమ మేధ, కొత్త టెక్నాలజీలు, డేటా అనలిటిక్స్ వంటి వివిధ రంగాల్లో ఇరు దేశాలు పనిచేయగలవని ఆయన పేర్కొన్నారు. ఇండియా–యూఏఈ స్టార్టప్ ఫోరం 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘యూఏఈ వద్ద పెట్టుబడుల సామర్థ్యాలు ఉన్నాయి. భారీ మార్కెట్ రూపంలో భారత్ .. పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా నిలుస్తోంది. కాబట్టి ఇరు దేశాలకు ఒకదానితో మరొకదానికి పోటీ లేదు. రెండూ భాగస్వాములుగా కలిసి పనిచేయవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థలకు సదుపాయాలు కల్పించడంతో పాటు స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, నంబర్ వన్ స్థానానికి చేరాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన పేర్కొన్నారు. దుబాయ్ ఎక్స్పో సందర్భంగా భారత స్టార్టప్లకు మంచి స్పందన లభించిందని.. పలు అంకుర సంస్థలు నిధులను సమీకరించుకున్నాయని, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని గోయల్ చెప్పారు. అంకుర సంస్థలు తమ ఆవిష్కరణ ప్రయోజనాలు .. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా చేరువయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
టెల్కోల మౌలిక సదుపాయాల షేరింగ్కు ఓకే
న్యూఢిల్లీ: టెల్కోలు ఇకపై ప్రధాన నెట్వర్క్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకునేందుకు (షేరింగ్) వెసులుబాటు కలి్పస్తూ సంబంధిత నిబంధనలను టెలికం విభాగం (డాట్) సవరించింది. దీనితో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల భారం గణనీయంగా తగ్గనుంది. ఇక, మొబైల్ నెట్వర్క్లకు అవసరమైన కనెక్టివిటీని కలి్పంచేందుకు శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునే దిశగా వాణిజ్యపరమైన వీశాట్ లైసెన్స్ నిబంధనల్లో కూడా డాట్ సవరణలు చేసింది. ఇప్పటిదాకా టెలికం సంస్థలు.. మొబైల్ టవర్లు, నెట్వర్క్లోని కొన్ని క్రియాశీలక ఎల్రక్టానిక్ విడిభాగాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. యాంటెనా, ఫీడర్ కేబుల్ వంటి వాటికి ఇది పరిమితమైంది. తాజా సవరణతో ప్రధాన నెట్వర్క్లో భాగాలను కూడా పంచుకునేందుకు వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇది పురోగామి చర్యగా అభివరి్ణంచారు. 5జీ వేలంపై ట్రాయ్తో సంప్రదింపులు.. 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి డాట్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధర, వేలం వేయతగిన స్పెక్ట్రం పరిమాణం, ఇతర విధి విధానాల గురించి తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ని కోరింది. -
ప్రాథమిక హక్కులుగా కనెక్టివిటీ, కమ్యూనికేషన్
న్యూఢిల్లీ: దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కులుగా మారాయని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఖతర్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. ‘తిండి, బట్ట, నీడలాగానే కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అనేవి ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరాలుగా, ప్రాథమిక హక్కులుగా మారాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో 4జీ నెట్వర్క్ లేకపోతే భారత్లో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టంగా ఉండేది. దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించాల్సిన అవసరం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయి టీకాల కార్యక్రమం నిర్వహించేందుకు, పిల్లలు ఇంటి నుంచే విద్యాభ్యాసం చేసేందుకు, ఉద్యోగులు ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించేందుకు డిజిటల్ మౌలిక సదుపాయాలే తోడ్పడ్డాయని అంబానీ వివరించారు. రాబోయే రోజుల్లో డిజిటల్, ఫిజికల్ (వైద్యపరంగా భౌతికమైన మౌలిక సదుపాయాలు) మేళవింపు సర్వసాధారణం కాగలదని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు పర్యావరణహితంగామారక తప్పదు.. పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం ద్వారా వ్యాపార సంస్థలు పర్యావరణ అనుకూల విధానాలను పాటించడం మినహా ప్రస్తుతం మరో గత్యంతరం లేదని ముకేశ్ అంబానీ చెప్పారు. తమ సంస్థ కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించుకోవడంపై గ్రూప్లోని వివిధ విభాగాలు దృష్టి పెట్టాయని అంబానీ తెలిపారు. క్రూడాయిల్, సహజ వాయువు వినియోగం కొనసాగించినప్పటికీ.. కర్బన ఉద్గారాలను ఉపయోగకరమైన ఉత్పత్తులు, రసాయనాలుగా మార్చగలిగే కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని అంబానీ పేర్కొన్నారు. -
‘అనుసంధానం’..అగమ్యగోచరం..!
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియలో ఎలాంటి ముందడుగు పడటం లేదు. వివిధ రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, స్వరాష్ట్ర ప్రయోజనాలు కాపాడాకే మిగులు జలాలు తరలించాలన్న విధానాన్ని పలు రాష్ట్రాలు వ్యక్తం చేస్తుండటంతో అనుసంధాన ప్రక్రియ మూలనపడుతోంది. అదీగాక జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రాలు గుర్రుగా ఉండటం సైతం అనుసంధానానికి అడ్డుగా మారుతోంది. అకినేపల్లి అని ఒకమారు, జనంపేట్ అని మరోమారు, ఇచ్చంపల్లి అంటూ ఇంకోమారు మాటలు చెబుతున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. నాలుగు ప్రతిపాదనల్లో ఏదీ తేలలేదు..? ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీ లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ, తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు నదుల అనుసంధానాన్ని చేపట్టాలని భావిస్తున్న కేంద్రం, ఇప్పటికే దానికి అనుగుణంగా పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మహానదిలో 360 టీఎం సీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలున్న దృష్ట్యా, ఇందులో 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని మొదట ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా 954 టీఎంసీల కేటాయింపు ఉం దని, ఉమ్మడి రాష్ట్రంలో ఆ మేరకు నీటిని వాడు కునే అవకాశం దక్కలేదని తెలిపింది. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు సైతం చేపట్టడంతో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తెలంగాణకు 1,600 టీఎంసీలు అవసరమని తెలిపింది. ఈ నీటిని పక్కనపెట్టి, అంతకుమించి నీటి లభ్యత ఉంటే దానిని నదుల అనుసంధానం ప్రక్రియకు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఎన్డబ్ల్యూడీఏ జనం పేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్లైన్ ద్వారా నాగార్జునసాగర్కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని తెలంగాణ తిసర్కరించింది.దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇచ్చంపల్లి(గోదావరి)– నాగార్జునసాగర్(కృష్ణా) ప్రాజెక్టులను అనుసంధానించాలని, దీనికి మూసీ రిజర్వాయర్ను వినియోగించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి తెలంగాణ సాను కూలంగా ఉంది. దీని ద్వారా రాష్ట్ర పరిధిలో కనిష్టంగా 18 నుంచి 20లక్షల ఎకరాల మేర సాగు జరుగుతుందని చెబుతోంది.దీనిపై ఇప్పటివరకు ఎన్డబ్ల్యూఏ ఎటూ తేల్చలేదు. దీంతో పాటు ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అను కూలత లేనిపక్షంలో ఇప్పటికే నిర్మాణం జరుగుతున్న తుపాకులగూడెం ద్వారా అయినా గోదావరి నీటిని తరలించే ప్రతిపాదనకు తెలంగాణ సమ్మతి తెలుపుతున్నా ఎన్డబ్ల్యూడీఏ నుంచి సానుకూలత లేదు. ఇదిలా ఉంటే కర్ణాటక, తమిళనాడు ఎన్నికల ప్రచా రంలో బీజేపీ మాత్రం గోదావరి–కావేరీ నదుల అనుసంధా నం చేసి తీరుతామని, ఆయా రాష్ట్రాల నీటి అవ సరాలు తీరుస్తామని హామీలు ఇచ్చింది. కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. దీనిపై ముందడుగు మాత్రం పడలేదు. ప్రస్తుతం కేంద్రం నియమిం చిన టాస్క్ఫోర్స్ కమిటీ భేటీయై రాష్ట్రాలతో చర్చిస్తేనే దీనిపై అడుగు ముందుకు పడనుంది. -
గోదావరి–కావేరీ నదుల అనుసంధానం
చెన్నై: నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, గోదావరి మిగులు జలాల్ని కావేరీకి తరలించేందుకు ప్రణాళిక రూపకల్పన కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గోదావరి–కావేరీ నదుల అనుసంధానానికి జల వనరుల శాఖ కృషి చేస్తోందని, ఇది కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. ‘మిగులు జలాల్ని గోదావరి నది నుంచి కృష్ణకు, అక్కడి నుంచి పెన్నా.. చివరకు కావేరీకి తరలించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది’ అని చెన్నైలో గడ్కారీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల ఆందోళనలపై చర్చిస్తున్నామని, సమీప భవిష్యత్తులో నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని ఆయన చెప్పారు. ‘తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి, వారి అనుమతితో ప్రణాళికను ఖరారు చేస్తాం. ఈ ప్రాజెక్టుల్ని జాతీయ ప్రాజెక్టులుగా పరిగణిస్తాం. 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి’ అని తెలిపారు. మొదటి ప్రాజెక్టులో భాగంగా 300 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాం ద్వారా కృష్ణాకు మళ్లిస్తారు. అక్కడి నుంచి పెన్నా నదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టుకు.. అనంతరం కావేరీ నది పరివాహకంలోని గ్రాండ్ ఆనకట్టుకు మళ్లిస్తారు. కాల్వల ద్వారా కాకుండా స్టీలు పైపుల ద్వారా నీటిని తరలిస్తాయని గడ్కారీ వెల్లడించారు. మొదటి దశలో 100 టీఎంసీల నీరు కావేరీకి వెళ్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. రెండో ప్రాజెక్టులో భాగంగా ఇంద్రావతి నది నుంచి నీటిని నాగార్జున సాగర్ డ్యాంకు తరలిస్తాం. అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టుకు మళ్లించి అనంతరం కర్ణాటకతో సంబంధం లేకుండా కావేరీకి నీటిని తరలిస్తాం’ అని గడ్కారీ వెల్లడించారు. అలాగే చెన్నై – బెంగళూరుల మధ్య రూ. 20 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వేను నిర్మిస్తామని చెప్పారు. తమిళనాడులోని తాంబరం–చెంగల్పట్టు మధ్య రూ. 2,250 కోట్లు, పూనామలీ నుంచి మదురవొయల్ మధ్య రూ. 1500 కోట్లతో, చెన్నై– ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు మధ్య రూ. 1000 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
హైస్పీడ్ కనెక్టివిటీతో సరికొత్త రైల్
-
55 వేల గ్రామాలకు మొబైల్ సౌకర్యం లేదు
భారతదేశంలో మొబైల్ కనెక్టివిటీ అందుబాటులో లేని గ్రామాలు ఇంకా ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. 55,669 గ్రామాలు సెల్యులార్ కనెక్టివిటీకి దూరంగా ఉన్నట్లు లోక్సభలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి గ్రామాలు, పట్టణాల్లో టెలి సాంద్రత స్థాయి 48.79 శాతం నుంచి 152.36 శాతం వద్ద ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. దేశంలో మొత్తం 5,97,608 గ్రామాలుండగా 5,41,939 గ్రామాల్లో ఇప్పటికే మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 55,669 గ్రామాల్లో నెట్వర్క్ అందుబాటులో లేనట్లు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరించారు. అన్ని ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే టెలికాం సేవలకు డిమాండ్ ఉన్నా.. ధర విషయం సున్నితంగా మారిందని ఆయన చెప్పారు. ఇటీవల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి కూడా టెలి సాంద్రతను గుర్తించాల్సి వస్తోందని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల కొనుగో శక్తిలో తేడాలు ఉండటంవల్ల... సాంద్రతలో కూడ భారీ మార్పులు కనిపిస్తున్నట్లు మంత్రి శంకర ప్రసాద్ తెలిపారు. నేషనల్ టెలికం పాలసీ ద్వారా 2017 నాటికి 70శాతం, 2020 నాటికి వంద శాతం గ్రామీణ ప్రాంతాల్లో టెలి సాంద్రతను పెంచే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, టెలికమ్యూనికేషన్ సేవలను మెరుగు పరిచేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. 3,567.58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2,199 మొబైల్ టవర్లను వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2015 నవంబర్ 30 నాటికి సుమారు 1,134 మొబైల్ టవర్లు ప్రసారం ప్రారంభించాయని మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.