Counter
-
అతిషికి సీఎం రేఖా గుప్తా కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా మాజీ సీంఎ అతిషికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందంటూ అతిషి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఢిల్లీని కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించాయి. ఇన్ని సంవత్సరాల పాలనలో వాళ్లేం చేశారు. మేం వచ్చి ఒక్కరోజే అయింది. తొలి రోజే నేను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఢిల్లీ ప్రజలకు రూ.10 లక్షల రూపాయల ఆయుష్మాన్ బీమా యోజన వర్తించేలా ఆదేశాలిచ్చాం. వాళ్లకు మమ్మల్ని ప్రశ్నించే అర్హత లేదు. వాళ్లు ముందు వారి పార్టీని సరిగా చూసుకోవాలి. చాలా మంది పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.గత ప్రభుత్వ అక్రమాలపై కాగ్ రిపోర్ట్ బయటపెడతామని ‘ఆప్’ భయపడుతోంది’అని అతిషికి సీఎం రేఖ కౌంటర్ ఇచ్చారు. కాగా, కొత్త ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో ఢిల్లీ మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలును మరిచిపోయిందని అతిషి గురువారం ఎక్స్(ట్విటర్)లో విమర్శించిన విషయం తెలిసిందే. -
చంద్రబాబుకు నందిగం సురేష్ అదిరిపోయే కౌంటర్
-
హరీష్ రావు వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
-
వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నింది: కాటసాని
-
షర్మిల వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
-
ఒక్క ఫోన్ కొడితే రైతుకు ఉన్న చోటే న్యాయం చేసే రోజులు పోయి.. అరిచినా పట్టించుకోని ప్రభుత్వం వచ్చింది
-
రాహుల్ గాంధీపై బండి సంజయ్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్
-
తప్పుడు ఫిర్యాదు చేసిన వారిని చెప్పు తో కొడతా: ఆది
-
రాహుల్గాంధీకి జైశంకర్ కౌంటర్
న్యూఢిల్లీ:తనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో విమర్శలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు తాను అమెరికా వెళ్లడంపై రాహుల్ సోమవారం(ఫిబ్రవరి3) లోక్సభలో చేసిన వ్యాఖ్యల పట్ల జైశంకర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ చేసిన ఆరోపణలను ఖండించారు.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు గతేడాది డిసెంబరులో జైశంకర్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ సోమవారం లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని అమెరికాను కోరేందుకు జైశంకర్ వెళ్లి ఉంటారు. ఆహ్వానం కోసం మూడు నుంచి నాలుగు సార్లు ఆయనను అక్కడి పంపారు’అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై విదేశాంగ మంత్రి జైశంకర్ మండిపడ్డారు.రాహుల్ గాంధీ చెప్పేదంతా అవాస్తవమని కొట్టిపారేశారు.తన అమెరికా పర్యటనపై రాహుల్ గాంధీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,తాను జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లోని సెక్రటరీ,ఎన్ఎస్ఏను కలిసేందుకు అక్కడి వెళ్లానని జైశంకర్ తెలిపారు.ప్రధాని మోదీకి ఆహ్వానం కోసం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు’అని జైశంకర్ ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా స్పష్టతనిచ్చారు. -
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
-
8 నెలలకే ప్రజలకు 70MM సినిమా.. ప్రజలే మీ కాలర్ పట్టుకుని...!
-
మౌనం వీడి రేవంత్ సర్కార్ పై నిప్పు లు చెరిగిన కేసీఆర్
-
చంద్రబాబు బూటకపు హామీలు.. ఏకిపారేసిన పుష్ప శ్రీ వాణి..
-
పెద్దిరెడ్డిపై ఎల్లో మీడియా విషపు రాతలు.. భూమన స్ట్రాంగ్ కౌంటర్
-
పరిటాల శ్రీరామ్ కి తోపుదుర్తి స్ట్రాంగ్ కౌంటర్..
-
బండి సంజయ్కి టీపీసీసీ చీఫ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్రమంత్రి బండి సంజయ్కి పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం(జనవరి25) మహేష్కుమార్గౌడ్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి ని గౌరవిస్తాం. ఇంధిరమ్మ త్యాగం ముందు మీరు, మీ మోదీ ఎంత. ఇంధరమ్మను బండి సంజయ్ అవమానిస్తున్నారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని రేపు నాలుగు పథకాలు ప్రారంభించి మరోసారి నిరూపించుకోబోతున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పండుగ జరుపుకోవాలి. పదేళ్లలో బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇండ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుతో అయినా గత పాలకులకు కనివిప్పు కలగాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల అనుచరులకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మా ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలే లబ్ధిదారుల లిస్ట్లో పేరు లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మేం ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. తప్పు చేస్తే మాత్రం చర్యలు తప్పవు’అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాగా, ఇందిరమ్మ(Indiramma house) పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇవ్వదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’(Pradhan Mantri Awas Yojana) పేరు పెడితేనే నిధులిస్తామంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. మేమే ముద్రించి ప్రజలకు రేషన్కార్డులు ఇస్తామని బండి సంజయ్ చెప్పారు.కరీంనగర్లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలోకి చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి గుర్తించి బీజేపీలో చేరడం సంతోషమన్నారు బీఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్లో ఉన్న సునీల్రావు కూడా ఏం చేయలేకపోయారు. నేను హైదరాబాద్లో మీటింగ్లో గొడవ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాక నిధులు విడుదల చేశారని బండి సంజయ్ చెప్పారు. -
రేవంత్ ‘ఐటీ ఉద్యోగి’ వ్యాఖ్యలు..కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా:నేను రాజకీయాల్లోకి రాకముందు ఐటీ సౌత్ ఇండియా హెడ్గా పనిచేసింది నిజమేనని, మరి అప్పుడు సీఎం రేవంత్ ఏం చేసేవాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.‘ సీఎం రేవంత్రెడ్డివి అహంకారపూరిత మాటలు. నేను ఐటీలో ఉన్నపుడు రేవంత్ ఏం చేసిండు..? బ్రోకరిజమా, సూట్ కేసులు మోసుడా..ఇవన్నీ నేనంటే మళ్ళీ నాపై ఏడుపొకటి.ఎవరైనా బీఆర్ఎస్ను వీడితే కేసీఆర్ అన్నట్టు వారి గ్రహచారం బాగా లేకపోవడమే. నేను మళ్ళీ చెబుతున్నా.నాపై పెట్టినవి లొట్టపీసు కేసులు.లై డిటెక్టర్ పెట్టి విచారణ చేసుకోమని నేనే సవాల్ విసురుతున్నా. ప్రజాపాలన సభల్లో జనం ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్పష్టత లేకుండా గ్రామసభలు నిర్వహిస్తే జనం తిరగబడ్డారు.పథకాల అమలు చేతగాక కాంగ్రెస్ మంత్రులు ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు.కాగా, దావోస్ పర్యటనలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేటీఆర్ది కేవలం ఐటీ ఉద్యోగి మెంటాలిటీ అని తాను పాలసీ మేకర్నని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఐటీ రంగంలోని ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో స్పందించిన కేటీఆర్ తాజాగా నేరుగా రేవంత్కు కౌంటర్ ఇచ్చారు. -
వరుస ఎన్ కౌంటర్లతో మావోయిజాన్ని ఆపలేరు
-
చంద్రబాబు తన మనుషులను కాపాడుకోవడానికి యత్నిస్తున్నారు
-
నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, ఏ తప్పు చేయలేదు
-
వెళ్లి రొయ్యలకు మేత వేసుకో.. ఆనంకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన YSRCP మహిళా నేత..
-
లోకేష్ కు గుడివాడ కౌంటర్
-
ప్రధానిపై విమర్శలు..మస్క్కు బ్రిటన్ కౌంటర్
లండన్:బ్రిటన్(Britain) ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)పై అమెరికా బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) విమర్శలకు బ్రిటన్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్(Pakistan) మూలాలున్న వ్యక్తులు అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగ్లను నడిపినా అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్గా ఉన్న స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)వేదికగా మస్క్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి.అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగులను చట్టం ముందు దోషులుగా నిలపడంలో స్టార్మర్ అప్పట్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇందుకే బ్రిటన్లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో స్టార్మర్కు కూడా భాగస్వామ్యం ఉందని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆ గ్యాంగులపై విచారణకు లేబర్ పార్టీ ఒప్పుకోనందున ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. అయితే ఈ మస్క్ చేసిన ఈ విమర్శలపై యూకే ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ తప్పుపట్టారు. మస్క్కు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని,ఆయన ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని వెస్ పేర్కొన్నారు. అయితే బ్రిటన్లో అమ్మాయిలపై అకృత్యాలను అరికట్టేందుకు మస్క్తో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
స్పీకర్ Vs హరీష్ రావు.. దద్దరిల్లిన అసెంబ్లీ
-
అల్లు అర్జున్ పై పవన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
-
పవన్ ను ఏకిపారేసిన రాచమల్లు
-
ట్రంప్కు పనామా అధ్యక్షుడి కౌంటర్
పనామాసిటీ:త్వరలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పనామా కాలువ(Panama Canal)ను కొనేస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తాజాగా స్పందించారు. అసలు ఈ అంశంపై ట్రంప్తో చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.ఈమేరకు ములినో మీడియాతో మాట్లాడారు. కాలువ పనామేనియన్లకు చెందిందన్నారు. కెనాల్పై ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అమెరికా(America) వాణిజ్య నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలుచేస్తోందనే ట్రంప్ ఆరోపణలను ములినో ఖండించారు.అదేవిధంగా పనామా కెనాల్లో చైనా జోక్యం లేదన్నారు.కెనాల్ రుసుములు పబ్లిక్ అండ్ ఓపెన్ ప్రాసెస్ కింద అధ్యక్షుడు లేదా అడ్మినిస్ట్రేటర్ పాదర్శకంగా నిర్ణయిస్తారన్నారు.కాగా, ట్రంప్ ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ..అట్లాంటిక్, పసఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.అమెరికాకు చెందిన వాణిజ్య,నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని,వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలన్నారు. దీంతో పాటు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని ట్రంప్ అన్నారు. -
ఎల్లో మీడియాలో బిల్డప్ తప్ప... మంచి చేసింది ఏమీ లేదు
-
పవన్ పై భూమన ఫైర్
-
గద్దె రామ్మోహన్ పై దేవినేని అవినాష్ ఫైర్
-
మేం డెవలప్ మెంట్ అంటే ఇప్పు డొన్నోళ్లు కలెక్షన్స్ అంటున్నారు
-
సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్.. ప్రభుత్వంపై గుడివాడ కౌంటర్
-
సాక్షి జర్నలిస్టులపై దాడి.. గుడివాడ అమర్నాథ్ కౌంటర్
-
చంద్రబాబుకి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కౌంటర్
-
సొమ్మిరెడ్డికి కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
-
మీ సంపద సృష్టి మంత్రి సవితకు రాచమల్లు కౌంటర్
-
రిపోర్టర్ కి బొత్స దిమ్మతిరిగే కౌంటర్
-
మంత్రి వంగలపూడి అనితకు అంబటి అదిరిపోయే కౌంటర్
-
శ్రీహరి రావు హత్యపై పవన్ వ్యాఖ్యలకు సింహాద్రి రమేష్ బాబు కౌంటర్
-
జేసీ గుండాయిజం.. భయపడేదేలే అంటున్న వైఎస్సార్సీపీ నేతలు
-
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు అనంత వెంకటరామిరెడ్డి కౌంటర్
-
మాయచేయడానికి ఆయన ఏమైనా మాంత్రికుడా...! నాదెండ్లకు అనిల్ కుమార్ కౌంటర్
-
ఎల్లోమీడియాకు నాగబాబు కౌంటర్
సాక్షి,హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ సోదరుడు నాగబాబు ఎల్లోమీడియాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు నాగబాబు తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో శుక్రవారం(నవంబర్ 29) ఒక పోస్టు చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు కుండబద్దలు కొట్టారు. పవన్ ఢిల్లీ పర్యటనపై కొన్ని రోజులుగా ఏదేదో ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియాకు తన ట్వీట్తో తాజాగా షాకిచ్చారు నాగబాబు. పవన్ ఢిల్లీ పర్యటన నాగబాబు కోసమేనని ఎల్లోమీడియా ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. నాగబాబుకు రాజ్యసభ సీటు కావాలని పవన్ తన టూర్లో బీజేపీ పెద్దలను కోరినట్టు ఎల్లోమీడియా వార్తలు ప్రసారం చేసింది. ఈ ప్రచారంపై నాగబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందుకే ఆయన ఎక్స్లో క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. -
ఏపీ చరిత్రలోనే అత్యంత తక్కువ ధరకు డీల్ కుదిరింది తమ హయాంలోనే
-
బాబు, పవన్ కు దేవభక్తుని చక్రవర్తి కౌంటర్
-
అదానీతో గత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు
-
లోకేష్, పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ అదిరిపోయే కౌంటర్
-
నారా లోకేష్ వ్యాఖ్యలు.. వై విశ్వేశ్వర్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
-
దేవిశ్రీకి కౌంటర్ ఇచ్చిన పుష్ప ప్రొడ్యూసర్..
-
‘రాసిపెట్టుకోండి.. నేనంతా మంచోడ్ని కాదు’ (ఫొటోలు)
-
సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం(నవంబర్ 26) కేటీఆర్ తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు.‘కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు. 12,400కోట్లు ఒప్పందాల సంగతేంటి?రాహుల్,రేవంత్రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్ళో వాళ్లే తేల్చుకోవాలి.ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు..అబద్దాల రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం.తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను. కానీ కేసీఆర్ను అనడానికి రేవంత్కు ఎంత ధైర్యం?ఈడీ కేసు కోసం రేవంత్,అతని మంత్రుల లెక్క మేం అదానీ కాళ్ళు పట్టుకోలేదు.బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్రెడ్డి.చిట్టినాయుడికి చిప్ దొబ్బిందని నిన్నటి రేవంత్ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.నేను సైకో అయితే..సీఎం రేవంత్ సన్నాసినా? శాడిస్టా? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు.28సార్లు ఢిల్లీ వెళ్ళి..రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.అదానీ జాతీయ రహదారులు,రక్షణ శాఖ పనులు చేస్తే మాకేం సంబంధం?రేవంత్లో సబ్జెక్టు,సరుకు ఉండదు. ఎవరైనా చెప్తే వినడు. దావోస్లో నేను అదానీని బరాబర్ కలిసిన. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదు.అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే..మేం రెడ్ సిగ్నల్ చూపించాం.మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది సీఎం రేవంత్ సోదరులు చేసిన హత్యే. ఏడాదిగా అదానీ,అల్లుడు, అన్న,బావమరిదికి అమృతం పంచటం కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.రేవంత్రెడ్డి అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్కు కేసీఆర్,మా మీద ఫ్రస్టేషన్ ఎందుకు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు.వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యే.తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోంది.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్ -
కనీస మార్కులొస్తేనే హోంగార్డులకు ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ప్రాథమిక రాత పరీక్షలో కనీస మార్కులు రాని హోంగార్డులకు ఉద్యోగాలు ఇవ్వలేమని రాష్ట్ర పోలీసు నియామక బోర్డు (ఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ ఎం.రవిప్రకాశ్ హైకోర్టుకు నివేదించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించలేదంటూ తమను అనర్హులుగా ప్రకటించారంటూ పలువురు హోంగార్డులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను దేహదారుఢ్య, తుది రాత పరీక్షలకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు చైర్మన్ రవిప్రకాశ్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హులు కాని వారికి పోస్టుల భర్తీ నిమిత్తం జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రశ్నించే హక్కులు ఉండవని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలోనే నోటిఫికేషన్లో పేర్కొన్న షరతుల గురించి పిటిషనర్లందరికీ స్పష్టంగా తెలుసని, వాటికి అంగీకరించిన తరువాతే వారంతా ప్రాథమిక రాత పరీక్షకు హాజరయ్యారన్నారు. ప్రాథమిక రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో వారంతా ఇప్పుడు నోటిఫికేషన్ను తప్పుపడుతున్నారని తెలిపారు.నోటిఫికేషన్లోని పేరా–7లో పేర్కొన్న స్పెషల్ కేటగిరీలు హారిజాంటల్ రిజర్వేషన్ (హోంగార్డులు, ఎన్సీసీ, ప్రతిభావంతులైన క్రీడాకారులు, పోలీసు సిబ్బంది పిల్లలు, మరణించిన పోలీసుల పిల్లలు తదితరాలు) కిందకు వస్తాయన్నారు. ఈ హారిజాంటల్‡ రిజర్వేషన్ కిందకు వచ్చే పోస్టులను కచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా భర్తీ చేసి తీరాల్సిందేనని తెలిపారు.అలా చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయిరూల్ ఆఫ్ రిజర్వేషన్తో సంబంధం లేకుండా హోంగార్డుల కోసం కేటాయించిన కోటాలో హోంగార్డులకు ప్రత్యేక మెరిట్ జాబితా తయారు చేస్తే రిజర్వేషన్లు 50 శాతం దాటిపోతాయని, ఇది సుప్రీం తీర్పునకు విరుద్ధమవుతుందని రవిప్రకాశ్ వివరించారు. పిటిషనర్ల అభ్యర్థనను ఆమోదిస్తే మెరిట్కు పూర్తిగా తిలోదకాలు ఇచ్చినట్టవుతుందని, పిటిషనర్లు తమ కులం ఆధారంగా వయసు మినహాయింపు కోరుతున్నారని పేర్కొన్నారు.అయితే, తమ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద కనీస అర్హత మార్కులను మాత్రం ఆమోదించడం లేదన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. స్పెషల్ కేటగిరీ కింద హోంగార్డుల్లో కూడా ఓసీ 40 శాతం, బీసీ 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామన్నారు. కనీస అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు కోరే హక్కు అభ్యర్థులకు లేదని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో సైతం స్పష్టం చేసిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసి సంబంధిత పిటిషన్లన్నీ కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. -
అక్రమ అరెస్ట్ లపై కూటమి ప్రభుత్వానికి అనంత వెంకటరామి రెడ్డి కౌంటర్
-
మంత్రి టీజీ భరత్ కు వరుదు కళ్యాణి కౌంటర్
-
రేవంత్ వ్యాఖ్యలకు ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్
-
వాలంటీర్ వ్యవస్థే లేకపోవడం ఏంటి అద్యక్ష.. బొత్స కౌంటర్
-
ఇవి మీకు కనిపించవా?.. పోలీసులపై నారాయణస్వామి ఆగ్రహం
-
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని పవనే అన్నారు
-
KSR Live Show: ఏపీలో థర్డ్ డిగ్రీ.. కొడాలి నాని కేసుపై వైఎస్సార్సీపీ శివ శంకర్ రియాక్షన్
-
మరి అయ్యన్న, అచ్చెన్నాయుడుపై ఎన్ని కేసులు పెట్టారు.. మార్గాని భరత్ కౌంటర్
-
ఆడవాళ్లపై ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపు బాబు
-
చంద్రబాబుకు రాచమల్లు శివప్రసాద రెడ్డి కౌంటర్
-
మంత్రి పయ్యావుల కేశవ్ కి కన్నబాబు అదిరిపోయే కౌంటర్
-
అసెంబ్లీలో టీడీపీ మంత్రి వ్యాఖ్యలకు పుష్ప శ్రీవాణి అదిరిపోయే సెటైర్లు
-
కేసీఆర్కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఇటీవల ఎర్రవెల్లి ఫాంహౌజ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం(నవంబర్ 11) ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడాారు. పది నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలకు అర్ధమైందని ఒకాయన మాట్లాడుతున్నాడని, ఆయన ఇంట్లో మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోవడం తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేం లేదని పరోక్షంగా కేసీఆర్కు రేవంత్ చురకంటించారు.‘ఈ పది నెలల్లో నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, రైతులు రైతు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారు. ఒక కోటి 5లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్ది పొందారు.నష్టాల్లో కూరుకున్న ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. 49 లక్షల 90వేల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్నారు.రూ.500లకే మా ఆడబిడ్డలు వంటగ్యాస్ సిలిండర్ అందుకోగలుగుతున్నారు.రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుతోంది.21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు.35వేల మంది టీచర్ల బదిలీలు పూర్తి చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిది.కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం,ప్రగతి భవన్ కట్టుకుండు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించలేదు.మా ప్రభుత్వం రాగానే 100 నియోజవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.విద్యనే తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుందని నిరూపిస్తున్నాం.ఎన్ని అడ్డంకులు సృష్టించినా 563 గ్రూప్ ఉద్యోగాలకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించాం.త్వరలో వారికి నియామకపత్రాలు అందించి వారిని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తాం. పది నెలల్లో రైతులు, నిరుద్యోగులను ఆదుకున్నాం. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఇవన్నీ చేసాం.మీరు లేకపోయినా ఏం బాధలేదు.మీతో ప్రజలకేం పని లేదు.తెలంగాణ సమాజం నిన్ను మరిచిపోయింది. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రభుత్వం చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వండి.లోపాలు ఉంటే సలహాలు ఇవ్వండి.బడి దొంగలను చూసాం కానీ..ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఉన్న విచిత్ర పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం’ అని రేవంత్రెడ్డి కేసీఆర్ను ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ పై వైఎస్ జగన్ ఫైర్
-
బీటెక్ రవి, పోలీసులకు వైఎస్ అవినాష్ రెడ్డి వార్నింగ్
-
కేటీఆర్కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై బండి సంజయ్ శుక్రవారం(నవంబర్ 8) హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు.‘బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రేవంత్,నేను కొట్లాడాం. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నాం. డైవర్షన్,కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్కే ఉంది. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసు,ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల్లో హంగామా చేసి చివరకు కాంగ్రెస్,బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యాయి. కేటీఆర్ ట్విటర్లో తప్ప ఎక్కడా కనిపించడు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కాయి. బీఆర్ఎస్లో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీశ్రావు మాత్రమే’అని బండి సంజయ్ అన్నారు. ఎక్కడో భువనగిరిలో కాకుండా మూసీ పక్కన ఇల్లు కూలగొట్టే దగ్గర సీఎం రేవంత్రెడ్డి పాదయాత్ర చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి పాద యాత్ర చేయాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: హ్యాపీ బర్త్డే రేవంత్: కేటీఆర్ -
టీడీపీ ఎమ్మెల్యేకి అనంతపురం మేయర్ స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై వరుదు కళ్యాణి కౌంటర్
-
సరస్వతి భూములపై పవన్ కామెంట్స్ కు దిమ్మతిరిగే కౌంటర్
-
పవన్ వ్యాఖ్యలకు కాసు మహేష్ రెడ్డి కౌంటర్
-
పవన్ కు మందకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్..
-
పవన్ కళ్యాణ్ కు అంబటి కౌంటర్
-
చంద్రబాబుకు వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్
-
రుషికొండ భవనాలపై బాబు కామెంట్స్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అమర్ నాథ్
-
సీఎం రేవంత్రెడ్డిపై డీకే అరుణ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ సీనియర్నేత, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా రేవంత్రెడ్డి చేసిన ట్వీట్పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(నవంబర్ 3)డీకే అరుణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘సోనియా గాంధీ పుట్టిన రోజునాడే అన్నీ గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క ఇల్లు నిర్మాణం మొదల పెట్టలేదు. కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? రైతు రుణమాఫీ సగం మందికి కాలేదు. సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. పక్క రాష్ట్రంలో అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫ్రీబస్ స్కీమ్ ఎత్తేస్తాం అంటున్నారు.గ్రామాలకు బస్సులు బంద్ చేసి తెలంగాణలో ఫ్రీ బస్ అంటున్నారు. మోదీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారు. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడడానికి రేవంత్రెడ్డికి సిగ్గుండాలి. 500 రూపాయలకే సిలిండర్లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లన్నీ కేంద్రానీవే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారు. కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్దం చేసుకుంటున్నారు.రైతు భరోసా లేదు. కౌలు రైతులకు,కూలీలకు సాయం దిక్కు లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే.50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్.10 లక్షల రూపాయల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి చేయించారో బయట పెట్టండి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండ దబాయించాలని చూస్తున్నారు. కొత్తగా ఒక ఫించను దరఖాస్తు కూడా తీసుకోలేదు.కొత్త వితంతు ఫించన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు’అని డీకే అరుణ మండిపడ్డారు. ఇదీ చదవండి: పీఎం నరేంద్రమోదీ వర్సెస్ సీఎం రేవంత్రెడ్డి -
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతీకార దాడులు చేస్తున్నారు
-
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తమ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా శనివారం(నవంబర్ 2) రేవంత్రెడ్డి ఒక పోస్టు చేశారు.‘ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అనేక అవాస్తవాలున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల బీమా వంటి హామీలను నెరవేర్చాం.22 లక్షల 22 వేల మంది రైతులకు రుణమాఫీ చేశాం.25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం.పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉంటే,కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది.ఈ పథకం కింద 42,90,246 మంది లబ్ధిపొందారు. యువతకు వేల ఉద్యోగాలిచ్చాం’అని రేవంత్రెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: నోటికందే కూడు నీటిపాలు -
కేసీఆర్ తో పోలికా?.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్