CPM
-
రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల డేటా విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఓటర్లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎం కంటే నోటా (నాన్ ఆఫ్ ది ఎబవ్)ఆప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని తేలింది. మొత్తం పోలైన ఓట్లలో నోటా ఆప్షన్కు 0.57 శాతం ఓట్లు పడగా బీఎస్పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01శాతం మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలకు దక్కిన ఓట్ల కంటే నోటా ఓట్ల శాతమే ఎక్కువ. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.01, జేడీయూకు 0.53 శాతం ఓట్లు పడ్డాయి. -
ఏం సాధించారని కూటమి నేతల సంబరాలు: సీపీఎం
సాక్షి, విశాఖపట్నం: కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వాల్తేర్ డివిజన్ను రెండు ముక్కలు చేయడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. 10,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని.. ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా ఒరిస్సా పరిధిలో కలిసిపోతుందని సీపీఎం పేర్కొంది.అరకు అభివృద్ధికి ఒరిస్సా మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం సాధించారని కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు. జోన్ ఏర్పాటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీపీఎం తెలిపింది.కాగా, కేకే లైన్ను విశాఖ డివిజన్లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.విశాఖ పర్యాటక భూభాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్ను విశాఖ రైల్వే డివిజన్లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వాపోయారు. రాయగడ డివిజన్లో కేకే లైన్ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు. -
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు’
సాక్షి, హన్మకొండ: ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నాయకుడు చాడా వెంకట్రెడ్డి. ప్రజాకవి గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.చాడా వెంకట్రెడ్డి తాజాగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరం కాదు. నక్సలిజాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలి.గద్దర్కు అవార్డు ఇవ్వడం తప్పు అనేది సరైంది కాదు. గద్దర్పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దేశాన్ని రాచరికం ఏలుతున్న రోజుల్లో కమ్యూనిజం పుట్టింది. భారత సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది సీపీఐ పార్టీనే. ఎన్నో నిర్భంధాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంది. నవాళి కళ్యాణానికి బీజం వేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. దీన్ని అంతం చేస్తామని కొందరు చెబుతున్నారు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్ల విషయమై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు. ఎన్కౌంటర్ల వల్ల ఉద్యమాలకు చెక్ పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఎన్కౌంటర్లు గతంలో చాలా జరిగాయి.. ఉద్యమాలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఎన్కౌంటర్ల వల్ల కొంతమంది మరణం మాత్రమే జరుగుతుంది. కొంత మందిని మాత్రమే చంపగలరు. ఉద్యమాన్ని ఆపలేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్వెస్లీ
సాక్షి, సంగారెడ్డి: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్వెస్లీ నియమితులయ్యారు. 60 మందితో సీపీఎం నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా, 70 ఏళ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటి నుంచి ఉద్వాసన పలికారు. తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావులకు సీపీఎం రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కలేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ.. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు.అయితే, సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు నేటితో ముగిశాయి. చివరి రోజు మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఆ కమిటీ ఎన్నుకోనుంది. -
2సీట్లు ఉన్న కుమార స్వామిని చూసి బుద్ధి తెచ్చుకో.. బాబుపై సీపీఎం నేత ఫైర్
-
డిప్యూటీ సీఎం పవన్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు
-
పవన్.. సీజ్ ది షిప్ ఏమైంది?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క నిమిషం కూడా చంద్రబాబు ప్రధానితో మాట్లాడలేదన్నారు. అలాగే, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ సహా అన్నింటినీ అదానీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. రైల్వే జోన్ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు. రైల్వే జోన్ ప్రారంభం కాకుండా కుట్రలు పన్నుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. మొన్న ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఈ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క నిమిషం కూడా ప్రధానితో బాబు మాట్లాడలేదు. మీరు స్టీల్ ప్లాంట్ను కాపాడే వ్యక్తులా లేక మిట్టల్కు బ్రోకర్లా అని అడుగుతున్నా. మిట్టల్కు ఆగమేఘాల మీద అనుమతులు ఎందుకు అడుగుతున్నారు?.ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. విశాఖ ఉక్కును బలి చేసి మిట్టల్ను తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ముందు విశాఖ ఉక్కును కాపాడి అప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. కర్ణాటక స్టీల్ ప్లాంట్కు రూ.15వేల కోట్లు కుమారస్వామి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు?. మన ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్కు నిధులు తేవాలి. లేనిపక్షంలో ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి.చంద్రబాబుని ప్రధాని మోదీ ఆడిస్తున్నారు. ఆరు నెలల్లో వెన్నుపోట్లు పొడవద్దు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోంది. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు శఠగోపం పెట్టారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనపడటం లేదు.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు.. పథకాలు ఇవ్వడంలో ఆ స్పీడ్ ఎందుకు లేదు?. ఈ ప్రభుత్వంపై పేదలు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ లేదు.. షిప్ లేదు. ఒక్క బియ్యపు గింజను కూడా సీజ్ చేయలేదు. పవన్కు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుడిలా కనపడుతున్నారు. పవన్ ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం అంటున్నారు. గిరిజనులకు భూమి హక్కు కల్పించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిరూపించుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు తీరు దుర్మార్గం.. సీపీఎం నిరసన
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ.. జగదాంబ సెంటర్లో సీపీఎం నిరసన చేపట్టింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గం అంటూ సీపీఎం నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏమిటంటూ వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.వైజాగ్ స్టీల్ కోసం గనులు అడగకుండా మిట్టల్కు చంద్రబాబు ఎలా గనులు ఇవ్వాలని కోరుతారంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని.. వైజాగ్ స్టీల్ను కాపాడకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది. -
పవన్ మాటలు వెనుక బీజేపీ ట్రైనింగ్
-
చంద్రబాబు విన్యాసాలు.. కష్టాల్లో ఏపీ ప్రజలు
-
ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక పార్క్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా విలేజ్ కాదని.. పారిశ్రామిక పార్క్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎంను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు సీపీఐ(ఎంఎల్) ప్రతినిధులు కలిశారు. ఇటీవల లగచర్లలో పర్యటించిన వీరు.. అధికారులపై దాడి ఘటన తర్వాత అక్కడి పరిస్థితులపై రూపొందించిన నిజనిర్దారణ నివేదికను సీఎంకు అందజేశారు. పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా లగచర్లలో ఏర్పాటుచేయబోయే పరిశ్రమల గురించి వారికి సీఎం రేవంత్రెడ్డి వివరించారు. లగచర్లలో కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నా ప్రజలను నేను ఇబ్బంది పెడతానా? తన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం తన బాధ్యత అని వామపక్ష పార్టీల నేతలతో సీఎం అన్నారు. ‘నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడుతా?’అని ప్రశ్నించారు. అయితే, లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని, అందుకు కుట్ర చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టంచేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టిన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయంపై సమాలోచన కాలుష్య కారక పరిశ్రమల కోసం రెండు పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని సీఎంకు సూచించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లగచర్లలో కాకుండా కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డికి చెందిన 1,156 ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిదని తెలిపినట్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఆ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని సీఎం అన్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూములుంటే సూచించాలని సీఎం అడిగారని, దీనిపై రెండుమూడుసార్లు సమావేశాలు నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకుందామని చెప్పారని తమ్మినేని వెల్లడించారు. కాగా, లగచర్లలో వరి కోతలకు అధికారులు యంత్రాలను అనుమతించడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, పోలీసు క్యాంపులతో నిర్భందం కొనసాగుతున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే.. ఆయన వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి వరికోత యంత్రాలను అనుమతించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలీసు క్యాంపులను వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు వివరించారు. గిరిజనులపై కేసులు ఎత్తేయండి: కూనంనేని లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎంను కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని, రైతుల భూములు సేకరించి జనావాసాల మధ్య ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటే వామపక్షాలు అంగీకరించబోవని సీఎంకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే.. అదికూడా రైతులను ఒప్పించి, పూర్తి నష్టపరిహారం అందించిన తరువాతే వారి భూములను సేకరించాలని సూచించినట్లు తెలిపారు. సీఎంను కలిసినవారిలో సీపీఐ రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ (ఎం.ఎల్) మాస్లైన్ నాయకులు రమ, ఎస్.ఎల్. పద్మ, ఆర్ఎస్పీ నాయకడు జానకిరాములు, ఎంసీపీఐ నాయకుడు గాదగోని రవి తదితరు ఉన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ సీపీఎం నేతల కీలక భేటీ
-
రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
-
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్ప్లాంట్పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. -
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఉపేక్షించం..మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీలేదు. ఏడాది పాలనలో సీఎం రేవంత్రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం తప్ప వేటినీ అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా ఊరూరా ఎర్రజెండా ను తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా చెప్పాం.ఇక నుండి రోడ్ల పైకి వస్తాం. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవలచేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమకిచ్చిన హామీ నెరవేర్చక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు.. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీపీఎం భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జి వంటి మరికొన్ని అంశాలను కూడా ఆ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంపై ఒకపక్క సీపీఎం విరుచుకు పడుతుంటే, మరోపక్క సీపీఐ కూడా వివిధ సమస్యలపై తన నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజలకు దూరమవుతామన్న భావన.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవగా, సీపీఎం పార్టీ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్కు రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని అసెంబ్లీ పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు సీపీఎంకు కూడా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలన్న అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది.అయితే ఏడాది కావొస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అసంతృప్తి కామ్రేడ్లలో ఉందని అంటున్నారు. అలాగే పలు సందర్భాల్లో సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇచ్చినా లెక్క చేయడంలేదని వామపక్షాలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే తాము మిన్నకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, వారికి దూరం అయ్యేందుకు అవకాశం ఉందనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ఫలితమే సీపీఎం, సీపీఐల ప్రతిస్పందనలని అంటున్నారు. ఇటీవలి పరిణామాలేంటి..?బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచే జీవోను రద్దుచేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను పడగొట్టి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఒకవైపు ప్రజాపాలన అంటూనే ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తోందని సీపీఎం విమర్శించింది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోలీసులను, అధికారులను ప్రయోగిస్తోంది. ఇళ్ల కూలి్చవేతకు ఏర్పాట్లు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ సీఎం రేవంత్రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ‘రైతులకు ప్రకటించిన రు.2 లక్షల రుణమాఫీని అర్హులైనవారందరికీ అమలు చేయాలి. అలాగే పంటకాలం పూర్తవుతున్నప్పటికీ వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. తక్షణమే రైతు భరోసా చెల్లించాలి..’అని సీపీఎం కోరింది. గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించింది. వారికి న్యాయం చేసేవిధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వానాకాలం, యాసంగికి రైతుభరోసా, రుణమాఫీలను వెంటనే అమలు చేయాలని సీపీఐకి చెందిన రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై జిల్లాల్లో ధర్నాలు చేపట్టింది. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమేనంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
నమ్మించి మోసం చేసిన కూటమి కరెంటు బిల్లులు బాదుడే బాదుడు..
-
Jammu Kashmir election results: కశ్మీర్ లోయలో ఎర్రజెండా
జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. ‘ఓ జో తరిగామ్ వాలా?’అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పారీ్టకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత ‘హక్ కా హామీ తరిగామీ’అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి. గట్టిపోటీని తట్టుకుని..ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యరి్థగా తరిగామికి మద్దతు ఇచి్చంది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచి్చంది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆరి్టకల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది. జైలు జీవితం.. గృహ నిర్భందం.. 1949లో జని్మంచిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యారి్థ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్భందానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్లో 35 రోజుల పాటు గృహనిర్భందలో ఉంచారు. నిర్భందంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పవన్ను సీఎం చేయడమే బీజేపీ ప్లాన్: సీపీఎం కార్యదర్శి
సాక్షి,విజయవాడ:కూటమి ప్రభుత్వంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ను బీజేపీ ఆడిస్తోందన్నారు.చంద్రబాబును దింపేసి పవన్ కళ్యాణ్ను సీఎం చేసేందుకు బిజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.ఏపీని నాశనం చేసేందుకు బీజేపీ పవన్ కల్యాణ్ను వాడుకుంటోందన్నారు. వందరోజుల్లోనే కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని విమర్శించారు.ఇదీ చదవండి: జీతాలు నిల్లు.. పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు -
తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు: బీవీ రాఘవులు
-
లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలిగానీ, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏ కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురావని, పాపమే తెస్తాయన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ)భవన్లో ఆదివారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడని, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అయన్ని చెప్పమనండి అని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాఘవులు ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి సీతారాం ఏచూరి పెద్ద పుస్తకమే రాశారని, సనాతన ధర్మంలో కీలకం కుల వ్యవస్థ అని, కులంపై అభిమానం ఉన్నవాళ్లు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారన్నారు. కుల వ్యవస్థ శ్రమకు, సాటి మనిషికి గౌరవం ఇవ్వదన్నారు. అలాగే, కుల వ్యవస్థను తీసేస్తే సనాతన ధర్మం ఉండదని, అది ఆధునిక ధర్మం అవుతుందన్నారు. ఈ దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడాలంటే కుల, మత వ్యవస్థను తొలగించాలని రాఘవులు తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ వంటి మతతత్వ శక్తుల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటివి ప్రమాదంలో పడిపోయాయని, ఈ తరుణంలో సీతారాం ఏచూరి వంటి నాయకులు లేకపోవడం దేశానికి పెద్ద లోటన్నారు.ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనర్థాలు..తాజాగా.. కేంద్ర మంత్రివర్గం ఒకే దేశం, ఒకే ఎన్నికకు ఆమోదం తెలిపిందని, ఈ నినాదం బాగుందని అనుకోవద్దని, దీనివల్ల ఏకత్వం మాటెలా ఉన్నా దేశంలో ప్రాంతాల వారీ తగదాలకు, విభజనకు దారితీస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. అధ్యక్ష తరహా పాలనను గతంలో ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఒకే ఎన్నిక అంటోందన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని, మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇక కామన్ సివిల్కోడ్ గురించి మనమంతా మాట్లాడుకుంటుంటే సాక్షాత్తు ప్రధానమంత్రే కమ్యూనల్ సివిల్కోడ్ తెస్తామని చెబుతున్నాడని.. ఇది ఏకత్వం కాదని, ఈ దేశం ఐక్యతను దెబ్బతీసే చర్యలని రాఘవులు విమర్శించారు.సిద్ధాంతానికి కట్టుబడ్డ ఏచూరి..మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఆహర్నిశలు పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి మన తెలుగు వాడు కావడం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి ‘రాజీనామా చేయండి’ అని డిమాండ్ చేసిన ధైర్యశాలి సీతారాం అన్నారు. 1984లో ఎన్టీఆర్ను గద్దె దింపినప్పుడు, ఆయన్ను మళ్లీ సీఎం పీఠం ఎక్కించడానికి రాష్ట్రంలోను, ఢిల్లీలోను సీతారాం చేసిన కృషి ఎనలేనిదన్నారు.ఉత్తమ పార్లమెంటేరియన్ మన ఏచూరి : అంబటిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల కోసం పోరాడే శక్తి అని, అటువంటి పార్టీలో నిబద్ధతతో రాటుదేలి రాణించడమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతారాం ఏచూరి మన తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. భారత పార్లమెంట్లో ఆయన పెట్టిన సవరణలు ఆమోదించేలా పోరాడిన సీతారాం ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారన్నారు. సీతారాం మరణం భారత రాజకీయాలకు తీరనిలోటని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు వచ్చానని అన్నారు. జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన సీతారాంకు తమ నాయకుడు జగన్ తరఫున, తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నానని రాంబాబు పేర్కొన్నారు. సభలో ఇంకా మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీతారాం చిత్రపటానికి అంజలి ఘటించారు. -
అన్నాడంటే మాటపై ఉన్నాడనే!
ఇచ్చిన మాటకే కాదు, తామన్న మాటలకూ ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్దిమంది రాజకీయ నాయకులలో సీతారాం ఏచూరి ఒకరు. ఇంటర్వ్యూ లలో వెలిబుచ్చిన అభిప్రాయాల పర్యవసానాలను ఆ తర్వాత ఎదుర్కొనే ధైర్యం లేక ప్రసారాలకు ముందే వాటిని తొలగించమని నాయకులు కోరటమన్నది అసాధారణమేమీ కాదు. కానీ ఏచూరి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండేవారు. యునైటెడ్ ఫ్రంట్కు సీపీఎం మద్దతిస్తున్నప్పటికీ, అప్పటి ప్రధాని దేవె గౌడ మీద ఆయన చేసిన విమర్శ దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే విజ్ఞప్తులను సైతం అంగీకరించటం కోసమే ఏచూరి మార్గాలను వెతికేవారు. ఆయన గుణం సావధానం. ఆయన జ్ఞాపకశక్తి అపారం.సీతారాం ఏచూరిని నేను మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తుకు రావటం లేదు. బహుశా అది నేను 1990లో ఇండియాకు తిరిగి వచ్చిన కొద్ది రోజులకు కావచ్చు. అయితే నేనెప్పటికీ మర్చిపోలేనిది మాత్రం ఆయనతో సుదీర్ఘమైన నా మొదటి ఇంటర్వ్యూ. అది 1996వ సంవత్సరం.ఇంటర్వ్యూ చేసింది ఆనాటి నూతన ప్రధాని దేవె గౌడ గురించి. అప్పటికి సీతారాంతో నాకు బాగా పరిచయం ఏర్పడి ఉంది. ఇంటర్వ్యూలో ‘సీత’ (తనను ఇలా పిలవొచ్చని ఏచూరి నాతో అన్నప్పట్నుంచీ నేనాయన్ని సీత అనటం మొదలుపెట్టాను) దేవె గౌడ తన అధికారిక పర్యటనకు తనతో పాటుగా అనేక మంది తన కుటుంబ సభ్యులను ఇటలీకి వెంటబెట్టుకుని వెళ్లటాన్ని విమర్శించారు. నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి దేవె గౌడ పార్టీ, సీపీఎం రెండూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నందు వల్ల సీత అలా విమర్శించటం అనూహ్యం, దాపరికం లేకపోవడం మాత్రమే కాక వార్తగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది కేవలం ఒక సాధారణ వ్యాఖ్య కాదు. పూర్తి స్థాయి విమర్శ. ఇంటర్వ్యూ ప్రసారానికి ముందు రోజు సాయంత్రం సీత నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంటర్వ్యూలో నేను చెప్పిన దానిని తొలగించమని అడగటానికి నేను మీకు కాల్ చేయలేదు’’ అని నవ్వుతూ అన్నారు. అదొక వ్యాప్తి చెందే స్వభావం కలిగిన సహృదయ హాసం. ‘‘నేను దాని గురించి ఇప్పటికే నా సహచరులకు చెప్పి, వారి స్పందనలకు తగిన వివరణ ఇచ్చేశాను కనుక దానిని మీరు తీసేయలేదని నిర్ధారించుకోటానికే మీకు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు దానిని తొలగిస్తే ఇద్దరం కూడా నవ్వులపాలౌతాం’’ అన్నారు. నిజానికి సీత, తామన్న మాటలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో ఒకరు. నాయకులు ఇంటర్వ్యూలలో వెలిబుచ్చిన తమ వాస్తవ అభిప్రాయాల పర్యవసానా లను ఎదుర్కొనే ధైర్యం లేక వాటిని తొలగించమని కోరటమన్నది అసాధారణమేమీ కాని ఆ 9వ దశకంలో, 2000–2009 మధ్య కాలంలో సీత అలా నాకు కాల్ చేయటం అత్యంత అసాధారణం. చెప్పాలంటే అభినందనీయం. అదొక్కటే కాదు, సీత సావధానంగా వినే గుణం కలిగిన వారనీ, ఆయన జ్ఞాపకశక్తి అపారమనీ కనిపెట్టటానికి నాకు మరికొంచెం సమయం పట్టింది. నేను ‘ఐ విట్నెస్’ వీడియో మేగజీన్కు పని చేస్తూ, తరచు చర్చలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఓసారి నాకు ఢిల్లీ కమానీ ఆడిటోరియం వెలుపలి ప్రాంగణంలో సీత సిగరెట్ తాగుతూ కనిపించారు. ‘‘మీకూ ఒకటి కావాలా?’’ అని నన్ను అడిగారు. బహుశా నా ముఖం సిగరెట్టు తాగే రకంలా ఆయనకు కనిపించి ఉండాలి. తన సిగరెట్ వెలిగించుకున్నాక, నాకూ ఒకటి ఇచ్చారు. నేను సిగరెట్ తాగుతానని మీకెలా తెలుసు అని అడిగాను. ‘‘మీరేగా చెప్పారు, మర్చిపోయారా?’’ అని ఆశ్చర్యపోయారు. ‘‘జనవరిలో మాత్రమే తాగుతానని, అది కూడా ఇతరులు ఇచ్చే సిగ రెట్లు మాత్రమే తాగుతానని మీరు నాతో చెప్పారు కదా’’ అన్నారు. ఆయన అన్నది నిజమే. అయితే ఎవరికి గుర్తుంటుంది కనుక అని నేను తమాషాగా చెప్పే విషయాలలో ఇది కూడా ఒకటి. కానీ సీత దానిని గుర్తుపెట్టుకున్నారు! వాస్తవానికి ఆయన జ్ఞాపకశక్తి పరిధి, కచ్చితత్వాలే ఇంటర్వ్యూ లలో ఆయనకు శక్తిమంతమైన ఆయుధాలు. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ప్రశ్నల్లో నేను తేదీలను కలిపేసినప్పుడు లేదా వాస్త వాలలో నా వైపు తప్పులు దొర్లినప్పుడు వెంటనే ఆయన నన్ను సరి దిద్దేవారు. అలాగని ఎప్పుడూ కూడా అభ్యంతరకరంగా మాట్లాడే వారు కాదు. నేను మర్చిపోయిన ఒకటీ రెండు పాయింట్లను కూడా జోడించి మరీ విషయాన్ని ముగించేవారు. అలాగుండేది ఏచూరితో. అయితే ఆయనలో అస్సలు లేనివి ఏమిటంటే ముఖం చిట్లింపు, హాస్య విహీనత. ఆయన చమత్కారం ఉవ్వెత్తున పొంగిన షాంపేన్లా మిరిమిట్లతో నురగలు కక్కుతుంది. 2005లో బృందా కారత్ సీపీఎం పాలిట్ బ్యూరోలో చేరారు. అప్పటికే ఆమె భర్త (ప్రకాశ్ కారత్) అందులో ఉన్నారు. బృందా పాలిట్ బ్యూరో సభ్యురాలైన కొత్తల్లో ‘సీఎన్ బీసీ’ లేట్ నైట్ డిస్కషన్లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.బృందాతో పాటు మరికొందరు అతిథులు ఉన్నారు. ఆ డిస్కషన్కు నాదే యాంకరింగ్. చర్చ సాగుతుండగా అతిథుల్లో ఒకరు... సీపీఎం పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన తొలి మహిళ కదా బృందా కారత్ అన్నారు. ‘‘అవును’’ అని చిరునవ్వుతో చూస్తూ, ‘‘మాది ఇప్పుడు రెండు క్యారెట్ల పార్టీ!’’ అన్నారు సీత. సీత... సల్లాపాల ఉల్లాస ప్రియుడు కూడా. కథలు కథలుగా తన గురించి చెప్పుకుంటున్నప్పుడు... ఆయన కళ్లు దివ్వెలై వెలగటం, ఆయన ముఖం నవ్వులై విరియటం చూసి... ఆయన స్వీయానంద భరితులై ఉన్నట్లు మీరు చెప్పగలుగుతారు. కొన్నిసార్లు ఆయనకు ఒక ఇంటర్వ్యూ నచ్చి, లేదా అంతక్రితమే ఆయన చదివిన ఒక కాలమ్ గురించి చెప్పాలనిపించి, పొద్దుపోయాక నాతో ఫోన్లో వృత్తాంత భరితంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలోని చిరుమంద హాసం లేదా ఆ గొంతులో తొణికిసలాడే నవ్వు నా గ్రహింపులోనికి వచ్చేవి. సీత ఎప్పుడో గాని చెప్పిన సమయానికి చేరుకోలేరు. ఒక ఇంటర్యూకి ఫలానా సమయానికి వచ్చేస్తానని మాట ఇచ్చి కూడా దారి మధ్యలో తనను కలవాలని వచ్చిన అనేక మంది కోసం కారును ఆపించేవారు. ‘‘సమస్య చిన్నదే. వాళ్లందరూ ఆయనతో మాట్లాడాలని ఆశ పడతారు. అందుకు ఆయన ఎప్పుడూ నిరాకరించరు’’ అని ఇంటర్వ్యూకు ఆయను తీసుకువచ్చేందుకు వెళ్లిన నా సహచరులు చెప్పేవారు. ‘కాదు’ అని సీత ఎప్పుడైనా నాతో అన్నట్లు గుర్తు లేదు. సాధా రణంగా జర్నలిస్టులు చేసే విధంగానే, ఇతర రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే అసంభవమైన విజ్ఞప్తులను నేను సీతకు చేసేవాడిని. అందుకు సీత ఎప్పుడూ వాటిని అంగీకరించటం కోసమే మార్గాలను వెతికే ప్రయత్నం చేసేవారు. కొన్నిసార్లు తన భార్య సీమ వైపు నుంచి చేయించే విన్నపాలను మన్నించేవారు. ఇన్ని విధాలుగా ఆయన నాకు ఎల్లప్పుడూ గుర్తుంటారు.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి...
-
స్టీల్ప్లాంట్ మూసివేతకు కుట్ర.. ‘కూటమి’పై సీపీఎం నేత ఫైర్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందంటూ కూటమి సర్కార్పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి వంద రోజుల పాలన మాటలకే పరిమితమయిందని.. పెన్షన్ తప్ప ఏ హామి అమలు కాలేదని విమర్శలు గుప్పించారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్నులు కడితే రూ.500 కోట్లు ఇస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్ను ఏర్పాటు చేయాలి. స్టీల్ ప్లాంట్కు తక్షణమే రూ.15 వేల కోట్లు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి’’ అంటూ శ్రీనివాసరావు నిలదీశారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఉద్యమం: సీఐటీయూసీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ నేతలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు.. బీజేపీకి భజన చేస్తున్నారని సీఐటీయూ మండిపడింది.‘‘స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అన్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటిమెంట్ అనే పదం వాడొద్దంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. సెయిల్లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’’ అని సీఐటీయూ నేతలు సీహెచ్ నరసింగరావు, కుమార్ డిమాండ్ చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్.. బీజేపీ నేతకు సీపీఎం నేత దిమ్మతిరిగే కౌంటర్