custady
-
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కస్టడీ నేటితో ముగియటంతో తీహార్ జైలు అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి ఆగస్ట్ 20వరకు పొడిగించింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ సరైన కారణాలు లేకుండా అరెస్ట్ చేసిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: కేజ్రీవాల్ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు -
‘గాయపడిన మనసు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది..’ చై కస్టడి టీజర్ అవుట్
యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో నటుడు అరవింద్ స్వామి కీల పాత్ర పోషిస్తున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్ మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కస్టడీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ తాజాగా చిత్రం బృందం మూవీ టీజర్ను విడుదల చేసింది. ఇందులో చై డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది..’ అంటూ చై సీరియస్ డైలాగ్తో టీజర్ మొదలైంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది. ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనునున్నారు. సమ్మర్ కానుకగా మే 12న తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది. -
దర్బంగా కేసు :నిందితులను మరోసారి కస్టడీకి తీసుకున్న ఎన్ఐఏ
-
టీడీపీ కీలక నేతలతో రాకేష్కు సన్నిహిత సంబంధాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి కస్టడీని నాంపల్లి కోర్టు పొడిగించింది. ఈ కేసు విచారణలో భాగంగా రాకేష్రెడ్డి, శ్రీనివాస్ కస్టడీ ముగియడంతో పోలీసులు శనివారం వారిని కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరిని మరో ఎనిమిది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు రాకేష్ రెడ్డి అక్రమాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, పోలీసు అధికారులతో పాటు, రౌడీ షీటర్తో ఉన్న సంబంధాలు ఇలా ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయని పోలీసులు ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ చేయడం కోసం రాకేష్ రెడ్డి కస్టడీని పొడగించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అందుకు కోర్టు అనుమతినిస్తూ ఫిబ్రవరి 23 వరకు రాకేష్ రెడ్డితో పాటు అతడి డ్రైవర్ శ్రీనివాస్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీడీపీ కీలక నేతలతో రాకేష్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో రాకేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసిందన్నారు పోలీసు అధికారులు. ఈ క్రమంలో పదవులు, సీట్లు ఇప్పిస్తానంటూ పలువురు నాయకులతో రాకేష్ రెడ్డి బేరసారాలు జరిపాడని.. భారీగా నగదు చేతులు మారినట్లు గుర్తించామన్నారు. రాకేష్ వ్యవహారం బయటకు రావడంతో తమకు న్యాయం చేయాలంటూ ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు. -
కేరళ నన్పై లైంగిక దాడి : పోలీస్ కస్టడీకి బిషప్
తిరువనంతపురం : కేరళ నన్పై లైంగిక దాడి కేసులో అరెస్టయిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ను ఈనెల 24 వరకూ పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్ధానం ఉత్తర్వులు జారీ చేసింది. ములక్కల్ బెయిల్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. 2014 మే 5న బాధితురాలిని లైంగికంగా వేధించే ఉద్దేశంతోనే స్కూల్కు వచ్చిన ములక్కల్ గెస్ట్ హౌస్లోని రూమ్ నెంబర్ 20లో రాత్రి 10.48 గంటలకు వరకూ ఆమెను ఉంచారని, అసహజ శృంగారానికి ఒత్తిడి చేశారని పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ఘటన గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బిషప్ బాధితురాలిని బెదిరించినట్టు వెల్లడించారు. తర్వాతి రోజు (మే 6) సైతం బాధితురాలిపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని నివేదికలో ప్రస్తావించారు. 2014 నుంచి 2016 వరకూ అదే గదిలో బాధితురాలిపై నిందితుడు 13 సార్లు లైంగిక దాడి, అసహజ శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు నిరాధారమని బిషప్ ములక్కల్ తోసిపుచ్చారు. -
అంతులేని నయీం ఆస్తులు
-
మరో 6 రోజుల కస్టడీకి ఫర్హానా, అఫ్సా
-
ఐరన్ దొంగల అరెస్టు
అనంతపురం: నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద ఐరన్ సామగ్రిని దొంగలిస్తున్న ఆరుగురు దుండగులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.అనంతపరం జిల్లాలోని హిందూపురం మండలానికి చెందిన ఆరుగురు బృందంగా ఏర్పడి మండలంలో పలు చోట్ల ఇనుప వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హిందూపురం పోలీసులు శనివారం దుండగులను అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. (హిందూపురం)